breaking news
Ad - Sakshi_Home_Sticky
-
పీఓలు, ఏపీఓల విధులు కీలకం
భూపాలపల్లి: పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు నిష్పక్షపాతంగా ఓటుహక్కు వినియోగించుకోవడంలో పీఓలు, ఏపీఓల విధులు కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్మిశ్రా అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మాంటిస్సోరీ ఉన్నత పాఠశాలలో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. పీఓ, ఏపీఓలు చేయవలసిన విధులపై మాస్టర్ ట్రైనర్స్తో శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగానికి, బ్యాలెట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ అనుసంధానంపై చేపట్టాల్సిన చర్యలను పీపీటీ ద్వారా అవగాహన కల్పించారు. పోలింగ్ ప్రారంభంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, మాక్ పోలింగ్ నిర్వహించే విధానంలో పాటించాల్సిన జాగ్రత్తల విషయంలో పొరపాటుకు తావులేకుండా అవగాహన కలిగి ఉండాలన్నారు. మాక్ పోలింగ్ ముగిసిన తర్వాత తప్పనిసరిగా సీఆర్సీ చేయాలని, ఒకవేళ మరిచిపోతే కౌంటింగ్ సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. ఈ కార్యక్రమాల్లో సిబ్బంది మేనేజ్మెంట్ అధికారులు శామ్యూల్, అవినాష్, ఆర్డీఓ మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ భవేష్మిశ్రా -
హేమాచలుని జాతర వేలం పాటలు
మంగపేట: మండలంలోని మల్లూరు గుట్టపై శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈ నెల 19 నుంచి 28 వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాలు(జాతర) వేలం పాటలను ఆలయ ఈఓ సత్యనారాయణ పర్యవేక్షణలో గురువారం నిర్వహించారు. జాతర సందర్భంగా ఈనెల 5నుంచి జూన్ 4వ తేదీ వరకు నెల రోజుల పాటు ఆలయ ప్రాంగణం పరిధిలో లడ్డు, పులిహోర ప్రసాదాలు తయారుచేసి విక్రయించుట, కొబ్బరి ముక్కలు పోగు చేసుకోవడంతో పాటు తదితర షాపుల నిర్వహణకు అనుమతి పొందేందుకు గురువారం వేలం పాటలు నిర్వహించారు. లడ్డు, పులిహోర ప్రసాదం విక్రయాలకు మల్లూరు చెందిన మారబోయిన గోవర్ధన్ రూ 3.18లక్షలు, కొబ్బరి ముక్కలు పోగు చేసుకునేందుకు జి. శ్రీకాంత్ రూ 55వేలు, పూల డెకరేషన్ డి. శ్రీనివాస్, తడుకల పందిళ్లు వేయుటకు సదానందం, రంగుల వేసేందుకు శ్రీనివాస్ రూ.57వేలకు టెండర్ బాక్స్ ద్వారా దక్కించుకున్నారు. కొబ్బరి కాయల విక్రయం, పుట్టు వెంట్రుకలు, ఫొటోలు తీసుకునేందుకు, చెప్పుల స్టాండ్ నిర్వహణకు ఈ నెల 8న వేలం పాటలను నిర్వహించనున్నట్లు ఈఓ సత్యనారయణ తెలిపారు. ఆలయ కార్యనిర్వహణ ఇన్చార్జ్ అధికారిగా మహేష్ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయ కార్యనిర్వహణ ఇన్చార్జ్ అధికారిగా రేగొండ మండలంలోని కొడవటంచ లక్ష్మీ నర్సింహస్వామి ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎస్.మహేష్ గురువారం బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుత ఆలయ కార్యనిర్వహణ అధికారి సత్యనారాయణ అనారోగ్య కారణాలతో రెండు నెలలు సెలవులో వెళ్తుండడంతో మహేష్కు ఇన్చార్జ్ బాధ్యతలను అప్పగించినట్లు ఆయన తెలిపారు. -
పనులన్నీ భారీ వాహనాలతోనే..
భూపాలపల్లి: గోదావరి నది ఇసుక క్వారీల్లో రోజుకో బాగోతం బయటపడుతోంది. తాజాగా మంజూరైన ఇసుక క్వారీల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తోడి డంప్ చేస్తున్నారు. మాన్యువల్ పద్ధతిలో పనులు చేపట్టాల్సి ఉండగా భారీ వాహనాలతో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. క్వారీల్లో కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్నా టీఎస్ఎండీసీ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండింటిలో పనులు ప్రారంభం... రాష్ట్ర ప్రభుత్వం గృహ, ఇతర నిర్మాణాలకు ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో ఇటీవల జిల్లాకు ఆరు ఇసుక క్వారీలను మంజూరు చేసింది. మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లి 2, 3, 4, పెద్దంపేటలో ఒకటి, పలిమెల మండలం పంకెనలో రెండు క్వారీలను మంజూరు చేసింది. ఒక్కో ఇసుక క్వారీ యజమాని లక్షా యాబై వేల మెట్రిక్ టన్నుల ఇసుకను గోదావరి నదిలో నుంచి వెలికితీసి విక్రయించుకునేందుకు అనుమతులు ఇచ్చింది. కాగా ఇందులో పెద్దంపేట, పంకెన క్వారీల్లో మాత్రమే గోదావరి నది నుంచి ఇసుక వెలికితీత, స్టాక్ పాయింట్ వద్ద డంపింగ్ పనులు ప్రారంభం అయ్యాయి. మిగతా క్వారీలు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా.. ప్రభుత్వం మంజూరు చేసిన ఆరు క్వారీల్లో మాన్యువల్(మనుషులు) ద్వారా పనులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకే సదరు కాంట్రాక్టర్లు ఒప్పందం కుదుర్చుకున్నారు. గోదావరి నదిలో మనుషులతో ఇసుక తవ్వకాలు చేపట్టి, వారితోనే నది ఒడ్డున ఏర్పాటు చేసుకున్న స్టాక్ పాయింట్కు తరలించుకోవాలి. నిబంధనలు ఇలా ఉన్నప్పటికీ ప్రస్తుతం ప్రారంభమైన పెద్దంపేట, పంకెన క్వారీల్లో మాత్రం పూర్తిగా భారీ వాహనాలనే వినియోగిస్తున్నారు. వాహనాల డ్రైవర్లు మినహా స్థానిక కూలీలు ఎక్కడా కనిపించడం లేదు. గోదావరి నదిలో పెద్ద రెండు చెయిన్ జేసీబీలను ఏర్పాటు చేసుకొని ఇసుకను తోడుతున్నారు. తోడిన ఇసుకను జేసీబీల ద్వారా లారీల్లో లోడ్ చేయించి స్టాక్ పాయింట్కు తరలిస్తున్నారు. స్టాక్ పాయింట్ వద్ద కూడా ఇసుకను చదును(సమాంతరంగా) చేసేందుకు జేసీబీనే వినియోగిస్తున్నారు. గోదావరి నదిలో మనుషుల ద్వారా చేపట్టాల్సిన పనులను భారీ వాహనాలతో చేస్తున్నా టీఎస్ఎండీసీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక వెలికితీస్తున్న విషయమై టీఎస్ఎండీసీ పీఓ తారక్నాధ్రెడ్డిని ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా స్పందించలేదు.ఇసుక క్వారీ కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం ప్రభుత్వ నిబంధనలకు తూట్లు మాన్యువల్గా చేపట్టాలని సర్కార్ రూల్స్ పట్టించుకోని టీఎస్ఎండీసీ అధికారులు -
పకడ్బందీగా వైద్యారోగ్య కార్యక్రమాలు
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వర్తించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ ఆదేశించారు. కలెక్టరేట్లోని మీటింగ్హాల్లో గురువారం వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బందితో సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్సకు సంబంధించిన మందులు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. ఇందుకు ఇద్దరితో కూడిన టీమ్లను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఎండ తీవ్రత 45డిగ్రీలు నమోదవుతున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో అన్ని ప్రోగ్రాముల్లో జిల్లా ర్యాంకింగ్ తగ్గిందని, రిపోర్టింగ్ సిస్టం మెరుగుపరచాలని ఆదేశించారు. మెడికల్ ఆఫీసర్లు ప్రతీ నెల వారి లక్ష్యాన్ని పూర్తిచేసి సమీక్ష చేయాలన్నారు. త్వరలో 16 సంవత్సరాల నుంచి 80 సంవత్సరంలో లోపు వారికి బీసీజీ వ్యాక్సినేషన్ మూడు డోసులు ఇవ్వనున్నట్లు తెలిపారు. డయాబెటిస్, స్మోకర్స్, టీబీ ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. సాధారణ కాన్పులు ప్రోత్సహించాలని.. ఆపరేషన్లు జరిగిన వారి వద్దకు వెళ్లి వివరాలు సేకరించాలని సూచించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో వరుసగా నాలుగు నెలలు అన్ని కాన్పులు ఆపరేషన్లు జరిగినట్లయితే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. తనిఖీలు నిర్వహించి పూర్తి వివరాలు సేకరించి ఆడిట్ చేయాలని సూచించారు. ఆరోగ్య మహిళా క్యాంపులు ప్రతీ మంగళవారం, గురువారం అధిక సంఖ్యలో తల్లులు పాల్గొనేలా చూడాలని కోరారు. డయాబెటిక్, హైపర్ టెన్షన్ వారిని గుర్తించి ఉచితంగా ప్రతి నెల మందులు అందించాలని ఆదేశించారు. టెలి మెడిసిన్ నంబర్ 14416పై ఆశలు, ఏఎన్ఎంలకు అవగాహన కల్పించాలని తెలిపారు. మానసిక రోగులను గుర్తించి వారికి సరైన వైద్యం అందించాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓలు డాక్టర్ కొమురయ్య, డాక్టర్ శ్రీదేవి, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఉమాదేవి, డాక్టర్ ప్రమోద్కుమార్, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల తనిఖీ.. జిల్లాకేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులను గురువారం వైద్యారోగ్యశాఖ అధికారులు తనిఖీ చేశారు. డిప్యూటీ డీఎంహెచ్ఓలు డాక్టర్ కొమురయ్య, డాక్టర్ శ్రీదేవి శ్రీ దివ్య, శ్రీ వెంకటేశ్వర, అమృత, సాయి సరోజ ఆస్పత్రులను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రులు నడిపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలి భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయని జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అఽధికారి డాక్టర్ మధుసూదన్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రమాదకరమైన ఎండలు ఉన్నాయన్నారు. పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వడదెబ్బ తగిలితే చెమట పోసి నీరసం, నిస్సత్తువ తీవ్రమై ఒక్కోసారి ప్రాణాపాయానికి దారితీసే పరిస్థితులు ఎదురవుతాయని చెప్పారు. ఉదయం 11 గంటలలోపు సాయంత్రం ఆరు గంటల తర్వాతే పనులు పూర్తి చేసుకోవాలన్నారు. ప్రతి రోజు తగినంత నీరు తాగాలని సూచించారు.జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ -
ఎన్నికల ఖర్చుల వివరాలు అందజేయాలి
కాళోజీ సెంటర్ : పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల వివరాలను విధిగా అందజేయాలని కేంద్ర ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎ.దిలిబన్, ధీరజ్సింగా అన్నారు. వరంగల్ కలెక్టరేట్లో అభ్యర్థుల వ్యయ సంబంధిత రిజిస్టర్లను ఖర్చుల పరిశీలకులు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల బరిలో ఉన్న 42 మంది అభ్యర్థుల్లో 32 మంది మాత్రమే రిజిస్టర్లను సమర్పించినట్లు తెలిపారు. ప్రజాప్రాతినిథ్యం చట్టంలోని సెక్షన్–77 ప్రకారం అభ్యర్థులు విధిగా హాజరై ఎన్నికల ఖర్చులు పరిశీలించుకోవాలని, హాజరు కాని 10 మంది అభ్యర్థులకు నోటీసులు అందజేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం దృష్ట్యా అభ్యర్థులే కాకుండా వారి ప్రతినిధులు కూడా రిజిస్టర్లను పరిశీలనకు పంపించే వెసులుబాటు ఉందని వివరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యయ పరిశీలన నోడల్ అధికారి రామిరెడ్డి, జిల్లా సహకార అధికారి సంజీవ రెడ్డి, 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని సహాయ వ్యయ అధికారులు, పోటీ చేసే అభ్యర్థులు, వారి ప్రతి నిధులు పాల్గొన్నారు. కేంద్ర ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎ.దిలిబన్, ధీరజ్సింగా
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019