breaking news
-
IPL 2024: అరెరె.. మీరెందుకిలా అంటున్నార్సార్?!
గుజరాత్ టైటాన్స్.. చెన్నై సూపర్ కింగ్స్.. లక్నో సూపర్ జెయింట్స్.. ముంబై ఇండియన్స్.. ఐపీఎల్-2023లో ప్లే ఆఫ్స్ చేరిన జట్లు.. వీటిలో గుజరాత్- చెన్నై మధ్య టైటిల్ పోరు జరుగగా సూపర్ కింగ్స్ చాంపియన్గా అవతరించింది. ఇక పాయింట్ల పట్టికలో సన్రైజర్స్ హైదరాబాద్ అట్టడుగున నిలవగా.. ఢిల్లీ క్యాపిటల్స్(9), పంజాబ్ కింగ్స్(8), కోల్కతా నైట్ రైడర్స్(7) కింద నుంచి నాలుగు స్థానాల్లో నిలిచాయి. రాజస్తాన్ రాయల్స్, ఆర్సీబీ మెరుగైన ప్రదర్శనతో వరుసగా ఐదు, ఆరో స్థానంలో నిలిచాయి. 2023 పూర్తైన తర్వాత పాయింట్ల పట్టిక స్వరూపం ఇది. ఇక ఇప్పుడు ఐపీఎల్-2024లో సగానికి పైగా మ్యాచ్లు అయిపోయాయి. గతేడాది పట్టికతో తాజా సీజన్ను టేబుల్ను పోలిస్తే టాప్-5 జట్లలో పూర్తి వ్యత్యాసం కనిపిస్తోంది. రాజస్తాన్ రాయల్స్ ఎనిమిదింట ఏడు విజయాలతో నంబర్ వన్లో ఉండగా.. గతేడాది నామమాత్రపు ప్రదర్శనకు పరిమితమైన కోల్కతా, చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న సన్రైజర్స్ ముందుకు దూసుకువచ్చాయి. కేకేఆర్, ఎస్ఆర్హెచ్ ఆడిన ఏడింట ఐదు విజయాలతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై ఏడింట నాలుగు విజయాలతో టాప్-4లో కొనసాగుతోంది. లక్నో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. అయితే, ఆర్సీబీ, ముంబై మాత్రం చెత్త ప్రదర్శన కనబరుస్తున్నాయి. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఎనిమిదింట కేవలం మూడుసార్లు గెలవగా..ఫాఫ్ డుప్లెసిస్ బృందం ఆర్సీబీ ఎనిమిదింట ఒక్కటి మాత్రమే గెలిచి ప్లే ఆఫ్స్ నుంచి దాదాపుగా నిష్క్రమించింది. అయితే..ఈసారి ధనాధన్ బ్యాటింగ్తో దుమ్ములేపుతున్న జట్టు ఏదైనా ఉందంటే.. సన్రైజర్స్. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించడంతో పాటు మూడుసార్లు 250కి పైగా స్కోర్లు సాధించి సత్తా చాటింది. కేకేఆర్, ఆర్సీబీ సైతం ఈ మార్కును టచ్ చేశాయి. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు.. ప్రతిసారి హిట్టింగ్ చేస్తే ఐపీఎల్ బోర్ కొట్టడం ఖాయమంటూ వ్యాఖ్యానించడం కొంతమంది అభిమానులకు మింగుడుపడటం లేదు. ముంబై, ఆర్సీబీ, సీఎస్కే వంటి జట్లు పరుగుల వరద పారిస్తే మురిసిపోయే మాజీ క్రికెటర్లు ఈసారి వేరే జట్లు హిట్టింగ్ ఆడితే చూసి ఓర్వలేకపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి టేబుల్ తలకిందులయ్యేట్లుగా కనిపిస్తునందువల్లే బోర్ కొడుతుందంటూ ఇన్ఫ్ల్యూయెన్స్ చేసేలా కామెంట్లు చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈసారి ఇప్పటికైతే ప్లే ఆఫ్స్ రేసులో రాజస్తాన్, కేకేఆర్, ఎస్ఆర్హెచ్, చెన్నై ముందు వరుసలో ఉండగా.. లక్నో, గుజరాత్ సైతం పోటీనిచ్చే అవకాశం ఉంది. సగానికి పైగా మ్యాచ్లు పూర్తయ్యేసరికి ఈ జట్లు టాప్-6లో ఉండగా.. ముంబై, ఢిల్లీ, పంజాబ్, ఆర్సీబీ వరుసగా ఏడు, ఎనిమిది, తొమ్మిది, పదో స్థానంలో నిలిచాయి. -
ఇంకెవరు.. నీ భార్యనే: కోహ్లి ఆన్సర్తో షాకైన డీకే
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి ఆటతోనే కాదు తన చురుకుదనంతో అభిమానులను ఫిదా చేస్తూ ఉంటాడు. క్రీజులో దిగగానే భారీ షాట్లతో విరుచుకుపడగల ఈ రన్ మెషీన్.. మైదానంలో తన చేష్టలతోనూ వినోదం పంచుతూ ఉంటాడు. అదే విధంగా.. సహచర ఆటగాళ్లతోనూ సరదాగా ఉంటూ తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆహ్లాదభరింతగా మారుస్తాడు. తాజాగా ఆర్సీబీ షేర్ చేసిన ఓ వీడియో ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది. తోటి ప్లేయర్ దినేశ్ కార్తిక్ అడిగిన ప్రశ్నలకు కోహ్లి ఊహించని సమాధానమివ్వడమే గాకుండా.. మళ్లీ అతడిని మాట్లాడకుండా చేశాడు. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఐపీఎల్-2024లో మ్యాచ్ల నుంచి విరామం దొరికిన సమయంలో ఆర్సీబీ తమ ఆటగాళ్లతో పలు ఆసక్తికర వీడియోలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో.. ఆర్సీబీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ హోస్ట్గా వ్యవహరిస్తూ ఉండగా... కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, పేసర్ మహ్మద్ సిరాజ్ తదితరులతో కలిసి కోహ్లి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్లో పాల్గొన్నాడు. ఇంకెవరు నీ భార్యనే! ఇందులో భాగంగా.. డీకే ముందుగా.. ‘‘క్రికెటర్ కాకుండా నా ఫేవరెట్ ప్లేయర్ ఎవరో చెప్పగలరా?’’ అని అడగ్గా.. కోహ్లి వెంటనే తడుముకోకుండా .. ‘‘నీ భార్య’’ అని ఆన్సర్ ఇచ్చాడు. దీంతో క్షణంపాటు ఆశ్చర్యంలో మునిగిన డీకే.. ‘‘అవును.. సరైన సమాధానం.. కానీ నిజానికి నా మనసులో వేరే పేరు అనుకున్నా’’ అన్నాడు. డీకే అలా అనగానే అక్కడ నవ్వులు పూశాయి. ఇందుకు సంబంధించిన వీడియో కోహ్లి ఫ్యాన్స్ను ఆకర్షిస్తోంది. మీరూ ఓ లుక్కేయండి.. మోసం చేసిన మొదటి భార్య? కాగా దినేశ్ కార్తిక్ భార్య పేరు దీపికా పళ్లికల్. ఆమె స్వ్కాష్ ప్లేయర్. భారత్ తరఫున అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొని ఎన్నో పతకాలు సాధించారు. అయితే, దీపికా కంటే ముందు డీకే నికితా వంజరాను పెళ్లాడాడు. కానీ ఆమె డీకేతో వివాహ బంధంలో ఉండగానే భర్త స్నేహితుడు, టీమిండియా మాజీ క్రికెటర్ మురళీ విజయ్తో సాన్నిహిత్యం పెంచుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో డీకే ఆమెకు విడాకులివ్వగా.. మురళీ విజయ్ను పెళ్లాడింది. తర్వాత డీకే దీపికాను పెళ్లి చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో కోహ్లి బ్యాటర్గా రాణిస్తున్నా ఆర్సీబీ చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది. ఆడిన ఏడు మ్యాచ్లలో కేవలం ఒక్కటి గెలిచి పట్టికలో పదో స్థానంలో ఉంది. అయితే, కోహ్లి మాత్రం 361 పరుగులతో టాప్ స్కోరర్గా కొనసాగుతూ ఆరెంజ్ క్యాప్ ప్రస్తుతానికి తన వద్ద పెట్టుకున్నాడు. మరోవైపు.. దినేశ్ కార్తిక్ సైతం జట్టు కష్టాల్లో ఉన్నపుడు బ్యాట్ ఝులిపిస్తూనే ఉన్నాడు. అయినా ఫలితం మాత్రం ఉండటం లేదు. Virat Kohli - the legend. 🤣👌 pic.twitter.com/1TMIPxEQT2 — Mufaddal Vohra (@mufaddal_vohra) April 19, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
RCB: అక్కడే మొదలు.. అక్కడే ముగిస్తా: కేఎల్ రాహుల్
‘‘ఆ రోజు విరాట్ అక్కడే ఉన్నాడు. కోచ్ రే జెన్సింగ్స్.. ఇంకా మిగతా సహాయక సిబ్బంది కూడా ఉన్నారు. అప్పుడు విరాట్ వచ్చి.. ‘నీకు ఈ కాంట్రాక్ట్ మీద సంతకం పెట్టడం ఇష్టమేనా? ఆర్సీబీకి ఆడతావా? అని అడిగాడు. అందుకు బదులుగా.. ‘ఏంటీ జోక్ చేస్తున్నావా?.. నా చిరకాల కల అది’ అని అన్నాన్నేను. అప్పుడు విరాట్.. ‘అవును.. జోక్ చేశానులే.. అయినా.. ఇది నీకు ఆప్షన్ కాదు.. ముందు ఈ కాంట్రాక్టు మీద సంతకం పెట్టు’ అన్నాడు. నేను అలాగే చేశాను. అప్పుడు వెంటనే విరాట్ స్పందిస్తూ.. ‘ఇక నుంచి నీ ప్రయాణం క్రేజీగా ఉండబోతోంది. వచ్చే రెండు నెలలు నీకు ఫుల్ మజా’ అంటూ నన్ను ఆటపట్టించాడు’’ అని టీమిండియా స్టార్, ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. క్యాష్ రిచ్ లీగ్లో అడుగుపెట్టిన నాటి జ్ఞాపకాలను తాజాగా గుర్తు చేసుకున్నాడు. కాగా కర్ణాటకకు చెందిన కన్ననూర్ లోకేశ్ రాహుల్ 2013లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున అరంగేట్రం చేశాడు. ఆ ఏడాది దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టి ఐపీఎల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. కేకేఆర్తో మ్యాచ్తో ఎంట్రీ సొంతమైదానం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్తో ఆర్సీబీ తరఫున అరంగేట్రం చేశాడు. ఇక ఆ తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్(కెప్టెన్)కు ఆడిన రాహుల్.. 2022లో ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ సారథిగా బాధ్యతలు చేపట్టాడు. తమ తొలి సీజన్లోనే లక్నోను ప్లే ఆఫ్స్ చేర్చి సత్తా చాటాడు. ఇక ఐపీఎల్-2024లోనూ ప్రస్తుతం లక్నో పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఆడిన ఆరు మ్యాచ్లలో మూడు గెలిచి ఐదో స్థానంలో ఉంది. శుక్రవారం నాటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్తో లక్నో వేదికగా సూపర్ జెయింట్స్ తలపడనుంది. ఇదిలా ఉంటే.. లక్నోకు సారథిగా ఉన్నా కేఎల్ రాహుల్ మనసులో ఆర్సీబీకి మాత్రం ప్రత్యేక స్థానం ఉంది. తన సొంత రాష్ట్రానికి చెందిన ఫ్రాంఛైజీ కావడంతో పాటు.. తనకు లైఫ్ కూడా ఇచ్చిన ఆర్సీబీ అంటే అతడికి గౌరవం. ఈ విషయాన్ని తాజాగా రవిచంద్రన్ అశ్విన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నాడు రాహుల్. అక్కడే మొదలు.. అక్కడే ముగిస్తా ‘‘ఆ రెండు నెలలు ఆర్సీబీలో నేను చాలా నేర్చుకున్నాను. మంచి అనుభవం గడించాను. అంతా త్వరత్వరగా జరిగిపోయింది. బెంగళూరుకు ఆడటం నాకెల్లప్పుడూ ఇష్టమే. నా కెరీర్ మొదలైందే అక్కడ! అక్కడే కెరీర్ ముగిస్తే బాగుంటుందని కూడా అనుకుంటున్నా. ఏదేమైనా భిన్న జట్లతో.. భిన్న ప్లేయర్లతో కలిపే ఐపీఎల్ ఓ అద్భుతమైన టోర్నీ’’ అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు. చదవండి: హార్దిక్ను పట్టించుకోని ఆకాశ్.. రోహిత్ మాట విని అలా! వైరల్ వీడియో var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
RCB కెప్టెన్గా అతడు ఉంటే ఏం మాట్లాడగలరు: సెహ్వాగ్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆట తీరుపై విమర్శలు వెల్లుతుతున్నాయి. సొంతమైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో చిత్తుగా ఓడిపోవడంతో సొంత జట్టు అభిమానులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే ఐపీఎల్-2024లో కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరే అవకాశం ఉండదని మండిపడుతున్నారు. ఇక ఇప్పటికే భారత టెన్నిస్ దిగ్గజం మహేశ్ భూపతి సైతం ఆర్సీబీని కొత్త వాళ్లకు అమ్మేయాలంటూ యాజమాన్యం తీరును విమర్శించాడు. జట్టు నిండా స్టార్లు ఉన్నా ఇలాంటి చెత్త ప్రదర్శన ఏమిటని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అదే ఇక్కడ ప్రధాన సమస్య ‘‘జట్టులో 12- 15 మంది భారత ఆటగాళ్లు ఉన్నారు. కేవలం 10 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. కానీ ఆర్సీబీ కోచింగ్ సిబ్బందిలో దాదాపుగా అందరూ విదేశీయులే ఉన్నారు. అదే ఇక్కడ ప్రధాన సమస్య. ఇక ఆటగాళ్లలో కొంతమంది మాత్రమే అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నారు. వీరిలో సగం మందికి ఇంగ్లిష్ పూర్తిగా అర్థమే కాదు. అలాంటపుడు ఆ విదేశీ కోచ్లు వీరిని ఎలా మోటివేట్ చేయగలరు? వారితో ఎక్కువ సమయం ఎలా గడపగలరు? భాష పూర్తిగా రాని ఆటగాళ్లు తమ సమస్యలను కోచ్లకు ఎలా వివరించగలరు? నాకైతే ఆర్సీబీలో ఒక్క ఇండియన్ కోచ్ కూడా కనిపించడం లేదు. కనీసం ఒక్కరైనా అనుభవజ్ఞుడైన కోచ్ ఉంటే బాగుంటుంది కదా! ఆటగాళ్లు ఏది చర్చించాలన్నా అందుకు తగిన వాతావరణం ఉండాలి. కెప్టెన్గా అతడు ఉంటే ఏం మాట్లాడతారు? నాకు తెలిసి చాలా మంది ఆటగాళ్లు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ దగ్గరికి వెళ్లడానికే సంశయిస్తారు. ఎందుకంటే అతడు ఏదైనా అడిగితే వీరు సమాధానం చెప్పలేరు కదా! ఒకవేళ కెప్టెన్ గనుక భారతీయుడైతే.. సదరు ఆటగాళ్లు తాము అనుకుంటున్న విషయాన్ని స్పష్టంగా అతడికి తెలియజేయగలరు. కానీ విదేశీ ఆటగాడితో సరిగా కమ్యూనికేట్ చేయలేక.. ఒకదానికి బదులు ఇంకొకటి మాట్లాడితే తదుపరి మ్యాచ్లో తుదిజట్టులో చోటు దక్కే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఆర్సీబీ సహాయక సిబ్బందిలో కనీసం ఇద్దరు నుంచి ముగ్గురైనా భారతీయులు ఉండాలి’’ అని క్రిక్బజ్ షోలో సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. కాగా ఐపీఎల్-2024లో ఆర్సీబీ ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్లలో కేవలం ఒక్కటి గెలిచి ఆరు ఓడిపోయింది. దీంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. ఇక ఈ సీజన్లో ఆర్సీబీ హెడ్కోచ్గా ఆండీ ఫ్లవర్ బాధ్యతలు చేపట్టగా.. బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్ కోచ్గా టీమిండియా మాజీ ఆల్రౌండర్ శ్రీధరన్ శ్రీరామ్, బౌలింగ్ కోచ్గా ఆడం గ్రిఫిత్(టాస్మేనియా మాజీ క్రికెటర్), ఫీల్డింగ్ కోచ్గా మలోలన్ రంగరాజన్ వ్యవహరిస్తున్నారు. చదవండి: SRH: ‘బాధితులు’ కూడా అసూయ పడేలా.. కమిన్స్ ఏమన్నాడో తెలుసా? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఏంట్రా ఈ బ్యాటింగ్?.. ఆగ్రహం వెళ్లగక్కిన కోహ్లి.. రియాక్షన్ వైరల్
‘‘నేను కొడితే అదోలా ఉంటుందని..ఆళ్లూ.. ఈళ్లూ చెప్పడమే గానీ.. నాకు కూడా తెలియదు.. ఇప్పుడు మీకు తెలుస్తుంది’’.. బిజినెస్మేన్ సినిమాలో మహేశ్ బాబు చెప్పిన మాదిరే సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు కూడా ఆర్సీబీ బౌలింగ్ను చితక్కొట్టారు. ఏమాత్రం కనికరం లేకుండా బెంగళూరు బౌలర్లపై విరుచుపడుతూ చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారించాడు. కో..డితే సిక్స్.. లేదంటే ఫోర్.. తగ్గేదేలే అన్నట్లు ట్రావిస్ హెడ్(41 బంతుల్లో 102) ఓవైపు ఊచకోత కోస్తుంటే మరోవైపు హెన్రిచ్ క్లాసెన్(31 బంతుల్లో 67) ఛాన్స్ వచ్చినప్పుడల్లా వీరబాదుడు బాదాడు. THE SHOOTING STAR...!!! 💫 - 106M monster by Heinrich Klaasen. 🥵 pic.twitter.com/raWQGOLOiM — Mufaddal Vohra (@mufaddal_vohra) April 15, 2024 వీరిద్దరి తుఫాన్ ఇన్నింగ్స్ చూసి ఆరెంజ్ ఆర్మీ కేకలతో స్టేడియం హోరెత్తిపోగా.. ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం జరుగుతున్న పరుగుల విధ్వంసాన్ని చూడలేక తమలో తామే మదనపడిపోతూ సతమతమయ్యారు. అభిమానుల పరిస్థితే ఇలా ఉంటే.. మరి ఆర్సీబీ బౌలర్లు, ఫీల్డర్ల పరిస్థితి ఇంకెలా ఉంటుంది? వికెట్ తీయడం సంగతి దేవుడెరుగు.. ముందు పరుగుల ప్రవాహానికి కట్టడి చేయడం ఎలా అని తలలు పట్టుకున్నారంతా! కాలితో తంతూ ఆగ్రహం వెళ్లగక్కిన కోహ్లి ఇక ఆర్సీబీ ముఖచిత్రంగా భావించే స్టార్ విరాట్ కోహ్లి అయితే తీవ్ర అసహానికి లోనయ్యాడు. రైజర్స్ బ్యాటర్లు తమ సొంత మైదానంలో దుమ్ములేపుతుంటే అస్సలు చూడలేకపోయాడు. ఏ దశలోనూ వారిని కట్టడి చేయలేక బౌలర్లు చేతులెత్తేస్తుంటే గాల్లోకి కాలితో పంచ్లు విసురుతూ కోపాన్ని వెళ్లగక్కాడు. అదే సమయంలో వికెట్ పడినప్పుడల్లా జట్టును ఉత్సాహపరుస్తూ.. చప్పట్లు కొడుతూ సంతోషం వ్యక్తం చేశాడు. సన్రైజర్స్ బ్యాటింగ్ పూర్తయ్యేంత వరకు కోహ్లి ఇచ్చిన వైవిధ్యమైన ఎక్స్ప్రెషన్స్, రియాక్షన్స్ చూసి ఫ్యాన్స్.. ‘‘అయ్యో పాపం ఆర్సీబీ’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. Everyone's mental health after watching RCB bowlers #RCBvsSRH pic.twitter.com/dSy38RctKC — Rohan Naik (@RohanNaik_) April 15, 2024 ఆర్సీబీ బౌలర్లపై ఫ్యాన్స్ మండిపాటు ఇలాగే ఆడితే ఆర్సీబీ ఈసారి కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరదంటూ ఆర్సీబీ బౌలర్లను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. కాగా బెంగళూరులో సోమవారం జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలో తమ రికార్డును తామే బ్రేక్ చేసి.. అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా చరిత్రకెక్కింది. ఇక లక్ష్య ఛేదనలో కోహ్లి(42), ఫాఫ్ డుప్లెసిస్(28 బంతుల్లో 62) శుభారంభం అందించినా.. మిడిలార్డర్ పూర్తిగా విఫలమైంది. ఇక ఆఖర్లో దినేశ్ కార్తిక్(35 బంతుల్లో 83) విధ్వంసకర అర్ధ శతకం బాదినా.. అనూజ్ రావత్(14 బంతుల్లో 25 నాటౌట్) మెరుపులు మెరిపించినా లక్ష్యాన్ని ఛేదించడంలో ఆర్సీబీ విఫలమైంది. ఫలితంగా 25 పరుగుల తేడాతో ఓడిపోయి వరుసగా ఐదో పరాజయం నమోదు చేసింది. చదవండి: #T20WorldCup2024: రోహిత్తో ద్రవిడ్, అగార్కర్ చర్చలు.. హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); A 1⃣0⃣8⃣m monster! 💥 The bowlers can finally breathe at the Chinnaswamy as the batting carnage comes to an end! 🥶 Recap the match on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #RCBvSRH pic.twitter.com/lclY9rs2Kf — IndianPremierLeague (@IPL) April 15, 2024
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019