Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

Published Sat, Apr 20 2024 1:15 AM

గంగవ్వ  - Sakshi

బాన్సువాడ రూరల్‌: బంధువుల విందుకు హాజరైన ఓ మహిళను మృత్యువు కబళించింది. కిరాణ దుకాణంలో పూజకు అవసరమయ్యే సామగ్రిని కొనుగోలు చేసి రోడ్డు దాటుతున్న క్రమంలో అతివేగంగా వస్తున్న వాహనం సదరు మహిళను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బాన్సువాడ మండలం తాడ్కోల్‌లో చోటు చేసుకుంది. సీఐ మున్నూరు కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. పిట్లం మండలం కుర్తి గ్రామానికి చెందిన పోతరాజు గంగవ్వ(60) బాన్సువాడ మండలంలోని తాడ్కోలో తమ బంధువులు నిర్వహించిన కందూరు విందుకు శుక్రవారం హాజరైంది. పెద్దదేవుని దర్గాలో పూజకు అవసరమయ్యే సామగ్రిని కొనుగోలు చేసి రోడ్డు దాటుతున్న క్రమంలో బాన్సువాడ వైపు వేగంగా వెళ్తున్న తుఫాను వాహనం ఢీకొన్నది. ఈ ఘటనలో గంగవ్వ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి తమ్ముడు సాయిలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

Advertisement

adsolute_video_ad

homepage_300x250