శుక్రవారం శ్రీ 3 శ్రీ మే శ్రీ 2024
వివరాలు IIలో u
పలు మండలాల్లో
రెడ్ అలర్ట్కు చేరుకున్న ఉష్ణోగ్రతలు
● ఉమ్మడి జిల్లాలో నేడు, రేపు మరింత పెరిగే అవకాశం
● తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక
● అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని నిపుణుల సూచన
45 డిగ్రీలు దాటితే..
ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మే నెల ప్రారంభంలోనే పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరువయ్యాయి. గురువారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో అత్యధికంగా 45.1 డిగ్రీలు, చిన్నచింతకుంట 45.0, నారాయణపేట జిల్లా కృష్ణాలో 45.2, ధన్వాడలో 45.1, కొత్తపల్లి మండలంలో 45, గద్వాల జిల్లాలో వడ్డేపల్లి 45.7, అయిజ 45.2, అలంపూర్ 45, నాగర్కర్నూల్ జిల్లాలో వంగూరు, కొల్లాపూర్ 46.0, వెల్దండ 45.4, కల్వకుర్తి 45.0 డిగ్రీలతో రెడ్ అలర్ట్ చేరుకున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. మండుటెండలో పనిచేసే కూలీలు, వీధి వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లరాదని నిపుణులు సూచిస్తున్నారు. దాహంతో సంబంధం లేకుండా రోజంతా తగినంత నీరు, నిమ్మకాయ నీరు, మజ్జిగ లాంటి ద్రావణాలను తరచుగా తీసుకోవాలని చెబుతున్నారు.
జో. గద్వాల జిల్లా..
మండలం ఉష్ణోగ్రతలు
వడ్డేపల్లి 45.7
అయిజ 45.2
అలంపూర్ 45.0
ఇటిక్యాల 44.9
ధరూర్ 44.8
వనపర్తి జిల్లా..
మండలం ఉష్ణోగ్రతలు
మదనాపురం 44.8
ఖిల్లాఘనపూర్ 44.6
కొత్తకోట 44.5
పాన్గల్ 44.2
గోపాల్పేట 44.0
న్యూస్రీల్