breaking news
-
No Headline
నామినేషన్లు వేయాల్సిన కార్యాలయాలు నియోజకవర్గం నెల్లూరు లోక్సభ కలెక్టర్ చాంబర్ నెల్లూరు సిటీ కార్పొరేషన్ నెల్లూరు రూరల్ ఆర్డీఓ కందుకూరు సబ్ కలెక్టర్ కావలి ఆర్డీఓ ఆత్మకూరు మున్సిపల్ కోవూరు తహసీల్దార్ సర్వేపల్లి ఎంపీడీఓ ఉదయగిరి తహసీల్దార్ -
వలంటీర్లపై కక్ష కట్టిన చంద్రబాబు
● కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న బుచ్చిరెడ్డిపాళెం రూరల్: ‘చంద్రబాబు నాయుడు వలంటీర్లపై కక్ష కట్టాడు. వారు సంక్షేమ పథకాలు, వృద్ధులు, దివ్యాంగుల పింఛన్లు ఇవ్వకుండా తన మనుషుల ద్వారా ఈసీకి ఫిర్యాదు చేయించి అడ్డుకున్నాడు’ అని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ పరిధిలోని 200 మంది వలంటీర్లు బుధవారం తమ పోస్టులకు రాజీనామా చేశారు. అనంతరం నెల్లూరులోని ప్రసన్నకుమార్రెడ్డి నివాసంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ప్రసన్నకుమార్రెడ్డి ప్రజల మనిషి అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆయన విజయం కోసం తమవంతు కృషి చేస్తామని వివరించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి సీఎంను చేయడమే తమ లక్ష్యమన్నారు. ప్రజా సేవ చేసే వారికే తమ మద్దతు ఉంటుందన్నారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుప్రజ, వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు టంగుటూరు మల్లికార్జునరెడ్డి, సచివాలయాల కన్వీనర్ మోర్ల మురళి, నాయకుడు కోడూరు మధుసూదన్రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
టీడీపీకి ఓట్లేస్తే చీకటి రోజులు తప్పవు
● కావలి ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డి కావలి: ‘తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తే చీకటి రోజులు తప్పవు. ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి’ అని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి అన్నారు. పట్టణంలోని వెంగళరావునగర్లో బుధవారం జరిగిన ముస్లింల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. వైఎస్సార్సీపీ స్థాపించిన నాటి నుంచి ముస్లింలు అండగా ఉన్నారన్నారు. 2019లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారన్నారు. ఈ ఎన్నికల్లోనూ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ముస్లిం, మైనారిటీలకు వైఎస్ రాజశేఖరరెడ్డి అండగా నిలిచారన్నారు. ఆయన రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో అనేక మంది ఉన్నత స్థానాలకు చేరుకున్నారని చెప్పారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లింల సంక్షేమానికి పాటుపడ్డారన్నారు. కర్నూలు వంటి కీలక స్థానాల్లో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారన్నారు. అదే విధంగా కార్పొరేషన్లు, నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల్లోనూ ముస్లింలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. ఇమామ్లు, మౌజన్లకు గౌరవ వేతనాలు, హజ్ యాత్రకు ఆర్థిక సాయం అందించిన ఘనత జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. టీడీపీ హయాంలో ముస్లింలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. చంద్రబాబు మతతత్వ పార్టీ అయిన బీజేపీతో చేతులు కలిపి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడన్నారు. కార్యక్రమంలో షేక్ నాయబ్ రసూల్, మొగల్ సలీం బేగ్, మొగల్ రహీం బేగ్, పఠాన్ నవాజ్ ఖాన్, షేక్ ఫీర్ మహమ్మద్, నాయబ్ రసూల్, షేక్ అబ్దుల్, నాగూర్ తదితరులు పాల్గొన్నారు. -
స్థానికుడిని.. మీకేం కావాలో నాకు తెలుసు
పొదలకూరు: ‘నేను స్థానికుడిని. మండలంలో ప్రతి గ్రామం గురించి తెలుసు. మీకేం కావాలో ఐడియా ఉంది. టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అలియాస్ అల్లీపురంరెడ్డి అవకాశం కోసం వస్తున్నాడు. ఆయన్ను నమ్మొద్దు. ఎన్నికలయ్యాక కనిపించడు’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. మండలంలోని ఆల్తుర్తి, ఆర్వైపాళెం, అంకుపల్లి, వెంకటాపురం, పర్వతాపురం, పులికల్లు, వావింటపర్తి, ఊసపల్లి గ్రామాల్లో బుధవారం మంత్రి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చడంతోపాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేసినట్లు తెలిపారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు రైతులు, పొదుపు మహిళలకు రుణమాఫీ చేస్తానని నమ్మించి అధికారంలోకి వచ్చాడన్నారు. కానీ వారిని మోసం చేసినట్లు చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. సచివాలయాలు, ఆర్బీకే, విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణం జరిగిందన్నారు. ప్రతి వీధిలో సిమెంటురోడ్లు, సైడ్ డ్రెయిన్లు నిర్మించామన్నారు. అధికారం చేజిక్కించుకునేందుకు చంద్రబాబు కూటమిని ఏర్పాటు చేసి వస్తున్నాడని, ఆయన్ను నమ్మొద్దని సూచించారు. ఓటెందుకు వేయాలి సోమిరెడ్డి.. ఏం మేలు చేశావని ప్రజలు నీకు ఓటేయాలని సోమిరెడ్డిని మంత్రి ప్రశ్నించారు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయలేదన్నారు. ఐదేళ్లు ప్రజలకు అందుబాటులో లేకుండాపోయి ఇప్పుడొచ్చి ఓట్లు అడుగుతున్నాడన్నారు. రూ.కోట్లు వెచ్చించి ప్రతి గ్రామంలో మట్టిరోడ్డు లేకుండా చేశానని, మురుగునీరు బయటకు వెళ్లేందుకు డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేయించినట్లు కాకాణి చెప్పారు. పేదలకు భూముల పంపిణీ, చుక్కల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపానన్నారు. మూడో పర్యాయం అవకాశం ఇవ్వాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎవరి హయాంలో అందాయో గుర్తించి ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మంత్రి వెంట చిల్లకూరు వెంకురెడ్డి, పి.బాబిరెడ్డి, బూసుపల్లి చిన్నపరెడ్డి, కె.రామిరెడ్డి, శ్రీహరి, చంద్రశేఖర్, వై.పెంచలరెడ్డి, టి.నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి -
మీ కోసం.. మా వంతుగా..
ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులకు మద్దతుగా వారి కుటుంబసభ్యులు ప్రతి ఇంటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్రెడ్డికి మద్దతుగా ఆయన కోడలు నిహారిక బుధవారం పట్టణంలో ప్రచారం నిర్వహించారు. బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ పరిధిలోని ఏడో వార్డులో కోవూరు అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి తరఫున ఆయన సతీమణి నల్లపరెడ్డి గీతారెడ్డి, కోడలు పూజారెడ్డి ప్రచారం చేశారు. కావలి ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డిని మరోసారి గెలిపించాలని కోరుతూ ఆయన కుమారుడు రామిరెడ్డి బాలసాకేత్రెడ్డి – మహిమ దంపతులు, కుమార్తె సంహిత – అఖిలేష్రెడ్డి దంపతులు 35వ వార్డులో కరపత్రాలు పంపిణీ చేశారు. సర్వేపల్లి ఎమ్మెల్యేగా కాకాణి గోవర్ధన్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఆయన కుమార్తె పూజిత ముత్తుకూరు పట్టణం బీసీ కాలనీ, ఎమ్మార్వో గిరిజన కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి సీఎంను చేయాలని కోరారు. – ఉదయగిరి/బుచ్చిరెడ్డిపాళెం రూరల్/కావలి/ముత్తుకూరు
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019