breaking news
-
'ఆ ఒక్క పదం తెచ్చిన తంటా'.. వాళ్లిద్దరిపై మండిపడ్డ హీరోయిన్!
ఇటీవల డార్లింగ్ అనే పదంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. టాలీవుడ్ నటుడు ప్రియదర్శి, హీరోయిన్ నభా నటేశ్ మధ్య ట్వీట్ వార్ కొనసాగిన సంగతి తెలిసిందే. పరిచయం లేని మహిళలను డార్లింగ్ అని పిలిస్తే వేధింపులకు కిందకు వస్తుందని నభా పోస్ట్ చేసింది. ప్రియదర్శి సైతం లైట్ తీస్కో డార్లింగ్ అంటూ రిప్లై కూడా ఇచ్చారు. తాజాగా వీరిద్దర మధ్య జరిగిన ఇంటరాక్షన్లో మరో హీరోయిన్ ఎంటరైంది. అదేంటో ఓ లుక్కేద్దాం. ప్రియదర్శి, నటి నభానటేశ్ గొడవలోకి నటి రీతూవర్మ ఎంట్రీ ఇచ్చింది. నా కామెంట్స్ సెక్షన్లో మీ పంచాయతీ ఏంటి? అని ఆమె ఇద్దరిని ప్రశ్నించింది. అసలేం జరిగిందంటే.. ఇటీవల కొద్ది రోజుల క్రితం హీరోయిన్ రీతూవర్మ ఓ ఫొటోషూట్కు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేశారు. ఆ పోటోలు చూసిన ప్రియదర్శి స్పందించారు. 'వావ్ రీతూ డార్లింగ్.. ఎంత అందంగా ఉన్నావో. నీ అందానికి ముగ్ధుడనయ్యా. మాటలు రావడం లేదు' అని కామెంట్ చేశారు. అయితే ఇది చూసిన నభా నటేశ్ మళ్లీ స్పందించింది. ఇతను మళ్లీ మొదలుపెట్టాడు.. ఆడవాళ్ల కామెంట్ సెక్షన్పై ఉన్నట్టుండి ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రతి ఒక్కరనీ డార్లింగ్ అని పిలవడమేంటని అసహనం వ్యక్తం చేసింది. నేను ఎవరినైనా డార్లింగ్ అని పిలిస్తే నీకేంటని ప్రియదర్శి బదులిచ్చారు. తాజా సంభాషణపై రీతూవర్మ కూడా రియాక్ట్ కావాల్సి వచ్చింది. నా కామెంట్ సెక్షన్లో మీ ఇద్దరి గొడవ ఏంటని నిలదీసింది. ప్రస్తుతం వీరి గొడవ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మొత్తానికి నెటిజన్స్కు ఫుల్ ఎంటర్టైనింగ్ ఉన్నప్పటికీ ఇందతా సినిమా ప్రమోషన్స్ కోసమేనని చర్చించుకుంటున్నారు. View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) Ahaa! Do not cross the line! Chuskundham.. https://t.co/8mwOpLC0di — Nabha Natesh (@NabhaNatesh) April 17, 2024 -
పెళ్లిచూపులు హీరోయిన్ బర్త్డే స్పెషల్ ఫోటోలు..
-
షూటింగ్లో గొడవ.. తెలుగు యంగ్ హీరో కారుని అడ్డుకున్న కూలీలు
తెలుగు యంగ్ హీరో శ్రీవిష్ణుకు కొందరు కూలీలు షాకిచ్చారు. కొత్త సినిమా షూటింగ్లో భాగంగా అనుకోని సంఘటన ఎదురైంది. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలోని బనగానెపల్లె మండలం యాగంటి క్షేత్రంలో సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొనేందుకు కోసం కొందరు కూలీలని చిత్రబృందం తీసుకొచ్చింది. అయితే పూర్తయిన తర్వాత వాళ్లకు వేతనం ఇచ్చే విషయం కాస్త ఆలస్యమైంది. (ఇదీ చదవండి: టాలీవుడ్ లక్కీ హీరోయిన్ పెళ్లి చేసుకోనుందా? అందుకే ఇలా!) ఈ క్రమంలోనే తమకు రావాల్సిన డబ్బు ఇంకా రాలేదని దాదాపు 400 మంది కూలీలు.. షూటింగ్ లొకేషన్లో ఆందోళన చేశారు. అటుగా వెళ్తున్న హీరో కారుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సీన్లోకి ఎంటరైన పోలీసులు.. కూలీలకు సర్దిచెప్పారు. హీరోకు ఈ విషయంతో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. అతడు కారుని పోనిచ్చారు. ఆ తర్వాత వివాదం కూడా సద్దుమణిగింది. గతేడాది 'సామజవరగమన' సినిమాతో హిట్ కొట్టిన శ్రీవిష్ణు.. ప్రస్తుతం పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు తెలుగమ్మాయి రీతూవర్మ కూడా గతేడాది 'మార్క్ ఆంటోని', 'ధృవ నక్షత్రం' లాంటి మూవీస్తో ప్రేక్షకుల్ని పలకరించింది. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న మూవీకే తాజాగా సమస్య ఎదురైంది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'యానిమల్'.. అనుకున్న టైమ్ కంటే ముందే స్ట్రీమింగ్?) -
పెళ్లి చూపులు భామ ధరించిన గూలబీ రంగు చీర ఎంతంటే..
రితు వర్మకు నటన ఒక ప్యాషన్. అందుకే రాశి కన్నా వాసికే విలువ ఇస్తుంది. మంచి పాత్రలతో చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. ఫ్యాషన్ విషయంలో కూడా స్టయిల్ కన్నా సౌకర్యానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇండస్ట్రీలో పనిచేస్తున్నామంటే మన లుక్ను పర్ఫెక్ట్గా మెయిన్టేన్ చేయాల్సిందే! అలాగయితేనే ఇండస్ట్రీలో నెగ్గుకురాగలం అంటోంది రితు వర్మ. ఇక ఆమె కంఫర్ట్గా ఫీలయ్యే బ్రాండ్స్లో ఓ రెండిటి గురించి.. మద్దిన్ మధురిత దత్తా, స్తాంజిన్ డాజిస్.. బిజినెస్ పార్ట్నర్సే కాదు మంచి స్నేహితులు కూడా! ఫ్యాషన్ పై వారికి ఉన్న అభిరుచి, ఆలోచనలు ఏకమవడంతో ఇద్దరూ కలసి కెరీర్ను స్టార్ట్ చేశారు. ముంబైలోని ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసి, 2012లో తమ ఇద్దరి పేరుతోనే ఫ్యాషన్ హౌస్ను ప్రారంభించారు. ఎక్కువగా చేనేత కళాకారులు నేసిన ఫ్యాబ్రిక్నే ఉపయోగిస్తారు. ప్రకృతి నుంచి ప్రేరణ పొందిన, సంప్రదాయ డిజైన్స్లో వీరిది పెట్టింది పేరు. ఈ బ్రాండ్ వేర్ ధర కాస్త ఎక్కువే. ఆన్లైన్లోనూ అందుబాటులో ఉంటుంది. శీతల్ జవేరి జ్యూయెల్స్.. నాటి.. ప్రసిద్ధ జ్యూలరీ బ్రాండ్స్లో శీతల్ జవేరి జ్యూయెల్స్ ఒకటి. నాణ్యత, నైపుణ్యమే దీని బ్రాండ్ వాల్యూ. సంప్రదాయ నగలతోపాటు మోడర్న్ డిజైన్స్ కూడా ఇక్కడ లభిస్తాయి. ధర క్వాలిటీ, డిజైన్స్ పై ఆధారపడి ఉంటుంది. ఆన్లైన్లోనూ లభ్యం. ఈ శీతల్ జవేరి జ్యూయెల్స్ బ్రాండ్ ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. (చదవండి: క్యూట్లుక్తో కట్టిపడేసే కృతి సనన్ ధరించిన గులాబీ రంగు చీర ఎంతంటే..) -
మెగా హీరోతో రిలేషన్లో రీతూ వర్మ.. క్లారిటీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్!
మెగా ఫ్యామిలీ ఇంట ఏ సెలబ్రేషన్స్ జరిగినా అక్కడ వాలిపోయేది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. నిహారిక స్నేహితురాలిగా తరచూ వారి ఇంటి వేడుకల్లో కనిపించేది. కానీ జనాలు మధ్య సమ్థింగ్ సమ్థింగ్ జరుగుతోందని అనుమానపడ్డారు. అన్నట్లుగా వరుణ్-లావణ్య షికార్లకు వెళ్లడం, వీరిద్దరి మధ్య లవ్వాయణం నడుస్తోందని ప్రచారం జరగడం.. చివరకు అదే నిజమంటూ పెళ్లి చేసుకోవడం కూడా అయిపోయింది. అయితే ఆ మధ్య వరుణ్-లావణ్యల పెళ్లికి అల్లు అర్జున్ ప్రీవెడ్డింగ్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో టాలీవుడ్ హీరోయిన్ రీతూ వర్మ కూడా ఉంది. దీంతో ఆమె మెగా హీరోతో రిలేషన్లో ఉందని వార్తలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వైష్ణవ్ తేజ్ ఈ రూమర్స్పై క్లారిటీ ఇచ్చాడు. రీతూ వర్మ.. లావణ్య స్నేహితురాలు.. అందుకనే పార్టీకి వచ్చింది. పెళ్లి వేడుకల్లోనూ సందడి చేసింది. అంతకుమించి ఏమీ లేదు అని చెప్పుకొచ్చాడు వైష్ణవ్ తేజ్. కాగా మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ నటించిన తాజా చిత్రం ఆదికేశవ. శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ సినిమా నవంబర్ 10న విడుదల కావాల్సింది. కానీ క్రికెట్ వరల్డ్ కప్ ప్రభావం సినిమాలపై పడుతుందన్న ఉద్దేశంతో ఈ చిత్రాన్ని ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు. చదవండి: సినిమాలకు గుడ్బై చెప్పనున్న స్టార్ డైరెక్టర్ కూతురు? వైద్య వృత్తిలోకి ఎంటర్?
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019