breaking news
-
‘మా విశ్వాసంపై దాడి’.. రాహుల్, అఖిలేష్పై ప్రధాని మోదీ విమర్శలు
లక్నో: ప్రతిపక్ష కూటమిలోని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్పై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. మోదీ ఉత్తర ప్రదేశ్లోని అమ్రోహా నిర్వహించిన లోక్సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో శుక్రవారం పాల్గొని మాట్లాడుతూ ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. ‘ప్రతి పక్షాలు మా(బీజేపీ) విశ్వాసంపై దాడి చేసి.. బంధు ప్రీతి, అవినీతి, బుజ్జగింపు రాజకీయలు చేస్తున్నాయి. మరోసారి ఉత్తరప్రదేశ్లో ఇద్దరు యువరాజులు కొత్త సినిమా తీస్తున్నారు. అయితే ఇప్పటికే వారు తీసిన సినిమాను తిరస్కరించారు. బంధు ప్రీతి, అవినీతి, బుజ్జగింపు రాజకీయలు ముసుగులోనే ప్రతీసారి ప్రతీపక్షాలు ఉత్తరప్రదేశ్ ప్రజలను ఓట్ల అడుగుతారు. ..ప్రతిపక్ష నాయకులకు మా విశ్వాసంపై దాడి చేస్తున్నారు. కానీ వాటికి మాపై దాడి చేసే అవకాశమే లేదు. ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి భారత్ మాతాకి జై అనడానికి కూడా ఇబ్బంది పడతాడు. అయోధ్య రామ మందిరంలో రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమ ఆహ్వానాన్ని ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు తిరస్కరించాయి. ప్రతి రోజు ప్రతిపక్ష పార్టీలు రాముడిని, సనాతన ధర్మాన్ని దూషిస్తాయి. సమాజ్వాదీ పార్టీ నేతలు రాముడి భక్తులను కపటంతో కూడిన వ్యక్తులని బహిరంగా వ్యాఖ్యానిస్తారు’ అని ప్రధాని మోదీ మండిపడ్డారు. -
80లో 8.. రేపే తొలి సమరం!
లక్నో: దేశవ్యాప్తంగా తొలిదశ సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19న జరగనున్నాయి. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా ఢిల్లీని కైవసం చేసుకునేందుకు కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 80 స్థానాలకు మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19న మొదటి దశలో ఎనిమిది స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తొలి దశ నియోజకవర్గాలు ఇవే.. ఉత్తర ప్రదేశ్లో తొలి దశలో ఎన్నికలు 8 నియోజకవర్గాల్లో జరగనున్నాయి. అవి పిలిభిత్, సహరాన్పూర్, కైరానా, ముజఫర్నగర్, బిజ్నోర్, నగీనా, మొరాదాబాద్, రాంపూర్. వీటిలో ఐదు సహారన్పూర్, కైరానా, బిజ్నోర్, మొరాదాబాద్, రాంపూర్ జనరల్ నియోజకవర్గాలు కాగా మిగిలినవి రిజర్వ్డ్ స్థానాలు. గత సార్వత్రిక ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ (BJP) ఈ ఎనిమిది సీట్లలో కేవలం మూడింటిని మాత్రమే గెలిచింది. అవి పిలిభిత్, కైరానా, ముజఫర్నగర్. సమాజ్వాదీ పార్టీ మొరాదాబాద్, రాంపూర్ స్థానాలను గెలుచుకోగా, బహుజన్ సమాజ్ పార్టీ సహరాన్పూర్, బిజ్నోర్, నగీనా స్థానాలను కైవసం చేసుకుంది. ప్రధాన అభ్యర్థులు వీళ్లే.. పిలిభిత్ నియోజవర్గం - జితిన్ ప్రసాద్ (బీజేపీ), భగవంత్ శరణ్ గంగ్వార్ (ఎస్పీ), అనిస్ అహ్మద్ ఖాన్ (బీఎస్పీ) సహరాన్పూర్ నియోజవర్గం- రాఘవ్ లఖన్పాల్ (బీజేపీ), మాజిద్ అలీ (బీఎస్పీ), ఇమ్రాన్ మసూద్ (కాంగ్రెస్) కైరానా నియోజవర్గం - ప్రదీప్ కుమార్ (బీజేపీ), శ్రీపాల్ సింగ్ (బీఎస్పీ), ఇక్రా హసన్ (ఎస్పీ) ముజఫర్నగర్ నియోజవర్గం- సంజీవ్ బల్యాన్ (బీజేపీ), హరీంద్ర మాలిక్ (ఎస్పీ), ధారా సింగ్ ప్రజాపతి (బీఎస్పీ) రాంపూర్ నియోజవర్గం- ఘనశ్యామ్ లోధి (బీజేపీ), జీషన్ ఖాన్ (బీఎస్పీ) మొరాదాబాద్ నియోజవర్గం- సర్వేష్ సింగ్ (బీజేపీ), మొహమ్మద్ ఇర్ఫాన్ సైఫీ (బీఎస్పీ) బిజ్నోర్ నియోజవర్గం - చందన్ చౌహాన్ (ఆర్ఎల్డీ), విజేంద్ర సింగ్ (బీఎస్పీ), యశ్వీర్ సింగ్ (ఎస్పీ) నగీనా నియోజవర్గం- ఓం కుమార్ (బీజేపీ), సురేంద్ర పాల్ సింగ్ (బీఎస్పీ), మనోజ్ కుమార్ (ఎస్పీ) -
వింత రాజకీయం.. పొత్తు ఉన్నా ఎవరి ప్రచారం వారిదే?
పశ్చిమ యూపీలో ఎన్నికల కోసం సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్లు పొత్తు కుదుర్చుకున్నప్పటికీ, ప్రచారం చేపట్టే విషయంలో ఇరు పార్టీల మధ్య సయోధ్య కనిపించడం లేదు. తొలి విడత లోక్సభ ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రంతో ముగిసింది. అయితే ప్రచారం చివరి రోజున ఇరు పార్టీలు ఉమ్మడి ర్యాలీకి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ యూపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ల తీరుకు భిన్నంగా బీజేపీ-ఆర్ఎల్డీల దోస్తీ పటిష్టంగా కొనసాగుతోంది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, హోంమంత్రితో ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి పలుమార్లు సమావేశమయ్యారు. ఇదే సమయంలో ఎస్పీ, కాంగ్రెస్ హైకమాండ్ విడివిడిగా తమ గొంతు వినిపించడం విచిత్రంగా మారింది. ఎస్పీ తో పొత్తు ఉన్నప్పటికీ కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంక గాంధీ విడిగా ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ఇరు పార్టీల మధ్య దూరానికి కారణమేమిటనే దానిపై పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని ఎనిమిది లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19న తొలి దశలో పోలింగ్ జరగనుంది. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వివిధ లోక్సభ స్థానాలకు వెళ్లి తమ కూటమి అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అఖిలేష్ యాదవ్ పిలిభిత్ నుంచి ముజఫర్ నగర్ వరకు బహిరంగ సభలు నిర్వహించారు. అయితే ముజఫర్నగర్కు సమీపంలో జరిగిన ప్రియాంక గాంధీ రోడ్ షోలో అఖిలేష్ కనిపించలేదు. సహరాన్పూర్ లోక్సభ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్కు మద్దతుగా ప్రియాంక గాంధీ రోడ్ షో నిర్వహించారు. ప్రచారం చివరి రోజున ఎస్పీ, కాంగ్రెస్లు ఉమ్మడి ర్యాలీ నిర్వహించకపోవడానికి ప్రధాన కారణం ముస్లిం ఓటు బ్యాంకు అని రాజకీయ విశ్లేషకులు జ్ఞాన్ ప్రకాశ్ తెలిపారు. 2019 నాటి ఎస్పీ, బీఎస్పీ పొత్తును ఉదహరిస్తూ, అప్పట్లో ఆ రెండు పార్టీల అధినేతలు ఉమ్మడి ర్యాలీని నిర్వహించారన్నారు. అయితే నాడు బహుజన సమాజ్ పార్టీ.. కూటమి వల్ల ప్రయోజనం పొందిందని, ఎస్పీ ఎటువంటి ప్రత్యేక ప్రయోజనం పొందలేకపోయిందన్నారు. ఈ సారి ఎస్పీ-కాంగ్రెస్ కూటమి ఉమ్మడి ర్యాలీ నిర్వహించకపోవడానికి ఇదే కారణం కావచ్చన్నారు. -
Lok sabha elections 2024: నాన్లోకల్ నాయిక
దిగ్గజాల వంటి లోకల్ నేతలు ఎందరో ఉండొచ్చు. మేం మాత్రం పక్కా నాన్ ‘లోకల్’! పుట్టి పెరిగింది ఎక్కడన్నది మాకనవసరం. మేమెక్కడ ల్యాండైతే అదే మాకు ‘లోకల్’! ‘తగ్గేదే లే...’ అంటున్నారు మహిళా రాజకీయ వలస పక్షులు. వీరిలో చాలామంది ఉత్తరప్రదేశ్ను తమ రాజకీయ కర్మభూమిగా మార్చుకోవడం విశేషం. అతి పెద్ద రాష్ట్రమైన యూపీకి అత్యధిక సంఖ్యలో నాన్ లోకల్ నాయికలకు రాజకీయ భిక్ష పెట్టిన రికార్డు కూడా ఉంది. అలా ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చి ఇక్కడ రాజకీయ అరంగేట్రం చేసినవారిలో ఏకంగా రాష్ట్రాన్నే ఏలిన వారొకరు. కేంద్రంలో చక్రం తిప్పినవారు ఇంకొకరు. ఈ వలస పక్షుల్లో సినీ తారలూ ఉన్నారు... డింపుల్ ‘భాభీ’... డింపుల్ యాదవ్ స్వస్థలం ఉత్తరాఖండ్. సమాజ్వాదీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ భార్యగా యూపీలో అడుగుపెట్టారు. 2009 ఫిరోజాబాద్ ఉప ఎన్నికలతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కానీ కాంగ్రెస్ నేత రాజ్బబ్బర్ చేతిలో ఓటమి చవిచూశారు. 2012లో కనౌజ్ లోక్సభ స్థానం ఉప ఎన్నికలో విజయం సాధించారు. 2019లో మళ్లీ ఓడినా 2022లో ములాయం సింగ్ యాదవ్ మరణం తర్వాత మెయిన్పురి ఉప ఎన్నికలో గెలుపొందారు. ‘వికాస్ కీ చాబీ.. డింపుల్ భాభీ..’ అంటూ సమాజ్వాదీ కార్యకర్తల నినాదాల నడుమ రెట్టించిన ఉత్సాహంతో ఈసారీ మళ్లీ మెయిన్పురిలో బీజేపీతో తలపడుతున్నారు. మీరా.. షీలా.. సుచేతా... బిహార్కు చెందిన లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ కూడా యూపీ నుంచే రాజకీయ అరంగేట్రం చేశారు. 1985లో బిజ్నోర్ ఉప ఎన్నికలో విజయంతో ఆమె ప్రస్థానం ఆరంభమైంది. కానీ తర్వాత ఆమె యూపీ నుంచి మళ్లీ పోటీ చేయలేదు. 2017లో యూపీఏ రాష్ట్రపతి అభ్యరి్థగా ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవిద్ చేతిలో ఓడారు. ఢిల్లీ సీఎంగా సుదీర్ఘకాలం చక్రం తిప్పిన పంజాబ్ పుత్రి షీలా దీక్షిత్ కూడా కాంగ్రెస్ తరఫున 1994లో తొలిసారి యూపీలోని కనౌజ్ నుంచే గెలిచారు. యూపీ తొలి మహిళా సీఎంగా చరిత్రకెక్కిన ప్రముఖ స్వాతంత్య్ర యోధురాలు సుచేతా కృపలానీ స్వస్థలం పంజాబ్! రాజకీయాల్లోనూ జయప్రదం రాజమండ్రిలో పుట్టిన తెలుగుతేజం జయప్రద. అసలు పేరు లలితారాణి. తెలుగు సినిమాల్లో వెలుగు వెలగడమే గాక బాలీవుడ్లోనూ రాణించారు. ఏడెనిమిది భాషల్లో నటించి ఎనలేని స్టార్డం సొంతం చేసుకున్నారు. ఎనీ్టఆర్ ప్రోద్బలంతో 1994లో టీడీపీలో చేరడం ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. పారీ్టతో విభేదించి సమాజ్వాదీ పారీ్టలో చేరడం ద్వారా యూపీలో అడుగు పెట్టారు. 2004, 2009 లోక్సభ ఎన్నికల్లో రాంపూర్ నుంచి విజయం సాధించారు. అనంతరం సమాజ్వాదీతోనూ పొసగక రా్రïÙ్టయ లోక్మంచ్ పేరిట సొంత పార్టీ పెట్టి విఫలమయ్యారు. చివరికి 2019లో బీజేపీ గూటికి చేరారు. మాయావతి.. యూపీ క్వీన్ ఈ ‘బెహన్ జీ’ పుట్టింది, చదివింది ఢిల్లీలో అయినా దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగింది మాత్రం యూపీ నుంచే. 1984లో కాన్షీరాం స్థాపించిన బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో వ్యవస్థాపక సభ్యురాలిగా చేరిన మాయావతి 1989లో తొలిసారి యూపీ నుంచే ఎంపీగా గెలిచారు. తర్వాత ఆమె రాజకీయ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగింది. రాష్ట్రంలోనే గాక దేశ రాజకీయాల్లోనూ తిరుగులేని దళిత నేతగా ఎదిగారు. 1995లో కాన్షీరాం ఆశీస్సులతో అనూహ్యంగా ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. దేశంలో తొలి దళిత మహిళా సీఎంగా చరిత్ర సృష్టించారు. నాలుగుసార్లు యూపీ సీఎంగా చేశారు. ఆమె రాజకీయ ప్రస్థానాన్ని ప్రజాస్వామ్య సంచలనంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అభివరి్ణంచారు. స్మృతీ ఇరానీ.. జెయింట్ కిల్లర్ ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ సీరియల్ ‘క్వీన్’ బుల్లితెర నటిగా దేశవ్యాప్తంగా అభిమానుల మనసు దోచారు. 2003లో బీజేపీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2004 లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో పోటీ చేసిన ఓడినా వెనకడుగు వేయలేదు. రాజ్యసభకు నామినేటయ్యారు. 2014లో అమేథీలో రాహుల్తో పోటీ పడటం ద్వారా యూపీ గడ్డపై కాలుమోపారు. తొలి ప్రయత్నంలో ఓడినా 2019లో రాహుల్ను ఓడించడంతో జెయింట్ కిల్లర్గా ఆమె పేరు దేశమంతటా మారుమోగింది. తనను ‘అమేథీ కీ బిటియా (అమేథీ బిడ్డ)’గా అభివరి్ణంచుకుంటూ అక్కడే స్థిరపడిపోయారు. ఈసారీ అమేథీ బరిలో నిలచి, దమ్ముంటే తనతో తలపడాలంటూ రాహుల్కు సవాలు విసురుతున్నారు. హేమమాలిని... మథుర ‘గోపిక’ అందం, నటనతో దేశాన్ని ఉర్రూతలూపిన బాలీవుడ్ డ్రీమ్గాళ్ హేమమాలిని స్వస్థలం తమిళనాడు. తమిళ సినిమాల నుంచి బాలీవుడ్లో అడుగుపెట్టి బంపర్హిట్లతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ముంబైలో స్థిరపడిన హేమ 2011లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. తర్వాత బీజేపీలో చేరి యూపీ బాట పట్టారు. 2014లో మథుర నుంచి 3 లక్షల పై చిలుకు మెజారిటీతో గెలుపొందారు. 2019లోనూ అక్కడి నుంచే గెలిచారు. ఈసారి హ్యాట్రిక్ కొట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. తన స్థానికతపై విపక్షాల విమర్శలను, ‘‘కృష్టుడిని ఆరాధించే గోపికగా మథురను నా స్వస్థలంగా మార్చుకున్నాను. పదేళ్లుగా ఇక్కడి ప్రజలకు సేవలందిస్తూ వారి మనసు గెలిచా. మళ్లీ గెలుపు నాదే’ అంటూ దీటుగా తిప్పికొడుతున్నారీ ‘బసంతి’! ధీశాలి... మేనక ఇందిర చిన్న కొడుకు సంజయ్ భార్యగా గాం«దీల కుటుంబంలో అడుగుపెట్టిన మేనక భర్త మరణాంతరం ఆ కుటుంబానికి పూర్తిగా దూరమయ్యారు. ఆమె స్వస్థలం ఢిల్లీ. 26 ఏళ్ల వయసులో రా్రïÙ్టయ సంజయ్ మంచ్ పేరుతో పార్టీ స్థాపించి 1984లో యూపీలోని అమేథీ నుంచి ఏకంగా రాజీవ్నే ఢీకొట్టి ఓడారు. 1989లో పిలిభిత్ నుంచి లోక్సభకు వెళ్లారు. 2004లో బీజేపీలో చేరారు. పిలిభిత్ నుంచి ఆరుసార్లు గెలిచారు. కేంద్ర మంత్రిగా రాణించారు. గత ఎన్నికల్లో సుల్తాన్పూర్ నుంచి గెలిచిన ఈ జంతు ప్రేమికురాలు ఈసారీ అక్కడి నుంచే బరిలో ఉన్నారు. ఇటలీ టు ఢిల్లీ.. వయా యూపీ యూపీకి రాజకీయంగా వలస వచ్చి దేశంలోనే పవర్ఫుల్ పొలిటీషియన్గా ఎదిగిన మహిళల్లో అగ్రతాంబూలం సోనియా గాం«దీదే. ఇటలీలో పుట్టి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని పెళ్లాడి, భారత్ను మెట్టినింటిగా చేసుకున్న సోనియా రాజకీయ రంగప్రవేశం చేసింది యూపీ నుంచే. గాం«దీల కంచుకోటైన అమేథీ నుంచే 1999 లోక్సభ ఎన్నికల్లో అరంగేట్రం చేశారు. 2004లో రాయ్ బరేలీ నుంచి గెలిచి దేశ రాజకీయాల్లో సూపర్స్టార్గా మారారు. యూపీఏ చైర్పర్సన్గా పదేళ్లు సంకీర్ణ ప్రభుత్వంలో చక్రం తిప్పారు. 2019 దాకా రాయ్బరేలీ నుంచే లోక్సభకు ఎన్నికవుతూ వచ్చారు. తాజాగా సోనియా రాజ్యసభకు వెళ్లడంతో ఈసారి కూతురు ప్రియాంక బరిలో దిగొచ్చని భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీజేపీ 150 సీట్లకే పరిమితం: రాహుల్ గాంధీ
లక్నో: లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం 150 సీట్లు మాత్రమే గెలుస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన బుధవారం ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో కాంగ్రెస్, ఎస్పీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ఎన్ని గెలుస్తామో ముందే జోష్యం చెప్పలేను. 15-20 రోజుల క్రితం బీజేపీ లోక్సభ ఎన్నికల్లో 180 సీట్లు గెలుస్తుందని అనుకున్నా. కానీ, బీజేపీ గ్రాఫ్ రోజురోజుకి పడిపోతుంది. బీజేపీ కేవలం 150 సీట్లలో మాత్రమే గెలుస్తుంది. మాకు అన్ని రాష్ట్రాల నుంచి రిపోర్టులు అందాయి. కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోంది. మాది ఉత్తరప్రదేశ్లో చాలా బలమైన కూటమి. మాకు మంచి ఫలితాలు వస్తాయి. గత పదేళ్లలో ప్రధాని మోదీ నోట్లరద్దు చేశారు. బడా వ్యాపారవేత్తల కోసం తప్పడు జీఎస్టీ అమలు చేసి ఉపాధి తగ్గించారు. యువతకు ఉపాధి కోసం మేము 23 విప్లవాత్మకమైన ఆలోచనలు చేశాం. ఉత్తరప్రదేశ్లోని గ్రాడ్యుయేట్లు, డిప్లొమా చేసినవారికి అప్రెంటిస్షిప్ హక్కును కల్పిస్తాం. యువత బ్యాంకు ఖాతాలో ఏడాదికి లక్ష రూపాయలు జమ చేస్తాం. కోట్లాది మంది యువతకు ఈ హక్కులు కల్పిస్తాం. పేపర్ లీకులు జరగకుండా చట్టం చేస్తాం’ అని రాహుల్ గాంధీ తెలిపారు. ప్రధాని మోదీ అవినీతికి ఛాంపీయన్ ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ ప్రపంచంలోనే అతి పెద్ద దోపిడి పథకమని అన్నారు. అదేవిధంగా అవినీతిలో ప్రధాని మోదీ ఒక ఛాంపీయన్ అని మండిపడ్డారు. ప్రధాని స్క్రిప్ట్ ఆధారంగా ఇంటర్వ్యూలో మాట్లడారని ఎద్దేవా చేశారు. ‘కొన్ని రోజుల కిత్రం ఓ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ మాట్లాడారు. అందులో ఎన్నికల బాండ్ల గురించి ప్రస్తావించారు. ఎన్నికల బాండ్లు రాజకీయాల్లో పారదర్శకత కోసం తీసుకువచ్చామని సమర్థించుకున్నారు. అలాంటప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేసింది. పారదర్శకత కోసమే అయితే బీజేపీకి విరాళాలు ఇచ్చిన వారి పేర్లు ఎందుకు దాచారు. ఏయే తేదీల్లో విరాళాలు అందజేశారో ఎందుకు దాచారు’అని రాహుల్ గాంధీ నిలదీశారు. #WATCH | Ghaziabad, UP: On the upcoming Lok Sabha elections, Congress MP Rahul Gandhi says "I do not do prediction of seats. 15-20 days ago I was thinking BJP would win around 180 seats but now I think they will get 150 seats. We are getting reports from every state that we are… pic.twitter.com/tAK4QRwAGl — ANI (@ANI) April 17, 2024 సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఇండియా కూటమి అనేది ఒక కొత్త ఆశాకిరణమని తెలిపారు. మెనిఫెస్టోలో పేదరిక నిర్మూలనకు సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయని రాహుల్ గాంధీ చెప్పారు. రైతుల ఆదాయం పెంచాలని, పేదరికం నిర్మూలించాలని ఇండియా కూటమిలో అన్ని రాజకీయ పార్టీలు పంటలకు ఎంఎస్పీ మద్దతు ధర కల్పిస్తామని చెబుతున్నాయని తెలిపారు. అదేవిధంగా ప్రతిపక్షాల ఇండియా కూటమి ఘజియాబాద్ నుంచి ఘాజీపూర్ వరకు బీజేపీని తుడిచిపెడుతుందని అన్నారు. బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవటంతో రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. #WATCH | Ghaziabad, Uttar Pradesh: SP chief Akhilesh Yadav says, "INDIA alliance is the new hope in the elections and as Rahul ji said that there are many things in his manifesto by which poverty can be eradicated. Adding to that I want to say that the day the farmers of our… pic.twitter.com/QyJL3Y7oEs — ANI (@ANI) April 17, 2024
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019