Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

కోదండరామస్వామి రథోత్సవం

Published Thu, Apr 18 2024 9:30 AM

- - Sakshi

పెబ్బేరు రూరల్‌: శ్రీరామనవమిని పురస్కరించుకొని వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో బుధవారం రాత్రి కోదండరామస్వామి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అర్చకులు సీతాసమేతుడైన శ్రీరాముడి ఉత్సవ మూర్తులను పట్టువస్త్రాలు, ఆభరణాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ సీతారాములు రథంపై కొలువుదీరగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, శాట్‌ చైర్మన్‌ శివసేనారెడ్డి రథోత్సవాన్ని ప్రారంభించారు. రథశాల నుంచి ఆంజనేయస్వామి ఆలయం వరకు తీసుకెళ్లి తిరిగి ఆలయ ఆవరణకు చేర్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం జై శ్రీరాం నామస్మరణతో మార్మోగింది.

Advertisement

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250