breaking news
Ad - Sakshi_Home_Sticky
-
పైథాని చీరలో అదిరిపోతున్న నీతా అంబానీ..ఆ చీర స్పెషల్ ఏంటంటే..!
రిలయన్స్ దిగ్గజం ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమర్థవంతమైన బిజినెస్ విమెన్గానూ, ఓ మంచి గృహిణిగా తల్లిగా, అన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ దూసుకుపోతున్న శక్తిమంతమైన మహిళ ఆమె. రాబోయే తరాలకు స్పూర్తి ఆమె. అలాగే ఎప్పటికప్పుడూ ట్రెడిషన్కి తగ్గట్టు తనదైన ఫ్యాషన్ లుక్లో కనిపిస్తారు. ఇటీవల చిన్న కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కూడా నీతా స్పెషల్ ఎంట్రాక్షన్గా నిలిచారు. ఆమె ధరించే అత్యంత ఖరీదైన చీరలు, నగలు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాయి కూడా. అలానే ఈసారి నీతా ముఖేష్ అంబానీ కల్చర్ సెంటర్ వార్షికోత్సవంలో ధరించిన చీర కూడా హైలెట్గా నిలిచింది. ఆ చీరకు ఓ స్పెషాలిట కూడా ఉంది. అదేంటంటే..స్టైల్కి స్పెషల్ సిగ్నేచర్ నీతా అంబానీ. హైప్రొఫైల్ వేడుకలకు తగ్గట్టుగా నీతా వస్త్రధారణ ఉంటుంది. ఇటీవల జరిగిన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఏసీసీ) వార్షికోత్సవంలో కూడా అలాంటి ఆకర్షణీయమైన వస్తధారణతో హైలెట్గా నిలిచింది. ఆమె ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర సంప్రదాయం ఉట్టిపడేలా పైథాని చీరలో వచ్చారు. చూపురులందర్నీ కట్టిపడేసేలా స్టన్నింగ్ లుక్లో సందడి చేసింది నీతా. ఈ చీర బంగారు జరీతో అజంతా గుహలను గుర్తుకు తెచ్చేలా పుష్పాలు, పక్షులతో డిజైన్ చేసి ఉంది. చీరల రాణి.. చీర అంతా కూడా కమలా పువ్వులతో డిజైన్ చేసి ఉంది. నాటితరం చీరల నైపుణ్యం చాటిచెప్పేలా ఉంది ఆ చీర. అంతేగాదు మన దేశీ చీరల కళాకారులను గౌరవిద్దాం. చేతి వృత్తులను ప్రోత్సహించేలా వారు తయారు చేసిన చీరలనే దరిద్దాం అని సోషల్మీడియవేదికగా నీతా పిలుపునిచ్చారు. నిజానికి ఈ పైథాని చీరు మహారాష్ట్ర రాయల్ చీరగా పరిగణించే చీరల్లో ఒకటి. ఈ పైథాని చీరను స్వచ్ఛమైన పట్టుతో రూపొందిస్తారు. ఈ చీర డిజైన్ ముందు వైపు కనిపించినట్లే వెనుకవైపు డిజైన్ స్పష్టంగా కనిపిస్తుంది. చక్కగా చేతితో నేసిన చేనేత వస్త్రం. ఈ చీర నేయాలంటే కళాకారుల వద్ద మంచి నైపుణ్యం ఉండాల్సిందే. ఇది భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా కళాకారులు చాలా శ్రమతో ఈ పైథాని చీరలను రూపొందిస్తారు. దీన్ని చీరల రాణిగా పిలుస్తారు. అలాగే ఈ చీరను నకిలీ చేయడం కూడా అంత ఈజీ కాదు. ఇక ఇక్కడ నీతా కూడా భారతీయ కళలను ప్రోత్సహించడం కోసం ఏర్పాటు చేసిన ఈ నీతా ముఖేష్ అబానీ కల్చర్ సెంటర్(ఎన్ఎంఏసీసీ) వార్షిక వేడుకలో దీన్నే గుర్తు చేసేలా ఆ పైథాని చీరతో కనిపించారు. అంతేగాదు మన భారతీయ కళల గొప్పదనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేశారు ఆమె. ఏ వేడుకైన హైలెట్ కావాలన్న, దాని ప్రాముఖ్యత తెలియజెప్పాలన్నా.. అందుకు తగ్గ వస్త్రాధారణతోనే సాధ్యమని నీతా చెప్పకనే చెప్పారు. దటీజ్ నీతా అంబానీ కదూ..! (చదవండి: సమ్మర్లో డీహైడ్రేషన్కు చెక్పెట్టేవి ఇవే..!) -
పోటెత్తుతున్న యూజర్లు.. జియోకు కొత్తగా 42 లక్షల సబ్స్కైబర్లు
ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో సబ్స్కైబర్లతో దూసుకుపోతుంది. ట్రాయ్ (TRAI) విడుదల చేసిన తాజా టెలికాం గణాంకాల ప్రకారం.. రిలయన్స్ జియో ఈ ఏడాది జనవరి నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 2.59 లక్షలకు పైగా చందాదారులు కొత్తగా వచ్చి చేరారు. జనవరిలో జియో అత్యధికంగా 2,59,788 మొబైల్ చందాదారులను చేర్చుకుంది. దీంతో జియో కస్టమర్ల సంఖ్య 3.24 కోట్లకు చేరుకుంది. ఇదే నెలలో ఎయిర్టెల్కు 1.18 లక్షల మంది చేరారు. వోడాఐడియా 44,649 మంది, బీఎస్ఎన్ఎల్ 16,146 మంది కస్టమర్లను కోల్పోయాయి. జనవరి నెలలో దేశవ్యాప్తంగా జియోలో అత్యధికంగా 41.78 లక్షల మంది కొత్త చందాదారులు చేరారు. ఎయిర్టెల్లో 7.52 లక్షల మంది చేరగా, వోడాఐడియా,బీఎస్ఎన్ఎల్లు తమ కస్టమర్లను కోల్పోయాయి. ఈ గణాంకాల ప్రకారం జనవరి 2024 నాటికి దేశంలో మొత్తం మొబైల్ కస్టమర్ల సంఖ్య 52.67 కోట్లకు చేరుకుంది. -
చేతులు కలిపిన అంబానీ– అదానీ
న్యూఢిల్లీ: బిలియనీర్ పారిశ్రామిక దిగ్గజాలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ తొలిసారి చేతులు కలిపారు. దీనిలో భాగంగా అదానీ పవర్కు చెందిన పవర్ ప్రాజెక్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) 26 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. అంతేకాకుండా మధ్యప్రదేశ్లోని ఈ ప్లాంటుకు చెందిన 500 మెగావాట్ల యూనిట్లో ఉత్పత్తయ్యే విద్యుత్ను ఆర్ఐఎల్ సొంత అవసరాలకు వినియోగించుకునేందుకు రెండు సంస్థలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. వెరసి అదానీ పవర్ పూర్తి అనుబంధ సంస్థ మహన్ ఎనర్జెన్ లిమిటెడ్లో 5 కోట్ల ఈక్విటీ షేర్లను ఆర్ఐఎల్ సొంతం చేసుకోనుంది. రూ. 10 ముఖ విలువకే(రూ. 50 కోట్లు) వీటిని చేజిక్కించుకోవడంతోపాటు.. 500 మెగావాట్ల విద్యుత్ను సొంత అవసరాలకు ఆర్ఐఎల్ వినియోగించుకోనుంది. సొంత వినియోగ పాలసీలో భాగంగా ఆర్ఐఎల్ 20 ఏళ్ల దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని(పీపీఏ) ఎంఈఎల్తో కుదుర్చుకున్నట్లు అదానీ పవర్ వెల్లడించింది. మొత్తం 2,800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఎంఈఎల్ ప్లాంటులో 600 మెగావాట్ల యూనిట్ను సొంత అవసరాల పద్ధతిలో తెరతీయనున్నట్లు వివరించింది. -
బిజినెస్: నష్టాల్లోంచి లాభాల్లోకి..
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, అధిక వెయిటేజీ రిలయన్స్(1.25%), ఐటీసీ(1.50%), ఎస్బీఐ(2%) షేర్లు రాణించడంతో సూచీలు ఆరంభ నష్టాలు భర్తీ చేసుకోగలిగాయి. అయితే రూపాయి క్షీణత, చిన్న కంపెనీల షేర్లలో అమ్మకాలు సూచీల భారీ లాభాలకు అడ్డుకట్టవేశాయి. తొలిసెషన్లో అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. యూరప్ మార్కెట్ల సానుకూల ప్రారంభంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ట్రేడింగ్లో 729 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్ చివరికి 90 పాయింట్ల లాభంతో 72,102 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 71,674 కనిష్టాన్ని, 72,403 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 221 పాయింట్ల రేంజ్లో 21,931 వద్ద గరిష్టాన్ని, 21,710 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. ఆఖరికి 22 పెరిగి 21,839 వద్ద నిలిచింది. రెండు నెలల కనిష్టానికి రూపాయి.. డాలర్ మారకంలో రూపాయి విలువ 16 పైసలు క్షీణించి 83.19 వద్ద నిలిచింది. ఈ ముగింపు స్థాయి రెండు నెలల కనిష్టం. ట్రస్ట్ ఫిన్టెక్ @ రూ.95–101 సాస్ ప్రొడక్ట్ ఆధారిత ఫిన్టెక్ సాఫ్ట్వేర్ సొల్యూషన్లు అందించే ట్రస్ట్ ఫిన్టెక్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రూ. 95–101 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 26న ప్రారంభమై 28న ముగియనుంది.ఆఫర్ ద్వారా కంపెనీ రూ. 63 కోట్లకుపైగా సమీకరించే యోచనలో ఉంది. ఇవి చదవండి: ప్రతి మూడు నెలలకు ఓ కొత్త కారు -
పెళ్లికొడుకు వాచ్పై కన్నేసిన జూకర్బర్గ్ దంపతులు.. ధర ఎంతో తెలుసా..
అంబానీ ఇంట వివాహ వేడుకలు ఇటీవలే ముగిశాయి. అనంత్ అంబానీ-రాధికమర్చంట్ ప్రివెడ్డింగ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రముఖులు, సినీతారలు, ప్రపంచ వ్యాపారవేత్తలు పాల్గొని అలరించిన సంగతి తెలిసిందే. అయితే ప్రివెడ్డింగ్ వేడుకలు ముగిసినా అందుకు సంబంధించిన వార్తలు రోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్కి హాజరైన వారిలో ఫేస్బుక్ అధినేత మార్క్జూకర్బర్గ్ దంపతులు కూడా ఉన్నారు. పెళ్లికొడుకు ధరించిన వాచ్ చూసి వారు దాని వివరాలు అడిగి తెలుసుకుంటున్న వీడియో ఒకటి వైరల్గా మారింది. అనంత్ అంబానీ చేతి గడియారాన్ని గమనించిన మార్క్ భార్య ప్రిస్కిల్లా.. అది చాలా బాగుంది అని అనంత్కు కితాబిచ్చినట్లు తెలిసింది. దానికి జుకర్బర్గ్ అంగీకరిస్తూ తాను ఇప్పుటికే ఆ విషయాన్ని అనంత్కు చెప్పానని జవాబిచ్చారు. దాన్ని ఎవరు తయారు చేశారని ఆమె అడగ్గా.. రిచర్డ్ మిల్లే అని అనంత్ బదులిచ్చాడు. Zuckerberg and wife going gaga over Anant Ambani’s watch (Richard Mille) worth 12-15 crores INR. FYI Anant also has a Patek Philippe Grand Complication Sky Moon Tourbiillion - ₹ 63 crores and a Grand Master Chimes - ₹66 crores 😂 😂 pic.twitter.com/65gwALBGwG — Pakchikpak Raja Babu (@HaramiParindey) March 3, 2024 ఈ వీడియో వైరల్ అయిన వెంటనే పలువురు ఆ వాచ్ ధర, కంపెనీ గురించి సోషల్ మీడియాలో ఆరా తీయడం ప్రారంభించారు. దాని ఖరీదు రూ.15 కోట్లు ఉంటుందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఎక్స్లోని ఒక పోస్ట్ ప్రకారం.. ఆ రిచర్డ్ మిల్లే ఆర్ఎం 56-02 వాచ్ విలువ రూ.15-18 కోట్లు ఉంటుందని అంచనా. అనంత్కు పటెక్ ఫిలిప్ గ్రాండ్ కాంప్లికేషన్ స్కై మూన్ టూర్బిల్లాన్ కూడా ఉంది. దీని ధర రూ.63 కోట్లుగా ఉందని తెలిసింది. ఇదీ చదవండి: అమృత‘మూర్తి’కి అరుదైన గౌరవం
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019