breaking news
Ad - Sakshi_Home_Sticky
-
అంబేద్కరే వచ్చి అడిగినా అది జరగదు: ప్రధాని
రాయ్పూర్: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను రద్దు చేస్తుందన్న అబద్ధాన్ని ఇంకా ఎన్నిరోజులు ప్రచారం చేస్తారని ప్రధాని మోదీ ప్రశ్నించారు. ఛత్తీస్గఢ్లో జాంజ్గిర్-చంపాలో మంగళవారం(ఏప్రిల్23)జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మాట్లాడారు. అంబేద్కర్ తిరిగి వచ్చి అడిగినా రాజ్యాంగాన్ని ఎవరూ మార్చలేరన్నారు. కాంగ్రెస్ నేతలు తాము రాముని కంటే గొప్పవాళ్లం అనుకుంటారని, అందుకే అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్టకు రాలేదని ఎద్దేవా చేశారు. ఇదీ చదవండి.. కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలిసా వినడం కూడా నేరమే -
బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు కేసీఆర్ లాంటి దొరలే..!
బీఆర్ఎస్, బీజేపీ ఎంపీ అభ్యర్థులపై సీఎం రేవంత్రెడ్డి తనదైన స్టైల్లో విమర్శలు గుప్పించారు. ‘ఆత్రం సక్కును చూశారు.. గోడం నగేశ్ను చూశారు.. వారు మీకు కొత్తేమి కాదు.. వాళ్ల పనితీనమేంటో కూడా మీకు తెలుసు.. మంచోడు మంచోడని మంచమెక్కిస్తే మంచమంతా పాడు చేశాడట వెనుకటికి ఆత్రం సక్కులాంటోడని’ అన్నారు. అలాగే గోడం నగేశ్ గురించి మా ట్లాడుతూ ‘బుద్ధిమంతుడని సద్దికట్టిస్తే బొడ్రాయి వద్ద భోంచేసి తిరిగి ఇంటికొచ్చి బోర్లాపడుకున్నడట.. అంటూ సామెతలను వివరిస్తూ వారిద్దరిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నగేశ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా అన్ని పదవులు చేసిన విషయం మీకందరికీ తెలుసన్నారు. వారిద్దరు తక్కువేమి కాదని కేసీఆర్ దొర ఎంతనో ఈ గిరిజన నాయకులు అంతటి దొరలేనన్నారు. ఉదయం 11గంటలైతే తప్ప కిందకి దిగడని, సామాన్యులు చేయి కలిపితే వెంటనే జేబులో పెట్టి తుడ్చుకునే నగేశ్ లాంటి దొరలు మనకు అవసరమా అని ప్రశ్నించారు. ఫాంహౌస్లో ఉండే దొరలైనా ఆదిలాబాద్లో ఉండే ఈ దొరలతో మనకేం పని అని అన్నారు. సామాన్యురాలిగా, ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఆత్రం సుగుణను పార్టీ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టిందని ఆమెను భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్కు పంపించాలని కోరారు. ఇవి చదవండి: సీఎం హామీల జల్లు! -
కూటమి మాకు పోటీనే కాదు..చంద్రబాబును కుప్పం నుండి తరిమేస్తాం
-
పవన్ కు పిచ్చి బాగా ముదిరినట్లు కనిపిస్తోంది
-
లోకేష్ కామెంట్స్ కి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019