ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం తర్వాత స్వామివారు గజవాహనంపై విహరించారు.అంతకు ముందు ఉదయం 7 నుంచి 9గంటల వరకు శివధనుర్భంగాలంకారంలో రాములోరు భక్తులకు దర్శనం ఇచ్చారు. చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఆలయంలో స్నపన తిరుమంజనం జరిగింది.బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు రథారోహణం, 10:15 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రథోత్సవం నిర్వహిస్తారు.
breaking news
Breadcrumb
- HOME
Ad - Sakshi_Home_Sticky
adsolute_video_ad
Related news
-
నాలుగోరోజు నామినేషన్ల జోరు
కడప సెవెన్రోడ్స్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నాల్గవరోజైన సోమవారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 44 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో కడప లోక్సభ స్థానానికి ఆరు నామినేషన్లు రాగా, ఏడు అసెంబ్లీ స్థానాలకు 38 నామినేషన్లు దాఖలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. కడప లోక్సభ: కడప లోక్భ స్థానానికి కుంచెం వెంకట సుబ్బారెడ్డి రాయలసీమ రాష్ట్ర సమితి అభ్యర్థిగా ఒకటి, ఇండిపెండెంట్గా ఒక నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షర్మిల తరఫున మూడు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ తరఫున వేణుగోపాల్ ఒకటి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఖాజా హుసేన్ ఒకటి, ఇండిపెంట్ అభ్యర్థిగా వెంకట సుబ్బారెడ్డి రెండు నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీలకు... బద్వేలు: కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్డీ విజయజ్యోతి ఒక సెట్, వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా దాసరి సుధ ఒక సెట్, సమాజ్ వాది పార్టీ అభ్యర్థిగా వెంకట సుబ్బరాయుడు ఒకటి, బీజేపీ అభ్యర్థిగా రోశన్న ఒకటి, బీజేపీ అభ్యర్థిగా అరుణరాజి ఒకటి, ఇండిపెండెంట్గా మల్లికార్జున ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. కడప: రీఫార్మ్స్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా సుబ్రమణ్యం ఒకటి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అభ్యర్థిగా అలీషేర్ ఒకటి, నేషనల్ మహా సభ అభ్యర్థిగా పట్టుపోగుల పవన్కుమార్ ఒకటి, జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ అభ్యర్థిగా అవ్వారు మల్లికార్జున నామినేషన్ దాఖలు చేశారు. పులివెందుల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి తరఫున ఒకటి, జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా దాసరి రవిశంకర్ ఒకటి, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా గవిరెడ్డి రామేశ్వర్రెడ్డి ఒకటి, బహుజన సమాజ్ పార్టీ తరఫున బెల్లం ప్రవీణ్కుమార్రెడ్డి ఒక నామినేషన్ దాఖలు చేశారు. కమలాపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పి.రవీంద్రనాథ్రెడ్డి రెండు సెట్లు, ఇండిపెండెంట్గా నర్రెడ్డి కిశోర్రెడ్డి ఒకటి, సీపీఐ తరఫున గాలి చంద్ర ఒకటి, కాంగ్రెస్ అభ్యర్థిగా పాముల బ్రహ్మానందరెడ్డి ఒకటి దాఖలు చేశారు. జమ్మలమడుగు: ఇండిపెండెంట్గా రామేశ్వర్రెడ్డి ఒకటి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ మూలె సుధీర్రెడ్డి రెండు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా క్రాంతి ప్రియ ఒకటి, ఇండిపెండెంట్గా ప్రమోద్కుమార్రెడ్డి ఒకటి, ఇండిపెండెంట్గా రామాంజనమ్మ ఒకటి, ఇండిపెండెంట్గా వెంకట సుబ్బారెడ్డి ఒక నామినేషన్ దాఖలు చేశారు. ప్రొద్దుటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాచమల్లు శివస్రాద్రెడ్డి ఒకటి, బీఎస్పీ అభ్యర్థిగా సుబ్బరాయుడు ఒకటి, కాంగ్రెస్ అభ్యర్థిగా మహమ్మద్ నజీర్ ఒకటి, జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ అభ్యర్థిగా సురేష్బాబు ఒక నామినేషన్ దాఖలు చేశారు. మైదుకూరు: తెలుగుదేశం పార్టీ తరఫున పుట్టా సుధాకర్ ఒకటి, పుట్టా రవికుమార్ యాదవ్ ఒకటి, వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురామిరెడ్డి ఒకటి, బీఎస్పీ తరఫున డీఎస్ జయరాం ఒకటి, ఇండిపెండెంట్గా ఆవుల వెంకట రమణ ఒకటి, బీఎస్పీ అభ్యర్థిగా డీఎస్ కల్యాణ్ ఒకటి, కాంగ్రెస్ అభ్యర్థిగా గుండ్లకుంట శ్రీరాములు ఒకటి, జయభారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా లెక్కల శ్రీనివాసులురెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం 44 నామినేషన్లు దాఖలు -
No Headline
ఎయిడెడ్ 768 650 84.64 బీసీవెల్పేర్ 210 208 99.05 ప్రభుత్వ 707 590 83.45 కేజీబీవీ 613 593 96.74 మున్సిపాలిటీ 1776 1425 80.24 మోడల్స్కూల్స్ 254 253 99.61 ఏపీ రెసిడెన్షియల్ 156 154 98.72 సోసియల్ వెల్ఫేర్ 839 816 97.26 ట్రైబల్ వెల్ఫేర్ 99 93 93.94 జెడ్పీ 9389 8147 86.77 ప్రైవేటు 12918 12609 97.61 -
టెన్త్లో తీన్మార్
కడప ఎడ్యుకేషన్: పదో తరగతి ఫలితాల్లో జిల్లా మెరిసింది. గతంతో పోల్చితే ఓ స్థానం ఎగబాకి మూడో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఉత్తీర్ణతశాతం కూడా మెరుగైంది. గతేడాది 79.43 శాతం ఉండగా ఈ ఏడాది 92.10 శాతం పెరిగింది. అంటే గతేడాది కంటే ఈఏడాది 12.67 శాతం పెరగడం విశేషం. జిల్లాలో ఎక్కడా ఎలాంటి ఆరోపణలకు తావులేకుండా విద్యాశాఖ అధికారులు చాలా పకడ్బందీగా పది పరీక్షలను నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 153 పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన పది పరీక్షలకు 27729 మంది విద్యార్థులు హాజరై పరీక్ష రాయగా ఇందులో 25538 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక ప్రభుత్వ మ్యానేజ్మెంట్కు సంబంధించి ఏపీ మోడల్ స్కూల్స్ 99.61 శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాలో మొదటిస్థానంలో నిలువగా బీసీ వెల్పేర్ 99.05 స్థానం సాధించి ద్వితీయస్థానంలో, ఏపీ రెసిడెన్సియల్ స్కూల్స్ 98.72 శాతం ఉత్తీర్ణత సాధించి తృతీయస్థానంలో నిలిచాయి. ప్రభుత్వ చొరవతోనే.. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలలకు నాడు –నేడు కింద సకలసౌకర్యాలను సమకూర్చింది. విద్యార్థుల చదువు కోసం అవసరమైన అన్ని రకాల వస్తువులను విద్యాకానుక పేరిట సకాలంలో అందించింది. దీంతోపాటు పిల్లలకు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందించింది. అలాగే అమ్మ ఒడిని అందించింది. దీంతో పిల్లలు ఏ చీకూచింత లేకుండా చదువుకున్నారు. పది ఫలితాలను అదరగొట్టారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పదిలో ఉత్తమ ఫలితాలను సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమకూరిన వసతుల కారణంగా ఈ ఏడాది పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతం పెరిగిందని పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాలికలదే హవా.. ఈ సారి ఫలితాల్లోనూ బాలురపై బాలికలే పై చేయి సాధించారు. జిల్లావ్యాప్తంగా 14214 మంది బాలురు, 13515 మంది బాలికలు పరీక్ష రాశారు. వీరిలో బాలురు 12929 మంది పాసై 90.96 శాతం ఉత్తీర్ణతను సాధించగా.. బాలికలు 12609 మంది పాసై 93.3 శాతం ఉత్తీర్ణతను సాధించారు. 22255 మందికి ప్రథమస్థానం: పది పరీక్షలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 27729 మంది విద్యార్థులు పరీక్షను రాయగా ఇందులో 25,538 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 22255 మంది విద్యార్థులు ప్రథమస్థానంలో ఉత్తీర్ణత సాధించగా 2378 ద్వితీయస్థానంలో ఉత్తీర్ణతను సాధించారు. అలాగే మరో 905 మంది తృతీయస్థానంలో నిలిచారు. సంవత్సరం పరీక్షలు రాసిన పాసైన పాస్ రాష్ట్రంలో విద్యార్థులు వారు శాతం స్థానం 92.10 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 3వ స్థానం గతేడాది కంటే ఒక స్థానం ముందుకు జిల్లావ్యాప్తంగా 27729 మందికిగాను 25538 మంది పాస్ గతేడాదికంటే 12.67 శాతం పెరిగిన ఉత్తీర్ణత వందశాతం ఉత్తీర్ణత సాధించిన 200 ప్రభుత్వ పాఠశాలలు 2017–18 35660 34008 95.37 10 2018–19 36536 33943 92.90 11 2019–20 37,600 37600 100 – 2020–21 37955 37,955 100 – 2021–22 38035 27018 71.03 06 2022–23 27097 21524 79.43 04 2023–24 27729 25538 92.10 03 -
No Headline
ఒంటిమిట్ట: లోక కళ్యాణార్థం జగమేలే వైకుంఠరాముని జగత్ కళ్యాణం ఆంధ్రభద్రాద్రి ఏకశిలానగరి ఒంటిమిట్టలోని జగదభిరాముడి దివ్యక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి వైభవంగా జరిగింది. కోదండ రామయ్య సీతమ్మవారిని పరిణయమాడిన వేళ శిల్పకళాశోభితమైన కళ్యాణ మండపం వైకుంఠాన్ని తలపించింది. ఒంటిమిట్ట కోదండ రాముడి కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం తరపున సతీసమేతంగా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలోని మూల మూర్తులకు రాష్ట్ర స్పెషల్ సీఎస్ కరికలవల్లన్ కల్యాణ వేదిక వద్ద ఉన్న కల్యాణ దంపతులైన సీతారాములకు ముత్యాలతలంబ్రాలు, పట్టువస్త్రాలు సంప్రదాయం ప్రకారం స్వామి వారికి సమర్పించారు. సంప్రదాయం.. ఎదుర్కోలు ఉత్సవం ఒంటిమిట్ట కోదండ రామాలయంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు సీతారామచ్రందులకు నిర్వహించిన ఎదుర్కోలు ఉత్సవం సంప్రదాయబద్ధంగా సాగింది. ఉత్సవ వరులను పల్లకీపై కొలువు తీర్చి ప్రధాన ఆలయం నుంచి మంగళవాయిద్యాల మధ్య భక్తుల జయజయ ధ్వనాలతో శిల్పకళా శోభితమైన కళ్యాణ మండపం వద్దకు తీసుకు వచ్చారు. వేదిక పైన రంజిత సింహాసనంపై కళ్యాణ మూర్తులను ఆశీనులు చేశారు. అనంతరం పూజా సామగ్రిని సంప్రోక్షణ జరిపి ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా విశ్వక్షేన పూజ నిర్వహించారు. ‘కర్మణ్యేపుణ్యాహవచనం’ అనే మంత్రంతో మండప శుద్ధి జరిపి కళ్యాణ తంతుకు శ్రీకారం చుట్టారు. ముంజానకీ ప్రథమం అనే మంత్రం జపిస్తూ వేద పండితులు స్వామి వారికి ఎదురుగా సీతమ్మను కూర్చో పెట్టి కన్యావరణ జరిపించారు. మోక్ష బంధనం, ప్రతిసర బంధనం, ద్వితీయ సువర్ణ యజ్ఞోప వీత ధారణం చేశారు. అనంతరం ఆశీర్వచనం, పాద ప్రక్షాళనం, పుష్పోదకస్నానం నిర్వహించి, వర పూజ చేశారు. బంగారు ఆభరణాలను సీతమ్మకు అలంకరించి సకలోపచారాలు చేశారు. మధుపర్కపాసన అనంతరం పెరుగు, తేనె కలిపిన మిశ్రమాన్ని స్వామి వారికి నివేదించగా నును సిగ్గుల మొలకై న సీతమ్మ నోసటన కళ్యాణ బొట్టును, బుగ్గన కాసింత దిష్టిచుక్క పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తరుపున స్పెషల్ సీఎస్ కరికాలవలవన్ సమర్పించిన ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను ధరించి పెళ్లికూతురిగా ముస్తాబైంది. అమెకు ఏ మాత్రం తీసిపోని విధంగా శివధనుస్సు విరిచిన శ్రీరామచంద్రమూర్తి అదే రీతిలో సర్వాభరణ భూషితుడై సీతమ్మ ఎదుట కూర్చున్నాడు. తరువాత లోక క్షేమం కోసం మహా సంకల్పం పఠించి కణ్యాదానం, గోదానం చేశారు. సీతమ్మకు రామయ్యకు చెరో 8 శ్లోకాలతో మంగళకాష్టం చదివారు. మంగళవాయిద్యాలు, వేద పండితుల చతుర్వేద పఠనం భక్తుల రామనామ ధ్వనుల మధ్య హస్త నక్షత్రయుక్త శుభలగ్నంలో సీతారాముల శిరస్సులపై జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉంచారు. అనంతరం గౌరిదేవి, సరస్వతి దేవి, మహాలక్ష్మీ అమ్మవార్లను ఆహ్వానించి సకల మంగళాలకు ఆలవాలమైన మంగళసూత్రానికి పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు వీణారాఘవాచార్యులు ఆధ్వర్యంలో పాంచరాత్ర ఆగమశాస్త్ర వేదపండితులు మంగళసూత్రాన్ని భక్తులకు చూపించి సాక్షాత్తూ లక్ష్మీనారాయణుడైన శ్రీరామ చంద్రమూర్తి చేత, శ్రీ మహాలక్ష్మీ స్వరూపినీ సీతాదేవికి శాస్త్రోక్తంగా మంగళసూత్రాధారణ నిర్వహించారు. ప్రభుత్వం తెచ్చిన ముత్యాల తలంబ్రాలు కళ్యాణమూర్తుల శిరస్సుపై వేసి కనుల పండువగా కళ్యాణం జరిపారు. అనంతరం నివేదన ఇచ్చి బ్రహ్మముడి వేశాక మహాదాశీర్వచనం నిర్వహించి హారతి ఇవ్వడంతో కళ్యాణ క్రతువు ముగిసింది. ● స్వామి వారి కల్యాణాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి సత్యనారాయణ, టీటీడీ ఈఓ ధర్మారెడ్డి, జేఈఓలు వీరబ్రహ్మం, గౌతమి, జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్తోపాటు టీటీడీ యంత్రాంగం, జిల్లా ఉన్నతాధికారులు, ప్రముఖులు, లక్షలాది మంది భక్త జనం వీక్షించారు. భక్తుల రామనామ సంకీర్తనలు.. పండితుల చతుర్వేద పఠనం..మంగళవాయిద్యాల నడుమ.. సోమవారం సాయంత్రం 6:30 గంటల నుంచి 8:30 గంటల వరకు హస్త నక్షత్రయుక్త శుభలగ్నంలో దశరథ మహారాజు తనయుడు శ్రీ రామచంద్రమూర్తి , జనకుని గారాల పట్టి.. నునుసిగ్గుల మొలక సీతమ్మను పరిణయమాడాడు. కమనీయం..రమణీయమైన ఈ సుందర దృశ్యాన్ని తిలకించిన భక్తులు భక్తి పారవశ్యంలో తడిసిముద్దయ్యారు. కమనీయం..దాశరథి కల్యాణం ఏకశిలానగరిలో పండు వెన్నెలలో రాములోరి కల్యాణం కనులారా వీక్షించిన చంద్రుడు పోటెత్తిన భక్తజనం మార్మోగిన రామనామం -
ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య
కాశినాయన : మండలంలోని వరికుంట్ల గ్రామానికి చెందిన వివాహిత జాగిరిమున్ని (36) తన ఇంట్లో ఉరి వేసుకుని సోమవారం ఆత్మహత్య చేసుకుంది. వారి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మున్నికి గత 18 సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన పీరావలితో వివాహమైంది. భర్త కువైట్లో పనిచేసేవాడు. మూడు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. భార్యభర్తలు అన్యోన్యంగా ఉండేవారు. ఈ నేపథ్యంలో ఆదివారం భార్యభర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. అయితే ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఆమె ఉరి వేసుకుని మృతిచెందింది. కాశినాయన ఏఎస్ఐ రమణ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోరుమామిళ్ళ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Related News by category
-
టీడీపీది నీచ రాజకీయం
మైదుకూరు : రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ నీచమైన రాజకీయం చేస్తోందని కర్నూలు ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్ ఖాన్ ఆరోపించారు. గురువారం ఆయన మైదుకూరులో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కూడా చంద్రబాబే నడిపిస్తున్నారని ఈసందర్భంగా హఫీజ్ ఖాన్ ఆరోపించారు. ఒక వైపు బీజేపీ ఓటు బ్యాంకు కావాలనుకుంటూనే మరో వైపు కాంగ్రెస్ పార్టీ ద్వారా ముస్లింల ఓట్లను చీల్చే కుట్రచేస్తున్నాడని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని ముస్లింలంతా గ్రహించి చంద్రబాబు కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. బాబు మోసపూరిత మాటలనూ ముస్లింలు నమ్మవద్దని పిలుపునిచ్చారు. నాలుగు శాతం రిజర్వేషన్ను కాపాడుకోవాలంటే.. ముస్లిం యువతకు భవిష్యత్తును ఇచ్చే నాలుగు శాతం రిజర్వేషన్ను కాపాడుకోవాలంటే ముస్లింలంతా వైఎస్సార్సీపీకి ఓటేసి మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్యే అబ్దుద్ హఫీజ్ ఖాన్ కోరారు. ఎన్ఆర్సీని రాష్ట్రంలో లేకుండా చూడాలన్నా, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా అసెంబ్లీలో జగన్మోహన్రెడ్డి చేసిన తీర్మానాన్ని కాపాడుకోవాలన్నా, యూనిఫాం సివిల్ కోడ్ను ఎదుర్కోవాలన్నా జగన్మోహన్రెడ్డిని మళ్లీ సీఎంగా చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. మైనారిటీలకు చంద్రబాబు రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తే, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జగన్ మోహన్రెడ్డి రూ.21వేల కోట్లతో విద్య, వైద్యం, గృహ వసతిని కల్పిస్తూ, మహిళా సాధికారతతో మైనారిటీలకు ఎంతో మేలు చేశారని వివరించారు. వక్ఫ్బోర్డు జిల్లా చైర్మన్ మదీనా దస్తగిరి, అన్నలూరు సర్పంచ్ ఎం.శ్రీనివాసులరెడ్డి, ఖాసీం, అజంతుల్లా, బాగ్ బాషా, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్ ఖాన్ -
మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం
కొండాపురం: గండికోట ప్రాజెక్టు ముంపు బాధిత తొలి విడత గ్రామాలకు ఎన్నికలు తర్వాత ఒక నెలరోజుల్లోపు అదనంగా చెప్పిన పరిహారం రూ.3.25 లక్షలు అందజేసి మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని చౌటిపల్లె, గండ్లూరు, కొండాపురం, పెంజి అనంతపురం, ఏటూరు, తాళ్లప్రొద్దుటూరు, దత్తాపురం, కె.సుగు మంచిపల్లె ముంపు గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి సుఽధీ ర్రెడ్డి, ఎమ్మెల్సీలు పి.రామసుబ్బారెడ్డి, రమేష్ యాదవ్తో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్రెడ్డి మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న పరిహారం పూర్తిస్థాయిలో ఎన్నికల తర్వాత అందుతుందని ఎవరు అధైర్యపడవద్దని ఆయన నిర్వాసితులకు భరోసా కల్పించారు. చౌటిపల్లె, గండ్లరు, కొండాపురం పునరావాసకేంద్రాలల్లో తాగునీటి సమస్యకు సీపీడబ్ల్యూస్కీం కింద శాశ్వత పరిష్కారం చేస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. రెండేళ్లు కరోనా నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎన్నికల సమయంలో ఏ హామీలు జగనన్న చెప్పారో అన్ని హామీలను అమలు చేసి చూపించారన్నారు. అదే చంద్రబాబు 2014లో ఎన్నికల ముందు బీజేపీ, జనసేన , టీడీపీ కలసి పోటీ చేసి.. రైతులకు రుణమాఫీ ,డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఏ ఒక్క హామి అమలు చేయలేక పోయారన్నారు. ఇద్దరి మధ్య వ్యత్యాసం గమనించి ఓటు వేయాలన్నారు. షర్మిళమ్మ చంద్రబాబు కుట్రలో భాగమై తమపై విమర్శలు చేస్తున్నారని.. దీనిని ఆమె విజ్ఞతకే వదిలేస్తామన్నారు. తప్పొప్పులు అన్ని ఆమెకు తెలుసన్నారు. మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కాలని చూస్తున్న చంద్రబాబు నాయుడుని తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఫ్యాన్గుర్తుకు ఓటు వేసి ఎంపీగా తనను, ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్రెడ్డిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గండికోట నిర్వాసితులకు డీకేటీ పట్టాలు ఇప్పిస్తామన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధీర్రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ పార్టీ గుర్తుతో గెలిచిన ఆదినారాయణరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలల్లో వివేకానందరెడ్డికి ఓటు వేయలేదన్నారు. వైఎస్ కుటుంబం ఆదరణతో రాజకీయంగా ఎదిగి ఇప్పుడేమో ఆ కుటుంబాన్ని విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. దేవగుడి కుటుంబం ఆర్థికంగా ఎదుగుదల కోసం ఎన్ని పార్టీలైనా మారుతారు అలాంటి వారికి ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు హామీలు చూసి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. ఆయా ముంపు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గండికోట నిర్వాసితులకు నెలరోజుల్లోపుఅదనపు పరిహారం చెల్లింపు ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
No Headline
ఈ చిత్రంలో భార్య సాయంతో పెన్షన్ తీసుకునేందుకు మడకలవారిపల్లె యూనియన్ బ్యాంకుకు వచ్చిన ఈ వ్యక్తి పేరు ఎన్.పెంచలయ్య. పట్టణంలోని ఆరోగ్యపురంలో నివాసం. కొన్నేళ్లుగా పక్షవాతంతో కాలు చచ్చుపడిపోయి ఇంటి వద్దనే వలంటీర్ సాయంతో పెన్షన్ పొందుతుండేవాడు. చంద్రబాబు పుణ్యమా అని వలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ నిలిపివేయడంతో బ్యాంకు వద్దకు వచ్చి పెన్షన్ తీసుకునేందుకు చాలా కష్టమవుతుందని, మాలాంటి వారిని ఇబ్బంది పెట్టడం మంచిది కాదని మండిపడుతున్నాడు. ఎక్కడికి వెళ్లాలో తెలియదు ప్రతి నెల 1వ తేదీన వలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ ఇస్తుండేవారు. ఇప్పుడు సచివాలయానికి వెళితే బ్యాంకు అకౌంట్లో పడుతుందని చెప్పారు. ఆశగా బ్యాంకు వద్దకు వెళితే బ్యాంకులో కూడా జమ కాలేదని చెప్పారు. అంతదూరం ఎండపొద్దున తిరగాలంటే ఇబ్బందిగా ఉంది. పెన్షన్ కోసం ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదు. మాలాంటి ముసలోళ్లను ఇబ్బందులు పెడితే చంద్రబాబుకు ఏమి వస్తుంది. – సుబ్బమ్మ, మడకలవారిపల్లె మా ఉసురు తగులుతుంది ఈ వయస్సులో ఇంటి నుంచి బయటికి రావాలంటేనే ఎండలంతో భయంగా ఉంది. గతంలో జగను పుణ్యమా అని వలంటీర్ ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చినప్పుడు బాగుండేది. ఉదయం 9 గంటలకు వస్తే 12 గంటలకు పెన్షన్ తీసుకున్నా. చంద్రబాబుకు మాలాంటి ముసలోళ్లపైన పగ ఎందుకో. మా ఉసురు ఊరికే పోదు. –లక్షుమ్మ, చింతపుత్తాయపల్లె కడప రూరల్: జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ గురువారం రెండవ రోజుకు చేరింది. 2,67,492 పింఛన్లకు గాను రూ.79.10 కోట్లు అందజేయాలి. మొత్తం పింఛన్లలో 1,87,103 పింఛన్లు బ్యాంకుల ఖాతాల ద్వారా అందజేస్తారు. మిగిలిన 80,389 పింఛన్లు సచివాలయాల ద్వారా అందించడానికి చర్యలు చేపట్టారు. మొదటి రోజు బ్యాంకులకు సెలవు కావడంతో అధిక శాతం మంది పింఛన్ల సొమ్మును పొందలేకపోయారు. బ్యాంకుల వద్దకు పరుగులు... వలంటీర్లు లేకపోవడంతో అవ్వాతాతలకు ఇబ్బందికరంగా మారింది. ప్రభుత్వం పింఛన్ సొమ్మును బ్యాంకుల ఖాతాలకు జమ చేసినప్పటికీ.. పండుటాకులు దూర ప్రాంతాల నుంచి బ్యాంకుల వద్దకు రావడానికి అనేక ఇబ్బందులు పడ్డారు. కొన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి బ్యాంకులకు 10–15 కిలో మీటర్లు దూరం వెళ్లాలి. ఏ ఆటోలో వెళ్లినా తోడుకు ఎవరో ఒకరిని తీసుకెళ్లాలి. రానుపోను చార్జీలకే వందలు పెట్టాల్సి వచ్చింద ని వృద్ధులు వాపోయారు. పైగా ఈ ఎండల్లో తిరగొద్దని వైద్యులు సూచిస్తున్నారు. పింఛన్ల కోసం మండుటెండల్లో వృద్ధులు బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. రెండు నెలలకే ఇలా.. కేవలం రెండు నెలల పాటు పింఛన్ల పంపిణీకి వలంటీర్లను విధుల నుంచి దూరంగా ఉంచారు. ఆ ప్రభావం పింఛన్లపై భారీగా పడింది. వలంటీర్లు ఉన్నప్పుడు ఎప్పుడు ఏమి జరిగేది. పింఛన్ల సొమ్ము ఎప్పుడిచ్చేది. అన్ని వివరాలు లబ్ధిదారులకు, స్ధానికులకు తెలిసేది. వలంటీర్లు లేకపోవడంతో ఏమి జరుగుతుందో తెలియని పరిస్ధితి ఏర్పడింది. వలంటీర్లు ఉండి ఉంటే మొదటి రోజే పింఛన్ల పంపిణీ 94 శాతం పైగా నమోదు అయ్యేది. ప్రస్తుత పింఛన్ పంపిణీ విధానంఅవ్వాతాతలకు నాటి చంద్రబాబు పాలనలో కష్టాలను గుర్తుకు తెచ్చింది. ఈ చిత్రంలో మేనల్లుడు అయిన రామారావు మోసుకుని వస్తున్న వృద్ధురాలి పేరు పెండ్లిమర్రి లక్షుమ్మ. వయోభారంతో కాళ్లు చచ్చుబడిపోయి మంచానికే పరిమితమైంది. ఈ పరిస్థితుల్లో పెన్షన్ పొందేందుకు గత నెల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వృద్ధురాలు వాపోయింది. మాలాంటోళ్లను ఇబ్బంది పెట్టడం మంచిదా అని ప్రశ్నించింది. -
No Headline
కడప నగరం ఎన్జీఓ కాలనీలో గల ఒక బ్యాంకు ముందు కూర్చున్న ఈ వృద్ధురాలి పేరు మరియమ్మ. స్థానిక చిన్నచౌక్లో నివసిస్తోంది. బ్యాంకు తలుపులు ఎప్పుడు తెరుస్తారా అని ఉదయం 9 గంటలకే వచ్చి కూర్చుంది. అవ్వా..ఇంత తొందరగా ఎందుకొచ్చావు..? అని అటుగా వచ్చిన ఒక వ్యక్తి అడిగాడు. పింఛన్ కోసం వచ్చాను నాయనా...ఇంతకు ముందు వలంటీర్లు ఇంటి కాడికే వచ్చి లెక్క ఇచ్చేవాళ్లు. ఇప్పుడేమో..మా లెక్క బ్యాంకులో వేశారంట. మళ్లా ఎండపెడతాదని ముందుగానే వచ్చాను. చంద్రబాబు ఉన్నప్పుడు కూడా పింఛన్ లెక్క కోసం చాల కట్టపడ్డాం. ఇప్పుడు కూడా ఆ బాబే అడ్డుపడ్డారని తెలిసిందని నిట్టూర్చింది. -
‘ములాఖత్’ వేళల్లో మార్పు
కడప అర్బన్: రాష్ట్ర జైళ్ల శాఖ ప్రధాన కార్యాలయం అధికారులు సవరించిన ఉత్తర్వుల మేరకు ఎండతీవ్రత, తీవ్ర వడగాల్పులు, పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కారణంగా ఖైదీల ములాఖత్ వేళల్లో మార్పు తీసుకొచ్చినట్లు కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ ఐ.ఎన్.హెచ్ ప్రకాష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కడప కేంద్రకారాగారంలోని ఖైదీలకోసం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ‘ములాఖత్’ (ఇంటర్వ్యూ)లో కలవొచ్చని..జూన్ 15 వరకు ఈ మార్పులు కొనసాగుతాయని వివరించారు. 6న జిల్లాస్థాయి క్రికెట్ ఎంపికలు కడప స్పోర్ట్స్: కడప నగరంలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానంలోని నెట్స్ కేంద్రంలో ఈనెల 6వ తేదీ ఉదయం జిల్లాస్థాయి అండర్–23, అండర్–19 పురుషుల విభాగం క్రికెట్ ఎంపికలు నిర్వహించనున్నట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ (సీఏవైడీ) కార్యదర్శి అవ్వారు రెడ్డిప్రసాద్ తెలిపారు. అండర్–23 ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు 2001 సెప్టెంబర్ 1 తర్వాత పుట్టినవారై ఉండాలన్నారు. అండర్–19 విభాగం ఎంపికలకు 2005 సెప్టెంబర్ 1 తర్వాత పుట్టినవారై ఉండాలన్నారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు ఆధార్, బర్త్ సర్టిఫికెట్, పాస్పోర్టు సైజు ఫొటోలు, స్టడీ సర్టిఫికెట్, పదోతరగతి మార్కులిస్టు, పాన్కార్డు, ఒరిజినల్తో పాటు ఒకసెట్ జిరాక్స్ ప్రతులను తీసుకురావాలని సూచించారు. బీఈడీ, ఎంఈడీ సెమిస్టర్ ఫలితాలు విడుదల వైవీయూ: యోగి వేమన విశ్వవిద్యాలయం బీఈడీ, ఎంఈడీ 3వ సెమిస్టర్ల పరీక్షా ఫలితాలను వైవీయూ వీసీ చింతా సుధాకర్, రిజిస్ట్రార్ వై.పి. వెంకటసుబ్బయ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎన్. ఈశ్వర్ రెడ్డితో కలిసి తన ఛాంబర్ లో గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఫిబ్రవరిలో జరిగిన బీఈడీ 3వ సెమిస్టర్ పరీక్షలకు 2,485 విద్యార్థులకు గాను 2,322 మంది హాజరయ్యారని, అందులో 1,964 (84.58 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఎంఈడీ మూడో సెమిస్టర్ పరీక్షలకు 64 మంది పరీక్షలు రాయిగా 55 (85.94 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని వివరించారు. సహాయ పరీక్షల నియంత్రణ అధికారి డా.గంగయ్య, సీడీసీ డీన్ ఆచార్య రఘుబాబు పాల్గొన్నారు. ఆన్లైన్ పోర్టల్ను సద్వినియోగం చేసుకోవాలి కడప కోటిరెడ్డిసర్కిల్: నిరుద్యోగ యువత ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ రెన్యూవల్ కోసం పోర్టల్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్కుమార్ పిలుపునిచ్చారు. గతంలోలాగా క్యూ లైన్లో నిలబడకుండా నూతన విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. పదో తరగతి నుంచి ఉన్నత విద్య వరకు ఉత్తీరులలైన అభ్యర్థులు ఎంప్లాయ్మెంట్ పోర్టల్లో ఫోన్ నెంబరు, ఆధార్కార్డు, మెయిల్ ఐడీ ద్వారా లాగిన్ అయి పూర్తి వివరాలను తమ ఇంటినుంచే మొబైల్లోనే రిజస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న నిరుద్యోగులకు వారి మెయిల్ ద్వారా జాబ్మేళా వివరాలు, ఉద్యోగ అవకాశాలు తెలుసుకోవచ్చన్నారు. 2023–24 విద్యా సంవత్సరం నుంచి టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఆన్లైన్ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. బందోబస్తుపై దిశానిర్దేశం బద్వేలు అర్బన్ : పక్కా ప్రణాళితో ఎన్నికల బందోబస్తు నిర్వహించాలని ఎస్పీ సిద్దార్థ కౌశల్ పేర్కొన్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలోని సమావేశ హాలులో గురువారం నియోజకవర్గ పరిధిలోని సీఐలు, ఎస్ఐలతో సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. మద్యం, నగదుతో ఓటర్లను ప్రలోభ పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రబుల్మాంగర్లు, రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు.
Photos
View allVideo
View allBullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019