నేడు జిల్లాకు సీఎం రేవంత్రెడ్డి
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో శుక్రవారం భారీ బహిరంగసభకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్రెడ్డి తొలిసారి జిల్లాకు వస్తుండడంతో ఘనస్వాగతం పలికేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశాయి. మొదటి బైపాస్రోడ్డులో నిర్వహించే ఈ సభకు సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాల నుంచి దాదాపు 50 వేల మందిని సమీకరించాలని పార్టీ నాయకులు భా విస్తున్నారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి, కరీంనగర్ ఎంపీ అ భ్యర్థి వెలిచాల రాజేందర్రావు సభ నిర్వహణపై పార్టీ శ్రేణులకు ఇప్పటికే దిశనిర్దేశం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బహిరంగసభ ప్రారంభం కానుండడంతో ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని టెంట్లు, కూలర్లను ఏర్పాటు చేస్తున్నారు.
పటిష్ట భద్రత
సభాస్థలికి జిల్లా నలుమూలల నుంచి వచ్చే వాహనాలను ఎక్కడికక్కడే నిలువరించి పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, వేములవాడ, కోనరావుపేట మార్గాల్లో సిరిసిల్లకు వచ్చే వాహనాలను ఆయా ప్రాంతాల్లోనే పార్కింగ్కు ఏర్పాట్లు చేస్తున్నారు. హెలీప్యాడ్తోపాటు సీఎం వచ్చి, వెళ్లే మార్గాల ను పోలీసులు ఇప్పటికే ఆధీనంలోకి తెచ్చుకున్నారు. డాగ్స్క్వాడ్, బాంబుస్క్వాడ్లతో తనిఖీలు చేశారు.
కాంగ్రెస్ జెండాలతో నిండిన కూడళ్లు
సిరిసిల్ల కూడళ్లు కాంగ్రెస్ పార్టీ జెండాలతో నిండిపోయాయి. సీఎం హోదాలో తొలిసారి జిల్లా కు వస్తుండడంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా స్వాగతం పలుకుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సిరిసిల్లలో సీఎం సభను వి జయవంతం చేసేందుకు పార్టీ ముఖ్యనాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
భద్రతపై ఎస్పీ సమీక్ష
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా గురువారం సాయంత్రం పోలీస్ అధికారులతో కలిసి బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యవేక్షించారు. భద్రత చర్యల్లో లోపాలు లేకుండా చూడాలని సూచించారు. బహిరంగ సభాస్థలి, ముఖ్యమంత్రి ప్రయాణించే రూట్ మ్యాప్, హెలిప్యాడ్, వీఐపీ పార్కింగ్, ట్రాఫిక్ రూట్లు సభాస్థలికి వచ్చి, వెళ్లే దారులు, జనరల్ పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎస్పీ వెంట ట్రెయినీ ఐపీఎస్ రాహుల్రెడ్డి, ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు చంద్రశేఖర్రెడ్డి, మురళీకృష్ణ, సీఐలు రఘుపతి, అనిల్కుమార్, శ్రీనివాస్, శ్రీనివాస్ పాల్గొన్నారు. మొదటి బైపాస్రోడ్డులో బహిరంగ సభ
భారీ జనసమీకరణలో కాంగ్రెస్ శ్రేణులు