breaking news
Ad - Sakshi_Home_Sticky
-
దక్కని ప్రాతినిధ్యం
జిల్లా నుంచి ఒక్కరూ పార్లమెంట్లో అడుగుపెట్టని వైనం ● ఖమ్మం స్థానానికి 17సార్లు ఎన్నికలు జరిగినా రాని అవకాశం ● భద్రాచలం, మహబూబాబాద్లోనూ మొండిచేయేభద్రాచలంలోనూ.. భద్రాచలం పార్లమెంటు స్థానాన్ని ఎస్టీలకు రిజర్వ్ చేస్తూ తొలిసారిగా 1967లో ఎన్నికలు నిర్వహించారు. చివరిసారిగా ఈ స్థానానికి 2004లో ఎన్నికలు జరిగాయి. భద్రాచలం పార్లమెంట్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, బూర్గంపాడులతో పాటు విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో విస్తరించి ఉండేది. దీంతో ఇక్కడి నుంచి ప్రధాన పార్టీల తరఫున పోటీ చేసే అవకాశం ఎక్కువగా ఆంధ్రా నేతలకే దక్కింది. కొద్దిమంది ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలకు పోటీ చేసి చట్టసభలో అడుగు పెట్టే అవకాశం వచ్చినా, ప్రస్తుతం ఆ ప్రాంతాలు రాష్ట్ర విభజన తర్వాత ఏపీ పరిధిలోకి వెళ్లాయి. ఈ స్థానానికి 11 సార్లు ఎన్నికలు జరగగా ఐదుగురు పార్లమెంటుకు వెళ్లారు. వీరిలో అత్యధికంగా నాలుగుసార్లు ఎన్నికై న రాధాబాయి ఆనందరావు స్వస్థలం ఖమ్మం కాగా విద్యాభ్యాసం రాజమండ్రిలో జరిగింది. మిగిలిన వారిలో సోడే రామయ్య కొండ్రాజుపేట(వీఆర్ పురం), కర్రెద్దుల కమలకుమారి లక్కవరం (చింతూరు మండలం), దుంపా మేరి విజయకుమారి విశాఖపట్నం, మిడియం బాబూరావు రాజమండ్రి ప్రాంతాలకు చెందినవారు. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం : దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు దాటాయి. పార్లమెంటుకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం 18వ పార్లమెంట్కు ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటివరకు ఏజెన్సీ ప్రాంతం విస్తరించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేతలకు దిగువసభలో అడుగు పెట్టే అవకాశం రాలేదు. ఖమ్మం నుంచి.. జిల్లా పరిధిలోని ఇల్లెందు, పినపాక, భద్రాచలం అసెంబ్లీ స్థానాలు మహబూబాబాద్ (ఎస్టీ) పార్లమెంటు పరిధిలో, కొత్తగూడెం, అశ్వారావుపేట ఖమ్మం (జనరల్) పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. ఖమ్మం పార్లమెంటు స్థానానికి 17సార్లు ఎన్నికలు జరగ్గా తొమ్మిది మంది ఎంపీలుగా పార్లమెంటుకు వెళ్లారు. 1952, 1957లలో జరిగిన తొలి, మలి ఎన్నికల్లో టీబీ విఠల్రావు కమ్యూనిస్టు పార్టీల తరఫున గెలిచారు. ఆయన స్వస్థలం ప్రస్తుతం మహారాష్ట్ర పరిధిలో ఉండగా, గతంలో అవిభాజ్య హైదరాబాద్ రాష్ట్రంలో ఉండేది. ఆ తర్వాత వరుసగా జలగం కొండలరావు, జలగం వెంగళరావు, పీవీ రంగయ్య నాయుడు, తమ్మినేని వీరభద్రం, నాదెండ్ల భాస్కరరావు, రేణుకా చౌదరి, నామా నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం ఎంపీలుగా గెలుపొందారు. వీరిలో పీవీ రంగయ్యనాయుడు, రేణుకా చౌదరి, నాదెండ్ల భాస్కరరావుల జన్మస్థలాలు ఏపీలో ఉండగా మిగిలినవారు ప్రస్తుత ఖమ్మం జిల్లాకు చెందిన వారుగా ఉన్నారు. మొత్తం తొమ్మిది మందిలో ఒక్కరూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూలాలు ఉన్న వారు లేరు. మహబూబాబాద్లో కూడా నో చాన్స్.. భద్రాచలం పార్లమెంటు నియోజకవర్గం 2008లో రద్దుకాగా ఆ స్థానంలో మహబూబాబాద్ కొత్తగా ఏర్పడింది. ఇప్పటివరకు మూడుసార్లు ఎన్నికలు జరగగా, తొలి, మలి ఎన్నికల్లో ములుగు జిల్లాకు చెందిన పోరిక బలరాంనాయక్, అజ్మీర సీతారాంనాయక్ గెలిచారు. మూడో ఎన్నికల్లో మహబూబాబాద్ జిల్లా మూలాలు ఉన్న మాలోత్ కవిత విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఈ ముగ్గురే మూడు ప్రధాన పార్టీల తరఫున పోటీ పడుతున్నారు. దీంతో మరోసారి ఈ స్థానం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నేతలకు నిరాశే ఎదురైంది. ఒక్కసారి కూడా.. ఖమ్మం, భద్రాచలం, మహబూబాబాద్ స్థానాల నుంచి భద్రాద్రి జిల్లాకు చెందిన వారికి ప్రధాన పార్టీల తరఫున పోటీ చేసే అవకాశం దక్కలేదు. గతంలో ప్రజారాజ్యం, వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులను విజయం వరించలేదు. అయితే, ఈసారి మాత్రం ఖమ్మం నుంచి పోటీలో ఇద్దరు భద్రాద్రి జిల్లా వాసులు ఉన్నారు. జిల్లాలోని ములకలపల్లి మండలానికి చెందిన బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు, కొత్తగూడేనికి చెందిన బీఎస్పీ అభ్యర్థి యెర్రా కామేష్ పోటీలో ఉన్నారు. -
కమనీయం.. కల్యాణం
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో గురువారం స్వామివారి నిత్యకల్యాణం కమనీయంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు నిర్వహించారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలుదీతీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. కనకదుర్గమ్మకు పుష్పార్చనపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం ఘనంగా సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. మండల పరిధిలోని కేశవాపురం, జగన్నాధపురం గ్రామాల మధ్య కొలువైఉన్న శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో అర్చకులు అమ్మవారికి 108 పుష్పాలతో అర్చన గావించారు. హారతి, మంత్రపుష్పం, నివేదన పూజలు జరిపారు. పూజా కార్యక్రమంలో ఈఓ జి.సుదర్శన్, వేదపడింతులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్శర్మ పాల్గొన్నారు ముగిసిన ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలుకొత్తగూడెంఅర్బన్: గత నెల 25 నుంచి ప్రారంభమైన ఓపెన్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారంతో ముగిశాయి. జిల్లాలో పదో తరగతి అభ్యర్థులకు మూడు సెంటర్లు, ఇంటర్ అభ్యర్థులకు నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఓపెన్ ఇంటర్మీడియట్ జనరల్, ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరుగుతాయని డీఈఓ వెంకటేశ్వరాచారి తెలిపారు. చుంచుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 12న ఆత్మారాముడి కల్యాణందుమ్ముగూడెం : మండలంలోని దుమ్ముగూడెం గ్రామంలో కొలువై ఉన్న ఆత్మారామచంద్రస్వామి కల్యాణం ఈ నెల 12న నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ తెలిపింది. కమిటీ బాధ్యులు గురువారం కరపత్రాలు విడుదల చేశారు. పవిత్ర గోదావరి నదీ తీరాన వేంచేసిఉన్న స్వామివారి కల్యాణం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ గోర్స అశోక్, గ్రామస్తులు దల్లి అప్పలరెడ్డి, కెల్లా శేఖర్, చిట్టిబాబు, ఆలయ అర్చకుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ కోర్సుల సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్లో మార్పులు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి డిగ్రీ కళాశాలల్లో సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ను గతంలో విడుదల చేయగా.. ఇందులో మార్పులు చేశారు. ఈ మేరకు కొత్త టైంటేబుల్ను కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఎస్.నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ తిరుమలాదేవి గురువారం విడుదల చేశారు.రెండో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 6, 8, 10, 16, 18, 21, 25, 29వ తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తారు. నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 7, 9, 15, 17, 20, 22, 28, 30వ తేదీల్లో ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 గంటవరకు జరగనున్నాయి. అలాగే, ఆరో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 6, 8, 10, 16, 18, 21, 25, 29, 31, జూన్ 7, 11, 12, 13వ తేదీల్లో ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. పారదర్శకంగా హోం ఓటింగ్ ప్రక్రియమణుగూరు రూరల్: హోమ్ ఓటింగ్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ సూచించారు. గురువారం మణుగూరు తహసీల్దార్ కార్యాలయంలో హోమ్ ఓటింగ్పై పీఓ, ఏపీఓలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 85 సంవత్సరాలపై బడిన వృద్ధులు, దివ్యాంగులతో ఓటింగ్ పూర్తి చేయించాలని, మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ చేయాలని సూచించారు. అధికారులు రాఘవరెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
‘విద్యుత్’ పోస్టర్ల ఆవిష్కరణ
సూపర్బజార్(కొత్తగూడెం): విద్యుత్ భద్రతా వారోత్సవాల పోస్టర్లను గురువారం సర్కిల్ కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం లక్ష్మీదేవిపల్లి సబ్డివిజన్ ఓఅండ్ఎం, సర్కిల్ సిబ్బందికి విద్యుత్ ప్రమాదాలు–నివారణపై నిర్వహించిన అవగాహన సదస్సులో విద్యుత్ ఎస్ఈ కె.రమేష్ మాట్లాడుతూ భద్రతా సూత్రాలను పాటిస్తూ ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సిబ్బందికి రక్షణ పరికరాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఆఫీసర్ ఇ.మురళి, నందయ్య, బి.వెంకటరత్నం, కె.వేణు, ఎండీ యాసిన్, పి.ప్రభాకర్, ఎ.రఘురామయ్య, పి.బుజ్జికన్నయ్య, హెచ్.దేవా, ఎస్కే రజియాబేగం, కె.పావని, కె.హరిత పాల్గొన్నారు. -
తొలి రోజు ముగ్గురు
నల్లగొండ: వరంగల్– ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలిరోజైన గురువారం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బండారు నాగరాజు, ప్రజావాణి పార్టీ తరఫున పాటి శ్రీకాంత్రెడ్డి, తెలంగాణ సకల జనుల పార్టీ నుంచి నందిపాటి జానయ్య ఒక్కో సెట్ నామినేషన్ వేశారు. మొత్తం ముగ్గురు అభ్యర్థులు మూడు సెట్ల నామినేషన్లు సమర్పించారని నల్లగొండ కలెక్టర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరిచందన తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్లు ప్రారంభం -
ఆ ఐదింటి సంగతేంటి?
● లోక్సభ ఎన్నికల వేళ మళ్లీ తెరపైకి విలీన పంచాయతీలు ● అదే హామీ ఇస్తున్న ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ● పదేళ్లుగా పట్టించుకోలేదని భద్రాచలంవాసుల ఆవేదన భద్రాచలం: లోక్సభ ఎన్నికల వేళ విలీన ఐదు పంచాయతీల విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. ఆ ఊళ్లను తిరిగి తెలంగాణలో కలిపేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ప్రధాన పార్టీల అభ్యర్థులు తాజా ప్రచారంలో పేర్కొంటుండగా, గత ఎన్నికల్లో కూడా ఇదే హామీఇచ్చారని, ప్రతీసారి ఎన్నికల ప్రచా ర అస్త్రంగా మాత్రమే వాడుకుంటున్నారనే తప్ప అభివృద్ధి కుంటుపడుతున్నా పట్టించుకోవడంలేదనే భా వన భద్రాచలం ప్రాంతవాసుల్లో వ్యక్తమవుతోంది. పలుమార్లు ఆందోళన చేపట్టినా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో తొలుత భద్రాచలం డివిజన్లోని కూనవరం, వీఆర్పురం, చింతూరు, కుక్కునూరు వేలేరుపాడు మండలాలను పూర్తిగా, భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో కొన్ని గ్రామాలను ఏపీలో కలుపుతున్నట్లు గెజిట్ విడుదల చేశారు. అనంతరం స్వల్ప కాలంలోనే భద్రాచలం మండలంలోని పిచుకులపాడు, కన్నాయిగూడెం, గుండాల, పురుషోత్తపట్నం, యటపాక గ్రామపంచాయతీలను సైతం ఏపీలో విలీనం చేస్తున్నట్లు మరో గెజిట్ విడుదల చేశారు. దీంతో భద్రాచలం పట్టణం మినహా ఇతర ప్రాంతాలన్నీ ఏపీలో కలిసిపోయాయి. ఆ ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని అక్కడి ప్రజలతోపాటు భద్రాచలం ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఐదు గ్రామపంచాయతీల ప్రజలు తీర్మానాలు కూడా చేశారు. పలుమార్లు ఆందోళనలు చేపట్టారు. భద్రాచలం పర్యటనకు వచ్చిన నాటి గవర్నర్ తమిళి సైను కలిసి వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారానికి నోచుకోవడంలేదు. ప్రతీసారి ఎన్నికల హామీగా.. విలీన ఐదు గ్రామపంచాయతీల ప్రజల ఓటర్లు ఏపీలోని పాడేరు నియోజకవర్గ పరిధిలోకి వస్తారు. భద్రాచలాన్ని ఆనుకుని అధిక భూభాగం ఉండటంతో పాటు, రామాల య భూములు ఆ గ్రామపంచాయతీల పరిధిలోనే ఉన్నాయి. భద్రాచలం అభివృద్ధి వాటిపైనే ఆధారపడి ఉంది. విలీన వ్యవహారం ఇరు రాష్ట్రాలతోపాటు కేంద్రం కూడా చొరవ చూపాల్సి రావడం, భద్రాచలంలోని అత్యధిక ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు లోక్సభ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు ఇదే కీలక హామీగా మారుతోంది. 2014, 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు పంచాయతీల విలీనానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తాజాగా 2024 ఎన్నికల ప్రచారంలోనూ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు అదే హామీ ఇస్తున్నాయి. గడిచిన పదేళ్లలో అధికార, ప్రతిపక్షాలు తమ సమస్యను పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు పంచాయతీలు తిరిగి తెలంగాణలో ఎందుకు కలపాలంటే.. ● పేరుకు ఆంధ్రప్రదేశ్లో కలిపినా కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల, ఎటపాకలు భౌగోళికంగా ఇప్పటికీ భద్రాచలంలో అంతర్భాగంగా ఉన్నాయి. ● భద్రాచలాన్ని ఆనుకొని ఉన్న పురుషోత్తపట్నం, ఎటపాక, గుండాలలో ఖాళీ భూములు అనేకం ఉన్నాయి. భద్రాచలం విస్తరణకు ఈ భూములు తప్పనిసరి. ● భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన భూములు సుమారు 900 ఎకరాలు పురుషోత్తపట్నంలోనే ఉన్నాయి. దీనివల్ల ఆలయ అభివృద్ధి పనులు ముందకు సాగటం లేదు. ● తెలంగాణలోని భద్రాచలం నుంచి దుమ్ముగూడెం వెళ్లి రావాలంటే ఏపీకి చెందిన ఎటపాక, పిచుకలపాడు, కన్నాయిగూడెం మీదుగా వెళ్లి రావాలి. ● గోదావరి వరదల సమయంలో సహాయక చర్యలు సకాలంలో చేపట్టలేకపోతున్నారు.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019