breaking news
-
దిక్కుతోచని కుటుంబం దిశ మారింది..!
ఆ ఇంటి యజమాని ఓ ప్రైవేట్ డ్రైవర్. తన సంపాదనతోనే సంసారాన్ని నెట్టుకొచ్చేవాడు. ఆ కుటుంబంలో తల్లి, భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. అరకొర సంపాదన తిండికే సరిపోయేది కాదు. తల్లికి రూ.200 మాత్రమే వితంతు పింఛన్ వచ్చేది. భార్య ఎంఏ, బీఈడీ చదివింది. నాలుగురాళ్లు వెనకేసుకుని పిల్లలను బాగా చదివించుకోవాలనే ఆశ ఉన్నా... సర్కారు సహకారం కొరవడింది. ఇదీ గతంలో అనంతపురం జిల్లాలోని అనంతపురం రూరల్ మండలం పాపంపేటకు చెందిన వెన్నపూస ఓబిరెడ్డి కుటుంబ పరిస్థితి. ఎన్నో ఒడుదుడుకులను తట్టుకుంటూ నెట్టుకు వచ్చిన ఈ కుటుంబం నేడు వైఎస్సాసీపీ ప్రభుత్వ సహకారంతో సుఖసంతోషాలతో జీవిస్తోంది. – అనంతపురం 2014 ఎన్నికల సమయంలో టీడీపీకి ఓట్లు వేస్తే డ్వాక్రా రుణాలు, బంగారు రుణాలు మాఫీ చేస్తామని, ఇంటికో ఉద్యోగం లేదా ప్రతినెలా రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ మాటలతో ఓబిరెడ్డి కుటుంబం గంపెడు ఆశలు పెట్టుకుంది. తీరా ఆయన డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు. వారి హామీతో మూడు నెలలు అప్పు కట్టలేదు. నెలనెలా వడ్డీ పెరుగుతోందని బ్యాంకు సిబ్బంది హెచ్చరిస్తూ వచ్చేవారు. ఒకవేళ మాఫీ చేసినా..మీరు చెల్లించిన సొమ్ము వెనక్కు ఇస్తామని, మాఫీ చేయకపోతే వడ్డీ మీ నెత్తిన పడుతుందని చెప్పారు. దీంతో సభ్యులంతా మాట్లాడుకుని అప్పు కడుతూ వచ్చారు. అలాగే ఇంట్లో ఉన్న బంగారమంతా బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.70 వేలు రుణం తీసుకున్నారు. అదికూడా మాఫీ కాలేదు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన ఈ నాలున్నరేళ్లలో మొత్తం రూ.7,36,000 మేరకు ఆర్థిక సహాయాన్ని పొందారు. వైఎస్సార్ ఆసరా కింద భార్యకు రూ.44 వేలు వచ్చింది. వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చారు. ఇంటి పెద్ద కన్నుమూయగా వైఎస్సార్ బీమా కింద రూ.లక్ష వచ్చింది. యానిమేటర్గా ఉద్యోగం ఇచ్చారు. ఇంట్లో ఇద్దరికి పింఛన్ వస్తోంది. ఇప్పుడు తమ కుటుంబం ఆనందంగా గడుపుతోందని ఓబిరెడ్డి ప్రమీల చెప్పారు. ‘సంక్షేమం’ లేకుండా సుస్థిరాభివృద్ధి అసాధ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయి. దేశంలో ఎక్కడైనా ఈ సంక్షేమ పథకాలు అమలు చేయకుండా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించడం అసాధ్యం. ఏపీ ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేని విధంగా అమలు చేస్తున్న నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు చేరువలో ఉన్నాయి. వీటిద్వారా సగటు మానవుని జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయి. – గుర్రం జయపాల్రెడ్డి, జెడ్పీ రిటైర్డ్ సీఈఓ ఓబిరెడ్డి కుటుంబానికి కలిగిన లబ్ధి ఇలా... పథకం టీడీపీలో వైఎస్సార్సీపీలో డ్వాక్రా రుణమాఫీ 00 రూ.44 వేలు పింఛన్ రూ.62,000 రూ.1.89 లక్షలు ఆరోగ్యశ్రీ 00 రూ.60 వేలు వైఎస్సార్బీమా 00 రూ.1 లక్ష సున్నా వడ్డీ 00 రూ.8 వేలు విద్యా దీవెన 00 రూ.25 వేలు వసతి దీవెన 00 రూ.15 వేలు అమ్మ ఒడి 00 రూ.55 వేలు నిరుద్యోగ భృతి రూ.4 వేలు 00 యానిమేటర్ 00 రూ.2.40 లక్షలు -
అప్పులు లేకుండా ఆనందంగా..
ఉన్నది 20 సెంట్ల భూమి. కౌలుకు మరో ఎకరం దేవదాయ శాఖ భూమి. అదే ఆ కుటుంబానికి ఆధారం. సమయానికి విత్తుకుంటే సరేసరి... లేదంటే అంతేమరి. ప్రకృతి సహకరిస్తే నాలుగు వేళ్లు నోట్లోకెళ్లేది. లేదంటే అప్పులకోసం తప్పని తిప్పలు. తరువాత వాటిని తీర్చడానికి నానా అగచాట్లు. చినుకు రాలకుంటే ఆవేదన... అతిగా వానపడితే ఆందోళన. అదనుకు విత్తనం దొరక్కున్నా... అవసరం మేరకు ఎరువులు లభించకపోయినా... ఆ ఏడాదంతా బతుకు దినదిన గండమే. ఇదీ శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం గోకర్ణపురానికి చెందిన కర్తల చిరంజీవులు కుటుంబ పరిస్థితి. ఆయనకు భార్య, ఇద్దరు కొడుకులు. తోడబుట్టిన చెల్లెలు వారితోనే. కుటుంబమంతా కష్టపడితేనే కడుపునిండేది. లేకుంటే పస్తులే గతి. అలాంటి కుటుంబానికి ప్రభుత్వాల సాయం ఎంతో అవసరం. –కంచిలి 2019లో రాష్ట్రంలో వెఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక పరిస్థితులన్నీ చక్కబడ్డాయి. కుటుంబం ఆర్థి కంగా నిలదొక్కుకుంది. అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి సాయం అందింది. వ్యవసాయం పండగైంది. అవసరమైన పెట్టుబడి అదనుకు ముందే అందుతోంది. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు రోజుల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేదు. సొసైటీ గోదాముల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఇంటి ముంగిటకే రైతు భరోసా కేంద్రాల ద్వారా అవి వచ్చిచేరుతున్నాయి. పండించిన పంటకు ఈ క్రాప్లో నమోదు కావడంతో మద్దతు ధరకే ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ప్రకృతి పగబట్టి పంటను తినేస్తే నష్టపరిహారం సొమ్ము ఆ సీజన్ ముగియక ముందే అందుతోంది. ఇంటి ఇల్లాలు రత్నానికి వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత కింద ఏటా నగదు ఖాతాలో పడుతోంది. సోదరి రుక్మిణమ్మకు ఒంటరి మహిళ పింఛన్ వస్తోంది. గడచిన నెలలో వివాహమైన పెద్దకొడుకు మాధవరావుకు కల్యాణ మస్తు పథకం కింద రూ. 50వేలు అందింది. చిన్నకొడుకు జోగారావు కిడ్నీలో రాళ్లు చేరితే డాక్టర్లు రూ. 50వేలు ఖర్చవుతుందన్నారు. పైసా ఖర్చులేకుండా ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్రచికిత్స జరిగింది. ఇప్పుడు ఏ సమస్య వచ్చినా దానిని ప్రభుత్వ సాయంతో ఎదుర్కోగలమన్న నమ్మకం ఏర్పడింది. బతుకుపై భరోసా దక్కింది. ఆర్థిక సమస్యలు తీరాయి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే మా ఆర్ధిక సమస్యలు తీరాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క నయాపైసా సాయం అందలేదు. వ్యవసాయ ఖర్చులు మొదలుకొని, కుటుంబ అవసరాలకు సైతం ఇబ్బంది పడేవాళ్లం. చిన్నపాటి అవసరానికీ అప్పులు చేయాల్సి వచ్చేది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతీ నెల ఇంచుమించు ఏదో ఒక పథకం ద్వారా ఆర్థిక సాయం అందుతోంది. తద్వారా మేము నిశ్చింతంగా జీవిస్తున్నాం. మా కుటుంబానికి ఈ ఐదేళ్ల కాలంలో నాలుగు లక్షలకు పైబడి లబ్ధి చేకూరింది. – కర్తల చిరంజీవులు -
నిస్సహాయ స్థితిలో పెద్దదిక్కులా
సిఫార్సు లేకుండానే పింఛన్ మంజూరు ఆరు నెలల క్రితమే నా భర్త మృతి చెందారు. వలంటీర్ వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారు. ఎలాంటి సిఫార్సులు లేకుండానే పింఛన్ మంజూరైంది. ఎవరికీ రూపాయి లంచం ఇవ్వలేదు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్, పింఛన్ సొమ్ములతో బతుకుతున్నాను. మా లాంటి పేదోళ్లను ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోంది. – తిగిరిపల్లి దమయంతి, వీర్రాజు తల్లి, పెద్దేవం తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామానికి చెందిన తిగిరిపల్లి వీర్రాజు కుటుంబానిది అత్యంత దయనీయ గాథ.. వీర్రాజు, అతని భార్య ఇద్దరూ దివ్యాంగులే. ఇంతలో అతనికి పక్షవాతం రావడంతో కుటుంబం ఒక్కసారిగా ఉపాధి మార్గం కోల్పోయింది. ఆ తరుణంలో వారికి ఈ ప్రభుత్వం అందించిన నవరత్నాలు ఆదుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మోపెడ్పై ఆకుకూరలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడిని. దివ్యాంగుడినైన నాకు నాలుగేళ్ల క్రితం పక్షవాతం వచి్చంది. కుటుంబ పోషణ భారమైంది. నా భార్య బధిరురాలు. ఇప్పుడు జగనన్న దయతో ఇద్దరికీ దివ్యాంగ పింఛన్ అందుతోంది. ఇంటి స్థలం కూడా మంజూరైంది’ అని ఆనందం వ్యక్తం చేశారు. ఆయన తల్లికి రూ.3 వేలు వితంతు పింఛన్ ఇస్తున్నారు. ఇంటి స్థలం ఇవ్వడంతోపాటు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించారు. కుమార్తె చదువుకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వచ్చాయి. అంతేగాకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో వారి పెద్దమ్మాయి దివ్యకు ఉద్యోగం లభించింది. దివ్య డిగ్రీ వరకు చదువుకుంది. ఆమెకు జీఎస్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా ఉద్యోగం ఇచ్చారు. నెలకు రూ.18 వేలు జీతం ఇస్తున్నారు. త్వరలో ఇంటి నిర్మాణం కూడా ప్రారంభిస్తాం అని వీర్రాజు ఆనందం చేస్తున్నారు. –కొవ్వూరు -
ఉన్నత చదువులకు జగనన్న దీవెన
మదనపల్లె పట్టణం ఎస్బీఐ కాలనీకి చెందిన బోనాసి జాన్బాబు మండల పరిధిలోని ఓ చర్చిలో ఫాదర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆయన భార్య బోనాసి రేచల్ గృహిణి. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అత్త వెంకటమ్మ ఆలనాపాలనా కూడా వీరిదే. చర్చికి వచ్చే దాతలు ఇచ్చే అరకొర కానుకలతో కుటుంబ పోషణ భారంగా నడిచేది. ఇలాంటి తరుణంలో పిల్లల చదువులెలా? అన్న భయం వెంటాడేది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ కుటుంబం దిశ తిరిగింది. సంక్షేమ పథకాలు ఆ ఇంటి ఇబ్బందుల్ని పూర్తిగా తొలగించాయి. పాస్టర్ జాన్బాబు పెద్ద కుమారుడు బోనాసి విలియయ్బాబు మదనపల్లె సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ చేశాడు. విద్యాదీవెన కింద రూ.3,28,000, వసతి దీవెన కింద రూ.20,800 అందాయి. దీంతో విజయ్బాబు చదువు సాఫీగా సాగింది. బీటెక్ పూర్తవడంతో విదేశాల్లో ఉన్నత చదువుల కోసం 2023లో విదేశీ విద్యాదీవెన కింద దరఖాస్తు చేసుకున్నారు. రూ.51 లక్షలు మంజూరైంది. ప్రస్తుతం అస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఉన్న మోనాస్ యూనివర్సిటీలో ఎంఎస్ ఫస్టియర్ చదువుతున్నాడు. కుమార్తె బోనాసి ఏంజెల్ ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఆమెకు అమ్మఒడి పథకంలో ఇప్పటి వరకు రూ.75 వేలు లబ్ధి చేకూరింది. చిన్నబ్బాయి బోనాసి బిడియన్ 7వ తరగతి చదువుతున్నాడు. జగనన్న విద్యాకానుక కింద యూనిఫాం, పాఠ్యపుస్తకాలు ఇలా చదువుకు అవసరమైనవన్నీ ప్రభుత్వం ఉచితంగా అందించింది. పైసా ఖర్చు లేకుండానే తన బిడ్డల్ని చదివించుకుంటున్నట్లు జాన్బాబు తెలిపారు. పాస్టర్లకు ఇచ్చే గౌరవ వేతనంతో సగర్వంగా బతుకుతున్నట్లు చెప్పారు. ఆయన అత్త వెంకటమ్మకు రూ.3 వేలు వృద్ధాప్య పింఛన్ అందుతోంది. –మదనపల్లె సిటీ కుటుంబ ఆర్థిక పరిస్థితిలో గణనీయ మార్పు గతంలో పేద, సామాన్య కుటుంబాల పిల్లలు ఉన్నత చదువులు చదవాలంటే కష్టంగా ఉండేది. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, నవరత్నాలు పేదల పాలిట వరాలుగా మారాయి. వీరి జీవన ప్రమాణాలు పెరిగాయి. అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, విద్యాదీవెన, విదేశీ విద్యా దీవెన, వసతి దీవెనలతో పేద పిల్లలు కూడా ఉన్నత చదువులు చదువుతున్నారు. ఇలాంటి విద్యార్థుల ఎదుగుదల, వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితుల్ని సమూలంగా మార్చివేస్తున్నాయి. – ఎం.నాగేంద్ర, రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్, బీటీ కళాశాల, మదనపల్లె కుటుంబసభ్యులతో జాన్బాబు ► జాన్బాబు కుటుంబానికి కలిగిన లబ్ధి విదేశీ విద్యాదీవెన రూ.51,00,000 ►విద్యాదీవెన రూ.3,28,000 ►వసతి దీవెన రూ.20,800 ►అమ్మ ఒడిరూ.75,000 ►సున్నా వడ్డీ రూ.1,167 ►ఇంటి స్థలం రూ.6,00,000 ►పాస్టర్ల గౌరవ వేతనం రూ.1,25,000 -
AP Navaratnalu Scheme: నాడు బతుకు భయం.. నేడు కొండంత ధైర్యం..
అర్చకత్వం వారి వృత్తి. గ్రామంలో ఉన్న శివాలయాన్నే నమ్ముకుని ఓ కుటుంబం జీవిస్తోంది. సొంత భూమి లేదు. కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసే శక్తి లేదు. ఆలయానికి చెందిన రెండెకరాల భూమి వేరేవారి ఆదీనంలో ఉంది. దానిపై వచ్చే ఆదాయం అంతంతమాత్రమే. దేవాలయానికి వచ్చే భక్తులు ఇచ్చిన దక్షిణలతోనే వారి కుటుంబపోషణ సాగుతోంది. దీనికి తోడు పుట్టిన కొడుకు, కూతురు ఇద్దరూ బధిరులే. ఇద్దరిలో కొడుక్కు అతికష్టమ్మీద పెళ్లి చేసినా... కూతురుకు పెళ్లికాక జీవితాంతం తమతోనే గడపాల్సి వస్తోంది. ఆదుకోవాల్సిన గత ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఆ కుటుంబాన్ని ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులనుంచి గట్టెక్కించింది. ఇదీ శ్రీకాకుళం జిల్లా బూర్జ గ్రామానికి చెందిన వారణాసి కుమార స్వామి, శ్యామలాంబ కుటుంబ గాథ. అడగకుండానే.. అన్నీ ఇచ్చిన జగనన్న ప్రభుత్వం 2019లో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక పరిస్థితులన్నీ చక్కబడ్డాయి. కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంది. ఏదో రకంగా ఏడాది పొడవునా ప్రభుత్వం నుంచి సహాయం అందుతోంది. ఇంటి ఇల్లాలు శ్యామలాంబకు వైఎస్సార్ ఆసరా(రుణమాఫీ), వైఎస్సార్ సున్నా వడ్డీ, కుమార స్వామికి పింఛన్, కొడుకు, కూతురుకు దివ్యాంగ పింఛన్లు, కొడుకు చంద్రశేఖర్ కుట్టు పని నేర్చుకోవడంతో మెషీన్ ఉన్నందున జగనన్న చేదోడు అందుతున్నాయి. అతని భార్య పేరున కాలనీలో ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయం అందింది. ఇప్పుడు పనులు పురోగతిలో ఉన్నాయి. వారి పిల్లలు బడికి వెళ్తున్నందున అమ్మ ఒడి నిధులు జమవుతున్నాయి. తమకు ఎలాంటి కష్టం వచ్చినా ఈ ప్రభుత్వం ఆదుకోగలదన్న నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు ఆ కుటుంబం ఎంతో దర్జాగా బతికేస్తోంది. –బూర్జ సుస్థిర ఆర్థిక వ్యవస్థకు దోహదం వైఎస్సార్సీపీ ప్రభు త్వం వచ్చాక అమలు చేస్తు న్న వివిధ రకాల సంక్షేమ పథకాల వల్ల ప్రతీ కుటుంబంలోనూ ఆర్థిక సమస్యలు పరిష్కారం అయ్యాయి. రైతులకు వైఎస్సార్ రైతుభరోసా వల్ల వ్యవసాయం కోసం అప్పు చేయాల్సిన బాధ తప్పింది. వైఎస్సార్ ఆరో గ్యశ్రీ వల్ల నిరుపేదలకు వైద్యం ఉచితంగా అందుతోంది. పిల్లల చదువు తల్లి దండ్రులకు భారం కాకుండా అమ్మ ఒడి, బతుకుపై భరోసా కల్పించేందుకు పింఛన్లు అందుతున్నాయి. ఈ ఆర్థిక సహాయం వల్ల రాష్ట్రంలో సుస్థిర ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతోంది. – కె.కె.కామేశ్వరరావునాయుడు, ఎకనమిక్స్ లెక్చరర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, బూర్జ
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019