breaking news
Ad - Sakshi_Home_Sticky
-
మీ ఫోనే.. మీ ఆయుధం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘‘ఇటువైపున జగన్ ఒకే ఒక్కడు... అటువైపున చూస్తే ఇంత మంది! దానికి తోడు కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, మోసాలు, బెదిరింపులు, హెరాస్మెంట్.. అన్నీ జరుగుతున్నాయి. మరిఇంత మంది, ఇన్ని కుట్రలు, ఇన్ని ఇబ్బందులను తట్టుకుని మీ జగన్ నిలబడగలుగుతున్నాడంటే కారణం? వాళ్లకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఉండొచ్చు కానీ మనకు సోషల్ మీడియా ఉంది. సెల్ఫోన్ చేతిలో ఉన్న నా ప్రతి చెల్లెమ్మ, ప్రతి తమ్ముడూ జగన్కు తోడుగా ఉన్నారు. అందుకే జగన్ ఒంటరి కాదు. జగన్కు కోట్ల గుండెలు అండగా ఉన్నాయి’ అని సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. 21వ రోజు ‘మేమంతా సిద్ధం బస్సు’ యాత్ర సందర్భంగా మంగళవారం విశాఖ జిల్లా పెద్దిపాలెంలోని చెన్నాస్ కన్వెన్షన్ హాలులో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో నిర్వహించిన ముఖాముఖిలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. రాత్రి బస ప్రాంతం నుంచి సీఎం అక్కడకు చేరుకున్నారు. పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి సజ్జల భార్గవ్రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ ముఖాముఖి కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల సోషల్ మీడియా కార్యకర్తలతోపాటు వివిధ దేశాల నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వర్చువల్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. మీకు ఎంత చేసినా తక్కువే ఆ దేవుడి దయమీద జగన్కు నమ్మకం ఉంది. జగన్ను ప్రేమించే గుండెల మీద నమ్మకం ఉంది. మరి జగన్ ఒంటరి ఎలా అవుతాడు? మీరు చూపిస్తున్న అభిమానానికి మీకు ఎంత చేసినా తక్కువే అవుతుంది. అన్ని రకాలుగా మీ అందరికీ తోడుగా ఉంటామని మరోసారి భరోసా ఇస్తున్నా. భార్గవ్ చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ స్ట్రీమ్ లైనింగ్ చేయడంలో ముందు నిలిచి అడుగులు వేస్తున్నాడు. మీ వెనుక ఒక్క జగనే కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీకు అండగా నిలుస్తుంది. ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, ప్రతి గ్రామంలో మీకు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నా. మన మీద దుష్ట చతుష్టయం దాడులు పెరిగాయంటే దాని అర్థం మనం విజయానికి చాలా దగ్గరగా ఉన్నామనే! ఇంకా పెద్ద స్క్రిప్ట్ ఏదో ఉన్నట్లే! దెబ్బ ఇక్కడ (నుదిటిపై) తగిలింది. ఇక్కడ (కంటిపై) తగల్లేదు. ఇక్కడా (కణతలపై) తగల్లేదంటే.. దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్ ఏదో మనతో రాయించే కార్యక్రమంలో ఉన్నాడని అర్థం. కాబట్టి ఆందోళన అవసరం లేదు. 175కి 175 అసెంబ్లీ, 25కి 25 ఎంపీ సీట్లను గెలుచుకోవడంలో మనం ఎక్కడా తగ్గేదే లేదు. ఫోన్ అనే ఆయుధం మీ చేతుల్లోనే ఉందని గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నా. వందల మంది చంద్రబాబులు, రామోజీలు, దత్తపుత్రులు, ఎల్లో మీడియాలు వచ్చినా వైఎస్ జగన్ తొణకడు. కారణం.. పైన దేవుడున్నాడు, కింద మీరంతా మీ అన్నకు అండగా ఉన్నారు. ప్రత్యేకంగా యాప్.. సోషల్ మీడియా వల్ల ఎవరైనా ఇబ్బందులకు గురైతే చెప్పుకోగలిగేలా ఒక యాప్ తయారు చేయాలి. ప్రతివారం నాకు దానిపై రిపోర్టు కావాలి. సిటీ ఆఫ్ డెస్టినీ.. ఆంధ్రా డెస్టినీ మన విశాఖ వచ్చిన మీరంతా ఈరోజు సిటీని చూస్తున్నారు కదా! ఈ సిటీ ఆఫ్ డెస్టినీ రేపు ఆంధ్ర రాష్ట్ర డెస్టినీ అవుతుందని కచ్చితంగా చెబుతున్నా. ఎప్పుడైతే ఒక ముఖ్యమంత్రి వచ్చి ఈ సిటీలో కూర్చుని పరిపాలన ప్రారంభిస్తారో అప్పుడు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో పోటీ పడే పరిస్థితి వస్తుంది. ఐటీని అత్యుత్తమ స్థానానికి చేర్చే పరిస్థితి కూడా వస్తుంది. చెల్లి గీతాంజలి చావుకు కారకులు.. ఇప్పటిదాకా ప్రతి సందర్భంలోనూ నాకు తోడుగా ఉంటున్న మీ అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. మరో 18 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగనుంది. ఒక్క జగన్ మీద చంద్రబాబు, దత్తపుత్రుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5.. వీళ్లంతా చాలరన్నట్లుగా బీజేపీ, కాంగ్రెస్ యుద్ధం చేస్తున్నాయి. ఈ మధ్య వాళ్ల ఉక్రోషం ఏ స్థాయికి వెళ్లిందంటే సోషల్ మీడియాలో జగన్కు సపోర్ట్ చేసిందని చెల్లెమ్మ గీతాంజలిని ఎంత దారుణంగా వేధించారో అందరూ చూశారు. జగనన్న చేసిన మంచితో తన కుటుంబం బాగుపడిందని, జగనన్న వల్ల తనకు ఇల్లు, ఇంటి స్థలం వచ్చిందని, మిగిలిన పథకాలు కూడా వచ్చాయని తన సంతోషాన్ని అందరితో పంచుకోవటమే ఆమె చేసిన పాపం! చివరికి ఆ చెల్లి సూసైడ్ చేసుకునే పరిస్థితికి వెళ్లిందంటే ఈ వ్యవస్థ ఎంత దారుణంగా చెడిపోయిందో చెప్పేందుకు నిదర్శనం. అన్నా.. జాగ్రత్త తెనాలిలో ఇంటి పట్టా తీసుకున్న గీతాంజలి ఆనందంతో తన అభిప్రాయాన్ని చెప్పుకుంది. కాయలున్న చెట్టుకు రాళ్ల దెబ్బలు తప్పవు. వైఎస్సార్సీపీ కాయలున్న చెట్టు అయితే టీడీపీ ముళ్ల చెట్టు లాంటిది. గీతాంజలి కుటుంబానికి వైఎస్సార్సీపీ ఎంతో అండగా నిలిచింది. అన్నా మీరు జాగ్రత్త.. మీ మీద దాడి జరిగితే అది మా మీద జరిగినట్లు భావించాం. వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబుకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు. చంద్రబాబు యుద్ధానికి డైరెక్ట్గా రాడు. – పి.నాని, బాపట్ల జిల్లా విశాఖ ఘటనకు నేనే ప్రత్యక్ష సాక్షిని.. విశాఖ ఎయిర్పోర్టులోని ఫుడ్ కోర్టు టీడీపీ వాళ్లదని తెలియక గతంలో అక్కడ ఉద్యోగం చేశా. విశాఖ ఎయిర్పోర్టులో మీపై జరిగిన దాడి ఘటనకు నేను ప్రత్యక్ష సాక్షిని. నేను జగన్ అభిమానిని అని తెలిసి నన్ను చాలా వేధించారు. టీడీపీ నాయకులు లోకేశ్, చంద్రబాబు, బాలకృష్ణ, సీఎస్వో వేణుగోపాల్, హర్షవర్థన్ అందరూ ఒక కూటమిలా ఉండేవాళ్లు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా నేను పీసీఎస్ రూల్స్ ప్రకారం నడుచుకుంటే నాపై దొంగ కేసులు బనాయించారు. నాకెక్కడా ఉద్యోగం రాకుండా చేశారు. నా కుటుంబాన్ని ఎంతగానో హింసించారు. సీఎస్వో వేణుగోపాల్ నిన్ను ఎక్కడా బతకనివ్వనని బెదిరించారు. మీ మీద హత్యాయత్నం వ్యవహారంలో నాపై ఒత్తిడి తేవటంతో ఉద్యోగానికి రాజీనామా చేసి మా కుటుంబం అంతా దూరంగా వెళ్లిపోయాం. ఇన్నేళ్లూ ఉద్యోగం లేకుండా ఉన్నా. విజయవాడలో మీ మీద బొండా ఉమ ప్రోద్బలంతో జరిగిన దాడి చూశాక మౌనంగా ఉండలేక ఇవన్నీ బయట పెడుతున్నా. – సామ్రాజ్యం, మాజీ ప్రైవేట్ చీఫ్ సెక్యూరిటీ అఫీసర్, విశాఖ ఎయిర్పోర్టు ముస్లింలంతా మీ వెనకే .. 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో ముస్లింలంతా భయపడుతూ బతికారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఊపిరి పీల్చుకుంటున్నాం. మైనార్టీలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డిప్యూటీ సీఎంగా, మండలి వైస్ చైర్పర్సన్గా చేశారు. ఏడుగురికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. ముస్లింల కోసం వైఎస్సార్ ఒక అడుగు ముందుకేస్తే.. మీరు నాలుగు అడుగులు ముందుకేశారు. – వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమాని మీ మాటలు మాకెంతో స్ఫూర్తినిస్తాయి. అబ్రహాం లింకన్, గాంధీజీ, అంబేడ్కర్ గురించి పుస్తకాల్లో చదువుకున్నాం. మీరు మాకు కళ్లెదుటే కనిపించే లైవ్ ఎగ్జాంపుల్. మీ లైఫ్ జర్నీ ఇంకా తెలుసుకోవాలని ఉంది. మీ మాటలు మాకెంతో స్ఫూర్తినిస్తాయి. –హెబ్సిబా, అసోసియేట్ ప్రొఫెసర్, ఫార్మసీ మీ మాటలు మాకెంతో స్ఫూర్తినిస్తాయి. అబ్రహాం లింకన్, గాంధీజీ, అంబేడ్కర్ గురించి పుస్తకాల్లో చదువుకున్నాం. మీరు మాకు కళ్లెదుటే కనిపించే లైవ్ ఎగ్జాంపుల్. మీ లైఫ్ జర్నీ ఇంకా తెలుసుకోవాలని ఉంది. మీ మాటలు మాకెంతో స్ఫూర్తినిస్తాయి. –హెబ్సిబా, అసోసియేట్ ప్రొఫెసర్, ఫార్మసీ మీ అభిమానిగా ఒక్క రోజైనా చాలు తమ్ముడు భరత్కుమార్రెడ్డి ఫిబ్రవరిలో ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తూ ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఆ సమయంలో ఎమ్మెల్యే శ్రీకాంత్, భార్గవ్ అన్న మా కుటుంబానికి అండగా నిలిచారు. నా తమ్ముడికి మీరే దైవం అన్నా. మీరు బాగుంటేనే మేమూ బాగుంటాం. మీరు తలపెట్టిన ప్రతి కార్యక్రమంపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేసేది. భార్గవ్ అన్న ఛార్జ్ తీసుకున్న తర్వాత వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతిపక్షాలు భయపడేంత స్ట్రాంగ్ అయ్యింది. మిమ్మల్ని కలుసుకుంటే నా తమ్ముడి ఆత్మ శాంతిస్తుందని వచ్చా. మీ అభిమానిగా ఒక్కరోజు బతికినా చాలు. – ఎం.అనిల్కుమార్ రెడ్డి, అన్నమయ్య జిల్లా, రాయచోటి నియోజకవర్గం మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందా జగనన్నా మీరు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. మనసుకు, దేహానికి ఎంత గాయమైనా చిరునవ్వుతో ఎదుర్కోవాలని మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందా. నా పిల్లలకు ఎంతో సాయం చేశారు. ఎప్పటికీ మీ అండదండలు ఉండాలని కోరుకుంటున్నా. మళ్లీ మీరే ముఖ్యమంత్రి కావాలి. – బాలచంద్ర, గుంటూరు జిల్లా, తెనాలి మండలం (గీతాంజలి భర్త) కడుపు కాలేవాడికి మీ పథకాల విలువ తెలుసు సోషల్ మీడియా సైనికుడైన మా అన్నయ్య 2022లో యాక్సిడెంట్లో మరణించాడు. అది తెలిసి సజ్జల భార్గవ్ మా ఇంటికి వచ్చారు. మీకు సాయం చేయాలని జగనన్న ఆదేశించారని చెప్పారు. మా వదినకు ఉద్యోగం ఇప్పించారు. మా పిన్ని, బాబాయి టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలో మెంబర్లు. వాళ్లకి సైతం పెన్షన్ మన ప్రభుత్వంలో ఇచ్చారు. మీరు అందించే పథకాల విలువ కడుపు కాలేవాడికే తెలుస్తుంది. కడుపు నిండిన వాడికి తెలియదు. మా అన్న చనిపోయినప్పుడు కూలీ పనులు చేసుకునే వ్యక్తి ఒకరు ఫోన్ చేసి ఆ రోజు వచ్చిన రూ.600 సాయంగా పంపుతున్నట్లు చెప్పాడు. ఇంత గొప్ప కుటుంబం ఇచ్చింది నువ్వే కదా జగనన్నా! – వినయ్ కుమార్, మల్కాపురం, జగ్గయ్యపేట మండలం, ఎన్టీఆర్ జిల్లా -
ఇక్కడ డీల్ కుదిరింది.. అక్కడ వేలు తెగింది
సాక్షి ప్రతినిధి, గుంటూరు/ గుంటూరు రూరల్ : ఈ చిత్రం చూశారుగా.. సోమవారం ఢిల్లీలో వేలు కోసుకొని హడావుడి చేసిన గుంటూరు స్వర్ణభారతి నగర్కు చెందిన కోపూరి లక్ష్మి టీడీపీ నేత బూర్ల రామాంజనేయులుతో ఉన్న చిత్రమిది. కొన్నేళ్లుగా తాడేపల్లిలో ఉంటున్న లక్ష్మి ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు, వేమూరు టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబుతో కలిసి ఆ పార్టీలో పనిచేస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన వ్యక్తిగా 2014 నుంచి 2017 మధ్య గుంటూరు, పరిసర ప్రాంతాల్లో చాలా భూ దందాలు, ఫోర్జరీ పత్రాలతో వేరొకరి స్థలాలు అమ్మేయడాలు, కేసులు పెట్టిన వారిపై అనుచరులతో కలిసి దాడులు చేయడంలో పేరొందిన ‘ఆదర్శ’ మహిళ. ఢిల్లీ డ్రామాలో నాయిక. లక్ష్మి తల్లి, తండ్రిది కూడా భూ దందాల చరిత్రే. ఆమె తండ్రి కూడా చేతులు కోసుకొని, కళ్లు పొడుచుకొని అధికారులను బెదిరించి, పనులు చేయించుకొనే వాడు. వారి మరణానంతరం వారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో గుంటూరు, పరిసర ప్రాంతాల్లో లక్ష్మి చేసిన దందాలు అన్నీ ఇన్నీ కావు. ఆమెపై గుంటూరులో పలు కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో ఆమె తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసుల నుంచి బయట పడేందుకు ఆ పార్టీలో చేరింది. ఆమె కోరుకున్నట్లుగానే కేసులు, దర్యాప్తులు ఆగాయి. ఇప్పుడు ఇదే కోపూరి లక్ష్మిని పావుగా వాడుకొని వైఎస్సార్సీపీకి చెందిన దళిత నేతలపై ఆరోపణలు చేయించి, తద్వారా ఎన్నికల్లో ఎంతో కొంత లబ్ధి పొందాలన్న చవకబారు ఆలోచనతో టీడీపీ భారీ పథకమే రచించింది. భూ అక్రమాలకు పాల్పడిన అమె చేతే, వేరే వారెవరో అక్రమాలు చేస్తుంటే అడ్డుకొన్నానంటూ చెప్పించడం వెనుక ఎల్లో స్క్రిప్టు ఉందన్న విషయం ఆమె ఢిల్లీ వెళ్లి ఆడిన డ్రామాలోనే తేటతెల్లమైంది. అంతలోనే ఇంత పెద్ద స్పందనా? కోపూరి లక్ష్మి ఇలా ఢిల్లీలో వేలు కోసుకొన్నానని చెప్పిందో లేదో.. కొద్ది నిమిషాల్లోనే టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టడం ప్రారంభించారు. ఆమె ఢిల్లీలో ఆడిన డ్రామా వెనుక టీడీపీ పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అక్కర్లేదు. ఒకాయన వేలు కోసుకోవద్దు.. ఓటేయండంటాడు. ఇంకొకాయన మరో రకంగా ఓదారుస్తాడు. అసలు వేలు కోయించిన వాళ్లే క్షణాల్లో ఇలా ఓదార్పు మాటలు మాట్లాడటం విడ్డూరమే. కేసుల ఎత్తివేత హామీ, ప్రలోభాలు ఎవరైనా తనపై దాడులు జరిగినా, వేధింపులకు గురిచేసినా ముందుగా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. తనను కొంతమంది వేధిస్తున్నారంటూ ఆరేళ్ల కిందట టీడీపీ ప్రభుత్వంలోనే కేసులు పెట్టింది. తర్వాత గుంటూరు నుంచి తాడేపల్లి వెళ్లిపోయింది. ఇటీవలి కాలంలో ఆమెపై ఎప్పుడు దాడులు జరిగాయి, వాటిని ఎవరు చేశారో తెలియదు. ఆమె ఫిర్యాదు కూడా చేయలేదు. ఢిల్లీలో విడుదల చేసిన ప్రెస్నోట్లో కూడా 2018 నాటి కేసుల గురించే ప్రస్తావించింది. టీడీపీ నేతల అండ, ఆర్థిక సహకారంతో ఏకంగా ఢిల్లీ వెళ్లి, తనపై వైఎస్సార్సీపీ నేతల దాడులంటూ ఆరోపణలకు దిగింది. ఇందుకు చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ నేతలు పెద్ద స్క్రిప్టే తయారు చేశారు. ఆమెతో భారీ డీల్ కుదుర్చుకున్నారు. ఆమెపై ఉన్న కేసులు ఎత్తేస్తామని, ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామంటూ ప్రలోభాలకు గురి చేశారు. ఈ డీల్ కుదిరిన వెంటనే ఆమె ఢిల్లీ వెళ్లి, ఎల్లో స్క్రిప్టు ప్రకారం వైఎస్సార్సీపీ నేతలపై ఆరోపణలు చేసి, వేలు కోసుకొన్నానని చెప్పి డ్రామాను రక్తికట్టించే ప్రయత్నం చేసింది. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాలకు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. టీడీపీ పెద్దల అండ లేనిదే ఆమె ఇంత దూరం వెళ్లదన్న విషయం ఇక్కడ సుస్పష్టం. ఆమె ఢిల్లీ నుంచి రాగానే నేరుగా టీడీపీ కార్యాలయానికి తీసుకువెళ్లి మీడియా ముందు పెట్టడమూ ఎల్లో స్క్రిప్టు ఉందన్న విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. లక్ష్మి గతమంతా అక్రమాలే స్వర్ణ భారతి నగర్కు చెందిన నామాల కృష్ణమూర్తి, భార్య తులసమ్మ 25 ఏళ్ళ కిందట స్వర్ణభారతి నగర్లో ప్రభుత్వ స్థలాల్ని కబ్జా చేసి, వాటిలో ప్లాట్లు వేసి ఫోర్జరీ పత్రాలు సృష్టించి అమాయక ప్రజలకు అంటగట్టేవారు. ఆ కాలనీకి ఇద్దరి పేర్లు కలిసేలా కృష్ణతులసీ నగర్ అనే పేరు వారే పెట్టారు. నామాల కృష్ణమూర్తి కూడా 25 ఏళ్ళ క్రితం ఇదే విధంగా చేతులు కోసుకుని, కళ్ళు పొడుచుకుని అధికారులను బెదిరించి పనులు చేయించుకునేవాడని కాలనీవాసులే చెబుతున్నారు. వారి కుమార్తే కోపూరి లక్ష్మి. వారి మరణానంతరం తల్లిదండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకుని స్వర్ణభారతి నగర్, కృష్ణతులసీ నగర్, అడవితక్కెళ్ళపాడు, తుఫాన్ నగర్లలో ఇదే విధంగా బ్లాక్మెయిల్, స్థలాల కబ్జాలకు పాల్పడుతుండేదని, ఫోర్జరీ పత్రాలతో వేరొకరి స్థలాలు అమ్మేస్తుండేదని స్థానికులు చెబుతున్నారు. ఆమెపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ కేసులన్నీ అప్పటి కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలోనే నమోదయ్యాయి. చాలా కేసులు కోర్టులో విచారణలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. వాటిలో కొన్ని.. ♦ 2013లో స్వర్ణభారతి నగర్కు చెందిన దివ్యభారతి అనే మహిళకు చెందిన స్థలానికి నకిలీ బీఫారం సృష్టించి, అందులో తహసీల్దారు సంతకం సైతం ఫోర్జరీ చేసి, ఆ స్థలం తనదేనని స్థానికంగా ఉండే పద్మశ్రీ అనే మహిళకు విక్రయించింది. విషయం తెలుసుకున్న దివ్యభారతి కోపూరి లక్ష్మిపై ఫిర్యాదు చేయగా, పోలీసులు ఫోర్జరీ, నకిలీ పత్రాలు తయారీ తదితర విషయాలపై కేసు నమోదు చేశారు. 2016లో ఈ కేసు విషయమై కోర్టు నుంచి ఇంటికి వస్తున్న పద్మశ్రీ కుటుంబ సభ్యులను స్వర్ణభారతినగర్ సమీపంలో అడ్డగించి వారిపై కోపూరి లక్ష్మి, ఆమె అనుచరులు దాడిచేశారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా లక్ష్మిపై కేసు నమోదు చే«శారు. ♦కోపూరి లక్ష్మి నకిలీ ఫోర్జరీ బీఫారాలను తయారు చేసి, అందులో తనకు తెలియకుండానే తన పేరిట సాక్షి సంతకాలు చేసేదని స్వర్ణభారతి నగర్కు చెందిన రమాదేవి అనే మహిళ 2013లో నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. ♦2014లో సుశీల, అంజలి అనే మహిళల ఇళ్ళను కబ్జా చేసేందుకు కోపూరి లక్ష్మి ప్రయత్నించింది. వారిపై దాడి చేసి ఇరువురి ఇళ్ళకు ఫోర్జరీ సంతకాలతో నకిలీ బీఫారాలు తయారు చేసి స్థానికంగా ఉండే వ్యక్తికి విక్రయించాలని ప్రయత్నించింది. దీంతో లక్ష్మిపై సుశీల నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ♦ 2015లో కోపూరి లక్ష్మి తన 15 సంవత్సరాల పెద్ద కుమార్తెకు వివాహం కాకున్నా, అప్పటికే వివాహం జరిగిందని రెవెన్యూ అధికారులను నమ్మించి ఆమె పేరుతో బీఫారం సృష్టించి ఆ స్థలాన్ని వేరే వ్యక్తికి విక్రయించాలని చూసింది. ఈ మోసాన్ని గమనించిన ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ♦ 2017లో నకిలీ పత్రాలతో మోహనరావు అనే వ్యక్తికి ఇంటి స్థలం విక్రయించింది. అయితే, ఈ స్థలాల దస్తావేజులు నకిలీవని తేలడంతో ఆయన నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసుల్లో పోలీసులు లక్ష్మిని పలుమార్లు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆమె పోలీసులను సైతం ఏమార్చి స్టేషన్ నుంచి పారిపోయిన సంఘటనలు ఉన్నాయని పోలీసులే చెబుతున్నారు. మా స్థలానికి నకిలీ బీఫారం సృష్టించి అమ్మేసింది 2016లో నా కుమార్తె అనారోగ్యంతో ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లేదాన్ని. ఆ క్రమంలో కోపూరి లక్ష్మి మా ఇంటి స్థలానికి నకిలీ బీఫారాన్ని సృష్టించి వేరేవారికి అమ్మేసింది. అదేమని అడిగితే మాపై దాడి చేసింది. దీంతో మనస్థాపానికి గురైన మా కుమార్తె చనిపోయింది. తరువాత పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి లక్ష్మి నకిలీ బీఫారం సృష్టించిందని రూజువు చేసి మా ఇల్లు మేము కాపాడుకున్నాం. – పాకనాటి ఆరోగ్యం, భర్త నాగేశ్వరరావు, కృష్ణతులసీ నగర్ మా స్థలం కబ్జాకు ప్రయత్నించింది.. మమ్మల్ని బెదిరించింది మా ఇంటి స్థలాన్ని కబ్జా చేసేందుకు కోపూరి లక్ష్మి తీవ్రంగా ప్రయత్నించింది. మమ్మల్ని బెదిరించింది. మేము పదేళ్ళ క్రితం రైతుబజారులో కూలీ పనులు చేసుకునేవాళ్లం. స్వర్ణభారతి నగర్లో మా స్థలం ఖాళీగా ఉండేది, దానిని కబ్జా చేసి విక్రయించాలని చూసింది. పోలీసులు, స్థానిక నాయకుల సహకారంతో అతి కష్టం మీద మా స్థలాన్ని కాపాడుకున్నాం. అప్పటి నుంచి మాపై పలుమార్లు దాడులు చేయించింది. లక్ష్మి మనుషులు ఇప్పటికీ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. – పుష్పలత, స్వర్ణభారతి నగర్ నకిలీ బీఫారాన్ని సృష్టించి అమ్మేసింది మేము వ్యవసాయ కూలీలం. పనులు ఉన్న సమయంలో ఇతర గ్రామాలకు వెళ్ళి కూలీ చేసి, వేసవిలో సొంత ఇంటికి వచ్చే వాళ్లం. మేము లేని సమయంలో కృష్ణతులసీ నగర్లోని మా ఇంటిని కబ్జాచేసి నకిలీ బీఫారాన్ని సృష్టించి అమ్మేసింది. దీంతో పోలీసులను ఆశ్రయించాం. లక్ష్మి తన మనుషులతో మాపై దాడులు చేయించింది. చంపుతామని బెదిరించింది. రెవెన్యూ అధికారులు, పోలీసులు, స్థానిక నాయకుల సాయంతో తిప్పలుపడి మా స్థలాన్ని కాపాడుకున్నాం. – పులిపాటి అంజలి, భర్త లోకయ్య, కృష్ణతులసీ నగర్ అక్రమాలకు అడ్డుపడుతున్నామని కేసు పెట్టింది కోపూరి లక్ష్మి స్థలాల ఆక్రమణలను అడ్డుకున్నందుకు నాపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది. అదేమని అడిగితే పోక్సో కేసు పెడతానని, నన్ను చంపేస్తానని బెదిరించింది. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి నా నుంచి లక్షల్లో డబ్బు వసూలు చేసింది. ఆమె బాధలు పడలేక హైదరాబాద్ వెళ్ళి బతుకుతున్నాను. – కె మోహనరావు, స్వర్ణభారతి నగర్ జాతీయ మీడియా దృష్టినాకర్షించడానికే ఢిల్లీకి కోపూరి లక్ష్మికి నిజంగా అన్యాయం జరిగితే ఇదే పని గుంటూరులోనో, తాడేపల్లిలోనో చేయొచ్చు కదా! ఢిల్లీ వరకు ఎందుకు వెళ్లారు? ఇక్కడ మళ్లీ చంద్రబాబు పాత్రే కనపడుతుంది. 1994 నుంచి ఆయన ఆడుతున్న పాత చీప్ట్రిక్స్నే ఇక్కడా ప్రయోగించారు. అవే గుంటనక్క వేషాలు ప్రదర్శించారు. రాష్ట్రంలో అయితే, ఆమెను నమ్మే వారెవరూ ఉండరు. ఆమె అక్రమాల చరిత్ర అటువంటిది. అదే ఢిల్లీలో అయితే ఎల్లో మీడియాతోపాటు జాతీయ మీడియా దృష్టిని, కొందరు జాతీయ నేతల దృష్టిని ఆకర్షించొచ్చు. అందుకే చంద్రబాబు ఇలాంటి చవకబారు డ్రామాకు తెరతీశారు. -
వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు
సాక్షి, నెట్వర్క్: పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకు చెందిన 200 కుటుంబాలు టీడీపీని వీడి మంగళవారం గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరాయి. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి నుంచి టీడీపీకి చెందిన పలువురు యువత తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి, మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. విస్సన్నపేట మండల బీజేపీ మాజీ అధ్యక్షుడు మీసాల సత్యనారాయణ తిరువూరు ఎమ్మెల్యే అభ్యర్ధి నల్లగట్ల స్వామిదాసు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. విజయవాడ అజిత్సింగ్నగర్కి చెందిన టీడీపీ మైనార్టీ నేతలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి సమక్షంలో పార్టీలో చేరారు. విజయవాడ టీడీపీ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు షేక్ బాజీ ఆధ్వర్యంలో 50 మంది ముస్లీం మైనార్టీ నేతలు, మహిళలు పార్టీలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధులు బిళ్లు కృష్ణమూర్తి కుమారులైన బిళ్లు బ్రదర్స్గా పిలువబడే బిళ్లు నర్సింహరావు, బిళ్లు అన్నవరం, యర్రంశెట్టివారిపాలెం గ్రామం పూతినీడివారిపాలెంలో జనసేన, టీడీపీల నుంచి పలువురు ఎమ్మెల్యే ప్రసాదరాజు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. పాలకొల్లులోని 18వ వార్డు బెత్లహాంపేటలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన 50 కుటుంబాలు, యలమంచిలి మండలంలోని అడవిపాలెం పంచాయతీ గగ్గిపర్రుకు చెందిన టీడీపీ, జనసేన నేతలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపి సమక్షంలో పార్టీలో చేరారు. భీమవరానికి చెందిన జనసేన, టీడీపీ నేతలు, కార్యకర్తలు, 100 మందికిపైగా నాయి బ్రాహ్మణులు, చిన ఆమిరం, భీమవరంలోని అప్పారావు తోట, నరసయ్య అగ్రహారం ప్రాంతాలకు చెందిన 50 మంది క్షత్రియులు, భీమవరం 18వ వార్డుకు చెందిన ముస్లిం సోదరులు వార్డు మాజీ కౌన్సిలర్ కోడె యుగంధర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సమక్షంలో వైఎస్సార్పీలో చేరారు. ఏలూరు జిల్లా సీతంపేటలో ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, ఎంపీ కోటగిరి శ్రీధర్ సమక్షంలో సీతంపేట జనసేన నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు సమక్షంలో గణపవరం మండలం పిప్పర గ్రామానికి చెందిన పలువురు టీడీపీ, జనసేన నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. నంద్యాలలోని 36వ వార్డు సంజీవనగర్ ఏరియా నుంచి 200 కుటుంబాలు మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరాయి. -
సీఐపై దాడికి టీడీపీ నేతల యత్నం
గంగాధనెల్లూరు (చిత్తూరు జిల్లా): గంగాధరనెల్లూరు ఆర్వో కార్యాలయం వద్ద విధులు నిర్వహిస్తున్న సీఐ శంకర్పై శ్రీరంగరాజపురం టీడీపీ మండల అధ్యక్షుడు జయశంకర్నాయుడు, మరికొందరు నేతలు తీవ్రంగా దుర్భాషలాడుతూ దాడికి ప్రయత్నించారు. గంగాధర నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి థామస్ నామినేషన్ దాఖలులో భాగంగా మంగళవారం ఆర్వో కార్యాలయంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు ప్రవేశించేందుకు ప్రయత్నం చేశారు. ఆర్వో కార్యాలయం వద్ద ట్రాఫిక్ నియంత్రణ కోసం విధుల్లో ఉన్న సీఐ శంకర్ అలా వెళ్లకూడదని అడ్డుకునే యత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన జయశంకర్నాయుడు ‘నన్నే అడ్డుకుంటావా.. వచ్చేది మా ప్రభుత్వం నీ అంతు చూస్తా నా..’ అంటూ సీఐపై బూతు పురాణంతో విరుచుకు పడ్డారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలసి దూషణకు దిగి సీఐ డౌన్డౌన్ అంటూ నినాదాలతో రోడ్డుపై బైఠాయించారు. తన్నుకున్న తమ్ముళ్లు.. ర్యాలీ కోసం 30 బస్సుల్లో జనాన్ని పోగుచేసి రూ.3 వందలు, మద్యం బాటిల్, బిర్యానీ ప్యాకెట్ పంపిణీ చేసినట్లు తెలిసింది. తీసుకొచ్చిన జనానికి మందుబాటిళ్ల పంపకాల్లో తేడా రావడంతో ఆర్వో కార్యాలయం ఎదుటే టీడీపీ కార్యకర్తలు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. కర్రలతో కొట్టుకున్నారు. అదేవిధంగా ఫొటోగ్రాఫర్లకు అనుమతి లేని రిటరి్నంగ్ కార్యాలయం ఆవరణంలో డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి తెలుగు తమ్ముళ్లు పైశాచిక ఆనందాన్ని పొందారు. -
ఆడా నేనే.. ఈడా నేనే.. కూటమిలో మరో హైడ్రామా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి కట్టిన పార్టీల నడుమ మంగళవారం రాత్రి మరో హైడ్రా మా నడిచింది. పొత్తులో భాగంగా బీజేపీకి కేటా యించిన అనపర్తి నియోజకవర్గ నుంచి కూడా టీడీపీ నేతనే రంగంలోకి దింపేందుకు నాయకుడి మార్పు డ్రామా పూర్తయ్యింది. రెండు రోజుల్లో నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగుస్తున్న సమయంలో అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీకి కేటాయించిన అనపర్తి నియోజకవర్గం నుంచి మాజీ సైనికుడైన శివకృష్ణంరాజు పేరును పార్టీ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం రాజమండ్రి లోక్సభ స్థానం పరిధిలో ఉంది. ఆ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనపర్తి నుంచి బీజేపీ జాతీయ నాయకత్వం ప్రకటించిన అభ్యర్థి కంటే ప్రస్తుత టీడీపీ ఇన్చార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేస్తేనే ప్రయోజనం ఉంటుందనేలా కొంతకాలంగా పురందేశ్వరి రాజకీయాలు నెరుపుతున్నారు. మరోవైపు బీజేపీ జాతీయ నాయకత్వం ప్రకటించిన అభ్యర్థి శివకృష్ణంరాజును ప్రచారం చేసుకోనివ్వకుండా టీడీపీ నాయకులు అడ్డుపడుతూ వచ్చారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ శివకృష్ణంరాజు సోమవారం బీజేపీ తరఫున నామినేషన్ కూడా దాఖలు చేశారు. అనపర్తిలో బీజేపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసిన తరువాత కూడా టీడీపీ నేతను బీజేపీలో చేర్పించి.. ఆ పార్టీకి, పొత్తు ధర్మానికి వెన్నుపోటు పొడిచారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక పునరావాసం కోసం టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నాయకులే బీజేపీకి కేటాయించిన సీట్లలోనూ పోటీ చేస్తున్నారు. తొలి నుంచి బీజేపీలో రాజకీయాలు కొనసాగించిన నాయకులకు బీజేపీ మొండిచేయి చూపడంతో ఆ పార్టీ శ్రేణులు రగిలిపోతున్నారు. మా అభ్యర్థి ఆయనే: పురందేశ్వరి కాగా.. టీడీపీ అనపర్తి నియోజకవర్గ ఇన్చార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం రాత్రి విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ ఎన్నికల ఇన్చార్జి అరుణ్సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019