యల్లనూరు: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, దివంగత కేతిరెడ్డి సూర్యప్రతాప్రెడ్డి వర్ధంతి సందర్భంగా గురువారం యల్లనూరు మండలం తిమ్మంపల్లిలోని ఆయన ఘాట్ వద్ద పలువురు ఘనంగా నివాళులర్పించారు. సూరీడు సతీమణి కళావతమ్మ, తాడిపత్రి, ధర్మవరం ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ప్రభుత్వ విద్య సలహాదారు ఆలూరి సాంబశివారెడ్డి, యువ నాయకులు హర్షవర్థన్రెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే సోదరుడు కృష్ణారెడ్డి, కుటుంబసభ్యులు హాజరయ్యారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు బొప్పే పల్లి రామాంజులరెడ్డి, సజ్జలదిన్నె రాజు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.