breaking news
Ad - Sakshi_Home_Sticky
-
బస్సు యాత్ర దెబ్బకు రామోజీ కి మైండ్ బ్లాక్
-
రామోజీ పెన్షన్ల లెక్క తేలుద్దాం
-
రామోజీ.. మీ రాతల్లోనే వ్యత్యాసం
సాక్షి, అమరావతి : రామోజీ మెదడు మోకాల్లోకి వచ్చిందేమోనన్న సందేహాలను ఈనాడు ప్రచురించే కథనాలు బలపరుస్తున్నాయి. పొదుపు సంఘాల రుణాలకు కొన్ని జిల్లాల్లో ఒక విధంగా.. మరికొన్ని జిల్లాల్లో మరో విధంగా వ్యత్యాసపు వడ్డీ రేటును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని అజ్ఞానపు రాతలతో సున్నా వడ్డీ రుణాలపై శుక్రవారం ‘అన్నా...సున్నా అంటే అంత భారమా?’ శీర్షికన ఒక తెలివితక్కువ కథనాన్ని ఈనాడు ప్రచురించింది. ఈనాడు అజ్ఞానాన్ని చూసి బ్యాంకులు, పొదుపు సంఘాల మహిళలు నవ్విపోతారన్న స్పృహ అయినా రామోజీకి లేకుండా పోయింది. బాబు 2014 ఎన్నికల ముందు తాను అధికారంలోకి వస్తే బేషరతుగా పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానని ఘోరమైన అబద్ధమాడి, అధికారంలోకి వచ్చిన తర్వాత రూపాయి కూడా మాఫీ చేయలేదు. మాఫీ చేయకపోగా తన హయాంలో సున్నా వడ్డీ పథకాన్ని ఆపేస్తే.. సీఎం జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు పెట్టిన బకాయిలన్నిటినీ బ్యాంకులకు చెల్లించి, ఆ పథకాన్ని పునరుద్ధరించారు. బాబు చేసిన మోసానికి పొదుపు సంఘాలు నీరుకారిపోయాయి. సున్నా వడ్డీ రుణాలు అందక అల్లాడిపోయాయి. బాబు చేసిన ఈ ఘోరమైన తప్పును జగన్ సరిదిద్దడంతో బ్యాంకులు ఇప్పుడు పొదుపు సంఘాలకు రుణాలు ఇవ్వడానికి పోటీ పడుతున్నాయి. ఈ నిజాలు రామోజీ మట్టిబుర్రకు తెలియక అజ్ఞానాన్ని రంగరించి, పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాల్లో నాలుగు శాతమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని, మిగిలింది కేంద్రం ఇస్తోందని తన తెలివితక్కువ పాత్రికేయ అసమర్థతను బయటపెట్టుకుంది. తెలివి తక్కువ తనాన్ని బయటపెట్టుకున్న ఈనాడు... ‘ఆరు జిల్లాలకు ఏడు శాతం కేంద్రం రాయితీ’ అంటూ తమ కథనంలో ఓ ఉపశీర్షికను పెట్టి.. జాతీయ జీవనోపాధుల కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 250 జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తోందని , అందులో ఏపీ పరిధిలో ఆరు ఉమ్మడి జిల్లాలు ఉన్నట్టు ‘ఈనాడు’ రాసుకుపోయింది. ఆ ఆరు జిల్లాల్లో మాత్రమే సంఘాలు రూ. 3 లక్షల వరకు తీసుకున్న రుణానికి అక్కడ బ్యాంకులు 11 శాతం వడ్డీకి రుణాలు ఇస్తూ, కేంద్రం ఏడు శాతం రాయితీ ఇస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం నాలుగు శాతమే భరిస్తోందంటూ ఈనాడు రాసింది. వాస్తవం ఏమిటంటే..2022 జూలై 20న ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాల మేరకు ఇప్పుడు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఏడు శాతం వడ్డీకే పొదుపు సంఘాలకు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. ఈ రుణాలపై కేంద్రం ఏడు శాతం వడ్డీ రాయితీ ఇస్తుందన్నదే శుద్ద తప్పు. ఆ ఏడు శాతం వడ్డీ మొత్తాన్ని ఇప్పటి ప్రభుత్వమే భరిస్తోంది. ఈనాడు మరో పెద్ద శుద్ధ తప్పు రాసింది. రాష్ట్రంలో ఇప్పుడు ఆరు ఉమ్మడి జిల్లాల్లో ఒకలా, మరో ఏడు ఉమ్మడి జిల్లాల్లో ఇంకోలా వడ్డీ రేటుకు పొదుపు సంఘాలకు రుణాలిస్తోందని రాసింది. అలాంటి వ్యత్యాసం లేనేలేదు. ఇప్పుడు.. బ్యాంకులే మహిళలను బతిమిలాడి రుణాలిచ్చే స్థితి.. అప్పట్లో చంద్రబాబు డ్వాక్రా రుణామాఫీ హామీ ఇచ్చి 2014లో అధికారంలోకి వచ్చాక ఆ హామీని అమలు చేయని కారణంగా రాష్ట్రంలో మొత్తం పొదుపు సంఘాల్లో 18.6 శాతం సంఘాలు అంటే ప్రతి ఐదులో ఒక సంఘం బాబు మాట నమ్మి తమ రుణాలు చెల్లించకపోవడంతో వాళ్లందరూ బ్యాంకుల ఎగవేతదారులుగా ముద్ర వేయించుకున్నారు. ఇప్పుడు పొదుపు సంఘాల మహిళలకు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా 2019 ఎన్నికల నాటికి ఉన్న అప్పు మొత్తం ప్రభుత్వమే తిరిగి చెల్లించడం వంటి కారణాలతో ఇప్పుడు మహిళలు 99.83 శాతం మంది అంటే దాదాపు అందరూ ఎప్పటికప్పుడు తమ కిస్తీలను చెల్లిస్తున్నారు. ఈ చెల్లింపులతో బ్యాంకులు పొదుపు సంఘాల మహిళలపై నమ్మకాన్ని పెంచుకున్నాయి. ఇప్పుడు ఎంత కావాలంటే అంత రుణాలు బ్యాంకులు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. 2019 ఏప్రిల్ నుంచి 2024 ఫిబ్రవరి వరకు ఐదేళ్ల కాలంలో ఏకంగా 1.73 లక్షల కోట్ల మొత్తాన్ని బ్యాంకులు పొదుపు సంఘాలకు రుణాలుగా ఇచ్చాయంటే రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల వద్ద ఎంత పరపతి పెరిగిందో అర్ధమవుతుంది. బాబు ప్రభుత్వంలో కేవలం ఒక్కో సంఘానికి గరిష్ఠంగా రూ. 10 లక్షల చొప్పున మాత్రమే బ్యాంకు రుణాలు ఇవ్వగా, ఇటీవల ఆర్బీఐ పొదుపు సంఘాలకు గరిష్ఠంగా రూ. 20 లక్షల వరకు పరిమితిని పెంచడంతో చాలా సంఘాలు ఇప్పుడు రూ. 20 లక్షల చొప్పున రుణాలు పొందుతున్నాయి. చంద్రబాబు చేసిన మోసం ఈ ప్రభుత్వానికి అంటగట్టే యత్నం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004లో వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పొదుపు సంఘాల రుణాలపై మొదట పావలా వడ్డీ పథకం అమలు చేయగా, తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోనే సున్నా వడ్డీ అమలులోకి వచ్చింది. విభజన అనంతరం.. 2014 ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఐదేళ్ల కాలంలో ఒక రూపాయినైనా మాఫీ చేయకుండా రాష్ట్రంలో పొదుపుసంఘాల మహిళలందరినీ మోసం చేసిన చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో సున్నా వడ్డీ పథకానికీ మంగళం పాడేశారు. 2016 జూలై తర్వాత రాష్ట్రంలో పొదుపు సంఘాల రుణాలపై వడ్డీలో ఒక్క రూపాయి అయినా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తిరిగి మహిళలకు చెల్లించలేదు. 2019లో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తిరిగి వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని పునరుద్ధరించడంతో పాటు గత ఐదేళ్లుగా ఏటా ఠంచన్గా ఆర్థిక సంవత్సరం ముగియగానే ఆ ఏడాది వడ్డీ డబ్బును ప్రభుత్వం తిరిగి మహిళలకు చెల్లిస్తూ వస్తోంది. గత నాలుగేళ్లల్లో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా వారి రుణాలపై వడ్డీ రూ. 4969.05 కోట్లను ఇప్పటికే ఆయా మహిళలకు చెల్లించింది. 2023–24 సంవత్సర వడ్డీని ఇటీవల ముగిసిన మార్చి నెలాఖరు తర్వాత ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లోగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. వాస్తవం ఇది...దీనికి భిన్నంగా చంద్రబాబును వెనకేసుకొచ్చే రాతలు రాసింది. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం 2016 నుంచి ఆపేసిన సున్నా వడ్డీని గొప్పగా చిత్రీకరిస్తూ.. అవన్నీ బకాయిలుగా పేర్కొంది. అప్పటి ప్రభుత్వం పెట్టిన బకాయిలు ఈ ప్రభుత్వం చెల్లించలేదని , ఇదంతా ‘జగన్ మోహన్రెడ్డి నయవంచన’ అంటూ ఈనాడు వక్రీకరించింది. వరుసగా రెండన్నరేళ్ల పాటు పథకానికి నిధులు ఇవ్వకుండా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఆపేస్తే వాటిని బకాయిలు ఎలా అంటారని అధికారులు ప్రశ్నిస్తున్నారు. -
ఆ ఉద్యోగ సంఘాలనేతలపై చర్యలు తీసుకోండి
సాక్షి, అమరావతి: ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కొందరు ఉద్యోగ సంఘాల నేతలపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకట్రామిరెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు ఉద్యోగ సంఘాల నేతలు చేస్తున్న వ్యాఖ్యలను నిత్యం కొన్ని పత్రికలు ప్రచురిస్తున్నాయని తెలిపారు. ఆయా పత్రికల క్లిప్పింగులను కూడా మీనాకు అందజేశారు. ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడటం ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని తనను సస్పెండ్ చేశారని.. మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కొన్ని ఉద్యోగ సంఘాల నేతల వ్యాఖ్యలు కూడా ఎన్నికల ప్రవర్తనా నియామవళి ఉల్లంఘన కిందకే వస్తాయని వెంకట్రామిరెడ్డి వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈనాడు తప్పుడు కథనాల వల్లే.. మార్చి 31న ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ హోదాలో తాను వైఎస్సార్ జిల్లాలో ఏపీపీటీడీ ఉద్యోగులను కలిసి వారి సమస్యలపై చర్చించానని వెంకట్రామిరెడ్డి తెలిపారు. అయితే అదే రోజు ఈనాడు పత్రిక ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం వల్లే ఉద్యోగులు మునిగిపోయారంటూ ఒక తప్పుడు కథనం ప్రచురించిందన్నారు. ఈ కథనాన్ని తాను ఖండిస్తూ విలీనం వల్ల ఉద్యోగులకు మేలే జరిగిందని.. ఉద్యోగుల గురించి తప్పుడు కథనాలు రాయొద్దని పత్రికా ప్రకటన విడుదల చేశానని తెలిపారు. దీంతో తనపై కక్ష కట్టిన ఈనాడు ఏప్రిల్ 2న తాను ఉద్యోగులతో మాట్లాడుతున్న ఫొటోను ప్రచురించి.. ఒక పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నానని తప్పుడు కథనం రాసిందన్నారు. ఈ కథనం ఆధారంగా తమపైన నాలుగు కేసులు పెట్టడంతోపాటు 11 మందిని సస్పెండ్ చేశారని వెంకట్రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పత్రికలు విష పురుగులు కొన్ని పత్రికలు రోజూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని సంఘాల నాయకులతో మాట్లాడిస్తున్నాయని, అది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదా? అని వెంకట్రామిరెడ్డి నిలదీశారు. ప్రభుత్వం ఉద్యోగులకు మంచి చేసింది అంటే తప్పు.. ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బంది పెడుతోంది అంటే అది కరెక్టా? అది కోడ్ ఉల్లంఘన కాదా? అని ప్రశ్నించారు. నిష్పక్షపాతంగా వార్తలు రాయడమంటే ఇదేనా అని ధ్వజమెత్తారు. కొంతకాలంగా ఆ పత్రికలు తమకు నచ్చిన వారికి మేలు చేయడమే లక్ష్యంగా కథనాలు రాస్తున్నాయని మండిపడ్డారు. ఈ పత్రికలు విష పురుగులతో సమానమన్నారు. ఎయిడ్స్, కరోనా లాంటివే ఈ పత్రికలు కూడా అని పేర్కొన్నారు. ఆ వ్యాధులకు మందు కనుక్కున్నారు కానీ ఈ పత్రికలకు మాత్రం మందు కనుక్కోలేకపోతున్నారన్నారు. ఉద్యోగుల సమాఖ్య తరఫున ఈనాడును బహిష్కరిస్తున్నామని వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. -
Fact check: ఓటమి భయం ప్రస్ఫుటం
సాక్షి, అమరావతి: రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం, టీడీపీ ఓటమి ఖాయమని జాతీయ చానళ్ల సర్వే ఫలితాలు విడుదలవుతున్న కొద్దీ ...ఈనాడు రామోజీరావులో పాత్రికేయ పైశాచికత్వం పెట్రేగి పోతోంది. ‘మేమంతా సిద్ధం’ యాత్రలో సీఎం వైఎస్ జగన్ పట్ల వెల్లువెత్తుతున్న ప్రజాదరణతో రామోజీరావుకు తత్వం మెల్లగా బోధపడుతోంది. జగన్కు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడం తన తరం కాదన్న అక్కసుతో ఏకంగా పోలీసు వ్యవస్థనే బ్లాక్మెయిల్ చేసేందుకు బరితెగించారు. ఆ కసిలో ఈనాడు పత్రికలో ‘అదే అరాచకత్వం...అదే దౌర్జన్యం’ శీర్షికన గురువారం తాజాగా విష పూరిత కథనాన్ని ప్రచురించారు. రామోజీ రాతలకు అతీతంగా అటు ఈసీ, ఇటు పోలీసు వ్యవస్థ నిబద్ధతతో తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వహించడం సానుకూల పరిణామం. కుట్ర బెడిసికొట్టినా ఖాకీలపై ఈనాడు కారుకూతలు... చంద్రబాబు, పురందేశ్వరిల భాగస్వామ్యంతో పోలీసు వ్యవస్థను తమకు గులాంగా చేసుకునే కుట్రలో భాగంగా ...రాష్ట్రంలో 20 మందికి పైగా ఐపీఎస్ అధికారులను మార్చేయాలని ఈనాడు లో కథనాలు రాశారు. రామోజీ పాచిక పారలేదు. డీఐజీ, ఐదుగురు ఎస్పీలను మాత్రమే ఎన్నికల కమిషన్ మార్చింది. వారి స్థానాల్లో తాము చెప్పిన వారినే నియమించాలన్నట్టుగా పచ్చ ముఠా పరోక్షంగా ఆదేశాలు జారీ చేసింది. తద్భిన్నంగా నియమావళి ప్రకారం ఎన్నికల కమిషన్ ఒక డీఐజీ, ఐదుగురు ఎస్పీలను నియమించడంతో రామోజీలో అహం దెబ్బతింది. దీంతో ‘వీళ్లా ఎస్పీలు’ అంటూ డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు లక్ష్యంగా దు్రష్పచార కథనాన్ని ఈనాడు ప్రచురించింది. ఈ కథనంతో చిర్రెత్తిన పోలీసు యంత్రాంగం తీవ్రంగా స్పందించింది. ఏకంగా 19 మంది ఐపీఎస్ అధికారులు టీడీపీ, జనసేన, బీజేపీ, ఈనాడులకు వ్యతిరేకంగా ఈసీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఈనాడు తీరుపై మండిపడింది. అంతటితో బుద్ధి రాని రామోజీ కుక్కతోక వంకరన్నట్లు మరోసారి పోలీసు వ్యవస్థపై విధ్వేషం వెళ్లగక్కారు. ఈనాడులో వచి్చన ఆదేశాలనే ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో పోలీసులు పాటించాలన్నట్టుగా బ్లాక్మెయిలింగ్కు దిగజారారు. టీడీపీ దౌర్జన్యాలు, దాడులను మసిపూసి మారేడు కాయ చేస్తూ వైఎస్సార్సీపీపై బురద జల్లేందుకు యతి్నంచారు. వైఎస్సార్సీపీలో ఫలానా నేతలపై ఫలానా సెక్షన్ల కింద కేసులు పెట్టండంటూ పోలీసులకు రామోజీ తన రాతల హుకుం జారీ చేశారు. పోలీసు అధికారుల బెదిరింపునకూ పన్నాగం తాజాగా ఎన్నికల విధుల్లో క్రియాశీలంగా ఉండే డీఎస్పీ, సీఐ, ఎస్సైలను బ్లాక్మెయిల్ చేయడం ద్వారా టీడీపీ అక్రమాలకు అడ్డులేకుండా చేయాలన్న పచ్చ కుట్రలో రామోజీ భాగస్వామిగా మారారు. ఇటీవల పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు దౌ ర్జన్యాలకు పాల్పడ్డ ఉదంతాలను ఈనాడు వక్రీకరిస్తూ తప్పుడు కథనం ప్రచురించింది. మాచర్ల, గన్నవరం, అద్దంకి, ఉరవకొండ, గుడివాడ తదితర నియోజకవర్గాల్లో గత వారం పదిరోజుల్లో టీడీపీ కార్యకర్తలు దౌర్జ న్యాలకు పాల్పడ్డారు. తాజాగా బుధవారం రాత్రి ఒంగోలులో ఎన్నికల ప్రచారంలో ఉన్న వైఎస్సార్సీపీ అ భ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిని, ఆయన కుటుంబ స భ్యులనే అడ్డుకున్నారు. అసలు ఎన్నికల ప్రచారం చే యడానికి వీల్లేదని గలాభా సృష్టించారు. ఈ ఘటనల పై స్థానిక పోలీసులకు ఫిర్యాదులు అందడంతో వారు కఠిన చర్యలు తీసుకున్నారు. టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడినా.. వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ప్రచా రా న్ని అడ్డుకున్నా పోలీసు యంత్రాంగం చేష్టలుడిగి చూ స్తుండాలన్నట్టుగా ఈనాడు వితండవాదం చేస్తోంది. ఈసీనే శాసిస్తున్న రామోజీ రాతలు... ఏకంగా రాజ్యంగబద్ధ సంస్థ ఈసీకే పరోక్షంగా తన రాతలతో ఆదేశాలు జారీ చేస్తుండటం రామోజీరావు బరితెగింపునకు నిదర్శనం. ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో ఏకంగా ఎస్పీలను మారిస్తే సరిపోతుందా... మొత్తం డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలను మార్చేయాలని ఈసీకే రాతల హుకుం జారీ చేశారు. అందర్నీ మారుస్తామన్నారు..ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఈసీనే ఈనాడు నిలదీయడాన్ని ప్రజాస్వామ్యవాదులే ఛీత్కరించుకుంటున్నారు. ఈసీ కొత్తగా నియమించిన పల్నాడు ఎస్పీపైనా ఈనాడు విషం కక్కింది. అయినా రామోజీ రాతలకు అతీతంగా ఈసీ తన పని తాను పక్షపాత రహితంగా చేసుకుపోతోంది.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019