Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

ఏపీలో రెండో రోజు కొనసాగుతున్న నామినేషన్ల పర్వం

Published Fri, Apr 19 2024 10:53 AM

Nomination Process Continues For The Second Day In Ap - Sakshi

ఏపీలో రెండో రోజు కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ..

  • హిందూపురంలో నామినేషన్ దాఖలు చేసిన బాలకృష్ణ
    శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ ఒక సెట్ నామినేషన్ దాఖలు.
  • దెందులూరు నియోజవర్గం వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన  అబ్బాయి చౌదరి

  • నర్సాపురం పట్టణం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో వైస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ సమర్పించిన ముదునూరి ప్రసాద్ రాజు

  • ఆచంటలో నామినేషన్ దాఖలు చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు

  • భీమవరం నియోజవర్గం వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న శ్రీ గంది శ్రీనివాస్.

  • కడప వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. 

  • ఎలమంచిలి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన యూవీ రమణ మూర్తి రాజు.. పాల్గొన్న డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు... అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి.. జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్.
  • చీపురుపల్లి వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు.
  • నగరి వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా ఆర్కే రోజా నామినేషన్‌ చేశారు.

  • కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో నామినేషన్ దాఖలు చేసిన వైస్సార్‌సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావు.
  • విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన షేక్ ఆసిఫ్
  • కాకినాడ జిల్లా కాకినాడలో నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన తెలుగుదేశం అభ్యర్థి కొండబాబు
  • కాకినాడ జిల్లా  కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు
  • అన్నమయ్య జిల్లా తంబల్లపల్లి లో టీడీపీ తరఫున జయచంద్ర రెడ్డి నామినేషన్ దాఖలు.
  • పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు.
  • కారుమూరి నివాసానికి వేల సంఖ్యలో వైఎస్సార్‌సీపీ అభిమానులు చేరుకున్నారు.
  • తన నివాసం నుండి వేలాదిమందితో భారీ ర్యాలీగా బయలు దేరారు.
  • తూర్పుగోదావరి జిల్లా రాజానగరం అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జక్కంపూడి రాజా నామినేషన్ దాఖలు చేశారు.
  • తిరుపతి వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి నామినేషన్‌ వేశారు.

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లోక్‌సభ, శాసన­సభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైన తొలి­రోజే గురువారం భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. దశమి, గురువారం మంచిరోజు కావడంతో తొలిరోజునే అభ్యర్థులు భారీ ర్యాలీలతో వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. 25 లోక్‌సభ స్థానాలకు 39 మంది అభ్యర్థులు 43 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.

Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250