Just In
Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1
Ad - Sakshi_Home_Sticky
-
‘రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులు దుర్వినియోగం’
బరంపురం: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని బీజేపీ బరంపురం లోక్సభ అభ్యర్థి డా.ప్రదీప్ పాణిగ్రాహి ఆరోపించారు. స్థానిక పాత బస్టాండ్లోని నందన్ ఇంటర్నేషనల్ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఒడిస్సా రాష్ట్ర అభివృద్ధికి విడుదల చేస్తున్న నిధులను అధికార పార్టీ బీజేడీ దారి మళ్లిస్తూ అవినీతికి పాల్పడుతోందని దుయ్యబట్టారు. రాష్ట్ర అభివృద్ధిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించి వివిధ రకాల పథకాల కింద కోట్లాది రూపాయులు విడుదల చేసినట్లు గుర్తు చేశారు. అధికార బీజేడీ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రజలు ఇప్పటికే గ్రహించారని చెప్పారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వారికి బుద్ధి చెబుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సుభాష్ పాఢి, ఎమ్మెల్యే అభ్యర్థి కె.అనిల్ కుమార్, సునీల్ సాహు తదితరులు పాల్గొన్నారు. -
ఓటే.. నీ ఆయుధం..!
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుహక్కు వినియోగం ప్రక్రియ అత్యంత బృహత్తరమైనది. ఈ ప్రక్రియని విజయవంతం చేయడంలో యువతని భాగస్వాములుగా మేల్కొలిపేందుకు ఎన్నికల సంఘం అంకితభావంతో కృషి చేస్తోంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) మార్గదర్శకంలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లాస్థాయిలో పలు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాలాసోర్ జిల్లాలోని వివిధ కళాశాలల్లో విద్యార్థులు ఈ కార్యకలాపాల్లో చురుకుగా పాలుపంచుకున్నారు. ప్రధానంగా తొలిసారి ఓటుహక్కు పొందిన సరికొత్త విద్యార్థి ఓటర్లు ఈ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఓటుహక్కు ప్రాధాన్యత ఇతివృత్తంగా బాలాసోర్ ప్రాంతంలో పలు పాఠశాలలు, కళాశాలల్లో ఇటువంటి చైతన్య కార్యక్రమాలు చేపట్టారు. మొదటిసారి ఓటు వేయనున్న యువతలో ఓటుహక్కు సద్వినియోగంపై అవగాహనను పెంపొందించే లక్ష్యంతో పలు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మన ప్రజాస్వామ్యం భవిష్యత్తును రూపొందించడంలో మన యువతను శక్తివంతం చేయడం చాలా కీలకం అని ఎన్నికల సంఘం తెలిపింది. డీఈవో బాలాసోర్ ఆధ్వర్యంలో తొలిసారిగా ఓటు వేయనున్న విద్యార్థులను అవగాహన కల్పించే దృక్పథంతో రంగోలీ పోటీలు నిర్వహించారు. వీరు రూపుదిద్దిన ప్రతి రంగవల్లి భారత ప్రజాస్వామ్య ప్రాముఖ్యతను ప్రతిబింబించిందని నిర్వాహక వర్గం అభినందించింది. – భువనేశ్వర్ -
విజృంభిస్తున్న మలేరియా వ్యాధి
రాయగడ: జిల్లాలోని కల్యాణ సింగుపూర్, మునిగుడ సమితి పరిధి నియమగిరి పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్న డొంగిరియా గ్రామాల్లో మలేరియా విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ ప్రాంత ప్రజలు జ్వరాల బారినపడి మంచం పట్టడంతో సమాచారం తెలుసుకున్న జిల్లా యంత్రాంగం ఈ మేరకు స్పందించింది. మలేరియా వ్యాధి సోకిన గ్రామాల్లో గురు, శుక్రవారాల్లో వైద్య బృందాలు ఆయా ప్రాంతాలకు వెళ్లి వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ రెండు సమితుల్లోని పార్శలి, లిఖాపొదొరొ, పొట్టంగపొదిరొ, డొంగామటి, జురప, లంబ, ఖాంబేసు, పొలొభెరి గ్రామాలకు వైద్య బృందాలు వెళ్లి చికిత్స అందిస్తున్నాయి. అదేవిధంగా రోగ నిర్ధారణ కోసం రక్త నమూనాలను సేకరిస్తున్నారు. అయితే కొంతమంది డొంగిరియా ప్రజలు కొండ ప్రాంతాల్లో నివసిస్తుండడంతో వారికి అందుబాటులో ఉన్న నాటువైద్యంపై ఆధారపడుతున్నట్లు తెలిసింది. అయితే అందరికీ సకాలంలో వైద్యం అందించే విషయంలో తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని వైద్య శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం అన్ని గ్రామాల్లో పరిస్థితి అదుపులో ఉందని పేర్కొంది. -
శనివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2024
● ఓటెత్తాలిఓటుహక్కు వినియోగంపై జిల్లా యంత్రాంగం విరివిగా చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈసారి జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో 85 శాతంకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించే విధంగా ప్రణాళికలు రూపొందించింది. ఈ క్రమంలో జిల్లాలోని గుడారిలో శుక్రవారం ఓటుహక్కు వినియోగంపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. గుడారి పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీల్లో చైతన్యం కల్పించేవిధంగా సిబ్బంది బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. – రాయగడన్యూస్రీల్ -
నందన్కానన్ జూలో తెల్లపులి మృతి
భువనేశ్వర్: నగర శివారులోని బారంగ్ నందన్కానన్ జూలాజికల్ పార్క్లో 14 ఏళ్ల తెల్లపులి ‘స్నేహ’ శుక్రవారం జూలో చికిత్స పొందుతూ మరణించింది. గురువారం అస్వస్థతకు గురవ్వడంతో సత్వర చికిత్స ప్రారంభించారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న తరుణంలో తీవ్రమైన వడగాలుల కారణంగా ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. స్నేహ 2010 మార్చి 1న జన్మించింది. 14 ఏళ్ల జీవిత కాలంలో 3 ఈతల్లో 9 పిల్లల తల్లిగా జూలో పులుల సంతతి వృద్ధికి తోడ్పడింది. వీటిలో 3 తెలుపు, 4 సాధారణ, 2 మెలనిస్టిక్ వన్నెల పులులు ఉండడం విశేషం. 2022 అక్టోబర్లో 11 ఏళ్ల తెల్లపులి బిజయ మృతి చెందింది. ఊపిరితిత్తుల క్యాన్సర్కు గురై ఇది మరణించింది. అంతకుముందు 2019 అక్టోబర్లో కాలేయ సంబంధిత అనారోగ్యంతో సుభ్రాంశు అనే ఐదేళ్ల తెల్ల మగ పులి కూడా మరణించింది. నందన్కానన్ అధికారిక వనరుల సమాచారం ప్రకారం ప్రస్తుతం జూలో 27 పులులు ఉన్నాయి. వీటిలో సాధారణ పులులతో 7 తెలుపు మరియు 3 మెలనిస్టిక్ పులులు ఉన్నాయి.మావో డంప్ స్వాధీనం మల్కన్గిరి: జిల్లాలోని కలిమెల సమితి బోడిగేట్ట అడవిలో కూంబింగ్ నిర్వహించిన కోబ్రా, బీఎస్ఎఫ్ జవాన్లు మావోలు అమర్చిన భారీ డంప్ను వెలికితీశారు. వివరాల్లోకి వెళ్తే.. బేజాంగ్వాడ అడవిలో మావోల డంప్లు ఉన్నట్లు ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా జిల్లా ఎస్పీ నితీష్ వాద్వానికి సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో కోబ్రా, బీఎస్ఎఫ్ జవాన్లు ముమ్మరంగా గురువారం సాయంత్రం నుంచి కూంబింగ్ నిర్వహించారు. దీనిలో భాగంగా ఎలక్కనూర్ గ్రామం వద్ద డంప్ను స్వాధీనం చేసుకున్నారు. డంప్లో ఒక ఐఈడీ టిఫిన్ బాక్స్ బాంబ్, ఆరు గన్లు, 36 హైడ్ గ్రానేట్స్, రెండు సోలార్ ఎల్క్ట్రికల్ ప్యానెల్స్, ఒక గ్యాస్ సిలిండర్, 20 మీటర్ల కరెంట్ వైరు ఉన్నట్లు వెల్లడించారు. డంప్ స్వాధీనం చేసుకున్న జవాన్లను అధికారులు అభినందించారు. నలుగురు దోపిడీ దొంగలు అరెస్టు బరంపురం: నగర శివారులోని శ్రీక్షేత్ర విహార్ పక్కన పడియాలో దోపిడీకి సిద్ధమవుతున్న ముఠాని పోలీసులు అరెస్టు చేశారు. ఐఐసీ అధికారి గోపినాథ్ ప్రధాన్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం అర్థరాత్రి పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో నిమ్మఖండి పోలీసుస్టేషన్ పరిధిలో అర్థరాత్రి దోపిడీకి సిద్ధమవుతున్న ముఠా పోలీసుల కంటపడింది. దీంతో పోలీసులు వీరిని వెంబడించి చాకచక్యంగా పట్టుకొని అరెస్టు చేశారు. అరైస్టెనవారిలో గంజాం జిల్లాలోని గంగపూర్ గ్రామానికి చెందిన తపన్ సాహు, పద్మపూర్ గ్రామానికి చెందిన నిమోయ్ చరణ్ నాయక్, తెంతులిఖండి గ్రామానికి చెందిన దేబనంద గౌడ, అస్కాకి చెందిన కె.సుర్యారావులు ఉన్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి 2 బైక్లు, తుపాకీ, 5 గుండ్లు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశారు.బీజేడీలోకి చేరికలు పర్లాకిమిడి: గుమ్మా సమితి సభ్యులు బర్నింగ్ గొమాంగో, గుసాని సమితిలో ఎం.ఎస్.పూర్ పోలాకి విష్ణుప్రసాద్లు శుక్రవారం బీజేడీలో చేరారు. స్థానిక బీజేడీ పార్టీ కార్యాలయంలో మిశ్రణ్ పర్వ్ శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కెంగం సూర్యారావు కాంగ్రెస్ నుంచి బీజేడీలో చేరిన బర్నింగ్ గొమాంగో, విష్ణుప్రసాద్లను పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. బీజేడీ పార్టీని వీడి ఇతర పార్టీలోకి వెళ్లినవారు పార్టీ ఽద్రోహులని బీజేడీ ఛత్ర విభాగం అధ్యక్షుడు సుర్జిత్ త్రిపాఠి అన్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Chekc 1234 off the field
Test article qid_23456x4
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 17 ఏళ్ల కెరీర్కు గుడ్ బై
ఎవరేశారో తెలుసుకోకుండా దోశలు తినేయడమేనా!!
స్టోయినిష్ అరుదైన రికార్డు.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
విశ్వసనీయత లేని ప్రతిపక్షాన్ని తిరస్కరించాలి!
అభివృద్ధి బటన్ నొక్కిన సీఎం జగన్
దిక్కుతోచని కుటుంబం దిశ మారింది..!
సారా.. నారా అండతో దోపిడీకి C/O సీఎం రమేష్
ఛాంపియన్ దేశం
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019