దివ్యాంగులు, పండుటాకులపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన అనుచరులు కక్షగట్టారు. కుట్రపూరితంగా వలంటీర్ వ్యవస్థపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయించారు. దీంతో ఎన్నికల కమిషన్ వలంటీర్ వ్యవస్థను పక్కనబెట్టింది. ఇంటికే చేరుతున్న పింఛన్ అందకుండా పోయింది. రెండు నెలల నుంచి పండుటాకులు ఆపసోపాలు పడాల్సి వస్తోంది. వీసీ ఆదేశాలతో గత నెలలో సచివాలయాల ద్వారా పింఛన్ నగదు పొందగా.. ఇప్పుడు బ్యాంక్కు వెళ్లి తీసుకోవాల్సి వస్తోంది. తమపై కక్షగట్టి ముప్పుతిప్పలు పెడుతున్న చంద్రబాబు తీరుపై అభాగ్యులు ఒంటికాలుతో లేస్తున్నారు. ‘మేం ఏం పాపం చేశామని.. ఇలా ఇబ్బంది పెడుతున్నాడు’ టూ శాపనార్థాలు పెడుతున్నారు.