Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

‘రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులు దుర్వినియోగం’

Published Sat, Apr 20 2024 1:15 AM

మాట్లాడుతున్న ప్రదీప్‌ పాణిగ్రాహి - Sakshi

బరంపురం: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని బీజేపీ బరంపురం లోక్‌సభ అభ్యర్థి డా.ప్రదీప్‌ పాణిగ్రాహి ఆరోపించారు. స్థానిక పాత బస్టాండ్‌లోని నందన్‌ ఇంటర్నేషనల్‌ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఒడిస్సా రాష్ట్ర అభివృద్ధికి విడుదల చేస్తున్న నిధులను అధికార పార్టీ బీజేడీ దారి మళ్లిస్తూ అవినీతికి పాల్పడుతోందని దుయ్యబట్టారు. రాష్ట్ర అభివృద్ధిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించి వివిధ రకాల పథకాల కింద కోట్లాది రూపాయులు విడుదల చేసినట్లు గుర్తు చేశారు. అధికార బీజేడీ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రజలు ఇప్పటికే గ్రహించారని చెప్పారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వారికి బుద్ధి చెబుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సుభాష్‌ పాఢి, ఎమ్మెల్యే అభ్యర్థి కె.అనిల్‌ కుమార్‌, సునీల్‌ సాహు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Copy Button

 

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250