ఎర్రవల్లిచౌరస్తా: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ జోగుళాంబ గద్వాల జిల్లాకు రానున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 5న ఎర్రవల్లి మండలకేంద్రంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్, నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లురవి, జోగుళాంబ గద్వాల జిల్లా జెడ్పీచైర్పర్సన్ సరిత గురువారం సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం ఎర్రవల్లిలో లక్షమందితో భారీ బహిరంగసభను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సభకు అగ్రనేత రాహుల్గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో అధికారం చేపట్టినట్లుగానే కేంద్రంలో కూడా అధికారం చేపట్టేలా దేశవ్యాప్తంగా చేపట్టనున్న సంక్షేమ పథకాలతో పాటు ఐదు గ్యారంటీల గురించి రాహుల్ ప్రకటిస్తారని చెప్పారు. అలాగే ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే వివిద అభివృద్ధి గురించి సీఎం రేవంత్ వివరిస్తారని తెలిపారు. సభకు నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని గద్వాల, అలంపూర్, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఎర్రవల్లి చౌరస్తాలో భారీ బహిరంగసభ
ఏర్పాట్లను పరిశీలించిన
సంపత్కుమార్, మల్లు రవి