breaking news
-
విద్యుత్ శాఖకు రూ.50 లక్షల ఆస్తి నష్టం
నిజామాబాద్నాగారం: వడగళ్ల వానతో విద్యుత్ శాఖకు సుమారు రూ. 50 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు ఎస్ఈ రవీందర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఈ దురు గాలులు, వడగళ్లకు గంటల వ్యవధిలో 10 ట్రాన్సుఫార్మర్లు, 150 వరకు విద్యుత్ స్తంభాలు, వైర్లు దెబ్బతిన్నాయి. కరెంట్ సరఫరాలో ఇక్కట్లు రావడంలో అధికారులు, విద్యుత్ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. సాయంత్రం 5 గంటల నుంచే విద్యుత్ సరఫరా పునరుద్ధరించే పనిలో పడ్డా రు. పట్టణాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చింది. పల్లెలో అర్ధరాత్రి వరకు కరెంట్ సరఫరా అందిస్తామన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
బాన్సువాడ రూరల్: బంధువుల విందుకు హాజరైన ఓ మహిళను మృత్యువు కబళించింది. కిరాణ దుకాణంలో పూజకు అవసరమయ్యే సామగ్రిని కొనుగోలు చేసి రోడ్డు దాటుతున్న క్రమంలో అతివేగంగా వస్తున్న వాహనం సదరు మహిళను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బాన్సువాడ మండలం తాడ్కోల్లో చోటు చేసుకుంది. సీఐ మున్నూరు కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. పిట్లం మండలం కుర్తి గ్రామానికి చెందిన పోతరాజు గంగవ్వ(60) బాన్సువాడ మండలంలోని తాడ్కోలో తమ బంధువులు నిర్వహించిన కందూరు విందుకు శుక్రవారం హాజరైంది. పెద్దదేవుని దర్గాలో పూజకు అవసరమయ్యే సామగ్రిని కొనుగోలు చేసి రోడ్డు దాటుతున్న క్రమంలో బాన్సువాడ వైపు వేగంగా వెళ్తున్న తుఫాను వాహనం ఢీకొన్నది. ఈ ఘటనలో గంగవ్వ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి తమ్ముడు సాయిలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
చెరువులో పడి యువకుడి మృతి
మాచారెడ్డి: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఏఎస్సై రామేశ్వర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గజ్జనాయక్ తండాకు చెందిన లక్ష్మణ్(36) గురువారం బహిర్భూమికని వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు పలు చోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. మండల కేంద్రంలోని ఊర చెరువులో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో వివాహిత..ఎడపల్లి: ఆర్థిక ఇబ్బందులతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని మంగళ్పాడ్లో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై వంశీచందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పోలెపల్లి ఇంద్రజ(48)కు ముగ్గురు సంతానం. వీరు ఇటీవల ఇంటి నిర్మాణం చేపట్టడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతక్రుదయం ఉపాధి హామీ పనులకు వెళ్లిన ఇంద్రజ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
పూడ్చిపెట్టిన మృతదేహానికి పోస్టుమార్టం
రెంజల్: పూడ్చిపెట్టిన మృతదేహానికి కొల్లూర్ పోలీసులు పోస్టుమార్టం నిర్వహించిన ఘటన మండలంలోని సాటాపూర్లో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గీరయ్య(48) బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వలస వెళ్లాడు. అక్కడ భవన నిర్మా ణ కార్మికుడిగా పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు పనిచేస్తున్న ప్రదేశంలో భవనంపై నుంచి కిందపడ్డాడు. ఈ ఘటనపై సైబరాబద్ కమిషనరేట్ పరిధిలోని కొల్లూర్ పీఎస్లో కేసు నమోదైంది. గాయపడిన గీరయ్యను కుటుంబీకులు గ్రామానికి తీసుకొచ్చి వైద్య చికిత్సలు అందించారు. ఇంటి వద్ద చికిత్స పొందుతూ 15 రోజుల క్రితం మృతిచెందాడు. కుటుంబీకులు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న కొల్లూర్ పోలీసులు శుక్రవారం గ్రామానికి చేరుకొని కేసు విషయమై పూడ్చిపెట్టిన మృతదేహానికి డాక్లర్లు, ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టుమార్టం నిర్వహించారు. -
బోధన్–బీదర్ రైల్వే లైన్కు కృషి చేస్తా
రుద్రూర్: బోధన్–బీదర్ రైల్వే లైన్ ఏర్పాటుకు కృషి చేస్తానని జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేశ్ షెట్కార్ అన్నారు. చందూర్, వర్ని, కోటగిరి మండల కేంద్రాల్లో పార్టీ కార్యకర్తలతో కలిసి శుక్రవారం నిర్వహించిన పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు బోధన్–బీదర్ రైల్వే లైన్ సర్వే చేయించి ఎస్టీమెట్ వేయించానని, ఆ తర్వాత ఎంపీగా వచ్చిన బీబీ పాటిల్ దాని గురించి పట్టించుకోలేదన్నారు. సీఎం రేవంత్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో బోధన్ ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమాల్లో పార్టీ బాన్సువాడ సెగ్మెంట్ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూర్ చంద్రశేఖర్, పార్టీ మండలాల అధ్యక్షులు తోట అరుణ్కుమార్, సురేశ్బాబా, పుప్పాల శంకర్, షాహీద్, నాయకులు పాల్గొన్నారు. జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేశ్ షెట్కార్
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019