breaking news
Ad - Sakshi_Home_Sticky
-
రూ. 1 నల్లా కనెక్షన్లు పక్కదారి
నిజామాబాద్నాగారం: ప్రభుత్వం పేదల కోసం రూ.1కే నల్లా కనెక్షన్ పథకం అందిస్తుండగా, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పక్కదారి పడుతోంది. నగరంలోని వ్యాపార వాణిజ్య సంస్థల్లోనూ రూ.1 నల్లా కనెక్షన్లు ఇవ్వడంతో మున్సిపల్ ఆదాయానికి గండిపడుతోంది. అధికారులు అక్రమంగా నల్లా కనెక్షన్లు అందిస్తూ, తమ జేబులు నింపుకుంటున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఇది పరిస్థితి.. నగరంలో 60 డివిజన్లు ఉండగా అధికారికంగా మంచినీటి కుళాయి కనెక్షన్లు 25వేలు ఉన్నాయి. అనధికారికంగా మరో 20వేల కనెక్షన్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పేదలకు తెల్లరేషన్కార్డు ఉన్న వారికి 1 రూపాయికే నల్ల కనెక్షన్ ఇవ్వాలి. తెల్ల రేషన్కార్డు లేకుంటే రూ. 7వేల ఫీజు వసూలు చేయాలి. అలాగే కమర్షియల్ అయితే (వ్యాపార వాణిజ్య సంస్థలు) రూ. 50వేల నుంచి రూ. 1లక్షా 50వేలకు పైగా ఫీజుతో పాటు అదనపు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ కొంతమంది ఇంజనీరింగ్ సెక్షన్లో అధికారులు, సిబ్బంది కొన్నేళ్లుగా గృహాలకు ఇచ్చే అనుమతి కాస్త కమర్షియల్ వాటిని ఇస్తూ, తమ జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో నగరంలో అక్రమ కనెక్షన్లు పెరిగిపోతూనే ఉన్నాయి. అయినా పర్యవేక్షణ చేయాల్సిన పైస్థాయి అధికారులు ఎవరికి వారు తమకేమి పట్టన్నట్లు వ్యవహారిస్తున్నారు. మున్సిపల్ ఆదాయానికి గండి.. నగరంలో మరోరకం దందాకు కూడా మున్సిపల్ సిబ్బంది తెరతీశారు. నగరంలో సుమారుగా 3వేలకు పైగా వ్యాపార వాణిజ్య సంస్థలున్నాయి. హోటళ్లు, ఆస్పత్రులు, దుకాణాలు, కళాశాలలు ఇలాంటివన్ని కమర్షియల్ కిందకి వస్తాయి. అయితే వ్యాపార సంస్థలకు నీటి కనెక్షన్ అంటే హాఫ్ ఇంచ్కు రూ. 50వేలు, మూడో వంతు రూ. 90వేలు, ఒక్క ఇంచ్కు రూ. 1లక్ష 50వేల ఫీజు డిపాజిట్ చేయాలి. ఇంత డిపాజిట్ చేయకుండా ఇంటి కుళాశాయి పేరుతో కనెక్షన్ తీసుకొని దానిని కమర్షియల్గా వాడుకుంటున్నారు. దీంతో మున్సిపల్ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. అయినా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో కూడా పర్యవేక్షణ చేయని స్థితిలో ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో ఒక్కసారి పరిశీలన చేపడితే అక్రమ నీటి కుళాయిల లెక్క బయటకు రావడంతోపాటు మున్సిపల్కు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కార్పొరేషన్ రిపోర్ట్ నగరంలోని వ్యాపార, వాణిజ్య సంస్థల్లో యథేచ్ఛగా ఏర్పాటు పర్యవేక్షించని అధికారులు -
తెయూ లైబ్రరీలో కంప్యూటర్ సౌకర్యం కల్పించాలి
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ గ్రంథాలయంలో ఆన్లైన్ పరీక్షల సన్నద్ధత కోసం కంప్యూటర్ సౌకర్యం కల్పించాలని వర్సిటీ గిరిజన శక్తి విద్యార్థి సంఘం నాయకులు కోరారు. ఈమేరకు గురువారం వారు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. సమస్యలను తెయూ ఇన్చార్జీ వీసీ, రిజిస్ట్రార్ దృష్టికి తీ సుకెళ్తానని చైర్మన్ హామీ ఇచ్చారు. నాయకులు శ్రీ ను రాథోడ్, సాగర్ నాయక్, రాజు, కార్తీక్, శ్రీహరి, నవీన్, చందర్ రాథోడ్, లింగస్వామి పాల్గొన్నారు. మాజీ మేయర్ తేనీటి విందు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ మాజీ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం గురువారం తన ఇంట్లో కాంగ్రెస్ ముఖ్య నాయకులకు అల్పాహారం, తేనీటి విందు ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొమ్మ మహేష్కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి, రాష్ట్ర ఉర్ధూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, కేశ వేణు, బాడ్సి శేఖర్గౌడ్, గడుగు గంగాధర్, ముప్ప గంగారెడ్డి, నరాల రత్నాకర్, అంతిరెడ్డి రాజిరెడ్డి పాల్గొన్నారు. టీచర్లకు సౌకర్యాలు కల్పించాలి నిజామాబాద్అర్బన్: ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయుఎస్ ) నాయకులు కోరారు. ఈమేరకు వారు గురువారం కలెక్టరేట్ ఏవో ప్రశాంత్కు వినతిపత్రం అందజేశారు. సంఘ ప్రతినిధులు పరళి కృష్ణ్ణవేణి, బట్టు బద్రీనాథ్, సల్లూరు కిషన్, లోకిని గంగాధర్ లున్నారు. -
కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి
నిజామాబాద్ రూరల్: ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తెలిపారు. కంఠేశ్వర్ బైపాస్ వద్ద గల ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయంలో గురువారం రూరల్ మండల ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పార్టీ కార్యకర్తలు అనుసరించాల్సిన వ్యూహం గురించి ఎమ్మెల్యే వివరించారు. నియోజక వర్గంలో ప్రతి బూత్కు ఐదుగురి సభ్యులను ఎంపిక చేసి 20 బూత్లపై మళ్లీ ఐదుగురిని పర్యవేక్షణ చేసేవిధంగా రూపకల్పన చేసినట్లు వివరించా రు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలువబోతుందని ధీ మా వ్యక్తం చేశారు. కిసాన్ కేత్ జిల్లా అధ్యక్ష్యుడు ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలికేట్ చంద్రశేఖర్గౌడ్, నాయకులు గడీల రాములు, భాస్కర్రెడ్డి, కంచెట్టి గంగాధర్, సాయారెడ్డి, అగ్గు బోజన్న, కుమార్రెడ్డి, ఎల్లయ్య, సాయారెడ్డి, అమృతాపూర్ గంగాధర్, నవీన్ గౌడ్, చిన్నరెడ్డి, బాల్రాజ్, రవి పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని సారంగాపూర్ గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ప్రచారం నిర్వహించారు. పార్టీ అభ్యర్ధి జీవన్రెడ్డిని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. నాయకులు నగేష్, జిలాని, శ్రీనివాస్, జుబేర్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు ఆగస్టు 15లోపే రుణమాఫీ
ఖలీల్వాడి: రైతులకు ఆగష్టు 15 లోపే రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని విజయ్ కిసాన్ మున్నూరుకాపు సంఘ భవనంలో గురువారం ఆయన మున్నురుకాపు సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ.. 2004లో ఉన్న మద్దతు ధర రూ.450 నుంచి 2014 వరకు రూ. 1350కి మూడు రేట్లు పెంచామన్నారు. బీజేపీ పదేళ్ల పాలన కాలంలో రూ.1350 నుంచి రూ. 2200 మాత్రమే కనీసం రెట్టింపు కూడా చేయలేదన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన మోదీ, ఎరువుల ధరలు పెంచి పెట్టుబడి రెట్టింపు చేశారన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో రైతులపై తీవ్ర భారం పడుతుందన్నారు. ఎంపీగా కవిత గెలిచిన తర్వాత ప్రైవేట్ రంగంలో నడుస్తున్న చక్కర కర్మాగాలను పూర్తిగా మూసివేశారన్నారు. ప్రతి ఒక్కరూ తనకు మద్దతు తెలిపి ఎంపీగా గెలిపించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీలు ఐక్యంగా ఉండాలని, బీజేపీ అధికారంలోకి వస్తే బీసీల రిజర్వేషన్లు తొలగించే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. మోదీ నల్ల చట్టాలు తీసుకువచ్చి రైతులను ఇబ్బందులకు గురి చేశారని, ఐక్యంగా రైతులందరూ పోరాటం చేస్తే వెనక్కి తగ్గారని గుర్తు చేశారు. డీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర కోఆపరేటివ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేణు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. క్వింటాల్కు రూ.500 బోనస్ అందిస్తాం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి -
సంక్షిప్తం
గుడితండాలో వైద్యశిబిరం మోపాల్: మండలంలోని గుడి తండాలో గురువారం ముదక్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సహకారంతో సూర్య ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యులు రోగులను పరీక్షించి, మందులు పంపిణీ చేశారు. వైద్యులు అలేఖ్య, సంతోష్ కుమార్, నజీమ్ అహ్మద్ ఖాన్, శ్రీకాంత్, ఆరోగ్య సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక సిరికొండ: మండల కేంద్రంలో గురువారం మండల దివ్యాంగుల యూనియన్ను ఏర్పాటు చేశారు. నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రొండ్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా రాజశ్రీ, కార్యదర్శిగా లింగం, సహయ కా ర్యదర్శిగా విజయ్, కోశాధికారిగా బోయిడి మంజుల ఎన్నికయ్యారు. సభ్యులు పోతన్న, అరుణజ్యోతి, సఫియబేగం, అంబర్లాల్,ఆంజనేయులు,ప్రశాంత్,అమర్నాథ్ ఉన్నారు. చలివేంద్రం ప్రారంభం నిజామాబాద్నాగారం: నగరంలోని రెడ్క్రాస్ సొసైటీ ఆవరణలో గురువారం చలివేంద్రాన్ని రెడ్క్రాస్ చైర్మన్ బుస్సా ఆంజనేయులు ప్రారంభించారు. సభ్యులు తోట రాజశేఖర్, కరిపే రవీందర్, అరుణ్బాబు, సూర్య నారాయణ, వెంకట కృష్ణ, సోలొమన్, శ్రీనివాస్రావు, హన్మంతురావు, రామకృష్ణ పాల్గొన్నారు ఘనంగా కళాశాల వార్షికోత్సవం నిజామాబాద్అర్బన్: నగరంలోని న్యూ అంబేడ్కర్ భవన్లో గురువారం వాగ్దేవి క ళాశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. కరస్పాండెంట్ సుజన్రెడ్డి, ప్రిన్సిపాల్ వెంకట్రెడ్డి విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. అనంతరం విద్యార్థులు ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. సిబ్బంది వేణుగోపాల్, రవీందర్, దత్తు పాల్గొన్నారు. 12న ప్రతిభ పురస్కారాల ప్రదానం నిజామాబాద్నాగారం: ఇటీవల వెలువడిన ఎస్సెస్సీ, ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన గంగపుత్ర (గూండ్ల/ బెస్త) విద్యార్థులకు ఈనెల 12న ప్రతిభ పురస్కారాలు అందజేయనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు నీలిరాంచందర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్సెస్సీలో 9 జీపీఏ పైన వచ్చినవారు, ఇంటర్లో 900 మార్కులపైగా సాధించిన విద్యార్థులు అర్హులన్నారు. ఆసక్తిగల వారు 94905 11114ను సంప్రదించాలని లేదా డా నీలి రామచందర్, కవిత పిల్లల ఆస్పత్రిలో ఈనెల 9లోపు దరఖాస్తులు అందజేయాలన్నారు. నూతన వేతన ఒప్పందం చేయాలి ఖలీల్వాడి: బీడీ కార్మికులందరికీ పెరిగిన ధరలకు అనుగుణంగా నూతన వేతన ఒప్పందం చేసి, అమలు చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు గురువారం బీడీ కంపెనీ యజమానుల సంఘం అధ్యక్షుడు హెచ్పీ ప్రకాష్ ఉపాధ్యాయ, ప్రధాన కార్యదర్శి ధర్మేందర్ గాంధీలకు వినతిపత్రం అందించారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ, నరేందర్, రాజన్న, రాజేశ్వర్, వెంకన్న, రాంప్రసాద్ పాల్గొన్నారు.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019