breaking news
-
పాలస్తీనాకు శాశ్వత సభ్యత్వ తీర్మానం.. వీటో పవర్ వాడిన అమెరికా
ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వాన్ని కల్పించాలని కోరుతూ పాలస్తీనా ప్రవేశపెట్టిన తీర్మాణాన్ని అమెరికా అడ్డుకుంది. తీర్మానంపై ఓటింగ్ సమయంలో అగ్రరాజ్యం అమెరికా వీటో పవర్ను వినియోగించింది. 193 దేశాలు సభ్యతం గల ఐరాసలో పాలస్తీనాకు శాశ్వత సభ్యత్వం కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానంపై గురువారం భద్రతా మండలిలో ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ సందర్భంగా 12 కౌన్సిల్ సభ్యదేశాలు పాలస్తీనా తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. ఇక.. బ్రిటన్, స్విట్జర్లాండ్ దేశాలు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. అమెరికా వీటో ఉపయోగించటంతో ఈ తీర్మానం వీగిపోయింది. ‘రెండు దేశాల సమస్య పరిష్కారానికి అమెరికా ఎప్పుడూ మద్దుతు ఇస్తుంది. ఈ ఓటు పాలస్తీనా ప్రత్యేక దేశానికి వ్యతిరేకమైంది కాదు. అయితే ఇరు దేశాల మధ్య పత్యక్ష చర్చల ద్వారా మాత్రమే సమస్యకు పరిష్కారం లభిస్తుంది’ అని యూఎన్లో యూఎస్ డిప్యూటీ రాయబారి రాబర్ట్ వుడ్ భద్రతామండలికి తెలిపారు. తీర్మానాన్ని అమెరికా వీటో చేయటంపై పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ తీవ్రంగా ఖండించారు. ‘పాలస్తీనా శాశ్వత సభ్యత్వానికి సంబంధించిన తీర్మానాన్ని అమెరికా వీటో చేయటం చాలా అనైతికం, అన్యాయం’ అని అన్నారు. ‘ఈ తీర్మానంపై ఆమోదం పొందలేదనే విషయం పాలస్తీనా ప్రయత్నాన్ని తగ్గించదు. అదే విధంగా పాలస్తీనా సంకల్పాన్ని ఓడించదు. మా ప్రయత్నం ఆగదు’ అని యూఎన్లో పాలస్తీనా రాయబారి రియాద్ మన్సూర్ ఒకింత భావోద్వేగంతో అన్నారు. -
ఐరాసలో సంస్కరణలకు మద్దతు ఇస్తాం: అమెరికా
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ సంస్థల్లో సంస్కరణలకు తాము పూర్తి మద్దతు ఇస్తామని అమెరికా వెల్లడించింది. ఐరాస, ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు చేయడాని అమెరికా మద్దతు ఇస్తుందని అగ్రరాజ్య విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ పేర్కొన్నారు. బుధవారం మీడియాతో వేదాంత్ పటేల్ మాట్లాడారు. ఇటీవల ఐరాస, దాని అనుబంధ సంస్థల్లో మార్పులు అవసరమన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రస్తావనకు సంబంధించి రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు వేదాంత్ పటేల్ సమాధానం ఇచ్చారు. ‘ఇప్పటికే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అమెరికా అధ్యక్షడు ఈ విషయం గురించి మాట్లాడారు. అదేవిధంగా ఐరాస కార్యదర్శి సైతం ఈ విషయాన్ని ప్రస్తావించారు. మనం ప్రస్తుతం 21 శతాబ్దంలో ఉన్నాం. దానిని ప్రతిబింబించేలా ఐరాసతో పాటు దాని అనుబంధ సంస్థల్లో తప్పకుండా మార్పులు అవసరం. ఐరాస సంస్కరణలకు తాము(అమెరికా) కచ్చితంగా మద్దతు ఇస్తాం. అయితే ఎలాంటి సంస్కరణలు చేయాలో అనే ప్రత్యేకమైన సూచనల తమ వద్ద లేవు. కానీ, ఐరాసలో మార్పులు అవసరమని మేం కూడా గుర్తించాం’ అని వేదాంత్ పటేల్ స్పష్టం చేశారు. ఇక... జనవరిలో ఐక్యరాజ్యసమితి పనితీరుపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. ఐరాస, దాని అనుబంధ సంస్థల్లో మార్పులు అవసరమన్న విషయం తెలిసిందే. భద్రతా మండలిలో భారత్ వంటి దేశానికి శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని ఎలాన్ మస్క్ తప్పుబట్టారు. అదీకాక.. శక్తిమంతమైన దేశాలు తమ సభ్యత్వాన్ని వదులుకోలేక పోతున్నాయంటూ విమర్శలు గుప్పించారు. ‘ఐరాస, దాని అనుబంధ సంస్థలను సవరించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం హాస్యాస్పదం. శక్తిమంతమైన దేశాలు తమ స్థానాలను వదులుకునేందుకు ఇష్టపడకపోవడమే అసలు సమస్య. ఆఫ్రికా యూనియన్కు సమష్టిగా ఒక శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి’ అని ఆయన ఎక్స్ వేదికగా స్పందించిన విషయం తెలిసిందే. ఇక.. ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా 1945లో ఐక్యరాజ్యసమితి స్థాపించారు. ఐరాసకు అనుబంధంగా భద్రతా మండలి ఏర్పడి ఏడున్నర దశాబ్దాలు దాటిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భద్రతా మండలిలో ఎటువంటి మార్పులూ చోటుచేసుకోకపోవటం గమనార్హం. అయితే శక్తివంతమైన వీటో అధికారం కలిగిన శాశ్వత సభ్యదేశాలుగా అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్లే కొనసాగుతున్నాయి. శాశ్వత సభ్యత్వం కోసం ఇండియా పట్టుబడుతున్నా దక్కటం లేదు. ఐదింట నాలుగు దేశాలు భారత్కు అనుకూలంగానే ఉన్నప్పటికీ పొరుగుదేశం చైనా అడ్దుకుంటోంది. -
గాజా ఓటింగ్: అమెరికాపై ఇజ్రాయెల్ గుర్రు!
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ కోసం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరిగిన ఓటింగ్కు అమెరికా దూరంగా ఉండడంపై ఇజ్రాయెల్ రగిలిపోతోంది. ఈ క్రమంలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుపుల్ల పడింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రతిపాదించిన డిమాండ్ను అమెరికా వీటో ఉపయోగించి వీగిపోయేలా చేయాలని ఇజ్రాయెల్ ఆర్మీ ముందు నుంచే కోరింది. కానీ, అమెరికా పూర్తిగా ఓటింగ్కు దూరంగా ఉండిపోయింది. దీంతో అగ్రరాజ్యంపై ఇజ్రాయెల్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో శాంతి చర్చల కోసం తమ బృందాన్ని అమెరికాకు పంపించాలనుకున్న నిర్ణయంపై ఆ దేశ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ వెనక్కి తగ్గారు. దక్షిణ గాజా నగరమైన రఫాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు సంబంధించి చర్చల కోసం తమ దేశానికి రావాల్సిందిగా అమెరికా ఇజ్రాయెల్ను ఆహ్వానించింది. అయితే తాజా పరిణామాలతోనే ఇజ్రాయెల్ ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ తీర్మానం వల్ల ఇజ్రాయెల్తో సంబంధాలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని యుఎస్ ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. ఇరాన్తో సహా పలు దేశాలకు దాడులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ భద్రత, రక్షణ కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పూర్తి మద్దతును తెలియజేస్తున్నారని వైట్హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులేవన్ స్పష్టం చేశారు. ఇక.. గాజా కాల్పుల విమరణను తక్షణమే అమలు చేయాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సోమవారం డిమాండ్ చేసింది. భద్రతా మండలిలోని సమావేశానికి 14 దేశాల సభ్యులు హాజరుకాగా.. అందులో పదిమంది సభ్యులు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించాయి. దీంతో ఇజ్రాయెల్కు చెందిన బంధీలను వెంటనే విడిచిపెట్టాలని తెలిపింది. అయితే ఈ సమావేశంలో అమెరికా తీర్మానాన్ని ప్రతిపాదించకుండా ఓటింగ్కు దూరం ఉంది. అయితే కాల్పుల విరమణ చేపట్టాలని మాత్రం కోరింది. మొత్తంగా.. ఆమెరికా వ్యవహరించిన తీరుపై ఇజ్రాయెల్ అసంతృప్తి వ్యక్తం చేసింది. -
భద్రతా మండలిలో చోటుకు బదులు...
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశ హోదా కోసం భారత్ పావు శతాబ్ద కాలంగా విఫలయత్నం చేసింది. మండలి విస్తరణ జరిగినా చోటు దొరక్కపోతే మళ్లీ మరో పాతికేళ్ళు వృథా అవుతుంది. అందుకే ఆ ప్రయత్నాలను కొనసాగిస్తూనే, ప్రత్యామ్నాయంగా భిన్న దేశాల కూటములతో కలిసి పనిచేయాలన్న కచ్చితమైన నిర్ణయం భారత్ తీసుకుంది. ప్రపంచ సమస్యలపై ఎజెండాను రూపొందించడానికి ప్రయత్నిస్తోంది. ‘ఐఎస్ఏ’, ‘సీడీఆర్ఐ’ లాంటి సమూహాల స్థాపనకు చొరవ తీసుకోవడమే కాకుండా, వాటి కార్యాలయాలను ఢిల్లీలో ఏర్పాటు చేయించడంలో విజయం సాధించింది. క్వాడ్, ఐ2యూ2 లాంటి సమూహాలతో కూడా సాగుతూ భారత్ ప్రాభవాన్ని పెరిగేలా చూడటం మన దౌత్య పురోగతికి సంకేతం. దౌత్యపరంగా ప్రపంచంలోనే అత్యున్నత వేదిక అయిన భద్రతా మండలిలో శాశ్వత స్థానం కోసం భారత్ ఇక ఎదురుచూడటం లేదు. ఐక్యరాజ్యసమితి (ఐరాస)కి చెందిన అత్యంత ముఖ్యమైన ఈ విభాగంలో సమాన ప్రాతినిధ్య లక్ష్యం దిశగా పావు శతాబ్ద కాలంగా చేస్తూ వచ్చిన ప్రయత్నాలు పెద్ద పురోగతిని సాధించలేదు. భద్రతా మండలి విస్తరణలో కూడా మరో పాతికేళ్ళ కాలం భారత్ వంటి ఆశావహులను పక్కదారి పట్టించవచ్చనేది ఇప్పుడు కేంద్రప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. అందుకే, అంతుచిక్కని ఐక్యరాజ్యసమితి సంస్కరణల లక్ష్యం కోసం ఎదురుచూడకుండా ప్రపంచ వేదికపై తన పాద ముద్ర వేయ డానికి, చిన్న చిన్న దేశాల సమూహాలతో కలిసి పనిచేయాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం కచ్చితమైన నిర్ణయం తీసుకుంది. భారత్ 37 బహు పాక్షిక సమూహాలలో చేరింది. అంతేకాకుండా, భద్రతా మండలికి బదులుగా ప్రపంచ సమస్యలపై ఎజెండాను రూపొందించడానికి ప్రయత్నిస్తోంది. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ ఫిబ్రవరి 8న రాజ్యసభలో మాట్లాడుతూ, ఈ బహుపాక్షిక సమూహాలు ‘‘వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, రక్షణ సహకారం సహా అనేక రంగాలలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి భారత్కు వీలు కల్పిస్తాయి. ఇలాంటి ఫలితాలు భారత్ జాతీయ అభివృద్ధి ఎజెండాకు దోహదం చేస్తాయి, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తాయి, మన ప్రజల శ్రేయస్సును మెరుగుపరుస్తాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను ముందుకు తెస్తాయి’’ అని చెప్పారు. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ (ఐఎస్ఏ) అనేది భారత్ ఆలోచన. 2015లో ప్యారిస్లో జరిగిన 21వ వాతావరణ మార్పు సదస్సులో అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండే అందించిన మద్దతు ఈ భావనను ఫ్రాంకో–ఇండియన్ ఉమ్మడి ప్రయత్నంగా మార్చింది. ఇది మోదీ ప్రభుత్వ మొట్టమొదటి బహుపాక్షిక చొరవ. కాబట్టి, ఇది ప్రారంభం కావడానికి కాస్త సమయం పట్టింది. అయితే ఐఎస్ఏ ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీటీ)లో ఉన్నందున ఇది భారత ప్రతిష్ఠను మరింతగా పెంచింది. అనేక దశాబ్దాలుగా మన దేశమే సమస్యగా ఉండటం కాకుండా, వాతావరణ మార్పుపై సమస్య–పరిష్కర్తగా మారేట్టు చేసి, భారత ఖ్యాతిని పెంచింది. సీడీఆర్ఐ విషయానికి వస్తే, దానికి ఐఎస్ఏ లాగా అంత పేరు లేదు. ఇది 2019లో ఏర్పడిన కొత్త, ముఖ్యమైన భాగస్వామ్యం. ఇది వాతావరణానికి తట్టుకోగల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి... బహుపాక్షిక ఏజెన్సీలు, అభివృద్ధి బ్యాంకులు, ప్రైవేట్ రంగం, విద్యాసంస్థలతో కలిసి పనిచేయడానికికీ ప్రభుత్వాలను ఒక చోటికి తీసుకువస్తుంది. 2016లో జరిగిన విపత్తు నష్టభయం తగ్గింపుపై జరిగిన ఆసియా మంత్రుల సదస్సులో మోదీ అటువంటి కూటమి ఆలోచనను ప్రతిపాదించారు. అయితే ఈ ఆలోచనను దాని భాగస్వాములు ఆమోదించడానికీ, సీడీఆర్ఐని రూపొందించడానికీ మరో మూడేళ్లు పట్టింది. సీడీఆర్ఐ ప్రధాన కార్యాలయం కూడా న్యూఢిల్లీలో ఉంది. అనేక దశాబ్దాలుగా, జెనీవా, నైరోబీ, వియన్నా వంటి మెట్రోలకు లాగే తన నగరాల్లో ఒకదానిని ఐక్యరాజ్యసమితి నగరంగా ప్రకటించాలని భారత్ ఆకాంక్ష. పైన పేర్కొన్న నగరాలు న్యూయార్క్కు అనుబంధ, ద్వితీయ ప్రధాన కార్యాలయంగా పని చేస్తాయి. ఇక్కడ ఐరాస వార్షిక జనరల్ అసెంబ్లీ వంటి అతి ముఖ్యమైన కార్యకలాపాలు సాగుతాయి. అయితే, భారత్ కోరుకున్నట్లు జరగలేదు. తన ప్రధాన నగరాల్లో ఒకదానిలో ప్రాంతీయ ఆర్థిక సంఘాన్ని నెలకొల్పేలా ఐరాసను భారత్ ఒప్పించలేకపోయింది. అడిస్ అబాబా, బ్యాంకాక్, బీరూట్, జెనీవా, శాంటియాగోలకు ఈ ఘనత లభించింది. అందువల్ల, భారత్లో సీడీఆర్ఐ, ఐఎస్ఏ కార్యాలయాలను నెలకొల్ప టానికి వ్యవస్థాపక సభ్యదేశాలను ఒప్పించటం గొప్ప విషయం. నేడు ఈ రెండు సంస్థలు పెద్ద సంఖ్యలో భారతీయులకు ఉపాధి కల్పిస్తు న్నాయి. న్యూఢిల్లీకి మకాం మార్చి, ఈ సంస్థలలో పని చేయడానికి విదేశాల నుంచి కూడా నిపుణులను రప్పించారు. జాతీయ రాజధాని ప్రాంతం ఈ సంస్థల నుండి అనుబంధ ప్రయోజనాలను పొందుతుంది. వారి ఆధ్వర్యంలో జరిగే అంతర్జాతీయ కార్యక్రమాల ద్వారా సమావేశాలు, ప్రదర్శనలకు న్యూఢిల్లీ ఒక ముఖ్యమైన వేదికగా ఎదుగుతుంది. భారత్ సభ్యురాలిగా ఉన్న అతి ముఖ్యమైన బహుళజాతి సమూహం ఏదంటే నిస్సందేహంగా క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. దీనిని సరళంగా క్వాడ్ అని పిలుస్తున్నారు. ఇది భారత్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాలను ఒకచోట చేర్చింది. క్వాడ్కు భారత్లో సంశ యవాదులు మాత్రమే కాకుండా కొన్నిసార్లు తీవ్రమైన వ్యతిరేకులు కూడా లేకపోలేదు. కానీ భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ‘వై భారత్ మ్యాటర్స్’ పుస్తకంలో, క్వాడ్ గురించి చాలా ముఖ్యమైన కానీ తరచుగా నిర్లక్ష్యం చేయబడిన అంశాన్ని పేర్కొన్నారు. భారత్కు ‘ఇటీవలి కాలంలో చాలా స్పష్టంగా అభివృద్ధి చెందిన సంబంధం ఆస్ట్రేలియాతోనే’ అని రాశారు. జైశంకర్ ప్రకారం, ఈ క్వాడ్ సభ్యదేశంతో పెరుగుతున్న సంబంధాలు ఇతర క్వాడ్ సభ్యదేశాలైన జపాన్, అమెరికాలతో సంబంధాలలో అంతరాన్ని తగ్గించాయి. అధికారిక అంచనా, ప్రజల అవగాహన రెండింటిలోనూ జపాన్, అమెరికాతో భారత్ సంబంధాలు చాలా ముఖ్యమైనవి. జైశంకర్ వాదనను అంగీకరించినట్లయితే, బహుపాక్షిక క్వాడ్ నిజానికి సాధారణంగా అంగీకరించిన దానికంటే పెద్ద ద్వైపాక్షిక ప్రయోజనాన్ని అందిస్తోంది. గత సంవత్సరం, క్వాడ్ మొదటిసారిగా ఐరాస భద్రతా మండలి సంస్కరణపై అంతర్–ప్రభుత్వ చర్చలకు మద్దతు ఇచ్చింది. ఐక్యరాజ్యసమితిని వాస్తవానికి ఏర్పాటు చేయడా నికి కారణమైన ప్రశంసనీయమైన లక్ష్యాలను అణచివేసే ప్రయత్నా లను అడ్డుకోవడానికి కలిసి పనిచేయడానికి అంగీకరించింది. జైశంకర్ ప్రకారం, క్వాడ్ ‘రెండు దశాబ్దాలుగా కీలక సంబంధాలలో భారత దేశం సాధించిన పురోగతి సమాహారం’. ఇండియా, ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలతో కూడిన ‘ఐ2యూ2’ కూటమి కూడా పూర్తిగా భారత్కు మాత్రమే ప్రయోజనం చేకూర్చింది. యూఏఈ పెట్టుబ డులు, ఇజ్రాయెల్ నీటిపారుదల సాంకేతికతతో మధ్యప్రదేశ్లో ఫుడ్ పార్కుల నెట్వర్క్ స్థాపన జరిగింది. రెండో ఐ2యూ2 ప్రాజెక్ట్ అమె రికా నిధులతో గుజరాత్లో విద్యుదుత్పత్తి కోసం సౌరశక్తిని ఉపయో గించాలని భావిస్తోంది. అయితే, పశ్చిమాసియాలో పెరుగుతున్న సంఘర్షణ దృష్ట్యా కొత్త ఐ2యూ2 ప్రాజెక్ట్లు ముందుకు సాగడానికి చాలా సమయం పట్టనుండటం విచారకరం. ఇలాంటి మరెన్నో సమూహాలకు కేంద్రంగా ఉంటున్న భారత్తో బహుళజాతి కార్యక్రమాలు, త్రైపాక్షికత పెరుగుతుండటం అనేవి భారతీయ దౌత్య పురోగతికి సంకేతం. భారత్, ఫ్రాన్స్, యూఏఈ తమ ‘ఫోకల్ పాయింట్స్ గ్రూప్’ను 2022లో ఏర్పాటు చేశాయి. ఇది రక్షణ, విపత్తు నిర్వహణ నుండి ప్రాంతీయ అనుసంధానం, ఆహార భద్రత వరకు అనేక రంగాలలో పురోగమిస్తోంది. ఈ మోడల్ మాదిరి గానే భారత్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా కాలానుగుణంగా ‘ఫోకల్ పాయింట్ల సమావేశాలను’ నిర్వహిస్తున్నాయి. అంత మాత్రాన ఇదంతా భద్రతా మండలి శాశ్వత సభ్యత్వానికి వీడ్కోలు చెప్పడం కానే కాదు. కానీ ఫ్రెంచ్వారన్నట్లు ‘మనం మళ్లీ కలిసేవరకు’ కొనసాగుతాయని అర్థం. కె.పి. నాయర్ వ్యాసకర్త వ్యూహాత్మక అంశాల విశ్లేషకుడు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ముంబై దాడుల సూత్రధారి అబ్దుల్ సలాం భుట్టావి మృతి
లష్కరే తోయిబా(LeT) వ్యవస్థాపకుడు, ముంబై దాడుల సూత్రధారి అబ్దుల్ సలాం భుట్టావి మృతి చెందినట్లు ఐక్యరాజ్యసమితి(UNO)ప్రకటించింది. లష్కరే తోయిబా వ్యవస్థపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్కు డిప్యూటీగా వ్యవహరించిన సలాం భుట్టావి మరణించినట్లు యూఎన్ఓ భద్రతా మండలి నిర్ధారించింది. ఈ మేరకు ఓ ప్రకటన వెల్లడించింది. 2008 ముంబై 26/11 దాడుల కుట్రదారుల్లో ఒకరైన సలాం భుట్టావి గుండెపోటుతో 2023 మేలో మృతి చెందినట్లు పేర్కొంది. పాకిస్తాన్ ప్రభుత్వ కస్టడిలో ఉన్న భుట్టావి పంజాబ్ ప్రావిన్స్లోని మురిధేలో మరణించారు. లష్కరే తోయిబా చేసిన ముంబై దాడుల్లో 166 మంది మృతి చెందగా.. సుమారు 300 మంది గాయపడ్డారు. ఐఖ్య రాజ్య సమితి నిషేధించిన మహమ్మద్హఫీజ్ సయీద్ను ముంబై దాడుల ఘటనకు సంబంధించి విచారించడం కోసం తమకు అప్పగించాలని పాకిస్థాన్ను భారత్ ఇటీవల కోరిన విషయం తెలిసిందే. చదవండి: అమెరికా, బ్రిటన్ మూల్యం చెల్లించుకోవాల్సిందే.. హెచ్చరించిన హౌతీలు
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019