ప్రతినెలా ఒకటో తేదీనాడే వలంటీర్లు మా ఇళ్ల వద్దకొచ్చి పింఛన్ ఇచ్చేవారు. చంద్రబాబు, ఆయన అనుచరుల కారణంగా నేడు మేము నానా కష్టాలు పడుతున్నాం. ఈనెలలో మాకు పింఛను బ్యాంకు అకౌంట్లలో జమచేసినట్టు చెప్పారు. పింఛను కోసం మండుటెండలో బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఈ వయసులో మేము ఇలా బ్యాంకుల చుట్టూ తిరగాల్సి రావడం ఎంతో కష్టంగా ఉంది. ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టి చంద్రబాబు ఏం సాధిస్తాడో..? అర్థం కావడంలేదు. ఈ కష్టాలకు కారణమైన బాబుకు మా ఉసురు తగలక పోదు.
– వీరదాసరి రమణమ్మ, కలువాయి
భయమేస్తోంది
ఒకటో తేదీన తెల్లవారుజామునే ఇంటి తలుపు తట్టి పెన్ష్న్ సొమ్ము ఇచ్చే వలంటీర్లను తీసేశారు. ఇప్పుడు బ్యాంకు వద్దకు వెళ్లితే ఆ జనాన్ని చూస్తే భయమేస్తోంది. ఆ క్యూలో నిలుచుకునే ఓపిక కూడా లేదు. నిరుపేదలను కష్టపెట్టే వారికి మా గోడు తప్పక తగలుతుంది బాబు.