breaking news
Ad - Sakshi_Home_Sticky
-
IPL 2024: అరెరె.. మీరెందుకిలా అంటున్నార్సార్?!
గుజరాత్ టైటాన్స్.. చెన్నై సూపర్ కింగ్స్.. లక్నో సూపర్ జెయింట్స్.. ముంబై ఇండియన్స్.. ఐపీఎల్-2023లో ప్లే ఆఫ్స్ చేరిన జట్లు.. వీటిలో గుజరాత్- చెన్నై మధ్య టైటిల్ పోరు జరుగగా సూపర్ కింగ్స్ చాంపియన్గా అవతరించింది. ఇక పాయింట్ల పట్టికలో సన్రైజర్స్ హైదరాబాద్ అట్టడుగున నిలవగా.. ఢిల్లీ క్యాపిటల్స్(9), పంజాబ్ కింగ్స్(8), కోల్కతా నైట్ రైడర్స్(7) కింద నుంచి నాలుగు స్థానాల్లో నిలిచాయి. రాజస్తాన్ రాయల్స్, ఆర్సీబీ మెరుగైన ప్రదర్శనతో వరుసగా ఐదు, ఆరో స్థానంలో నిలిచాయి. 2023 పూర్తైన తర్వాత పాయింట్ల పట్టిక స్వరూపం ఇది. ఇక ఇప్పుడు ఐపీఎల్-2024లో సగానికి పైగా మ్యాచ్లు అయిపోయాయి. గతేడాది పట్టికతో తాజా సీజన్ను టేబుల్ను పోలిస్తే టాప్-5 జట్లలో పూర్తి వ్యత్యాసం కనిపిస్తోంది. రాజస్తాన్ రాయల్స్ ఎనిమిదింట ఏడు విజయాలతో నంబర్ వన్లో ఉండగా.. గతేడాది నామమాత్రపు ప్రదర్శనకు పరిమితమైన కోల్కతా, చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న సన్రైజర్స్ ముందుకు దూసుకువచ్చాయి. కేకేఆర్, ఎస్ఆర్హెచ్ ఆడిన ఏడింట ఐదు విజయాలతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై ఏడింట నాలుగు విజయాలతో టాప్-4లో కొనసాగుతోంది. లక్నో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. అయితే, ఆర్సీబీ, ముంబై మాత్రం చెత్త ప్రదర్శన కనబరుస్తున్నాయి. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఎనిమిదింట కేవలం మూడుసార్లు గెలవగా..ఫాఫ్ డుప్లెసిస్ బృందం ఆర్సీబీ ఎనిమిదింట ఒక్కటి మాత్రమే గెలిచి ప్లే ఆఫ్స్ నుంచి దాదాపుగా నిష్క్రమించింది. అయితే..ఈసారి ధనాధన్ బ్యాటింగ్తో దుమ్ములేపుతున్న జట్టు ఏదైనా ఉందంటే.. సన్రైజర్స్. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించడంతో పాటు మూడుసార్లు 250కి పైగా స్కోర్లు సాధించి సత్తా చాటింది. కేకేఆర్, ఆర్సీబీ సైతం ఈ మార్కును టచ్ చేశాయి. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు.. ప్రతిసారి హిట్టింగ్ చేస్తే ఐపీఎల్ బోర్ కొట్టడం ఖాయమంటూ వ్యాఖ్యానించడం కొంతమంది అభిమానులకు మింగుడుపడటం లేదు. ముంబై, ఆర్సీబీ, సీఎస్కే వంటి జట్లు పరుగుల వరద పారిస్తే మురిసిపోయే మాజీ క్రికెటర్లు ఈసారి వేరే జట్లు హిట్టింగ్ ఆడితే చూసి ఓర్వలేకపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి టేబుల్ తలకిందులయ్యేట్లుగా కనిపిస్తునందువల్లే బోర్ కొడుతుందంటూ ఇన్ఫ్ల్యూయెన్స్ చేసేలా కామెంట్లు చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈసారి ఇప్పటికైతే ప్లే ఆఫ్స్ రేసులో రాజస్తాన్, కేకేఆర్, ఎస్ఆర్హెచ్, చెన్నై ముందు వరుసలో ఉండగా.. లక్నో, గుజరాత్ సైతం పోటీనిచ్చే అవకాశం ఉంది. సగానికి పైగా మ్యాచ్లు పూర్తయ్యేసరికి ఈ జట్లు టాప్-6లో ఉండగా.. ముంబై, ఢిల్లీ, పంజాబ్, ఆర్సీబీ వరుసగా ఏడు, ఎనిమిది, తొమ్మిది, పదో స్థానంలో నిలిచాయి. -
SRH: ‘టాలీవుడ్ ప్రిన్స్’తో కమిన్స్.. సూపర్స్టార్ రిప్లై.. ఫ్యాన్స్ ఫిదా
Pat Cummins And Mahesh Babu- Crazy Viral: ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రాక సన్రైజర్స్ హైదరాబాద్లో సరికొత్త ఉత్సాహం నింపింది. అతడి సారథ్యంలో ఐపీఎల్-2024లో వరుస విజయాలతో సన్రైజర్స్ కాస్తా సన్‘డేంజర్స్’గా మారి ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తోంది. ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, నితీశ్కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్.. ఇలా ఒక్కొక్కరు వ్యక్తిగతంగా పరుగుల సునామీ సృష్టిస్తూ సన్రైజర్స్ను విధ్వంసకర బ్యాటింగ్కు మారుపేరుగా మార్చగా.. వీరి సేవలను ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన కమిన్స్ తనదైన వ్యూహాలతో విజయాల పరంపరకు తెరతీశాడు. ఈ నేపథ్యంలో.. గత మూడేళ్లుగా పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం కోసం పోటీపడ్డ రైజర్స్ ఇప్పుడు.. ప్లే ఆఫ్స్ రేసులో ముందు వరుసలో ఉంది. ఆడిన ఏడు మ్యాచ్లలో ఐదు విజయాలతో ప్రస్తుతం పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. కాగా సన్రైజర్స్ తమ తదుపరి మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్తో బెంగళూరుతో తలపడనుంది. హైదారాబాద్ వేదికగా గురువారం ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో సొంతగడ్డపై మరోసారి దుమ్ము రేపేందుకు సిద్ధమైన ప్యాట్ కమిన్స్ బృందం సోమవారం సూపర్స్టార్ మహేశ్ బాబును కలిసింది. View this post on Instagram A post shared by Pat Cummins (@patcummins30) ఈ సందర్భంగా మహేశ్ బాబుతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన కమిన్స్.. ‘‘ఈరోజు మధ్యాహ్నం.. టాలీవుడ్ ప్రిన్స్తో సమయం సంతోషంగా గడిచింది’’ అంటూ హర్షం వ్యక్తం చేశాడు. ఇక మహేశ్ బాబు సైతం.. ‘‘మిమ్మల్ని నేరుగా కలవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. వీరాభిమానిని. మీకు, ఎస్ఆర్హెచ్ జట్టుకు ఆల్ ది బెస్ట్’’ అంటూ విషెస్ తెలిపాడు. వీరిద్దరి పోస్టులు చూసిన ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్లో అంటూ మురిసిపోతున్నారు. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) కాగా గతంలో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెలిసిందే. మహేశ్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి స్టార్స్ను అనుకరిస్తూ అతడు చేసే రీల్స్ నెట్టింట వైరల్ అయిన సందర్భాలు కోకొల్లలు. చదవండి: ఓడినా.. మళ్లీ అదే నవ్వు.. అర్థంపర్థం లేని వాగుడు: సౌతాఫ్రికా స్టార్ పోస్ట్ వైరల్ SunRisers 🤝 Superstar of Telugu cinema, Mahesh Babu 👑🧡 pic.twitter.com/Nd4MQWCfi8 — SunRisers Hyderabad (@SunRisers) April 22, 2024 -
ఈసారి టైటిల్ సన్రైజర్స్దే!.. రిక్కీ పాంటింగ్ కామెంట్స్ వైరల్
ఐపీఎల్-2024లో చాంపియన్గా నిలవడానికి గల అర్హత ఇదేనంటూ ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దూకుడైన బ్యాటింగ్తో ముందుకు సాగే జట్టే టైటిల్ సాధిస్తుందని అభిప్రాయపడ్డాడు. కాగా క్యాష్ రిచ్ తాజా ఎడిషన్లో ఇప్పటి వరకు 31 మ్యాచ్లు జరుగగా.. తొమ్మిదికి పైగా మ్యాచ్లలో.. ఒక ఇన్నింగ్స్లో 200.. అంతకంటే పైచిలుకు స్కోర్లు నమోదయ్యాయి. ఇక ఈ సీజన్లో కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ రోజుల వ్యవధిలోనే తమ రికార్డు తామే బద్దలు కొట్టింది. దుమ్మురేపుతున్న సన్రైజర్స్ తొలుత ముంబై ఇండియన్స్పై 277 పరుగులు సాధించిన ఎస్ఆర్హెచ్.. ఆ తర్వాత ఆర్సీబీపై 287 పరుగులు స్కోరు చేసింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా రికార్డులకెక్కింది. Captain Pat reflects on the game ➕ who clinched the dressing room awards? 👀🏅 Watch as we soak in the post match vibes from our strong win in #RCBvSRH 🧡 pic.twitter.com/Ey7VhksA6B — SunRisers Hyderabad (@SunRisers) April 16, 2024 తగ్గేదేలే అంటున్న కేకేఆర్ మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ సైతం ఢిల్లీ క్యాపిటల్స్పై 272 పరుగులతో సత్తా చాటింది. ఇక తాజాగా మంగళవారం నాటి మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్, కేకేఆర్ వరుసగా 224, 223 పరుగులు స్కోరు చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రిక్కీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇప్పటికే రెండుసార్లు భారీ స్కోరు చేసిన జట్టుగా ఎస్ఆర్హెచ్ రికార్డులు సాధించింది. కేకేఆర్ కూడా మా జట్టు మీద 272 రన్స్ స్కోరు చేసింది. సన్రైజర్స్ సూపర్ ఫామ్ నాకు తెలిసి ఇంపాక్ట్ ప్లేయర్ కారణంగానే బ్యాటింగ్ జట్లకు ఈ మేరకు ప్రయోజనం చేకూరుతున్నట్లు అనిపిస్తోంది. ఆర్సీబీతో మ్యాచ్లో ట్రావిస్ హెడ్ ఎంతగా ప్రభావం చూపాడో చూశాం. ఎంతో ఆత్మవిశ్వాసం ఉంటేగానీ ఆ మాదిరి షాట్లు ఆడలేరు. బ్యాటింగ్ ఆర్డర్లో డెప్త్ ఉన్న కారణంగా కూడా అతడు స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించగలిగాడు. ఐపీఎల్ వంటి మేజర్ టోర్నీల్లో లేదా బిగ్ బాష్ లీగ్లో.. ఇలా ఎక్కడ చూసినా సరే లక్ష్యాన్ని కాపాడుకోగలిగి జట్లే విజయం సాధించాయి. అయితే.. ఈసారి ఐపీఎల్ మాత్రం భిన్నంగా సాగుతోంది. ఆ జట్టుదే టైటిల్ బౌలర్లను చితక్కొడుతూ భారీ స్కోర్లు సాధించిన జట్లే టైటిల్ దిశగా వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. డిఫెన్సివ్ బౌలింగ్పై ఆధారపడే జట్ల కంటే దూకుడుగా బ్యాటింగ్ చేసే జట్లకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి’’ అని రిక్కీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. అలా అయితే ఈసారి సన్రైజర్స్దే టైటిల్! ఇక పాంటింగ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే సీజన్ ఆరంభం(కేకేఆర్తో మ్యాచ్లో 204) నుంచి దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న సన్రైజర్స్కే టైటిల్ విన్నర్గా నిలిచే ఛాన్స్ ఉందని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. పాంటింగ్ మార్గదర్శనంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్లలో కేవలం రెండే గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇక పంత్ సేన తమ తదుపరి మ్యాచ్లో భాగంగా బుధవారం గుజరాత్ టైటాన్స్ను అహ్మదాబాద్లో ఢీకొట్టనుంది. చదవండి: #Pat Cummins: శెభాష్.. ఇది సరైన నిర్ణయం! కమిన్స్ అన్నతో అట్లుంటది మరి.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
RCB కెప్టెన్గా అతడు ఉంటే ఏం మాట్లాడగలరు: సెహ్వాగ్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆట తీరుపై విమర్శలు వెల్లుతుతున్నాయి. సొంతమైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో చిత్తుగా ఓడిపోవడంతో సొంత జట్టు అభిమానులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే ఐపీఎల్-2024లో కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరే అవకాశం ఉండదని మండిపడుతున్నారు. ఇక ఇప్పటికే భారత టెన్నిస్ దిగ్గజం మహేశ్ భూపతి సైతం ఆర్సీబీని కొత్త వాళ్లకు అమ్మేయాలంటూ యాజమాన్యం తీరును విమర్శించాడు. జట్టు నిండా స్టార్లు ఉన్నా ఇలాంటి చెత్త ప్రదర్శన ఏమిటని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అదే ఇక్కడ ప్రధాన సమస్య ‘‘జట్టులో 12- 15 మంది భారత ఆటగాళ్లు ఉన్నారు. కేవలం 10 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. కానీ ఆర్సీబీ కోచింగ్ సిబ్బందిలో దాదాపుగా అందరూ విదేశీయులే ఉన్నారు. అదే ఇక్కడ ప్రధాన సమస్య. ఇక ఆటగాళ్లలో కొంతమంది మాత్రమే అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నారు. వీరిలో సగం మందికి ఇంగ్లిష్ పూర్తిగా అర్థమే కాదు. అలాంటపుడు ఆ విదేశీ కోచ్లు వీరిని ఎలా మోటివేట్ చేయగలరు? వారితో ఎక్కువ సమయం ఎలా గడపగలరు? భాష పూర్తిగా రాని ఆటగాళ్లు తమ సమస్యలను కోచ్లకు ఎలా వివరించగలరు? నాకైతే ఆర్సీబీలో ఒక్క ఇండియన్ కోచ్ కూడా కనిపించడం లేదు. కనీసం ఒక్కరైనా అనుభవజ్ఞుడైన కోచ్ ఉంటే బాగుంటుంది కదా! ఆటగాళ్లు ఏది చర్చించాలన్నా అందుకు తగిన వాతావరణం ఉండాలి. కెప్టెన్గా అతడు ఉంటే ఏం మాట్లాడతారు? నాకు తెలిసి చాలా మంది ఆటగాళ్లు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ దగ్గరికి వెళ్లడానికే సంశయిస్తారు. ఎందుకంటే అతడు ఏదైనా అడిగితే వీరు సమాధానం చెప్పలేరు కదా! ఒకవేళ కెప్టెన్ గనుక భారతీయుడైతే.. సదరు ఆటగాళ్లు తాము అనుకుంటున్న విషయాన్ని స్పష్టంగా అతడికి తెలియజేయగలరు. కానీ విదేశీ ఆటగాడితో సరిగా కమ్యూనికేట్ చేయలేక.. ఒకదానికి బదులు ఇంకొకటి మాట్లాడితే తదుపరి మ్యాచ్లో తుదిజట్టులో చోటు దక్కే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఆర్సీబీ సహాయక సిబ్బందిలో కనీసం ఇద్దరు నుంచి ముగ్గురైనా భారతీయులు ఉండాలి’’ అని క్రిక్బజ్ షోలో సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. కాగా ఐపీఎల్-2024లో ఆర్సీబీ ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్లలో కేవలం ఒక్కటి గెలిచి ఆరు ఓడిపోయింది. దీంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. ఇక ఈ సీజన్లో ఆర్సీబీ హెడ్కోచ్గా ఆండీ ఫ్లవర్ బాధ్యతలు చేపట్టగా.. బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్ కోచ్గా టీమిండియా మాజీ ఆల్రౌండర్ శ్రీధరన్ శ్రీరామ్, బౌలింగ్ కోచ్గా ఆడం గ్రిఫిత్(టాస్మేనియా మాజీ క్రికెటర్), ఫీల్డింగ్ కోచ్గా మలోలన్ రంగరాజన్ వ్యవహరిస్తున్నారు. చదవండి: SRH: ‘బాధితులు’ కూడా అసూయ పడేలా.. కమిన్స్ ఏమన్నాడో తెలుసా? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
శెభాష్.. ఇది సరైన నిర్ణయం! కమిన్స్ అన్నతో అట్లుంటది మరి..
SRH Fans Hails Pat Cummins Captaincy: ఐపీఎల్లో గత మూడేళ్లుగా పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న జట్టు సన్రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్-2023లో పద్నాలుగింట కేవలం నాలుగు మ్యాచ్లు మాత్రమే గెలిచి పట్టికలో అట్టడుగున పదోస్థానంలో నిలిచింది. ఫలితంగా ఇక ఈ జట్టు ఇంతే! ఊరించి ఉసూరుమనిపించడం.. గెలుస్తారనుకున్న మ్యాచ్లో కూడా ఓడిపోవడం.. అనే విమర్శలు ఎదుర్కొంది. సరైన కెప్టెన్, ఓపెనింగ్ జోడీ లేకపోవడం.. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసే ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ విఫలం కావడం వంటివి తీవ్ర ప్రభావం చూపాయి. భారీ ధరకు కొనుక్కున్న హ్యారీ బ్రూక్ రాణించకపోవడం.. హెన్రిచ్ క్లాసెన్తో పాటు గ్లెన్ ఫిలిప్స్ను బరిలోకి దింపినా అప్పటికే ఆలస్యం కావడం గతేడాది ఎస్ఆర్హెచ్ కొంపముంచింది. అయితే, తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని.. లోపాలు సరిచేసుకుని ముందు సాగడం కూడా సన్రైజర్స్కు చేతకాదు అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వన్డే వరల్డ్కప్-2023 విన్నింగ్ కెప్టెన్ కోసం 20 కోట్లు కానీ.. సన్రైజర్స్ యాజమాన్యం వ్యూహాత్మంగా అడుగులు వేసింది. ఐపీఎల్-2024 వేలంలో భాగంగా వన్డే వరల్డ్కప్-2023 విజేత ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ను భారీ ధరకు కొనుగోలు చేసింది. అతడి కోసం ఏకంగా రూ. 20.50 కోట్లు వెచ్చించింది. అదే విధంగా వరల్డ్కప్ హీరో ట్రావిస్ హెడ్ను కూడా రూ. 6.80 కోట్లు పెట్టి కొనుక్కుంది. అయితే.. టీ20లలో అంతగా అనుభవం లేని కమిన్స్ను కెప్టెన్ చేయడం సన్రైజర్స్ పొరపాటేనని మరోసారి విమర్శలు వచ్చాయి. అతడి కోసం అంత ఖర్చు చేయడం అవసరమా అనే పెదవి విరుపులు కూడా! నమ్మకం నిలబెట్టుకుంటున్న కమిన్స్ కానీ మేనేజ్మెంట్ తనమీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ సన్రైజర్స్ను విజయపథంలో నడుపుతున్నాడు కమిన్స్. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, మార్క్రమ్ వంటి హిట్టర్లకు తోడు నితీశ్ కుమార్రెడ్డి, అబ్దుల్ సమద్ సేవలను సరైన సమయంలో సరిగ్గా ఉపయోగించుకుంటూ ఫలితాలు రాబడుతున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో ఈ స్టార్ పేసర్ తనతో పాటు భువీ, నటరాజన్, జయదేవ్ ఉనాద్కట్లతో పాటు స్పిన్నర్ మయాంక్ మార్కండేను కూడా అవసరమైన సమయంలో రంగంలోకి దించుతున్నాడు. మాస్టర్ మైండ్ ఆర్సీబీతో సోమవారం నాటి మ్యాచ్లో పిచ్ను సరిగ్గా రీడ్ చేసిన కమిన్స్ వన్డౌన్లో క్లాసెన్ను దింపి ఫలితం రాబట్టాడు. అందుకు తగ్గట్లే క్లాసెన్(31 బంతుల్లో 67) ట్రావిస్ హెడ్(41 బంతుల్లో 102)కు సహకారం అందిస్తూనే.. ఆచితూచి ఆడుతూ వీలు చిక్కిన్నపుడల్లా బంతిని బౌండరీకి తరలించాడు. ఆఖర్లో మార్క్రమ్(17 బంతుల్లో 32), అబ్దుల్ సమద్(10 బంతుల్లో 37) ధనాధన్ ఇన్నింగ్స్తో అజేయంగా నిలిచి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు(287) నమోదు చేసిన జట్టుగా ఆల్టైమ్ రికార్డు సృష్టించడంలో తమ వంతు పాత్ర పోషించారు. Abdul Samad in the house now 😎 Flurry of sixes at the Chinnaswamy 💥 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #RCBvSRH pic.twitter.com/eWFCtZ5Usq — IndianPremierLeague (@IPL) April 15, 2024 ఇక ఆర్సీబీ లక్ష్య ఛేదనలో ఆరంభంలో దూకుడుగా ఆడినా ప్యాట్ కమిన్స్ ముఖంపై నవ్వులు పూశాయే గానీ.. అతడు ఏమాత్రం తడబడలేదు. ముందుగా పార్ట్టైమ్ స్పిన్నర్ అభిషేక్ శర్మ చేతికి బంతినిచ్చాడు. ఐదో బంతికే క్యాచ్ డ్రాప్ చేయడంతో కోహ్లికి లైఫ్ లభించగా అతడు దూకుడు మరింత పెంచాడు. ఆ తర్వాత భువీని రంగంలోకి దింపాడు. అనంతరం మళ్లీ లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్..నటరాజన్ ఇలా ఒక్కో ఓవర్కు వైవిధ్యం చూపించాడు. పిచ్ పరిస్థితిని అంచనా వేస్తూ మరో స్పిన్నర్ మయాంక్తో బౌలింగ్ చేయించి ఫలితం రాబట్టాడు. ఆర్సీబీని దెబ్బకొట్టడంలో సఫలం మయాంక్ మార్కండే కోహ్లి(42) బౌల్డ్ కావడంతో అప్పటిదాకా ఆర్సీబీ విజయంపై ఆశలు పెట్టుకున్న అభిమానులు ఒక్కసారిగా నీరుగారిపోయారు. అయితే, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(28 బంతుల్లో 62), దినేశ్ కార్తిక్(35 బంతుల్లో 83) ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. తన వ్యూహాలను పక్కాగా అమలు చేసిన ప్యాట్ కమిన్స్ మూడు వికెట్లు తీయడంతో పాటు కెప్టెన్గానూ తానేంటో మరోసారి నిరూపించాడు. మిస్టర్ కూల్ ధోనిలా కూల్గా డీల్ చేస్తూ సన్రైజర్స్ను 25 పరుగుల తేడాతో గెలిపించాడు. తద్వారా రైజర్స్ ఖాతాలో నాలుగో(ఆరింట) విజయం చేరింది. ఇక కమిన్స్ చేరిక జట్టుకు నష్టం చేకూరుస్తుందే తప్ప లాభం ఉండదన్న విమర్శకులకు అద్బుత నైపుణ్యాలతో సమాధానమిస్తున్న ఈ పేస్ బౌలర్.. తొలుత ప్లే ఆఫ్స్నకు గురిపెట్టాడు. Nothing but bright smiles and 𝙜𝙤𝙤𝙤𝙤𝙤𝙤𝙙 vibes after a historic night of cricket 😁🔥#PlayWithFire #RCBvSRH pic.twitter.com/RXn6mb5pF1 — SunRisers Hyderabad (@SunRisers) April 16, 2024 అంతా సవ్యంగా సాగితే ఈసారి ఫైనల్లోనూ రైజర్స్ను చూస్తామంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్. డేవిడ్ వార్నర్ తర్వాత తమకు దొరికిన మరో ఆణిముత్యం కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అంటూ కొనియాడుతున్నారు. విశ్లేషకులు సైతం కమిన్స్ కెప్టెన్సీకి మంచి మార్కులే వేస్తున్నారు. పనిలో పనిగా రిస్క్ తీసుకున్నా సరే అనుకున్న ఫలితాలు వస్తున్నాయి అంటూ సన్రైజర్స్ ఓనర్ కావ్యా మారన్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: #T20WorldCup2024: రోహిత్తో ద్రవిడ్, అగార్కర్ చర్చలు.. హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్! Captain Pat reflects on the game ➕ who clinched the dressing room awards? 👀🏅 Watch as we soak in the post match vibes from our strong win in #RCBvSRH 🧡 pic.twitter.com/Ey7VhksA6B — SunRisers Hyderabad (@SunRisers) April 16, 2024
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019