breaking news
-
కమెడియన్ రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నాయకుడి మృతి
నల్లగొండ క్రైం: నల్లగొండ పట్టణ సమీపంలోని లెప్రసీ కాలనీ వద్ద నార్కట్పల్లి–అద్దంకి రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ పట్టణ కార్యదర్శి సందినేని జనార్దన్రావు (48) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రత్యక్ష సాక్షులు, కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. నకిరేకల్ మండలం మంగలపల్లి గ్రామానికి చెందిన జనార్దన్రావు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ నల్లగొండలో స్థిరపడ్డాడు. బుధవారం సాయంత్రం లెప్రసీ కాలనీ వద్ద వెంచర్లో వాకింగ్ చేసి, బైక్పై నల్లగొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి వస్తున్నాడు. లెప్రసీ కాలనీ వద్ద రోడ్డు దాటుతుండగా.. హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు బీఎండబ్ల్యూ కారులో వెళ్తున్న హాస్యనటుడు రఘుబాబు వేగంగా వచ్చి ఇతడి బైక్ను ఢీకొట్టాడు. దీంతో జనార్దన్రావు మొదట కారు అద్దంపై పడి, ఆ తర్వాత ఎగిరి 100 మీటర్ల దూరంలో పడ్డాడు. బైక్ కారు ఇంజన్లో ఇరుక్కుపోయింది. జనార్దన్రావు తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. సమీపంలో ఉన్న వారు గమనించి, కమెడియన్ రఘుబాబుతో వాగ్వాదానికి దిగారు. అనంతరం టూటౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు. రఘుబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనార్దన్రావు మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడికి భార్య నాగమణి, కుమార్తె ఝాన్సీ, కుమారుడు భరత్ ఉన్నారు. కుమార్తె ఇటీవల సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరగా, కుమారుడు బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. కమెడియన్ రఘుబాబు అజాగ్రత్తగా కారు నడిపి తన భర్త మృతికి కారణమయ్యాడని నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ ఎస్ఐ నాగరాజు తెలిపారు. పలువురి సంతాపం.. జనార్దన్రావు మృతి పట్ల బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ సైదిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు అభిమన్యు శ్రీనివాస్, మారగోని గణేష్గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు దేప వెంకటరెడ్డి, ఐతగోని యాదయ్యగౌడ్, పలువురు వ్యాపారవేత్తలు సంతాపం తెలిపారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
గాంధీనగర్ : గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్-వడోదర ఎక్స్ప్రెస్ వేపై నిలిపి ఉంచిన ట్రక్కుపైకి ఓ కారు వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 10 మంది మరణించారు. ఖేడా జిల్లాలోని నదియాడ్ పట్టణం సమీపంలో బుధవారం ఈ ఘటన వెలుగుచూసింది. అతివేగం కారణంగా మారుతీ సుజుకి ఎర్టిగా కారు అదుపుతప్పి ట్రక్కు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 8 మంది చనిపోగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు విడిచారు. బాధితులు వడోదర నుంచి అహ్మదాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో 93 కిలోమీటర్ల పొడవైన ఎక్స్ప్రెస్వేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు చదవండి: ‘అణు బాంబుల ధ్వంసం.. సీపీఎంపై రాజ్నాథ్ ఫైర్ -
ఆ కారు నడిపింది రహీలే!
సాక్షి, సిటీబ్యూరో/బంజారాహిల్స్: పంజగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలోని ప్రజాభవన్ ఎదురుగా చోటు చేసుకున్న ‘బీఎండబ్ల్యూ కారు ప్రమాదం’లో ఇటీవల అరైస్టెన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ మరో కేసులో నిందితుడిగా మారాడు. 2022లో జూబ్లీహిల్స్ ఠాణా పరిఽధిలో చోటు చేసుకున్న ‘మహేంద్ర థార్ యాక్సిడెంట్’కు ఇతడే కారణమని అధికారులు తేల్చారు. ఈ కేసులోనూ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పాత్రపై ప్రాథమిక ఆధారాలు సేకరించారు. అప్పట్లో జూబ్లీహిల్స్ కేసు దర్యాప్తు చేసిన, పర్యవేక్షించిన అధికారుల చుట్టూ ఉచ్చుబిగుస్తోందని సమాచారం. ప్రజాభవన్ వద్ద చోటు చేసుకున్న ప్రమాదం కేసులో రహీల్, ఇద్దరు పోలీసులు సహా 15 మంది అరెస్టు అయిన విషయం విదితమే. ఆ ప్రమాదంలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ యాక్సిడెంట్ తెరపైకి తెచ్చింది. ప్రాణాలు కోల్పోయిన రెండు నెలల చిన్నారి.. జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో 2022 మార్చి 17వ తేదీ రాత్రి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వైపు నుంచి జూబ్లీహిల్స్ వైపు దూసుకువచ్చిన మహేంద్ర థార్ కారు రోడ్డుపై బుడగలు విక్రయించే వారిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన కాజల్ చౌహాన్, సారికా చౌహాన్, సుష్మ చౌహాన్ భోస్లే గాయపడగా.. కాజల్ కుమారుడు రఘువీర్ (రెండు నెలలు) అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ వాహనంపై ఎమ్మెల్యే షకీల్ స్టిక్కర్ ఉండటంతో అప్పట్లో రహీల్పై ఆరోపణలు వచ్చాయి. మరుసటి రోజు స్పందించిన షకీల్ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. సదరు కారు తన సోదరుడిదని (కజిన్), తానూ అప్పుడప్పుడు వాడుతుంటానని పేర్కొన్నారు. సోదరుడి కుటుంబం కారులో వెళుతుండగా జూబ్లీహిల్స్ రోడ్ నం.45 వద్ద సిగ్నల్ సమీపంలో బెలూన్లు అమ్ముకునే యువతికి కారు గాయమైందని, ఆ భయంలో ఆమే పసిపాను పడేయడంతో దుర్ఘటన జరిగిందని చెప్పుకొచ్చాడు. పసిపాపను కోల్పోయిన కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పానని పేర్కొన్నాడు. అప్పట్లో పోలీసులూ క్లీన్చిట్ ఇచ్చేశారు... అదే నెల 19న విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన పోలీసులు రహీల్కు క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఆ వాహనాన్ని తానే నడుపుతున్నట్లు షకీల్ బంధువు సయ్యద్ అఫ్మాన్ అహ్మద్ లొంగిపోయినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇతడి పక్కన సీటులో రహీల్ కూర్చోగా... వెనుక సీటులో స్నేహితుడు మహ్మద్ మాజ్ ఉన్నట్లు వెల్లడించారు. వాహనంలో సేకరించిన వేలిముద్రలు సైతం అఫ్మాన్ ఫింగర్ ప్రింట్స్తో సరిపోలినట్లు చెప్పుకొచ్చారు. ఇలా ఈ ప్రమాదంలో రహీల్ పాత్ర లేనట్లు తేల్చేశారు. అయితే ప్రజాభవన్ వద్ద ప్రమాదం కేసు దర్యాప్తులో భాగంగా నాటి కేసుపై దృష్టి పెట్టిన పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీళ్లు నాటి రికార్డులను పరిశీలించగా అనేక లోపాలు కనిపించాయి. కాజల్ వాంగ్మూలంలో ఎక్కడా ప్రమాద సమయంలో డ్రైవింగ్ ఎవరు చేశారనే ప్రస్తావన లేదు. ఆమెతో ఆఫ్మాన్కు టెస్ట్ ఐడెంటికేషన్ పెరేడ్ నిర్వహించిన దాఖలాలు లేవు. మరోపక్క అప్పట్లో పోలీసుల ప్రకటించిన వేలిముద్రల రికార్డులు కోర్టుకు సమర్పించలేదు. అదే ఏడాది నవంబర్లో దాఖలు చేసిన చార్జిషీట్ లోపభూయిష్టంగా ఉన్నట్లు తేల్చారు. ఈ వ్యవహారం వెనుక షకీల్–రహీల్ పాత్రను అనుమానించిన వెస్ట్జోన్ పోలీసులు ఆ ఫైల్ను రీ–ఓపెన్ చేశారు. విచారణలో అసలు విషయం వెలుగులోకి... ‘జూబ్లీహిల్స్ ప్రమాదం’ కేసు దర్యాప్తులో భాగంగా వెస్ట్జోన్ పోలీసులు ఫిర్యాది, ఇతర బాధితురాళ్లను విచారించారు. నిందితుడిగా ఉన్న అఫ్మాన్ను సైతం ప్రశ్నించగా రహీల్ పాత్ర వెలుగులోకి వచ్చింది. దీంతో నాటి దర్యాప్తు అధికారి విచారణలోనూ ఆరోపణలకు బలాన్నిచ్చే అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. వీటి ఆధారంగా ముందుకెళ్లిన పోలీసులు రహీల్ను నిందితుడిగా చేర్చారు. ప్రజాభవన్ వద్ద ప్రమాదంతో దుబాయ్ పరారైన ఇతడు ఇటీవలే వచ్చి అరైస్టె బెయిల్ పొందాడు. రహీల్ను జూబ్లీహిల్స్ యాక్సిడెంట్ కేసులో అదుపులోకి తీసుకుని ప్రశ్నించాలని నిర్ణయించారు. అలా వెలుగులోకి వచ్చే వివరాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటారు. అప్పట్లో ఈ కేసు సెటిల్ చేయడంలో ఓ పోలీసు ఉన్నతాధికారి కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. అతడే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు రూ.5 లక్షలు ఇప్పించినట్లు తెలిసింది. దీంతో ఈ కేసులో ఆయనతో పాటు మరో అధికారీ విచారణ ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. రహీల్ విచారణ తర్వాతే షకీల్ పాత్రపై స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు. -
ఆ సెక్షన్తో సీరియస్ యాక్షన్!
సాక్షి, సిటీబ్యూరో/బంజారాహిల్స్: సంపన్నవర్గాలు ఉండే వెస్ట్జోన్ పరిధిలోని అనేక ప్రాంతాలు ర్యాష్ డ్రైవింగ్కు కేరాఫ్ అడ్రస్లు. ఖరీదైన కార్లలో వచ్చే బడాబాబుల పిల్లల ర్యాష్ డ్రైవింగ్ కారణంగా రోడ్లు, బారికేడ్లు, డివైడర్లు ధ్వంసం కావడమూ సర్వసాధారణం. కొన్ని సందర్భాల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ధోరణికి చెక్ చెప్పడానికి ఈ తరహా కేసుల్లో ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)తోపాటు ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక (పీడీపీపీ) చట్టంలోని సెక్షన్లనూ జోడించాలని పోలీసులు నిర్ణయించారు. ఈ రెండు ఉదంతాల్లో వర్తింపు... ఫిల్మ్నగర్, బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ల పరిధిలో శనివారంరాత్రి, ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదాల కేసుల్లో పోలీ సులు పీడీపీపీ యాక్ట్ జోడించారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెం.92లో వెర్నా కారు(ఏపీ 29 బీయూ 5078) డివైడర్ను ఢీకొట్టింది. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో అందులోని ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హోంగార్డు లింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారు నడుపు తున్న వ్యక్తిపై ఐపీసీలోని సెక్షన్ 279తోపాటు పీడీపీపీ యాక్ట్లోని సెక్షన్ 3 కింద కేసులు పెట్టారు. బంజారాహిల్స్ రోడ్ నెం.10లో ఆదివారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో బెంజ్ కారు (ఏపీ10 ఆర్ 0055) అదుపు తప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో స్తంభం కుప్పకూలిపోగా వైర్లు తెగిపడి కేబుళ్లు ధ్వంసమయ్యాయి. కారు డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విద్యుత్ శాఖ ఏడీఈ పి.వేణుమాధవ్ ఫిర్యా దు మేరకు కారు నడిపిన వ్యక్తిపై ఐపీసీ సెక్షనన్ 279, 336లతోపాటు పీడీపీపీ యాక్ట్లోని సెక్షన్ 3 కిందా కేసు నమోదు చేశారు. పూర్వాపరాలు పరిశీలించి.. ఇప్పటివరకు ఈ తరహా యాక్సిడెంట్ కేసులను కేవలం నిర్లక్ష్యపు డ్రైవింగ్గా పరిగణిస్తూ ఐపీసీలోని 279, 336 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేవారు. వీటిలో గరిష్టంగా ఆరు, మూడు నెలల జైలు శిక్షలతోపాటు నామమాత్రపు జరిమానా మాత్రమే ఉంది. అయితే పలు ప్రమాదాల్లో పెద్ద ఎత్తున ప్రజా ఆస్తులు దెబ్బతింటుండటంతో కారకులపై పీడీపీపీ యాక్ట్ సెక్షన్ 3 కింద కేసుల నమోదుకు పోలీసులు పూనుకున్నారు. ఈ సెక్షన్ ప్రకారం నిందితులు దోషులుగా తేలితే గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష పడుతుంది. అయితే ప్రతి ప్రమాదంలోనూ ఈ సెక్షన్ జోడించకుండా దాని పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హనుమకొండ వాసి మృతి
కురవి/ వరంగల్ క్రైం: అమెరికాలోని టెక్సాస్లో శనివారం రాత్రి (భారతీయ కాలమాన ప్రకారం) జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగు(విలేజి)కు చెందిన బండి రోహిత్రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన బండి అనిల్రెడ్డి, అనితారెడ్డి దంపతులు సుమారు 20 సంవత్సరాల నుంచి హనుమకొండలోని సహకారనగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు రోహిత్రెడ్డి టెక్సాస్లో అమెజాన్లో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కుమారుడు రోహన్రెడ్డి కూడా అక్కడే ఎంఎస్ చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో రోహిత్రెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. తీవ్రగాయాలైన రోహిత్రెడ్డిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంపై తల్లిదండ్రులకు సమాచారం అందడంతో ఆదివారం రాత్రి టెక్సాస్కు ప్రయాణమయ్యారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019