breaking news
-
స్టెల్లర్ బ్లేడ్..! గ్రహాంతరవాసులతో వార్..!!
యాక్షన్ అడ్వెంచర్ గేమ్ ‘స్టెల్లర్ బ్లేడ్’ ఈ నెల 26న విడుదల కానుంది. కథ విషయానికి వస్తే భూమి మీద ఉన్న మనుషులకు, గ్రహాంతవాసులకు మధ్య యుద్ధం జరుగుతుంది. గ్రహాంతరవాసులతో యుద్ధంలో ఓడిపోయిన తరువాత మానవాళి తరిమివేయబడుతుంది. కోల్పోయిన తమ స్వస్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఈవ్తో పాటు ఆమె దళం ‘నయతిబా’ అనే గ్రహాంతరవాసులతో పోరాటానికి సిద్ధం అవుతుంది. థర్డ్–పర్సన్ పర్స్పెక్టివ్ నుంచి ఆడే గేమ్ ఇది. శత్రువు వ్యూహాల ఆధారంగా ఎదురు దాడి చేయాల్సి ఉంటుంది. ఈ గేమ్కు సంబంధించిన డెమోను గత నెల విడుదల చేశారు. జానర్స్: యాక్షన్, అడ్వెంచర్.. ఇంజిన్: అన్రియల్ ఇంజిన్4 మోడ్స్: సింగిల్–ప్లేయర్ ప్లాట్ఫామ్: ప్లేస్టేషన్ 5 ఇవి చదవండి: ఈ షాకింగ్ నిజాల గురించి మీకు తెలుసా? -
Gaming: 'టేల్స్ ఆఫ్ కెన్జెర’ ఈ నెల 23న విడుదల కాబోతోంది..
సర్జెంట్ స్టూడియోస్ వారి ‘టేల్స్ ఆఫ్ కెన్జెర’ ఈ నెల 23న విడుదల కాబోతోంది. ఈ గేమ్లో ప్రధాన పాత్ర జావ్. డబుల్ జంప్, వాల్ జంప్, గాల్లో గంతులు వేయడంలో దిట్ట. మూడు ఆత్మలను బంధించి మృత్యుదేవత కలుంగకు అర్పిస్తుంది. సన్ మాస్క్, మూన్ మాస్క్ అనేవి జావ్ ప్రధాన ఆయుధాలు. శత్రువుల ఆటకట్టించడంలో ఈ రెండు ఆయుధాలకు తమదైన ప్రత్యేకత ఉంది. శత్రువులను జయించినప్పుడు వారి నుంచి ‘ఉలోగి’ అనే సోల్ ఎనర్జీని కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ‘టేల్స్ ఆఫ్ కెన్జెర’ అనేది 2.5డీ ప్లాట్ఫామ్ అడ్వెంచర్ గేమ్. ప్లేయర్స్ క్రమంగా కొత్త కొత్త స్కిల్స్ను సొంతం చేసుకుంటారు. ప్లాట్ఫామ్స్: మైక్రోసాఫ్ట్ విండోస్, నిన్టెండో స్విచ్, ఎక్స్ బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్ మోడ్: సింగిల్ ప్లేయర్ -
Gaming: యాక్షన్–రోల్ ప్లేయింగ్ గేమ్.. 'హరైజన్ ఫర్బిడెన్ వెస్ట్'
హరైజన్ జీరో డాన్ (2017) గేమ్కు సీక్వెల్గా వచ్చిన యాక్షన్–రోల్ ప్లేయింగ్ గేమ్ హరైజన్ ఫర్బిడెన్ వెస్ట్(పీసీ) విడుదలైంది. థర్డ్–పర్సన్ పర్స్పెక్టివ్లో ఆడే గేమ్ ఇది. ప్రమాదకరమైన ఆయుధాలతో నిండిన ‘అలోయ్’ అనే హంటర్ను ప్లేయర్ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. నోరా తెగకు చెందిన యంగ్ హంటర్ అలోయ్ శాస్త్రవేత్త ఎలిజబెత్ సోటెక్ క్లోన్. ‘మిస్టీరియస్ ప్లేగ్’ మూలాన్ని తెలుసుకోవడానికి తన బృందాన్ని ఫర్బిడెన్ వెస్ట్ అని పిలవబడే సరిహద్దు ప్రాంతానికి తీసుకువెళుతుంది. ఆలోయ్ తన ప్రయాణంలో భారీ తుఫానులను, సంచార తెగలతో యుద్ధాలను ఎదుర్కొంటుంది. పచ్చనిలోయల నుంచి శిథిలమైన నగరాల వరకు ఆలోయ్ ప్రయాణంలో ఎన్నో దృశ్యాలు కనిపిస్తాయి. గత గేమ్తో ΄ోల్చితే ఈ గేమ్ మ్యాప్ పెద్దగా ఉంటుంది. షీల్డ్వింగ్, ఫోకస్ స్కానర్, డైవింగ్ మాస్క్, పుల్కాస్టర్లాంటి టూల్స్ను కంబాట్లో ఉపయోగించవచ్చు. ప్లాట్ఫామ్స్: ప్లే స్టేషన్ 4, ప్లే స్టేషన్ 5 విండోస్ జానర్: యాక్షన్, అడ్వెంచర్ మోడ్: సింగిల్–ప్లేయర్ ఇవి చదవండి: Sia Godika: 'సోల్ వారియర్స్'.. తను ఒక చేంజ్మేకర్! -
ఎంటర్టైన్మెంట్ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: గేమింగ్, టెక్నాలజీ, వినోద రంగాల్లో దక్షిణాసియాకు తెలంగాణను కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో గేమింగ్, మీడియా, వినోద రంగాలకు సంబంధించి దేశంలోనే అతిపెద్ద ప్రదర్శన ‘ఇండియా జాయ్ 2019’ను మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. ఇంటర్నెట్ మాధ్యమంగా టీవీ, సినీ ప్రసారాలను అందించే ఓటీటీ (ఓవర్ ది టాప్) రంగం ఏటా 8 శాతం చొప్పున శరవేగంగా వృద్ధి చెందుతోందని, ప్రస్తుతం యానిమేషన్ విభాగంలో ఓటీటీ వాటా 2.9 బిలియన్ డాలర్లుగా ఉందని కేటీఆర్ వెల్లడించారు. విజువల్ ఎఫెక్ట్స్ పరిశ్రమ కూడా వేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో హైదరాబాద్ కేవలం తెలుగు సినీ పరిశ్రమకే కాకుండా దక్షిణాసియాలోని అన్ని భాషల సినీ పరిశ్రమలకు కేంద్రంగా ఉండాలన్నారు. రాష్ట్రంలోని 150కి పైగావీఎఫ్ఎక్స్ స్టూడియోలు, 2డీ, 3డీ యానిమేషన్, గేమింగ్ కంపెనీలు 30 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 90 వేల మందికి పరోక్ష ఉపాధి ఉపాధిని కల్పిస్తున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా 7 బిలియన్ల జనాభా ఉండగా, 2.3 బిలియన్ల మంది డిజిటల్ గేమింగ్లో చురుగ్గా ఉన్నారని, ప్రస్తుతం 140 బిలియన్ డాలర్లుగా ఉన్న గేమింగ్ మార్కెట్లో భారత్ వాటా 91 శాతం మేర అనగా 125 బిలయన్ డాలర్ల మేర ఉందని కేటీఆర్ వెల్లడించారు. స్మార్ట్ఫోన్లు, టాబ్లు జీవితంలో అంతర్భాగంగా మారిన నేపథ్యంలో 2020–25 నాటికి గేమిగ్రంగం 300 బిలియన్ డాలర్ల పరిశ్రమగా వృద్ధి చెందే అవకాశముందన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్లో దేశంలో ప్రత్యేకించి తెలంగాణలో వీఎఫ్ఎక్స్, గేమింగ్, యానిమేషన్, కంటెంట్ క్రియేషన్ రంగాల్లో లక్షల కొద్దీ ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందన్నారు. తొమ్మిదేళ్ల క్రితం రాష్ట్రంలో గేమింగ్ స్టార్టప్లు 25 ఉండగా, ప్రస్తుతం 250కి చేరాయని, ‘ఈ స్పోర్ట్స్’రంగంలో భారతీయ కంపెనీలకు అనేక అవకాశాలు వస్తున్నాయని కేటీఆర్ చెప్పారు. 2022 నాటికి ఇమేజ్ టవర్స్ హైదరాబాద్లో ఏర్పాటైన గేమింగ్, వీఎఫ్ఎక్స్ సంస్థల ద్వారా రాష్ట్రానికి మంచి పేరు వచ్చిందని, బాహుబలి, లైఫ్ ఆఫ్ పై వంటి అత్యున్నత సాంకేతిక సినిమాలు, చోటా బీమ్ వంటి యానిమేషన్ చిత్రాలకు ఇక్కడే రూపకల్పన జరిగిందని కేటీఆర్ చెప్పారు. యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్ కంపెనీల కోసం గ్రీన్మ్యాట్, మోషన్ క్యాప్చర్ వంటి అత్యాధునిక స్టూడియోలు.. పూర్తి సదుపాయాలతో కూడిన ఇమేజ్ టవర్స్ నిర్మాణం 2022 నాటికి పూర్తవుతుందన్నారు. రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని యువతకు కూడా ఉపాధి దక్కేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. యానిమేషన్, గేమింగ్ తదితర రంగాలపై అవగాహన కల్పించేందుకు ఫైనార్ట్స్ కోర్సులతో పాటు డిగ్రీలోనూ వాటిని పాఠ్యాంశాలుగా చేర్చుతామన్నారు. గేమింగ్ రంగంలో స్థానికంగా పెట్టుబడులతో వచ్చే సంస్థలకు రాయితీలు ఇవ్వడంతో పాటు, ఎంఎస్ఎంఈ పరిశ్రమలను కూడా ప్రోత్సహిస్తామని కేటీఆర్ ప్రకటించారు. 23 వరకు ‘ఇండియా జాయ్’ బుధవారం ప్రారంభమైన ఇండియా జాయ్ 2019 వేదికగా ప్రపంచ డిజిటల్, మీడియా, ఎంటర్టైన్మెంట్ కార్పొరేషన్లు ఒకే వేదిక మీదకు వచ్చాయి. ఈ నెల 23 వరకు హెచ్ఐసీసీలో జరిగే ఈ ప్రదర్శనకు సుమారు 30 వేల మంది సందర్శకులు వస్తారని అంచనా. కాగా, ప్రపంచవేదిక మీద తమ సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు భారత్కు చెందిన మీడియా, గేమింగ్, డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కంపెనీలకు ఇండియా జాయ్ వేదికగా పనిచేస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ వీఎఫ్ఎక్స్, యానిమేషన్, గేమింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజీవ్ చిలుక, సినీ నిర్మాత అల్లు అరవింద్, అమేజాన్ ప్రైమ్ కంటెంట్ హెడ్ విజయ్ సుబ్రమణ్యం, సినీ నటి నమ్రత శిరోద్కర్, శ్రీధర్ ముప్పిడి తదితరులు పాల్గొన్నారు. -
మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హైదరాబాద్ వేదిక
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ నగరం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి వేదిక కానుంది. ప్రపంచంలోని ప్రముఖ ఎంటర్టైన్మెంట్, గేమింగ్, డిజిటల్ అండ్ మీడియా, యానిమేషన్, విజువల్ ఎపెక్ట్స్ రంగాల దిగ్గజ కంపెనీలు, తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో జరిగే ఇండియా జాయ్ కార్యక్రమానికి మరోసారి హైదరాబాద్ నగరం వేదిక కానున్నది. నాలుగు రోజులపాటు జరగనున్న ఇండియా జాయ్-2019 కార్యక్రమం నవంబర్ 20వ తేదీ నుంచి 23 వరకు హైదరాబాద్లోని హైటెక్స్లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావుని ముఖ్యఅతిధిగా ఆహ్వానిస్తూ ఇండియా జాయ్ ప్రతినిధులు ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఇండియా జాయ్ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారని నిర్వాహకులు ఒక ప్రకటనలో వెల్లడించారు. మీడియా, ఎంటర్టైన్మెంట్, గేమింగ్, యానిమేషన్, విజువల్ ఎపెక్ట్స్ రంగాలకు చెందిన వివిధ దేశాల నుంచి సుమారు వెయ్యి మంది ప్రతినిధులుఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గేమింగ్ యానిమేషన్ , మీడియా, ఎంటర్టైన్మెంట్ వంటి రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఈ రంగాలకు హైదరాబాద్ నగరాన్ని పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చేందుకు ‘ఇమేజ్ టవర్’ ను నిర్మిస్తున్నట్లు ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. ఇమేజ్ టవర్ ఈ రంగాలకు ఒక ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సు’గా పనిచేస్తుందని, ఇందులో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల ముఖ్య ప్రతినిధులు హాజరుకానున్న ఈ సమావేశంలో ఆయా రంగాలకు హైదరాబాద్ నగరంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మీడియా, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, వినోద రంగాలకు సంబంధించి అద్భుతమైన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటికే అంతర్జాతీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ సినిమాలకు, చోటా బీమ్ వంటి గొప్ప కార్టూన్ సిరీస్ రూపకల్పన హైదరాబాద్ నగరంలోనే జరిగిందని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు పూర్తిస్థాయి సహకారం అందిస్తామని కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్, దేశీ టూన్స్, విఎఫ్ఎక్స్ సదస్సు, ఇన్ఫ్లుయెన్సర్ కాన్ఫరెన్స్, ఈ- స్పోర్ట్స్ వంటి పలు కార్యక్రమాలను ఈ నాలుగు రోజుల్లో చేపట్టనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. మొత్తం వివిధ దేశాల నుంచి సుమారు 30 వేల మంది సందర్శకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నదని తెలిపారు. #IndiajoyinFestival is a prestigious platform for Digital, Media & Entertainment Corporations to collaborate & innovate. With more than 30,000 visitors, the 4-day conclave is expected to serve as a springboard for Indian media, entertainment companies on the world stage. — Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) November 11, 2019
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019