breaking news
-
విషాదం: స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల దుర్మరణం
విదేశాల్లో ఉన్నత చదువులకోసం వెళ్లిన భారతీయ విద్యార్థుల వరుస మరణాలు తల్లిదండ్రులకు తీరని కడుపుశోకాన్ని మిగుల్చుతోంది. తాజాగా స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రదేశంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు ప్రమాదవశాత్తూ నీట మునిగి చనిపోయారు. బుధవారం సాయంత్రం జరిగిన దురదృష్టకర సంఘటనలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు మునిగిపోయారని వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని లండన్లోని భారత హైకమిషన్ ప్రతినిధి వెల్లడించారు. వీరిని డూండీ యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తున్న చాణక్య బొలిశెట్టి (22), జితేంద్రనాథ్ కరుటూరి (27)గా గుర్తించారు. వాటర్ఫాల్స్కు పాపులర్ అయిన లిన్ ఆఫ్ తుమ్మెల్ జలపాతం వద్ద వీరిద్దరూ దుర్మరణం పాలయ్యారు. అత్యవసర సేవల ద్వారా ఇద్దరి మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. డూండీ యూనివర్సిటీలో చదువుతున్న నలుగురు స్నేహితులు ట్రెక్కింగ్ చేస్తుండగా, ప్రమాద వశాత్తూ ఇద్దరు నీటిలో పడి మునిగిపోయారు. దీంతో మిగిలిన ఇద్దరు విద్యార్థులు ఎమర్జెన్సీ సర్వీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక, అంబులెన్స్లు ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టాయి. (అమెరికా : ఆ ఇద్దరు తప్పు చేశారా? చేతివాటమా?) కాగా భారత కాన్సులేట్ జనరల్ విద్యార్థుల కుటుంబాలకు సమాచారం అందించింది వారికి తగిన సహాయాన్ని అందిస్తోంది. అలాగే ఒక కాన్సులర్ అధికారి బ్రిటన్లో నివసిస్తున్న విద్యార్థి బంధువును కలిశారు. అటు డూండీ విశ్వవిద్యాలయం కూడా తగిన సాయాన్ని హామీ ఇచ్చింది. పోస్ట్మార్టం అనంతరం వారి మృతదేహాలను భారత్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు -
83 ఏళ్ల వయస్సులో వికెట్ కీపింగ్.. ఆక్సిజన్ సిలిండర్ పట్టుకుని మరి! వీడియో వైరల్
క్రికెట్ అనేది వయస్సుతో సంబంధం లేని క్రీడ. ఆడాలనే తపన ఉంటే ఏ వయస్సులోనైనా మైదానంలో అడుగుపెట్టవచ్చు. సహచర ఆటగాళ్లతో కలిసి ఆటను ఆస్వాదించవచ్చు. తాజాగా స్కాట్లాండ్ మాజీ ఆటగాడు అలెక్స్ స్టీల్ కూడా అదే చేసి చూపించాడు. 83 ఏళ్ల వయస్సులో కూడా క్రికెట్పై తన మక్కువను చాటుకున్నాడు. ఓ వైపు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ.. క్రికెట్ మైదానంలో సందడి చేశాడు. ఓ స్థానిక క్లబ్ మ్యాచ్లో తన వెనుక భాగంలో ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని మరి అతడు వికెట్ కీపింగ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అతడికి ఆటపై ఉన్న అంకితభావం పట్ల సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా అలెక్స్ 2020లో ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అనే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి బారిన పడ్డాడు. అప్పటి నుంచి అతడు అక్సిజన్ సపోర్ట్తోనే తన జీవితాన్ని ముందుకు సాగిస్తున్నాడు. ఈ వ్యాధి బారిన పడిన తర్వాత 3 నుంచి 4 ఏళ్లవరకు మాత్రమే జీవించే అవకాశం ఉంది. ఇక స్టీల్ 1967లో స్కాట్లాండ్ తరపున ఓల్డ్ ట్రాఫోర్డ్లో లాంక్షైర్తో జరిగిన మ్యాచ్లో ఫస్ట్క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో 14 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన స్టీల్..621 పరుగులు చేశాడు. అందులో రెండు హాఫ సెంచరీలు ఉన్నాయి. ఆ రెండు కూడా ఐర్లాండ్పై సాధించనివే. వికెట్ కీపర్గా 11 క్యాచ్లు, రెండు స్టంపౌట్లు ఉన్నాయి. చదవండి: IND vs AUS: టీమిండియాతో వన్డే సిరీస్.. ఆస్ట్రేలియా కెప్టెన్గా విధ్వంసకర ఆటగాడు! View this post on Instagram A post shared by Cricketgraph (@cricketgraph) -
4597 రోజుల తర్వాత.. అదే వాంఖడేలో భారత్-శ్రీలంక మ్యాచ్!
దసన్ శనక సారధ్యంలోని శ్రీలంక జట్టు భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2023కు అర్హత సాధించింది. ఐసీసీ వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించిన శ్రీలంక.. 9వ జట్టుగా ప్రధాన టోర్నీలో అడుగుపెట్టనుంది. ఈ మెగా ఈవెంట్కు క్వాలిఫయర్-2 జట్టుగా శ్రీలంక అర్హత సాధించింది. వాస్తవానికి ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకారం నవంబర్ 2వ తేదీన వాంఖడే మైదానంలో భారత్ క్వాలిఫయర్-2 జట్టుతో తలపడనుంది. ఇప్పుడు శ్రీలంక క్వాలిఫయర్-2 జట్టుగా ప్రపంచకప్లోకి అడుగుపెట్టడంతో మరోసారి ఇరు జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. 4597 రోజుల తర్వాత... ఇక 4597 రోజుల తర్వాత తొలిసారి ముంబైలోని వాంఖడే స్టేడియం భారత్-శ్రీలంక మ్యాచ్కు వేదిక కానుంది. సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఇదే వాఖండే వేదికగా జరిగిన 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకపై అద్భుత విజయంతో భారత్ జట్టు విశ్వవిజేతగా నిలిచింది. ధోని సారథ్యంలోని భారత జట్టు శ్రీలంకను మట్టికరిపించి టైటిల్ను ఎగరేసుకుపోయింది. ఏప్రిల్ 2, 2011న భారత్-శ్రీలంక మధ్య వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. జింబాబ్వే-స్కాట్లాండ్ ఫైట్ ఇక వన్డే ప్రపంచకప్లో రెండో జట్టుగా అడుగుపెట్టేందుకు జింబాబ్వే-స్కాట్లాండ్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ప్రస్తుతం ప్రస్తుతం పాయింట్ల పట్టికలో జింబాబ్వే 6 పాయింట్లతో ఉండగా, స్కాట్లాండ్ 4 పాయింట్లతో ఉంది. జూలై 4న హరారే వేదికగా జింబాబ్వే-స్కాట్లాండ్ అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో స్కాట్లాండ్ విజయం సాధిస్తే జింబాబ్వేతో సమంగా నిలుస్తోంది. అప్పుడు నెట్రన్ రేట్ కీలకం కానుంది. అయితే జింబాబ్వే(+0.030) కంటే స్కాట్లాండ్(+0.188) రన్ రేట్ మెరుగ్గా ఉంది కాబట్టి స్కాటిష్ జట్టు క్వాలిఫయర్-1గా ప్రపంచకప్కు అర్హత సాధిస్తుంది. చదవండి: IND vs WI: బీచ్లో వాలీబాల్ ఆడిన భారత ఆటగాళ్లు.. వీడియో వైరల్ -
పగలు ఫిజిక్స్ టీచర్.. రాత్రికి అడల్ట్ సైట్లో ఫొటోలు షేరింగ్.. ఎందుకో తెలుసా?
Physics Teacher kirsty buchan.. పగలు పాఠశాలలో విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పే చీచర్ ఆమె.. కానీ, రాత్రి అయితే మాత్రం ఆమె తన అర్ధనగ్న ఫొటోలను తీసుకుంటూ వాటిని అడల్ట్ సైట్స్లో పెడుతోంది. ఈ విషయం కాస్తా విద్యార్థులకు తెలియడంతో చివరకు టీచర్ జాబ్కు రాజీనామా చేసింది. వివరాల ప్రకారం.. స్కాట్లాండ్లోని బానర్మన్ హైస్కూల్లో క్రిస్టీ బూచన్ ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తోంది. దీంతో, ఆమె ఉదయం పూట కొన్ని సంవర్సతరాలుగా పిల్లలకు ఫిజిక్స్ పాఠాలు బోధిస్తోంది. కానీ, రాత్రి అవగానే ఆమె మరో పని కూడా చేస్తూ విద్యార్థుల కంటపడకుండా జాగ్రత్తపడింది. కాగా, రోజూ అర్ధరాత్రి వరకూ మెలకువగానే ఉంటూ ఓన్లీ ఫ్యాన్స్ అనే అడల్ట్ వెబ్సైట్లో తన నగ్న చిత్రాలను పోస్ట్ చేసేది. వెబ్సైట్లో పోస్ట్ చేసేందుకు ఫొటో షూట్ నిర్వహించుకుని వాటిని సైట్లో పోస్ట్ చేసేది. ఇలా చేయడం ద్వారా ఆమెకు కొంత ఆదాయం వచ్చేది. అలా కొన్నేళ్లపాటు చేసుకుంటూ కాలం వెళ్లదీసింది. అయితే, టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. దొరకనంత వరకూ దొర.. దొరికిన తర్వాత ఎంతటి వారినైనా దొంగే అంటారనే సమేత ఉంది కదా. ఆమెకు ఇదే సమెత వర్తించింది. ఇలా చేస్తున్న క్రమంలో సదరు ఫిజిక్స్ టీచర్ ఫొటోలు ఓ విద్యార్థి కంటపడ్డాయి. దీంతో, అతడు ఈ విషయాన్ని స్కూల్లో అందరికీ చెప్పేశాడు. దీంతో, స్కూల్ క్రమశిక్షణా కమిటీ ఆమెను విచారణకు రావాలని కోరింది. ఈ క్రమంలో వారు.. తనను తప్పుబట్టేది ఏంటని.. ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఫొటోలు పోస్టు చేయడానికి కారణమిదే.. అయితే, ఫిజిక్స్ టీచర్ క్రిస్టీ బూచన్కు కుమారుడు(11) ఉన్నాడు. అతడిని పోషించుకునేందుకు డబ్బు సరిపోకపోవడంతో తాను ఈ పని చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది. తన కుమారుడికి దీర్ఘకాలిక వ్యాధులు ఉండటంతో సర్జరీలకు చాలా ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొంది. ఇలా, నగ్న చిత్రాలను పోస్ట్ చేసి నెలకు వేల డాలర్లు సంపాదిస్తున్నట్లు తెలిపింది. డబ్బు కోసమే తాను ఈ పని చేస్తున్నట్టు పేర్కొంది. ఆ పని చేస్తున్నందుకు తాను నరకం అనుభవిస్తున్నానని వెల్లడించింది. ఉదయం టీచర్ పనిచేస్తూ.. అర్ధరాత్రి వరకు నిద్రలేకుండా ఈ పని చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమారుడి కోసం తాను కరెక్ట్గానే చేస్తున్నానని చెప్పుకొచ్చింది. A physics teacher has resigned from her job after pornographic images of her emerged online. Kirsty Buchan, 33, left her post at Bannerman High School in Baillieston, Glasgow, after explicit pictures from her Only Fans site were circulated among pupils. pic.twitter.com/tuBFfUU3qR — vijay banga (@lekh27) December 1, 2022 -
వైద్యం ముసుగులో అసభ్యకర చేష్టలు.. 48 మంది మహిళా రోగులతో..
సాక్షి, న్యూఢిల్లీ: అతనో వైద్యుడు.. రోగుల బాగోగులు చూసి ధైర్యం చెప్పాల్సిందిపోయి వారితోనే అసభ్యకరంగా ప్రవర్తించాడు. తన వద్దకు వచ్చిన మహిళా పేషెంట్లతో విచక్షణ మరచి మృగంలా వ్యవహరించాడు. వారికి ముద్దులు పెడుతూ, అసభ్య వ్యాఖ్యలు చేస్తూ ఇబ్బందులకు గురి చేశాడు. ఈ దారుణ ఘటన స్కాట్లాండ్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. భారత సంతతికి చెందిన డాక్టర్ కృష్ణ సింగ్(72) మహిళా పేషెంట్లతో అనుచితంగా వ్యవహరించాడు. స్కాట్లాండ్లో బీపీ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్న కృష్ణ సింగ్.. తన కేరీర్లోని 35 ఏండ్లలో సుమారు 48 మంది మహిళా రోగులతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు నిర్ధారణ అయ్యింది. తన వద్దకు వచ్చిన మహిళా పేషంట్స్కు ముద్దులు ఇవ్వడం, నెమరడం, అనవసరమైన పరీక్షలు చేయించడం, అసభ్య వ్యాఖ్యలు చేశారు. 1983 నుంచి 2018 మధ్య కాలంలో మహిళా రోగులతో డాక్టర్ కృష్ణ సింగ్ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నార్త్ లనార్క్షైర్లో మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో మహిళా రోగులను సదరు డాక్టర్ లైంగికంగా వేధించినట్లు గ్లాస్గోలోని హైకోర్టులో ప్రాసిక్యూటర్ ఏంజిలా గ్రే వాదించారు. కాగా, 2018లో ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో ఆ డాక్టర్ ప్రవర్తనపై విచారణ ప్రారంభించారు. మొత్తం 54 అభియోగాల్లో కృష్ణ సింగ్ దోషిగా తేలాడు. ఇదిలా ఉండగా పేషెంట్లు చేసిన ఫిర్యాదులను సింగర్ తప్పుపట్టారు. ఇండియాలో వైద్య శిక్షణ తీసుకున్న సమయంలో ఆ పరీక్షల గురించి నేర్చుకున్నట్లు సదరు డాక్టర్ చెప్పడం గమనార్హం. విచారణ అనంతరం ఈ కేసులో తీర్పును వచ్చే నెలకు వాయిదా వేశారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019