breaking news
-
శిశు హత్య కేసులో తల్లి, అవ్వ అరెస్టు
తిరువొత్తియూరు: ఓ శిశువును హత్య చేసిన తల్లితోపాటు అవ్వను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. అరియలూరు జిల్లా మీన్సురుటి సమీపం మేల్సంబోడైకి చెందిన బిల్డర్ చిత్తిరై చోళన్, పరిమళ (48) దంపతులకు ఐదుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు మంజుల (18) పెళ్లి కాకుండానే గర్భం దాల్చింది. అదే గ్రామానికి చెందిన అన్బుదురై (21)తో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో గర్భం దాల్చినట్లు తెలిసింది. దీనిపై మంజుల తల్లి పరిమళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జయంకొండం మహిళా పోలీసులు పోక్సో చట్టం కింద అన్బుదురైని అరెస్టు చేశారు. ఈ క్రమంలో మంజుల మార్చి 29న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ కారణంగా జైలులో ఉన్న అన్బుదురై తరఫున, డీఎన్ఏ పరీక్ష కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో జయంకొండం మహిళా పోలీస్స్టేషనన్ పోలీసులు తల్లీబిడ్డతో డీఎన్ఏ పరీక్ష నిమిత్తం రావాలని కోరారు. ఈ క్రమంలో 30వ తేదీ అర్ధరాత్రి బిడ్డ అపహరణకు గురైందని మంజుల మీన్సురుట్టి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందులో అన్బుదురై బిడ్డను అపహరించినట్లు పేర్కొంది. ప్రత్యేక పోలీసులు మంజులను ప్రశ్నించారు. అందులో డీఎన్ఏ పరీక్షకు భయపడి 30 రోజుల పసికందును హతమార్చి ఇంటి ముందు ఉన్న పెరియమడయన్ చెరువు గట్టు వద్ద పాతిపెట్టినట్టు మంజుల పోలీసుల విచారణలో అంగీకరించింది. దీంతో పోలీసులు బుధవారం సాయంత్రం పసికందు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు చిన్నారి తల్లి మంజుల, అవ్వ పరిమళను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి తిరుచ్చి సెంట్రల్ జైలుకు తరలించారు. మంజుల పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తాను తప్పు చేశానని, దీంతో మానసిక క్షోభకు గురై బిడ్డను చంపి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపింది. తాను పిల్లవాడిని చంపి పాతిపెట్టి, అదృశ్యమైనట్లు నాటకం ఆడినట్టు పేర్కొంది. -
బ్లాక్ మెయిల్ ముఠా అరెస్టు
తిరువొత్తియూరు: అసభ్యకర వీడియోలు తీసి, వాటిని సంబంధిత వ్యక్తులకు చూపి, బ్లాక్ మెయిల్ చేసి నగదు దోచుకుంటున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. సేలం ప్రాంతానికి చెందిన నిత్యానందం (47) అనే వ్యక్తికి సామా జిక మాద్యమం ద్వారా నైల్లెకి చెందిన భానుమతి పరిచయమయ్యారు. చాటింగ్ మూలంగా పరిచయమైన నిత్యానందాన్ని, భానుమతి నైల్లెకి రప్పించారు. భానుమతి ఇంట్లో ఇద్దరు ఉల్లాసంగా ఉంటున్న స మయంలో హఠాత్తుగా పక్క గదిలో దాగి ఉన్న నలుగురు ముఠా వారి గదిలోకి చొరబడి నిత్యానందాన్ని బెదిరించి నగ్నంగా అతని ఫొటోలు తీసుకున్నారు. అతని వద్ద నుంచి మూడున్నర సవర్ల నగలు, నగదును అపహరించారు. దీనిపై నిత్యానందం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి భానుమతి ఆమె సహచరులు రంజిత్ (42), సుడలై (40), వెల్లదురై (42), పార్థసారథి (46) అనే వ్యక్తులను అరెస్టు చేశారు. విచారణలో దిగ్భ్రాంతి కలిగించే సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. భానుమతి నేతృత్వంలో ఈ ముఠా, నెలకు ఇద్దరు పారిశ్రామికవేత్తలను లక్ష్యంగా చేసుకుని వారితో చాటింగ్ చేసి, ఆశ చూపి నైల్లెకి రప్పించుకుని తర్వాత అసభ్యకరంగా ఫొటోలు తీసి, బ్లాక్ మెయిల్ చేసి వారి వద్ద నుంచి నగదు దోచుకుంటున్నారు. తర్వాత ఐదుగురు ఈ నగదును సమానంగా పంచుకుంటున్నారు. ఆ నగదుతో సుడలై, పార్థసారథి, రంజిత్ అనే ముగ్గురు గోవా, బెంగళూరు ప్రాంతాలకు విమానంలో వెళ్లా రు. అరెస్టయిన రంజిత్ పోలీసులతో మాట్లాడుతూ గోవాకు వెళ్లి చైన్నె, హైదరాబాదు తదితర ప్రాంతాల చెందిన సినీ నటీమణులను రప్పించి, వారితో ఉల్లాసంగా ఉంటామని తెలిపారు. తమతో ఉల్లాసంగా గడపడానికి వచ్చే వారికి ముందుగా ఆన్లైన్ ద్వారా సగం నగదు చెల్లిస్తామని చెప్పాడు. ఇదిలా ఉండగా చైన్నెకి చెందిన పారిశ్రామికవేత్త ఇలాగే రప్పించి అతని వద్ద నుంచి నగదు అపహరించడానికి పథకం వేసినట్లు తెలిసింది. కానీ పోలీసులు ఈ ముఠాను పట్టుకోవడంతో చైన్నెకి చెందిన పారిశ్రామిక వేత్త వీరి బారి నుంచి తప్పించుకున్నాడు. ఈ ముఠాకు నాయకురాలిగా ఉంటున్న భానుమతి, నాయకుడు వెళ్లదురై పారిశ్రామిక వేత్తల నుంచి దోచుకుంటున్న నగదును వడ్డీకి ఇస్తున్నట్లు, తద్వారా అధిక నగదు సంపాదిస్తున్నట్లు విచారణలో తేలింది. దీంతో పోలీసులు ఎన్జీవో కాలనీలో ఉన్న భానుమతి ఇంట్లో తనిఖీలు చేయగా పారిశ్రామికవేత్తల నుంచి తీసుకున్న 50కి పైన చెక్కులు ఉండగా గుర్తించి, స్వాధీ నం చేసుకున్నారు. -
వర్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు
సేలం: వర్షం కురవాలని సేలంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కొన్ని రోజులుగా తమిళనాడులో వేడి పెరుగుతోంది. గరిష్ఠంగా 111 డిగ్రీల ఫారెన్హీట్ నమోదవుతోంది. దీంతో తమిళనాడులోని నీటి వనరులన్నీ ఎండిపోతున్నాయి. ఈ పరిస్థితిలో వర్షం కురిసి, చల్లని వాతావరణం నెలకొనాలని తమిళనాడు తౌహీ త్ జమాత్ పార్టీ తరఫున ముస్లింలు సేలం కోట ప్రాంతంలోని బహిరంగ ప్రదేశంలో వర్షం కో సం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జిల్లా అధ్యక్షుడు సిద్ధిక్ నేతృత్వంలో జరిగిన ఈ ప్రార్థనలో వంద మందికి పైగా ముస్లింలు పాల్గొన్నారు. -
కీళపూడి రోడ్డులో అండర్ బ్రిడ్జి నిర్మించాలి
పళ్లిపట్టు: కీళపూడి రోడ్డులో గ్రామీణుల రాకపోకల కోసం అండర్ బ్రిడ్జి నిర్మించాలని ఐదు గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు. తిరువళ్లూరు జిల్లా త చ్చూరు నుంచి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు వరకు ఆరులేన్ల హైవే రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం పళ్లిపట్టు సమీపంలోని కీళపూడి వద్ద గ్రామీణ రోడ్డుకు మధ్యలో హైవే పనులు జరుగుతున్నందున కీళపూడి నుంచి సొరకాయపేట, నెడియం, పొదటూరుపేట సహా ఐదు గ్రా మాలకు రాకపోకలకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితులున్నందున రోడ్డుకు మధ్యలో హైవేశాఖ అధికారులు కీళపూడి – సొరకాయపేట రోడ్డులో అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మించాలని మూడు నెలల కిందట జాతీయ రహదారుల శాఖ కమిషన్కు లేఖ పంపారు. అయితే చర్యలు తీసుకోకపోవడంతో గురువారం ఐదు గ్రామాల ప్రజలు హైవేపై నిరసన తెలపాలని నిర్ణయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు గురువారం ఉదయం గ్రామానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. వారంలో జిల్లా కలెక్టర్తో చర్చలు జరిపి గ్రామీణుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. -
క్యాబ్ డ్రైవర్ల సంక్షేమమే లక్ష్యంగా నమ్మయాత్రి సేవలు
కొరుక్కుపేట: క్యాబ్ డ్రైవర్ల సంక్షేమమే ధ్యేయంగా ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ఓఎన్డీసీ) సీఈఓ టి కోషి తెలిపారు. ఇప్పటికే నమ్మయాత్రి అనే యాప్ బెంగళూరులో విజయంతంగా నడుస్తు న్న నేపథ్యంలో అదే స్ఫూర్తితో చైన్నెలోను నమ్మయాత్రి సేవలను తీసుకువచ్చారు. గురువారం చైన్నె లోని కామరాజర్ అరంగం వేదికగా జరిగిన కార్యక్రమంలో చైన్నెలోని డ్రైవర్ల సమక్షంలో నమ్మయాత్రి క్యాబ్ సేవలను జెండా ఊపి, ప్రారంభించారు. ఈసందర్భంగా కోషి మాట్లాడుతూ చైన్నెలో తొలిసారిగా జీరో కమీషన్ ఆథారిత యాప్ను ప్రవేశపెట్టామన్నారు. ఇది విజయవంతం అవుతుందని అశాభా వం వ్యక్తం చేశారు. ఈ యాప్ ద్వారా డ్రైవర్తోపాటు ప్రయాణికులకు కూడా మేలు జరుగుతుందన్నారు. జీరో కమీషన్ రైడ్లను అందించడానికి చైన్నె క్యాబ్, ట్యాక్సీ యూనియన్లు నమ్మయాత్రితో చేతులు కలపడం చాలా సంతోషంగా ఉందని, ఇప్పటికే 15 వేల మంది క్యాబ్ డ్రైవర్లు ఆన్బోర్డులో ఉన్నారని చెప్పారు. రానున్న మూడు నెలల్లో 50 వేల మంది లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. నమ్మయాత్రి ప్రారంభోత్సవం సందర్భంగా డ్రైవర్లకు సంక్షేమ పథకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జనరల్ సెక్రటరీ వి.కుప్పుస్వామి, ఉరిమై కురల్ డ్రైవర్స్ అసోసియేషన్ జహీర్ హుస్సేన్, జనరల్ సెక్రటరీ వెట్రివేల్, ఆల్ డ్రైవర్స్ యూనియన రైట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ముస్తఫా, సింగారం డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఢిల్లీబాబు తదితరులు పాల్గొన్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019