breaking news
Ad - Sakshi_Home_Sticky
-
బోండా ఉమా పని అయిపొయింది..వెల్లంపల్లి స్ట్రాంగ్ వార్నింగ్
-
దాడులు చేస్తే తీవ్రంగా స్పందిస్తాం: ఇజ్రాయెల్కు ఇరాన్ వార్నింగ్
టెహ్రాన్: ఇరాన్,ఇజ్రాయెల్ మధ్య రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్ తమ దేశంపై ఎలాంటి దాడికి దిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించింది. ప్రతి చర్యలకు తమ ఎయిర్ఫోర్స్ సిద్ధంగా ఉందని తెలిపింది. ఇరాన్పై ఎలాంటి దాడులు చేయాలన్న దానిపై చర్చించేందుకు ఇజ్రాయెల్ వార్ క్యాబినెట్ బుధవారం(ఏప్రిల్17)న భేటీ కానుంది. ఈ నేపథ్యంలో దాడులను ఎదుర్కొనడానికి తాము సిద్ధమని ఇరాన్ ప్రకటించడం గమనార్హం. ‘ ఇజ్రాయెల్ దాడులకు పాల్పడితే మా స్పందన తీవ్రంగా ఉంటుంది’ అని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రెయిసీ చెప్పారు. తమ సుఖోయ్-24ఎస్ విమానాలు సిద్ధంగా ఉన్నాయని ఇరాన్ ఎయిర్ఫోర్స్ కమాండర్ హెచ్చరించారు. అయితే ఇజ్రాయెల్ ఇరాన్లోని లక్ష్యాలపై దాడి చేస్తుందా లేదంటే ఇరాన్ వెలుపల దాడులు చేస్తుందా అనేదానిపై స్పష్టత లేదు. ఇరాన్కు చెందిన వాణిజ్య నౌకలకు ఎర్ర సముద్రంలో రక్షణ కల్పిస్తున్నట్లు ఇరాన్ నేవీ అడ్మిరల్ షారమ్ ఇరానీ తెలిపారు. కాగా, ఇటీవల సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఆ దేశానికి చెందిన 13 మంది ఆర్మీ ఉన్నతాధికారులు మరణించారు. దీనికి ప్రతీకారంగా ఏప్రిల్ 1న ఇరాన్ వందలాది డ్రోన్లు, మిసైళ్లతో ఇజ్రాయెల్పై దాడి చేసింది. వీటిలో 99 శాతం మిసైళ్లను ఇజ్రాయెల్ తన ఐరన్ డోమ్ వ్యవస్థ సహకారంతో కూల్చి వేసింది. ఇదీ చదవండి.. ఇరాన్కు భారీ షాక్ ఇచ్చిన అమెరికా -
స్కిల్ కేసు.. చంద్రబాబుకు సుప్రీంకోర్టు వార్నింగ్ !
ఢిల్లీ,సాక్షి: స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ షరతులు ఉల్లంఘించొద్దని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఈ కేసులో ఏపీ సీఐడీ దాఖలు చేసిన చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్లతో కూడిన సుప్రీం ధర్మాసనం మంగళవారం(ఏప్రిల్ 16) విచారణ జరిపింది. పిటిషన్ తదుపరి విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది. బాబు, ఆయన కుమారుడు లోకేష్ స్కిల్ కేసు దర్యాప్తు అధికారులను బెదిరిస్తున్నారని ఏపీ సీఐడీ తరపు న్యాయవాది సుప్రీం కోర్టు దృష్టికి తెచ్చారు. ‘దర్యాప్తుకు భంగం కలిగేలా లోకేష్ వ్యవహరిస్తున్నారు. రెడ్బుక్లో అధికారుల పేర్లు రాసుకుంటున్నానని, అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల అంతు చూస్తాను అని లోకేష్ అంటున్నారు. ఒక టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ బెదిరింపులకు పాల్పడ్డాడు. రెడ్బుక్ చంద్రబాబుకు ఇస్తారా అని లోకేష్ను ఆ టీవీ ఛానల్ ప్రతినిధి ఇంటర్వ్యూలో అడిగారు’ అని సీఐడీ వాదనలు వినిపించింది. పిటిషన్పై చంద్రబాబు తరపున న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. కాగా, గతేడాది స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయిన చంద్రబాబు ప్రస్తుతం షరతులతో కూడిన బెయిల్పై ఉన్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. శిరోముండనం కేసులో విశాఖ కోర్టు కీలక తీర్పు -
ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్: ఇరాన్ హెచ్చరిక నోటీసు ఇవ్వలేదు: అమెరికా
ఇజ్రాయెల్పై ఇరాన్ 300లకుపైగా డ్రోన్లు, మిసైల్స్తో భీకరదాడి చేసింది. సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన దాడికి ప్రతీకారంగా ఇరాన్ ఆదివారం భారీగా ఎత్తును డ్రోన్లు, మిసైల్స్తో విరుచుకుపడింది. అయితే ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, మిసైల్స్ను 99 శాతం అడ్డుకున్నామని ఇజ్రాయెల్ పేర్కొంది. దాడి చేసే ముందు అమెరికాతో సహా ఇజ్రాయెల్ మిత్ర దేశాలకు తాము 72 గంటల ముందస్తు హెచ్చరిక నోటీసు ఇచ్చినట్లు ఇరాన్ పేర్కొంది. ఇజ్రాయెల్పై దాడికి ముందే అమెరికాకు 72 గంటల హెచ్చరిక నోటీసు ఇచ్చామని ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరాబ్డొల్లాహియాన్ చేసిన వ్యాఖ్యలను అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా ఖండించింది. ఇరాన్ నుంచి తమకు ఎలాంటి హెచ్చరిక నోటీసులు రాలేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వంలో ఉన్నతధికారి ఒకరు పేర్కొన్నారు. ఇజ్రాయెల్పై దాడి విషయంలో ముందస్తుగా ఇరాన్ తమను హెచ్చరించలేదని.. దాడిచేసిన తర్వాతే తమకు ఇరాన్ సమాచారం అందించిదని అన్నారు. మరోవైపు ఇరాన్ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ దాడి చేయాలని వార్ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్ మరింత అప్రమత్తంగా ఉందని ఆ దేశ మిలటరీ అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి తెలిపారు. ప్రమాదకర, రక్షణాత్మక చర్యల కోసం కార్యాచరణ ప్రణాళికలు ఆమోదించబడ్డాయని పేర్కొన్నారు. ఇక.. ఇజ్రాయెల్పై చేసిన దాడులను ఇరాన్ ఐక్యరాజ్యసమతి వేదికగా సమర్థించుకుంది. కేవలం ఆత్మరక్షణ కోసమే ఇజ్రాయెల్పై దాడులకు దిగాల్సి వచ్చిందని పేర్కొంది. దాదాపు 300లకుపైగా డ్రోన్లు, మిసైల్స్తో ఇజ్రాయెల్పై విరుచుకుపడిన ఇరాన్పై అదను చూసి.. తగిన రీతిలో ప్రతీకార దాడులకు దిగుతామని ఇజ్రాయెల్ మంత్రి బిన్నీ గంట్జ్ తెలిపారు. -
ఇజ్రాయెల్ వణుకుతోంది: మళ్లీ హెచ్చరించిన ఇరాన్
టెహ్రాన్: ఇజ్రాయెల్- ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్పై ఏ క్షణమైనా దాడి జరగొచ్చని ఇరాన్ మరోసారి హెచ్చరించింది. ‘ఇరాన్ ఏం చేయబోతోందో ఇజ్రాయెల్కు తెలియదు. తమ దేశంపై ఎక్కడ దాడి జరుగుతుందోనని వణుకుతోంది. ఇప్పటికే ఇజ్రాయెల్లో చాలామంది షెల్టర్లలోకి పారిపోయారు. అసలైన యుద్ధం కంటే ఈ మానసిక, మీడియా, రాజకీయ యుద్ధమే వారిని మరింత భయపెడుతోంది’అని ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ సలహాదారుడు యాహ్యా రహీం సఫావీ పేర్కొన్నారు. మరోవైపు.. హార్ముజ్ జలసంధి సమీపంలో ఓ వాణిజ్య నౌకపై దాడికి దిగిన ఇరాన్ కమాండోలు దాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. నౌకలో 17 మంది భారతీయులు ఉండడంతో వారి విడుదల కోసం ఇరాన్ అధికారులతో భారత్ ఇప్పటికే సంప్రదింపులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కాగా, సిరియాలోని ఇరాన్ ఎంబసీపై ఇటీవల ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ ఆర్మీ ఉన్నతాధికారులు మరణించారు. దీనికి బదులు తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించినప్పటి నుంచి పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇదీ చదవండి..ఇజ్రాయెల్ నౌకపై ఇరాన్ దాడి.. నౌకలో 17 మంది భారతీయులు
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019