షార్లోట్స్విల్ డబ్ల్యూ–75 మహిళల టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో జరుగుతున్న ఈ టోర్నీలో సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో రష్మిక 2–6, 2–6తో గాబ్రియేలా ప్రైస్ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. 84 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రష్మిక తన సర్విస్ను నాలుగుసార్లు కోల్పోయింది.
breaking news
Breadcrumb
తొలి రౌండ్లోనే రష్మిక పరాజయం
Published Wed, Apr 24 2024 4:26 AM
# Tag
Ad - Sakshi_Home_Sticky
adsolute_video_ad
Related news
-
టైటిల్ పోరుకు యూకీ–అల్బానో జోడీ
మ్యూనిక్: భారత టెన్నిస్ అగ్రశ్రేణి క్రీడాకారుడు యూకీ బాంబ్రీ తన కెరీర్లో మూడోసారి ఏటీపీ –250 టోర్నీలో డబుల్స్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. బీఎండబ్ల్యూ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో యూకీ–ఒలివెట్టి జంట 6–1, 6–7 (5/7), 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో ఎర్లెర్–మెడ్లెర్ (ఆ్రస్టియా) ద్వయంపై గెలిచింది. 92 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఈ ఇండో–ఫ్రెంచ్ జోడీ ఏడు ఏస్లు సంధించి నాలుగు డబుల్ ఫాల్ట్లు చేసింది. తమ సర్విస్ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్విస్ను మూడుసార్లు బ్రేక్ చేసింది. -
‘లోక్సభ’లో ఓడినా... ప్రధానులైన నేతలు వీరే!
దేశంలోని ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే పలు విచిత్ర ఉదంతాలు మనకు కనిపిస్తాయి. వీటిలోని కొన్నింటిని విన్నప్పుడు మనకు ఒక పట్టాన నమ్మాలని అనిపించదు. 1984 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. అయితే నాటి ఎన్నికల్లో దిగ్గజనేతలైన చంద్రశేఖర్, అటల్ బిహారీ వాజ్పేయి, నరసింహారావు ఓటమి పాలయ్యారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఈ ముగ్గురు సీనియర్ నేతలు తదుపరి 12 ఏళ్ల వ్యవధిలో వేర్వేరు సమయాల్లో దేశానికి ప్రధానులుగా మారడం విచిత్రం. చంద్రశేఖర్ జనతా పార్టీ నుంచి నాడు ఎన్నికల బరిలోకి దిగిన చంద్రశేఖర్ తన సంప్రదాయ స్థానమైన బల్లియా(యూపీ) నుంచి పోటీకి దిగినా ఆయనకు నిరాశే ఎదురైంది. కాంగ్రెస్కు చెందిన జగన్నాథ్ చౌదరి 53,940 ఓట్ల తేడాతో సునాయాసంగా చంద్రశేఖర్ను ఓడించారు. ఆ తర్వాత 1990లో చంద్రశేఖర్ దేశ ప్రధాని అయ్యారు. పీవీ నరసింహారావు కాంగ్రెస్ సీనియర్ నేత, నాటి హోంమంత్రి పీవీ నరసింహారావు కూడా ఎన్నికల్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 1984లొ దక్షిణాదిలో బీజేపీ తొలిసారిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసింది. నాడు బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సీ జంగారెడ్డి 54,198 ఓట్ల తేడాతో నరసింహారావుపై విజయం సాధించారు. దక్షిణ భారతదేశం నుంచి ఎంపీగా ఎన్నికైన తొలి బీజేపీ నేత సీ జంగా రెడ్డి. 1991లో నరసింహారావు దేశానికి ప్రధాని అయ్యారు. వాజ్పేయి అటల్ బిహారీ వాజ్పేయి 1984 ఎన్నికల్లో గ్వాలియర్ నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మాధవరావు సింధియా చేతిలో వాజ్పేయి ఓటమి పాలయ్యారు. అటల్ బిహారీ వాజ్పేయి 1996లో దేశానికి ప్రధాని అయ్యారు. -
సెమీఫైనల్లో రిత్విక్ జోడీ పరాజయం
మొరెలోస్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–75 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మెక్సికోలో జరుగుతున్న ఈ టోర్నీ తొలి సెమీఫైనల్లో హైదరాబాద్కు చెందిన బొల్లిపల్లి రిత్విక్–నిక్కీ పునాచా జోడీ 4–6, 6–3, 7–10తో మత్సుజెవ్స్కీ (పోలాండ్)–మాథ్యూ రొమియోస్ (ఆ్రస్టేలియా) జంట చేతిలో ఓడిపోయింది. రెండో సెమీఫైనల్లో అర్జున్–జీవన్ (భారత్) ద్వయం 4–6, 7–6 (7/5), 10–8తో జాన్సన్ (బ్రిటన్)–మన్సూరి (ట్యూనిషియా) జంటపై నెగ్గి ఫైనల్ చేరింది. -
పోరాడి ఓడిన సుమిత్
మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో భాగంగా గురువారం ప్రపంచ ఏడో ర్యాంకర్ హోల్గర్ రూనే (డెన్మార్క్)తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్లో భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ 3–6, 6–3, 2–6తో పోరాడి ఓడిపోయాడు. 2 గంటల 11 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ప్రపంచ 93వ ర్యాంకర్ సుమిత్ ఐదు డబుల్ ఫాల్ట్లు చేశాడు. తన సర్వీస్ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్విస్ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. సుమిత్కు 42,935 యూరోల (రూ. 38 లక్షల 38 వేలు) ప్రైజ్మనీతోపాటు 50 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ప్రదర్శనతో సుమిత్ ఈనెల 15న విడుదల చేసే ఏటీపీ ర్యాంకింగ్స్లో 13 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 80వ ర్యాంక్ కు చేరుకోనున్నాడు. అంతేకాకుండా మేలో జరిగే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో నేరుగా మెయిన్ ‘డ్రా’లో చోటును ఖరారు చేసుకున్నాడు. 2019లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’లో ఆడనున్న భారత ప్లేయర్గా సుమిత్ గుర్తింపు పొందుతాడు. -
మూడు మ్యాచ్ పాయింట్లు కాపాడుకొని భారత్ గెలుపు
చాంగ్షా (చైనా): బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా మహిళల టీమ్ టెన్నిస్ టోర్నీలో భారత జట్టు రెండో విజయం సాధించింది. చైనీస్ తైపీతో జరిగిన మ్యాచ్లో భారత్ 2–1తో నెగ్గింది. తొలి మ్యాచ్లో రుతుజా భోస్లే 6–3, 6–2తో హావో చింగ్ చాన్ను ఓడించింది. రెండో మ్యాచ్ లో అంకిత రైనా 6–2, 4–6, 4–6తో ఎన్ షువో లియాంగ్ చేతిలో ఓటమి పాలైంది. నిర్ణాయక మూడో మ్యాచ్లో అంకిత–ప్రార్థన జోడీ 4–6, 6–1, 15–13తో హావో చింగ్ చాన్–ఎన్ షువో లియాంగ్ జంటపై గెలిచి భారత్కు విజయాన్ని అందించింది. టైబ్రేక్లో అంకిత జోడీ మూడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకోవడం విశేషం.
Related News by category
-
నేటి నుంచి పింఛన్ల పంపిణీ
పండుటాకులకు పింఛన్ కష్టాలు వెంటాడుతున్నాయి. చంద్రబాబు చేసిన నిర్వాకం అవ్వాతాతలకు శాపంగా మారింది. ఇదివరకు ఒకటో తేదీ వచ్చిందంటే వేకువజామునే వలంటీర్లు తలుపు తట్టి ఆప్యాయంగా పలకరించి పింఛన్ నగదును అందజేసేవారు. చంద్రబాబు కారణంగా పింఛన్ల పంపిణీ విధానంలో మార్పులు వచ్చాయి. గత నెల సచివాలయల్లో పింఛన్ల పంపిణీ చేయగా.. ఈ సారి బ్యాంకుల్లో జమ కానున్నాయి. ఆ డబ్బులు తీసుకోవడానికి బ్యాంకులకు వెళ్లక తప్పని పరిస్థితి వచ్చింది.కడప రూరల్: జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభం కానుంది. మొత్తం పింఛన్లు 2,67,492కు గాను అందులో 1,87,103 పింఛన్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు. అనారోగ్యం తదితర కారణాలతో బాధపడే 80,389 మందికి సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే పింఛన్ నగదును అందజేసేలా చర్యలు చేపట్టారు.సచివాలయాలకు వెళ్లడానికేఇబ్బందులు పడ్డారు..చంద్రబాబు మిత్ర బృందం వలంటీర్ వ్యవస్ధపై ఫిర్యాదులతో దాడి చేశారు. వారు పండుటాకులన్న జాలి కూడా చూపలేదు. దీంతో ఎన్నికల కమీషన్ విధుల నుంచి వలంటీర్లు దూరంగా ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రభావం సామాజిక పింఛన్ల పంపిణీపై పడింది. అంతకు ముందు వలంటీర్లు పొద్దు పొడవక ముందే అవ్వాతాతల ఇంటికి వెళ్లి ఆప్యాయంగా పలకరించే వారు..పింఛన్ నగదును అందజేసే వారు. చంద్రబాబు కారణంగా వలంటీర్లు విధులకు దూరంగా ఉండాల్సి వచ్చింది. దీంతో ఏప్రిల్ 1వ తేదీన జరిగిన పింఛన్ల పంపిణీలో అధిక శాతం మందికి సచివాలయాల్లోనే పింఛన్ల సొమ్మును అందజేశారు. భగభగ మండే ఎండల్లో పండుటాకులు సచివాలయాలకు వెళ్లలేక చాలా మంది అనారోగ్యానికి గురయ్యారు. కొందరు మృత్యువాత పడ్డారు. తాజాగా చేపట్టే పింఛన్ల పంపిణీలో అత్యధిక శాతం మందికి పింఛన్ నగదును బ్యాంకు ఖాతాలో జమ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంటే ఎక్కడో మారు మూల పల్లెలో ఉండే వృద్ధులు ఇతర కేటగిరీకి చెందిన వారు తమ గ్రామం నుంచి దాదాపు 10 కిలో మీటర్ల పైగా దూరంలో ఉండే బ్యాంకు వద్దకు వెళ్లి పింఛన్ నగదును తీసుకోవడం అటే అది ఎంత వరకు సాధ్యం అనే సందేహలు వ్యక్తం అవుతున్నాయి. పైగా ఎంత మంది దగ్గర ‘ఏటీఎం కార్డులు’ పే ఫోన్ సౌకర్యం ఉంటుందనేది ప్రశ్నార్ధకమే. కాగా వారు వ్యయ ప్రయాసాలకు ఓర్చి బ్యాంకులకు వెళ్లి పింఛన్ సొమ్మును తెచ్చుకోవాలంటే ఇబ్బందులు పడక తప్పదనే వాదన వినిపిస్తోంది. మొత్తం పింఛన్లు 2,67,492అందులో 1,87,103 పింఛన్లు బ్యాంకు ఖాతాలకు జమ80,389 పింఛన్లు ఇంటి వద్దనే పంపిణీఅవ్వాతాతలకు తప్పని తిప్పలుపంపిణీకి అన్ని చర్యలు చేపట్టాం...పింఛన్ల పంపిణీకి అన్ని చర్యలు చేపట్టాం. బ్యాంకుల ద్వారా కొంతమందికి, అనారోగ్యం తదితర కారణాలతో బాధపడే వారికి ఇంటి వద్దనే పింఛన్లను పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నాం.– ఆనంద్నాయక్, ప్రాజెక్ట్ డైరెక్టర్,జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్ధ -
Chekc 1234 off the field
Chekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the fieldChekc 1234 off the field -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 17 ఏళ్ల కెరీర్కు గుడ్ బై
పాకిస్తాన్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ బిస్మా మరూఫ్ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్కు బిస్మా మరూఫ్ రిటైర్మెంట్ ప్రకటించింది. తన నిర్ణయాన్ని మరూఫ్ సోషల్ మీడియా వేదికగా గురువారం వెల్లడించింది. "నేను చాలా ఇష్టపడే ఆట(క్రికెట్) నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను.నా 17 ఏళ్ల ప్రయాణం ఎన్నో సవాళ్లు, విజయాలు, మధురమైన జ్ఞాపకాలతో నిండి ఉంది. నా క్రికెట్ ప్రయాణంలో అరంగేట్రం నుంచి ఇప్పటి వరకు నాకు మద్దతుగా నిలిచిన అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.నాపై నమ్మకం ఉంచి, జట్టును నడిపించే బాధ్యతను తనకు అప్పగించినందుకు పీసీబీకి ప్రత్యేక ధన్యవాదాలు. చివరగా నా దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం చాలా సంతోషంగా ఉందని" బిస్మా పేర్కొన్నట్లు పీసీబీ ఒక ప్రకటన విడుదల చేసింది.కాగా 2006లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మరూఫ్ 17 ఏళ్ల పాటు పాకిస్తాన్ క్రికెట్కు తన సేవలు అందించింది. పాకిస్తాన్ మహిళ క్రికెట్ జట్టు తరపున వన్డేలు, టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటికి మరూఫ్ పేరునే ఉంది. ఆమె పాక్ తరపున 136 వన్డేల్లో 3369 పరుగులతో పాటు 44 వికెట్లు, 146 టీ20ల్లో 2893 పరుగులతో పాటు 36 వికెట్లు పడగొట్టింది.96 మ్యాచ్ల్లో పాక్ జట్టుకు కెప్టెన్గా మరూఫ్ వ్యవహరించింది. మరూఫ్ చివరగా స్వదేశంలో వెస్టిండీస్ మహిళలతో జరుగుతున్న వన్డే సిరీస్లో పాక్ జట్టు తరపున ఆడింది. విండీస్తో టీ20 సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో కూడా మరూఫ్ భాగమైంది. కానీ ఈ సిరీస్లో ఆడుతారా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. -
స్టోయినిష్ అరుదైన రికార్డు.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిష్ విరోచిత శతకంతో చెలరేగాడు. కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ వంటి వారు విఫలమైన చోట స్టోయినిష్ తన బ్యాట్కు పనిచెప్పాడు. 211 పరుగుల భారీ లక్ష్య చేధనలో సీఎస్కే బౌలర్లను స్టోయినిష్ ఓ ఆట ఆడుకున్నాడు. తన విధ్వంసకర సెంచరీతో లక్నో విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో 63 బంతులు ఎదుర్కొన్న స్టోయినిష్ 13 ఫోర్లు, 6 సిక్స్లతో 124 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా సీఎస్కే నిర్దేశించిన 211 పరుగుల లక్ష్యాన్ని లక్నో 19.3 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో సీఎస్కేపై లక్నో 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఇక సెంచరీతో మెరిసిన స్టోయినిష్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖిచుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే విజయవంతమైన రన్ ఛేజింగ్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా స్టోయినిష్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు పంజాబ్ కింగ్స్ మాజీ ఆటగాడు పాల్ వాల్తాటి పేరిట ఉండేది. 2011 ఐపీఎల్ సీజన్లో సీఎస్కేపై లక్ష్య చేధనలో వాల్తాటి 120 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. తాజా మ్యాచ్లో 124 పరుగులు చేసిన స్టోయినిష్.. వాల్తాటి ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. MARCUS STOINIS... THE HULK. 💪 - The winning celebrations from Stoinis and LSG says everything. 🔥pic.twitter.com/iGBHDNWDSU — Mufaddal Vohra (@mufaddal_vohra) April 23, 2024 -
స్టొయినిస్ విధ్వంసం
చెన్నై: నాలుగు రోజుల క్రితం లక్నో వేదికగా చెన్నై సూపర్కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ల మధ్య జరిగిన మ్యాచ్కు ఇప్పుడు చెన్నైలో రీప్లేగా జరిగిన పోరులో లక్నోనే మళ్లీ ‘సూపర్’గా ఆడి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో లక్నో 6 వికెట్ల తేడాతో చెన్నైపై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీస్కోరు చేసింది. ఓపెనర్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (60 బంతుల్లో 108 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్స్లు) అజేయ శతకాన్ని నమోదు చేశాడు. ‘హిట్టర్’ శివమ్ దూబే (27 బంతుల్లో 66; 3 ఫోర్లు, 7 సిక్స్లు) చెలరేగాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన లక్నో 19.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మార్కస్ స్టొయినిస్ (63 బంతుల్లో 124 నాటౌట్; 13 ఫోర్లు, 6 సిక్స్లు) అసాధారణ ఇన్నింగ్స్తో అజేయ సెంచరీ సాధించి లక్నోను విజయతీరాలకు చేర్చాడు. పూరన్తో నాలుగో వికెట్కు 70 పరుగులు, దీపక్ హుడాతో అబేధ్యమైన ఐదో వికెట్కు 55 పరుగులు జోడించిన స్టొయినిస్ లక్నోకు చిరస్మరణీయ విజయం అందించాడు. కెప్టెన్ ఇన్నింగ్స్... రహానే (1), వన్డౌన్లో మిచెల్ (11), జడేజా (16) చెన్నై టాప్–4 బ్యాటర్లలో ముగ్గురి స్కోరిది! పవర్ ప్లేలో చెన్నై చేసిన స్కోరు 49/2 తక్కువే! ఈ దశలో కెప్టెన్ రుతురాజ్ బౌండరీలతో పరుగుల వేగాన్ని అందుకున్నాడు. గైక్వాడ్ 28 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... జట్టు స్కోరు 11.3 ఓవర్లలో వందకు చేరింది. అదే ఓవర్లో జడేజా నిష్క్రమించడంతో వచ్చిన దూబే ఓ రకంగా శివతాండవమే చేశాడు. 15 ఓవర్లలో చెన్నై 135/3 స్కోరు చేసింది. కానీ ఆ తర్వాత దూబే పవర్ప్లే మొదలైంది. భారీ సిక్సర్లతో స్కోరు ఒక్కసారిగా దూసుకెళ్లింది. 16వ ఓవర్లో దూబే హ్యాట్రిక్ సిక్స్లతో 19 పరుగులు, 18వ ఓవర్లో గైక్వాడ్ 6, 4, 4లతో 16 పరుగులు, 19వ ఓవర్లో మళ్లీ దూబే దంచేయడంతో 17 పరుగులు, ఆఖరి ఓవర్లో 15 పరుగులతో స్కోరు 200 పైచిలుకు చేరింది. చివరి 5 ఓవర్లలో దూబే వికెట్ మాత్రమే కోల్పోయిన చెన్నై 75 పరుగులు సాధించింది. గైక్వాడ్ 56 బంతుల్లో శతకాన్ని, దూబే 22 బంతుల్లో అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నారు. బ్యాటింగ్ గేర్ మార్చి... కొండంత లక్ష్యం ముందున్న లక్నోకు ఆరంభంలో అన్ని ఎదురుదెబ్బలే తగిలాయి. ఓపెనర్లు డికాక్ (0), కేఎల్ రాహుల్ (14 బంతుల్లో 16; 1 ఫోర్, 1 సిక్స్), దేవదత్ పడిక్కల్ (19 బంతుల్లో 13) నిరాశపరిచారు. టాపార్డర్లో బ్యాటింగ్కు దిగిన స్టొయినిస్ ఒక్కడే గెలిపించేదాకా మెరిపించాడు. ఈ క్రమంలో 26 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. తర్వాత నికోలస్ పూరన్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్స్లు) జోరు పెంచగానే... పతిరణ మరుసటి ఓవర్లోనే పెవిలియన్ చేర్చాడు. స్టొయినిస్ 56 బంతుల్లో సెంచరీ పూర్తిచేసుకున్నాడు. దీపక్ హుడా కూడా (6 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) బ్యాట్కు పని చెప్పడంతో అనూహ్యంగా లక్నో లక్ష్యం వైపు పరుగు పెట్టింది. 18 బంతుల్లో 47 పరుగుల కష్టమైన సమీకరణం ఇద్దరి దూకుడుతో సులువైంది. 18, 19వ ఓవర్లలో 15 పరుగుల చొప్పున వచ్చాయి. 6 బంతుల్లో 17 పరుగుల్ని స్టొయినిస్ 6, 4, నోబాల్4, 4లతో ఇంకో మూడు బంతులు మిగిల్చి ముగించాడు. స్కోరు వివరాలు చెన్నై సూపర్కింగ్స్ ఇన్నింగ్స్: రహానే (సి) రాహుల్ (బి) హెన్రి 1; రుతురాజ్ (నాటౌట్) 108; మిచెల్ (సి) హుడా (బి) యశ్ 11; జడేజా (సి) రాహుల్ (బి) మోసిన్ 16; దూబే (రనౌట్) 66; ధోని (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 210. వికెట్ల పతనం: 1–4, 2–49, 3–101, 4–205. బౌలింగ్: హెన్రీ 4–0–28–1, మోసిన్ ఖాన్ 4–0–50–1, రవి బిష్ణోయ్ 2–0–19–0, యశ్ ఠాకూర్ 4–0–47–1, స్టొయినిస్ 4–0–49–0, కృనాల్ పాండ్యా 2–0–15–0. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: డికాక్ (బి) దీపక్ 0; రాహుల్ (సి) రుతురాజ్ (బి) ముస్తఫిజుర్ 16; స్టొయినిస్ (నాటౌట్) 124; పడిక్కల్ (బి) పతిరణ 13; పూరన్ (సి) శార్దుల్ (బి) పతిరణ 34; హుడా (నాటౌట్) 17; ఎక్స్ట్రాలు 9; మొత్తం (19.3 ఓవర్లలో 4 వికెట్లకు) 213. వికెట్ల పతనం: 1–0, 2–33, 3–88, 4–158. బౌలింగ్: దీపక్ చహర్ 2–0–11–1, తుషార్ 3–0–34–0, ముస్తఫిజుర్ 3.3–0–51–1, శార్దుల్ 3–0–42–0, మొయిన్ అలీ 2–0–21–0, జడేజా 2–0–16–0, పతిరణ 4–0–35–2. ఐపీఎల్లో నేడు ఢిల్లీ X గుజరాత్ వేదిక: న్యూఢిల్లీ రాత్రి7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం
Photos
View allVideo
View allBullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019