breaking news
-
జగనన్నకు అండగా నిలవండి
రొద్దం: టీడీపీ అధినేత చంద్రబాబు మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని, ఆయన పరిపాలనకు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనకు ఎంత తేడా ఉందో గమనించాలని మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీచరణ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని కంబాలపల్లి, తురకలాపట్నం, ఆర్ కుర్లపల్లి, రెడ్డిపల్లి గ్రామాల్లో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వల్ల ప్రతి ఒక్కరికీ లబ్ధి చేరుకూరిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు జన్మభూమి కమిటీలు పెట్టి ఆ పార్టీ నాయకులకే పథకాలు అందించారని విమర్శించారు. పార్టీలకతీతంగా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్న జగనన్నకు అందరూ మళ్లీ అండగా నిలవాలన్నారు. ఈనెల 25న తన నామినేషన్ కార్యక్రమం ఉంటుందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరవాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాసులు, స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బి.నారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బి.తిమ్మయ్య, నాయకులు మారుతీరెడ్డి, నరసింహులు, రాజ్గోపాల్రెడ్డి, అక్కులప్పయాదవ్, లక్ష్మినారాయణరెడ్డి, వజీర్బాషా, ఎన్ నారాయణరెడ్డి, కేపీ శ్రీనివాసులు, రాజారెడ్డి, వినయ్రెడ్డి, ఉజ్జినప్ప, సి.నారాయణరెడ్డి, నరేంద్రరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. మంత్రి ఉషశ్రీచరణ్ -
అభివృద్ధికి రహదారి
పుట్టపర్తి అర్బన్: జిల్లాలో రహదారుల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. జాతీయరహదారులతో పాటు రోడ్లు, భవనాల శాఖ, పంచాయతీరాజ్, పీఎంజీఎస్వై, జాతీయ ఉపాధి హామీ పథకం, ఎంపీపీ, జెడ్పీ నిధుల కింద రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. ఇందులో చాలా వరకూ పూర్తయ్యాయి. వీటి కోసం ప్రభుత్వం ఏకంగా రూ.6,057 కోట్లు వెచ్చిస్తోంది. జిల్లాలో మొత్తం 1,529 కిలోమీటర్ల మేర రోడ్లు ఏర్పాటు చేసింది. వందేళ్ల నుంచి తారు రోడ్డుకు నోచుకోని గ్రామాలకు సైతం రోడ్డు నిర్మాణాలు చేపట్టడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల పురోగతి ఇలా... జిల్లా పరిధిలో 250 కిలోమీటర్లకు పైబడి జాతీయ రహదారులు నిర్మిస్తున్నారు. వచ్చే రెండేళ్లలో పూర్తి చేయాలనే సంకల్పంతో పనులు చేస్తున్నారు. ఈ రోడ్లతో బెంగళూరు, హైదరాబాద్, కడప, కర్నూలు, చిత్తూరు ప్రాంతాలకు కనెక్టవిటీ పెరుగుతుంది. 80 కిలోమీటర్లు 342వ జాతీయరహదారి నిర్మించేందుకు రూ.1,745 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 90.58 కిలోమీటర్లు 716జీ జాతీయ రహదారి నిర్మాణం కోసం రూ.1648.70 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇక జిల్లా మీదుగా 75 కిలోమీటర్లు వెళ్లే గ్రీనఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కోసం భూ సేకరణ పూర్తయ్యింది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. ఇందు కోసం రూ.850 కోట్లు ఖర్చు చేయనున్నారు. ● రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 32 మండలాల పరిధిలో 804 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాలకు రూ.366 కోట్లు వెచ్చిస్తున్నారు. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో 233 కిలోమీటర్ల రోడ్లు వేసేందుకు రూ.350 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ● పీఓంజీఎస్వై కింద 131.18 కిలోమీటర్లకు పైగా రోడ్ల నిర్మాణాలకు రూ.52.55 కోట్లు ఖర్చు పెట్టారు. 12.58 కిలోమీటర్ల కదిరి బైపాస్ రోడ్డుకు రూ.220.66 కోట్లు, 7.7 కిలోమీటర్ల ముదిగుబ్బ బైపాస్కు రూ.116.81 కోట్లు ఖర్చు చేస్తోంది. 20.04 కిలోమీటర్ల హిందూపురం– పరిగి రోడ్డుకు రూ.98.16 కోట్లు, 42.37 కిలోమీటర్ల మడకశిర–శిరరోడ్డుకు రూ.207.79 కోట్లు, 33 కిలోమీటర్ల బత్తలపల్లి–ముదిగుబ్బ రోడ్డుకు రూ.401.72 కోట్లు ఖర్చు చేస్తున్నారు. పరిశ్రమల రాకకు మార్గం సుగమం.. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. జాతీయ రహదారులతో పాటు పలు పరిశ్రమలు ఒకదానితో ఒకటి పోటీ పడి వస్తున్నాయి. మెరుగైన రవాణా సౌకర్యం, ప్రభుత్వ సహకారం, నీటి వసతి, అనుకూలమైన వాతావరణం ఉండడంతో పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) ఆధ్వర్యంలో 3,257 ఎకరాల భూమి సేకరించి అభివృద్ధి చేయంతో పలు పరిశ్రమలు వస్తున్నాయి. ఇప్పటి వరకు 1,138 యూనిట్ల కోసం భూమిని సిద్ధం చేశారు. 249 యూనిట్లు నెలకొల్పడానికి ప్లాట్లు కేటాయించారు. శరవేగంగా రోడ్ల నిర్మాణం గ్రామీణ నుంచి జాతీయ రహదారుల వరకు అభివృద్ధి అన్ని ప్రాంతాల రాకపోకలకూ మార్గం సుగమం శ్రీసత్యసాయి జిల్లా అభివృద్ధి దిశగా పయనిస్తోంది. గడిచిన ఐదేళ్లలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు సంక్షేమ పథకాల అమలుతో పాటే అభివృద్ధి పనులపైనా దృష్టి సారించింది. రహదారుల నిర్మాణాలతో జిల్లా రూపురేఖలు పూర్తిగా మారాయి. అన్ని ప్రాంతాలకూ రాకపోకలు, రవాణా సౌకర్యాలు మెరుగయ్యాయి. -
అన్ని రకాల మందులిస్తున్నారు
గతంతో పోలిస్తే ప్రభుత్వాస్పత్రులు ఎంతో మారాయి. గతంలో సరైన వైద్యం అందేది కాదు. మందులు దొరికేవి కావు. కానీ ఇప్పుడు అలా లేదు. నాకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో నాలుగు రోజులుగా హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నా. ఇక్కడ వైద్య సేవలు చాలా బాగున్నాయి. మందులు అందిస్తున్నారు. ప్రస్తుతం నా ఆరోగ్యం సైతం కుదుటపడింది. ప్రైవేటు ఆస్పత్రి చికిత్స చేయించుకుని ఉంటే రూ.వేలల్లో ఖర్చయ్యేది. ప్రభుత్వాస్పత్రిలోనే నాకు ఉచితంగా మెరుగైన వైద్యం అందింది. – నారాయణస్వామి, వీవర్స్కాలనీ, హిందూపురం -
తిమ్మంపల్లిలో సూరీడు వర్ధంతి
యల్లనూరు: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, దివంగత కేతిరెడ్డి సూర్యప్రతాప్రెడ్డి వర్ధంతి సందర్భంగా గురువారం యల్లనూరు మండలం తిమ్మంపల్లిలోని ఆయన ఘాట్ వద్ద పలువురు ఘనంగా నివాళులర్పించారు. సూరీడు సతీమణి కళావతమ్మ, తాడిపత్రి, ధర్మవరం ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ప్రభుత్వ విద్య సలహాదారు ఆలూరి సాంబశివారెడ్డి, యువ నాయకులు హర్షవర్థన్రెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే సోదరుడు కృష్ణారెడ్డి, కుటుంబసభ్యులు హాజరయ్యారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు బొప్పే పల్లి రామాంజులరెడ్డి, సజ్జలదిన్నె రాజు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. -
అప్రమత్తంగా ఉండాలి
పుట్టపర్తి టౌన్: అగ్ని విపత్తుల సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని అగ్ని మాపక అధికారి నాగరాజునాయక్ పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాల నివారణ వారోత్సవాల్లో భాగంగా గురువారం గుంతపల్లి వద్దున్న నిషా డిజైన్స్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికులకు అవగాహన కలిగించారు. డీఎఫ్ఓ నాగరాజునాయక్ మాట్లాడుతూ మీరు పనిచేస్తున్న ఫ్యాక్టరీల్లో ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, ప్రతి ఒక్కరూ అవగాహణ కలిగి ఉండాలన్నారు. అగ్ని ప్రమాదం జరిగినప్పు ఎలా కాపాడుకోవాలో డెమో ద్వారా వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే సకాలంలో సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది విజయకుమార్, నరసింహులు, రామాంజనేయులు, దేవలానాయక్, వెంకటరెడ్డి రామాంజనేయులు, దామోదర్, తేజేశ్వర్రెడ్డి, ఎస్ఎస్ నాయుడు పాల్గొన్నారు. సజావుగా ప్రీ పీహెచ్డీ పరీక్షలు అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ప్రీ పీహెచ్డీ గురువారం ప్రారంభమయ్యాయి. ఎస్కేయూ క్యాంపస్లోని పరీక్ష కేంద్రాలను వీసీ డాక్టర్ కె.హుస్సేన్ రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంవీ లక్ష్మయ్య పర్యవేక్షించారు. పరీక్ష కేంద్రాల్లోని వసతులను ఆరా తీశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎ.కృష్ణ కుమారి తదితరులు పాల్గొన్నారు. యువజన విభాగం ‘పురం’ అధ్యక్షుడిగా సల్మాన్ఖాన్పుట్టపర్తి అర్బన్: వైఎస్సార్సీపీ అనుబంధ యువజన విభాగం హిందూపురం నియోజకవర్గ అధ్యక్షునిగా సల్మాన్ఖాన్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు నవీన్నిశ్చల్ నియామక పత్రం అందజేశారు. తన మీద నమ్మకం ఉంచి అధ్యక్షునిగా ఎంపిక చేసినందుకు సల్మాన్ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడి పనిచేసి వైఎస్సార్సీపీ గెలుపునకు కృషి చేస్తానని చెప్పారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019