breaking news
Ad - Sakshi_Home_Sticky
-
గ్రూప్ దశలోనే శ్రీజ, మనిక నిష్క్రమణ
మకావు: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి మహిళాక్రీడాకారిణులు మనిక బత్రా, ఆకుల శ్రీజలకు నిరాశ ఎదురైంది. వీరిద్దరు గ్రూప్ దశలోనే నిష్క్రమించారు. మొత్తం 48 మంది క్రీడాకారిణులను మొత్తం 16 గ్రూప్లుగా విభజించారు. ఒక్కో గ్రూప్లో ముగ్గురికి చోటు క ల్పించారు. 16 గ్రూప్ల్లో టాపర్గా నిలిచిన వారు నాకౌట్ దశ ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. గ్రూప్–2లో ఢిల్లీ అమ్మాయి మనిక, గ్రూప్–4లో తెలంగాణ ప్లేయర్ శ్రీజ రెండో స్థానంలో నిలిచారు. నాకౌట్ దశకు అర్హత సాధించాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ల్లో ప్రపంచ 37వ ర్యాంకర్ మనిక, ప్రపంచ 39వ ర్యాంకర్ శ్రీజ ఓడిపోయారు. బుధవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్లలో మనిక 6–11, 4–11, 9–11, 4–11తో ప్రపంచ రెండో ర్యాంకర్ మాన్యు వాంగ్ (చైనా) చేతిలో... శ్రీజ 4–11, 4–11, 15–13, 2–11తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ చెన్ మెంగ్ (చేతిలో) ఓటమి పాలయ్యారు. -
WTT Champions Tourney 2024: పోరాడి ఓడిన మనిక
ఇంచియోన్ (దక్షిణ కొరియా): వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) చాంపియన్స్ లెవెల్ టోర్నీలో భారత నంబర్వన్ మనిక బత్రా తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 38వ ర్యాంకర్ మనిక 12–10, 9–11, 6–11, 11–8, 8–11తో ప్రపంచ ఆరో ర్యాంకర్ హినా హయాటా (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయింది. 47 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో నిర్ణాయక ఐదో సెట్లో కీలక తరుణంలో మనిక తప్పిదాలు చేసి ఓటమి పాలైంది. తొలి రౌండ్లో ఓడిన మనిక బత్రాకు 3,500 డాలర్ల (రూ. 2 లక్షల 91 వేలు) ప్రైజ్మనీతోపాటు 15 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
రెండో రౌండ్లో శరత్ కమల్.. తొలి రౌండ్లోనే ఓటమిపాలైన మనిక
సింగపూర్ స్మాష్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో భారత స్టార్ ఆచంట శరత్ కమల్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. 41 ఏళ్ల శరత్ కమల్ క్వాలిఫయింగ్ ద్వారా పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టాడు. తొలి రౌండ్లో ప్రపంచ 87వ ర్యాంకర్ శరత్ కమల్ 11–5, 11–4, 11–6తో నికోలస్ బర్గోస్ (చిలీ)పై గెలిచాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో భారత నంబర్వన్ మనిక బత్రా 4–11, 7–11, 2–11తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ యిది వాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయింది. -
భారత్ను గెలిపించిన మనిక
బుసాన్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ చాంపియన్షిప్లో భారత మహిళల జట్టుకు తొలి విజయం లభించింది. హంగేరితో ఆదివారం జరిగిన గ్రూప్–1 రెండో లీగ్ మ్యాచ్లో భారత్ 3–2తో గెలిచింది. భారత నంబర్వన్ మనిక బత్రా తాను ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గెలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. మరోవైపు భారత పురుషుల జట్టు గ్రూప్–3లో భాగంగా పోలాండ్తో జరిగిన మ్యాచ్లో 1–3తో ఓడిపోయింది. -
Table Tennis Player Manika Batra Pics: ఆటలోనే కాదు అందంలోనూ తగ్గేదేలే..(ఫొటోలు)
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019