breaking news
-
ఏపీలో రెండో రోజు కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
ఏపీలో రెండో రోజు కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ.. హిందూపురంలో నామినేషన్ దాఖలు చేసిన బాలకృష్ణ శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ ఒక సెట్ నామినేషన్ దాఖలు. దెందులూరు నియోజవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అబ్బాయి చౌదరి నర్సాపురం పట్టణం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో వైస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ సమర్పించిన ముదునూరి ప్రసాద్ రాజు ఆచంటలో నామినేషన్ దాఖలు చేస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు భీమవరం నియోజవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న శ్రీ గంది శ్రీనివాస్. కడప వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎలమంచిలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన యూవీ రమణ మూర్తి రాజు.. పాల్గొన్న డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు... అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి.. జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్. చీపురుపల్లి వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నగరి వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా ఆర్కే రోజా నామినేషన్ చేశారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో నామినేషన్ దాఖలు చేసిన వైస్సార్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన షేక్ ఆసిఫ్ కాకినాడ జిల్లా కాకినాడలో నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన తెలుగుదేశం అభ్యర్థి కొండబాబు కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు అన్నమయ్య జిల్లా తంబల్లపల్లి లో టీడీపీ తరఫున జయచంద్ర రెడ్డి నామినేషన్ దాఖలు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. కారుమూరి నివాసానికి వేల సంఖ్యలో వైఎస్సార్సీపీ అభిమానులు చేరుకున్నారు. తన నివాసం నుండి వేలాదిమందితో భారీ ర్యాలీగా బయలు దేరారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థి జక్కంపూడి రాజా నామినేషన్ దాఖలు చేశారు. తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి నామినేషన్ వేశారు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లోక్సభ, శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజే గురువారం భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. దశమి, గురువారం మంచిరోజు కావడంతో తొలిరోజునే అభ్యర్థులు భారీ ర్యాలీలతో వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. 25 లోక్సభ స్థానాలకు 39 మంది అభ్యర్థులు 43 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
మూడో దశ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
న్యూఢిల్లీ, సాక్షి: లోక్సభ సార్వత్రిక ఎన్నికల మూడో దశకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. 12 రాష్ట్రాల్లోని 94 నియోజకవర్గాల్లో మే 7న జరగనున్న మూడో దశ లోక్సభ ఎన్నికలకు రాష్ట్రపతి తరపున ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ప్రక్రియ ప్రారంభమైంది. ఈ దశలో నామినేషన్ల దాఖలుకు ఏప్రిల్ 19 చివరి తేదీ. అలాగే మధ్యప్రదేశ్లోని బేతుల్ నియోజకవర్గంలో వాయిదా పడిన ఎన్నికల కోసం విడిగా మరొక నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. బేతుల్ నియోజకవర్గంలో రెండో దశలో ఏప్రిల్ 26న పోలింగ్ జరగాల్సి ఉండగా ఇక్కడ బీఎస్పీ అభ్యర్థి మరణంతో ఎన్నికలు వాయిదా వేశారు. గుర్తింపు పొందిన జాతీయ లేదా రాష్ట్ర పార్టీ అభ్యర్థి ఎన్నికలకు ముందు మరణిస్తే ఆ పార్టీ తాజా అభ్యర్థిని గుర్తించి రంగంలోకి దింపేందు కోసం ఎన్నికలను వాయిదా వేస్తారు. మూడవ దశలో అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, గోవా, గుజరాత్, జమ్మూ కశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా లోక్సభ సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగుస్తాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన రేణుకా చౌదరి, అనిల్ కుమార్
రాజ్యసభ సభ్యులుగా నామినేషన్లు వేసిన కాంగ్రెస్ అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ మూడు సెట్ల నామినేషన్లు వేసిన అభ్యర్థులు అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్ పత్రాలు సమర్పించిన నేతలు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, ఇంచార్జ్ దీపా దాస్ మున్షి, దిగ్విజయ్ సింగ్, మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్కు పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీ-ఫామ్ అందజేశారు. సాక్షి, హైదరాబాద్: కాసేపట్లో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అసెంబ్లీ సెక్రటరీ వద్ద రాజ్యసభ అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ నానామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ వేసే కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పాల్గొంటారని తెలుస్తోంది. తెలంగాణ నుంచి ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులను బుధవారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) ప్రకటించిన విషయం తెలిసిందే. రేణుక చౌదరి, అనిల్కుమార్ యాదవ్కు ఏఐసీసీ అవకాశం ఇచ్చింది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడే అనిల్ కుమార్ యాదవ్. దీంతో పెద్దల సభలోకి యువకుడు అనిల్ కుమార్ యాదవ్ అడుగుబెట్టనున్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో అనిల్ కుమార్ యాదవ్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. యూత్ కాంగ్రెస్ కోటాలో అనిల్కు అవకాశం కల్పించింది కాంగ్రెస్ అధిష్టానం. -
మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
-
కాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగ్విజయ్!
బెంగళూరు/న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక అనూహ్య మలుపులు తిరుగుతోంది. రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ధిక్కార స్వరం వినిపిస్తుండడంతో తాజాగా సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ పేరు తెరపైకి వచ్చింది. అధ్యక్ష ఎన్నికలో దిగ్విజయ్ బరిలోకి దిగడం ఖాయమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆయనవైపే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. నామినేషన్ల ప్రక్రియ మరో రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో సోనియా గాంధీ బుధవారం సీనియర్ నాయకుడు, పార్టీకి విధేయుడైన ఏకే ఆంటోనీతో సమావేశయ్యారు. అధ్యక్ష ఎన్నికల బరిలోకి దింపాల్సిన అభ్యర్థిపై గంటన్నరకు పైగా చర్చించినట్లు తెలిసింది. మరోవైపు అశోక్ గెహ్లాట్ గురువారం సోనియాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. తన వర్గం ఎమ్మెల్యేలు అధిష్టానంపై ప్రదర్శించిన ధిక్కార వైఖరి పట్ల సోనియాకు గెహ్లాట్ ఫోన్లో ఇప్పటికే వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల తిరుగుబాటు వెనక తన హస్తం లేదని ఆయన చెప్పినట్టు సమాచారం. అది దిగ్విజయ్ వ్యక్తిగత నిర్ణయం దిగ్విజయ్ సింగ్ సాధ్యమైనంత త్వరగా ఢిల్లీకి చేరుకుంటారని, శుక్రవారం నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో పోటీ చేయాలన్నది ఆయన వ్యక్తిగత నిర్ణయమని, ఇందులో పార్టీ నాయకత్వం ప్రమేయం లేదని వెల్లడించాయి. దిగ్విజయ్ ప్రస్తుతం కేరళలో భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా, తాను సైతం బరిలో ఉంటానని సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశీ థరూర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం నామినేషన్ దాఖలు చేయబోతున్నానని ఆయన ఇటీవలే తేల్చిచెప్పారు. అధినేత్రి సోనియాగాంధీ ఆదేశిస్తే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక బరిలో దిగేందుకు పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే (80) సిద్ధమని ఆయన సన్నిహితుడొకరు బుధవారం చెప్పారు. అధ్యక్ష బరిలో దిగేందుకు తనకు ఆసక్తి లేదని సీనియర్ నేత కమల్నాథ్ మరోసారి స్పష్టం చేశారు. తన దృష్టంతా ఏడాదిలో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపైనే ఉందన్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019