breaking news
Ad - Sakshi_Home_Sticky
-
విద్య, వైద్యం, ఉపాధితోనే నిజమైన అభివృద్ధి
భీమవరం/భీమవరం (ప్రకాశం చౌక్): భవనాలు నిర్మించడం, కాలువలు తవ్వడమే అభివృద్ధి కాదని.. అట్టడుగు వర్గాలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు లభిస్తేనే నిజమైన అభివృద్ధి అని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పీసీఆర్ కల్యాణ మండపంలో గురువారం ‘ఓపెన్ మైండ్ ఫర్ బెటర్ సొసైటీ’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ నాడు–నేడు సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తన ఉద్యోగానుభవంలో సంక్షేమం, అభివృద్ధి రెండూ చేసిన ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే రెండేళ్లు కరోనా విపత్తు వల్ల తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వచ్చిందన్నారు. మిగిలిన మూడేళ్ల కాలంలో ఒకపక్క పేదలకు సంక్షేమం, మరోపక్క రాష్ట్రంలో శాశ్వత అభివృద్ధి ప్రణాళికలు రచించారని తెలిపారు. ఐదేళ్లలో సంక్షేమం, అభివృద్ధి రెండూ సమపాళ్లలో జరిగాయనేందుకు ఉదాహరణ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 17 మెడికల్ కళాశాలలు, గ్రామ, వార్డు సచివాలయ భవనాలు, విలేజ్ క్లినిక్లు, ఆస్పత్రి భవనాలు అని వివరించారు. చంద్రబాబు హయాంలో పేదరికం నిష్పత్తి 7.7 శాతం ఉంటే.. జగన్ పాలనలో 4.19 శాతానికి తగ్గిందన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి కేవలం రూ.3 వేల కోట్ల పెట్టుబడులు వస్తే.. గడచిన ఐదేళ్లలో రాష్ట్రానికి రూ.78 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. నాడు–నేడు పథకం ద్వారా 45,975 ప్రభుత్వ పాఠశాలలను రూ.18 వేల కోట్లతో అభివృద్థి చేశారన్నారు. ఓపెన్ మైండ్తో చర్చించాలి ఓపెన్ మైండ్ ఫర్ బెటర్ సొసైటీ చైర్మన్, ఏపీ ఉన్నత విద్యా రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ ఎన్.రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో 34వేల ఉద్యోగాలు ఇస్తే.. జగన్ పాలనలో 2.7 లక్షల ఉద్యోగాలు కల్పించారని వివరించారు. 2018–19 వరకు స్థూల రాష్ట్ర ఉత్పత్తి రూ.7,90,800 కోట్లయితే 2023–24లో రూ.11,66,000 కోట్లు అని చెప్పారు. తలసరి ఆదాయం 2018–19లో రూ.1.54 లక్షల కోట్లు అయితే 2023–24లో రూ.2.20 కోట్లకు పెరిగిందన్నారు. ఆర్టీఐ మాజీ కమిషనర్, ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి.విజయబాబు మాట్లాడుతూ.. గత పాలనతో పోలిస్తే మన రాష్ట్రంలో పేదరికం 50 శాతం తగ్గిందన్నారు. పేదల పిల్లలు ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, మాస్టర్ డిగ్రీ వంటి ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు సాధిస్తున్నారని, దీనిని మేధావులు గుర్తించాలని కోరారు. -
మనసున్న మారాజు.. మత్స్యకారుల్లో వెలుగులు
సాక్షి, విశాఖపట్నం, అచ్యుతాపురం: మత్స్యకారులపై మమకారంతో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారి పట్ల మరోసారి ఉదారతను చాటుకున్నారు. ఇప్పటికే మత్స్యకారుల సంక్షేమానికి పలు పథకాలు ప్రవేశపెట్టి వారికి అండగా నిలిచారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.10 వేల భృతి, లీటర్పై రూ.9 డీజిల్ సబ్సిడీ, 50 ఏళ్లకే పెన్షను, వేట సమయంలో ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.10 లక్షల పరిహారం వంటి పలు ప్రయోజనాలను చేకూరుస్తున్నారు. వారికి ఏ కష్టం వచ్చినా వెంటనే ఆదుకుంటున్నారు. గత నవంబర్ 19 అర్ధరాత్రి ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 49 బోట్లు దగ్ధమైన సంగతి తెలిసిందే. బాధిత బోటు యజమానులకు మూడు రోజుల్లోనే భారీ మొత్తంలో రూ.7.11 కోట్ల పరిహారాన్ని అందజేశారు. ఈ బోట్లపై ఆధారపడ్డ కలాసీలు 400 మంది జీవనోపాధి కోసం ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున చెల్లించారు. ఊహించిన దానికంటే ఎక్కువ పరిహారాన్ని అందించడంపై బాధిత మత్స్యకారులు ఎంతగానో ఉబ్బితబ్బిబ్బయ్యారు. తమకు ఈ మేళ్లన్నీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాకే జరుగుతున్నాయన్న ఆనందంలో ఉన్నారు. మత్స్యకారులపై మమకారం గత టీడీపీ ప్రభుత్వం హయాంలో సముద్రంలో మ త్స్యకారుల బోట్లు కాలిపోయినా, మునిగిపోయి నా, తుపాన్లలో దెబ్బతిన్నా పరిహారం సక్రమంగా ఇచ్చేవారు కాదు. ఇచ్చే అరకొర సాయం కూడా ఏళ్ల తరబడి కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందుకు భిన్నంగా మత్స్యకారులపై అభిమానాన్ని చాటుకుంటున్నారు. వారికొచ్చే కష్టాలపై తక్షణమే స్పందించి ఉదారంగా సాయమందిస్తున్నారు. టీడీపీ హయాంలో మునిగిన, అగ్ని ప్రమాదానికి గురైన, తుపాన్లలో దెబ్బతి న్న బోట్లకు కూడా పరిహారం అందించేలా చూడాల ని బాధిత మత్స్యకారులు తాజా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ను కోరారు. దీనిపై ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. స్పందించిన సీఎం బాధిత మత్స్యకారులకు పరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు వివిధ ప్రమాద ఘటనల్లో దెబ్బతిన్న 36 బోట్లకు రూ.1.35 కోట్ల నిధులు విడుదల చేస్తూ మత్స్యశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ఈనెల 16న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ నిధులు జిల్లా కలెక్టర్ అకౌంట్లో జమయ్యాయి. జగనన్న ప్రభుత్వం ఆదుకుంది చేపల వేటే నాకు జీవనాధారం. నేను భార్య, ముగ్గురు పిల్లల్ని పోషించాలి. చేపల్ని పట్టి అమ్ముకుంటే వచ్చే సొమ్ము జీవనానికే సరిపోతుంది. వేట నిషేధ సమయంలో అక్కరకొస్తుందని ఆదా చేద్దామనుకుంటే ఎప్పుడూ వీలయ్యేది కాదు. జగనన్న ప్రభుత్వం వేట నిషేధ సమయంలో రూ.10 వేల మత్స్యకార భరోసా అందిస్తోంది. దాంతో నా కుటుంబాన్ని ఎలాంటి కష్టం లేకుండా పోషించగలుగుతున్నాను. డీజిల్ కొనుగోలుకు సబ్సిడీ ఇవ్వడంతో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాను. –గనగళ్ల దేముడు, పూడిమడక గ్రామం, అచ్యుతాపురం మండలం చంద్రబాబు హయాంలో పస్తులే వేటకెళితేనే కడుపు నిండేది. లేకుంటే పస్తులే. చంద్రబాబు హయాంలో మత్స్యకార భృతి ఎప్పుడో ఇచ్చేవారు. అది కూడా రూ.4 వేలు. వేట నిషేధ సమయంలో అప్పులు చేసి కుటుంబాన్ని పోషించాల్సివచ్చేది. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మత్స్యకార భరోసా కింద రూ.10 వేల పరిహారం నిషేధ కాలంలోనే ఇవ్వడంతో కుటుంబ పోషణకు ఎంతో ఉపయోగపడు తోంది. నాకు ఒక బోటు ఉండడంతో సబ్సిడీపై డీజిల్ అందిస్తున్నారు. ఇది నాకు ఎంతో ఆర్థిక ఉపశమనం కలిగిస్తోంది. –చోడపల్లి సింహాచలం, తంతడి గ్రామం, అచ్యుతాపురం మండలం దెబ్బతిన్న బోట్లు 2014–2019 మధ్య కాలంలో మొత్తం 36 బోట్లు దెబ్బతిన్నాయి. వీటిలో 21 బోట్లు సముద్రంలో మునిగిపోగా, నాలుగు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ఐదు నీటి అడుగున చిక్కుకుపోయాయి. మరో ఆరు బోట్లు ఫిషింగ్ హార్బర్లో ప్రమాదాల పాలై పాక్షికంగా నష్టం వాటిల్లింది. ఇందులో 2014 హుద్హుద్ తుపానుకు మునిగిపోయిన రెండు బోట్లకు, 2018 తిత్లీ తుపానులో మునిగిన మూడు బోట్లకు, 2019 పెథాయ్, జావద్ తుపాన్లకు మునిగిపోయిన 11 బోట్లకు టీడీపీ ప్రభుత్వం పరిహారం చెల్లించలేదు. అప్పుడెప్పుడో టీడీపీ హయాంలో దెబ్బతిన్న బోట్లకు కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాయమందిస్తుండడంపై మనసున్న మారాజు అంటూ సీఎం జగన్ను మత్స్యకారులు కొనియాడుతున్నారు. ఆయన రుణం తీర్చుకుంటామని పేర్కొంటున్నారు. -
మా మంచి జగన్ మామయ్య (ఫొటోలు)
-
యునెస్కోలో ‘మన బడి’పై చర్చ
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వ పాఠశాల మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరిసింది. విద్యపై ప్రభుత్వం చూపిన శ్రద్ధ, సంస్కరణలు మారిన పరిస్థితులు, సాధించిన ఫలితాలు ఇప్పటికే ఐక్యరాజ్య సమితి వరకు చేరగా..తాజాగా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో మనబడి నాడు–నేడుపై చర్చ జరిగింది. ఈనెల 13న యునెస్కో ఆధ్వర్యంలో ప్యారిస్లోని ప్రధాన కార్యాలయంలో ‘గ్లోబల్ ఇంక్లూజివ్ స్కూల్స్ ఫోరమ్’ సదస్సు ప్రారంభమైంది. 90కి పైగా దేశాల నుంచి 400 మంది విద్యా శాఖ ముఖ్య అధికారులు, స్పెషలిస్టులు ఈ సదస్సుకు హాజరయ్యారు. సదస్సులో ఐక్యరాజ్యసమితి స్పెషల్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ ఏపీ ప్రతినిధిగా గురువారం పాల్గొని రాష్ట్రంలో అమలు చేస్తోన్న మనబడి నాడు–నేడుపై వివరించారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ అసమానతలు లేని అన్ని సదుపాయాలతో సమగ్ర విద్య అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో ఏపీ విద్యా సంస్కరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పేదింటి పిల్లలు చదువుకునే బడుల్లో ఇంగ్లిష్ మీడియం అమలు, విభిన్న భాషలు మాతృభాషగా ఉన్న విద్యార్థులు కూడా సులభంగా ఇంగ్లిష్ నేర్చుకునేందుకు వీలుగా బైలింగ్వుల్ పాఠ్యపుస్తకాలు, ప్రతి విద్యార్థి కార్పొరేట్ స్థాయిలో గౌరవంగా చదువుకునేలా యూనిఫాం, బూట్లు అందజేత, పోషక విలువలతో కూడిన గోరుముద్ద, తరగతి గదుల్లో ఐఎఫ్పీలు, విద్యార్థులకు ట్యాబ్స్ వంటి అంశాలు అంతర్జాతీయ ప్రతినిధులను ఆకట్టుకున్నాయని షకిన్ కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. సమగ్ర విద్య మూలస్తంభాల్లో ‘మనబడి నాడు–నేడు’తో వచ్చిన మార్పు ఒకటి అని యునెస్కో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్ వివిఎన్ గైరిస్, ఎడ్యుకేషన్ ఫర్ ఇంక్లూజన్ అండ్ జెండర్ ఈక్వాలిటీ చీఫ్ జస్టీన్ సాస్ అభివర్ణించినట్లు షకిన్ తెలిపారు. -
ప్రగతి దిశగా బాలికా చదువు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాల అంటే బాలికలకు గతంలో ఓ నరకం.. చదువుకుందామని ఆశ ఉన్నా సదుపాయాలు ఉండేవి కావు. కనీసం టాయిలెట్ కూడా లేని దుస్థితి. కౌమార దశ బాలికల పరిస్థితి మరీ దారుణం. దాంతో చాలామంది 8 లేదా 9 తరగతిలోనే చదువు మానేసేవారు. అత్యధిక బాలికల డ్రాప్ అవుట్స్ కూడా ఈ తరగతుల్లోనే ఉండేవి. ఈ సమస్యను గుర్తించిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం బాలికలు చదువుల ఆకాంక్షను నెరవేర్చేందుకు అవసరమైన సదుపాయాలను కల్పించింది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలోను నాడు–నేడు ప్రాజెక్టులో 100 శాతం నిరంతర నీటి సరఫరాతో టాయిలెట్లు, అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేందుకు ప్రత్యేక గదిని అందుబాటులోకి తెచ్చింది. స్కూలు స్థాయిలోనే వారి ఆరోగ్యంపైనా దృష్టిపెట్టి, రక్తహీనత ఉన్న బాలికలకు ఫోలిక్ ఐరన్ మాత్రలను అందిస్తోంది. ఏటా కౌమర దశ బాలికలు 9.74 లక్షల మందికి ‘స్వేచ్ఛ’ పేరిట శానిటరీ న్యాప్కిన్స్ను ఇస్తోంది. ఈ తరహా సేవలు నూరుశాతం అందిస్తున్న రాష్ట్రాల్లో దేశంలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. ఫలితంగా గత నాలుగేళ్లుగా బడుల్లో బాలికల సంఖ్య పెరిగింది. ఉత్తీర్ణతలోనూ వారు ముందున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్స్ సాధనలోనూ బాలురు కంటే బాలికలే ముందున్నారు. బాలికలకు నూరు శాతం సదుపాయాలు పాఠశాల స్థాయిలో డ్రాప్ అవుట్స్కు ప్రధాన కారణం టాయిలెట్లు, గతంలో పట్టణాల్లోని కొన్ని ప్రభుత్వ బడుల్లో మాత్రమే అరకొరగా ఉండేవి. దాంతా విద్యార్థులు, ముఖ్యంగా బాలికలు చాలా ఇబ్బంది పడేవారు. టాయిలెట్ల సదుపాయం లేని చోట్ల కౌమర బాలికలు తమ చదువుకు స్వస్తి పలికేవారు. రాష్ట్ర ప్రభుత్వం మనబడి నాడు–నేడు ప్రాజెక్టు ప్రారంభించి ప్రతి పాఠశాల, జూనియర్ కళాశాలలోను టాయిలెట్ల నిర్మాణం చేపట్టింది. ప్రస్తుతం 49,293 ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో నీటి సరఫరాతో టాయిలెట్లు అందుబాటులోకి వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. 45,137 పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేక గది, టాయిలెట్లు ఉన్నట్టు ప్రకటించింది. ఫలితంగా బాలికల డ్రాప్ అవుట్స్ తగ్గిపోవడమే గాక చేరికలు పెరిగాయి. 2018–19 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బడుల్లో బాలికల సంఖ్య 18,80,591 మంది ఉంటే 2023–24లో 19,26,724 మందికి పెరిగింది. డ్రాప్ అవుట్స్ కూడా 2018–19లో 16.37 శాతం నుంచి 2023–24 నాటికి 12 శాతానికి తగ్గిపోయింది. దీంతో పాటు బాలికల గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) గణనీయంగా పెరిగింది. ‘స్వేచ్ఛ’గా చదువుకునేలా.. దేశంలో 23 శాతం బాలికలు రుతుక్రమ సమయంలో పాఠశాలలు, కళాశాలలకు దూరంగా ఉంటున్నారని అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి ఉండేది, పాఠశాల స్థాయిలో అధిక డ్రాప్ అవుట్స్కు ఇదే కారణంగా ఉండేది. బాలికల డ్రాప్ అవుట్స్కు కారణమవుతున్న రుతుక్రమ ఇబ్బందులను పరిష్కరించేందుకు 2020–21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం ‘స్వేచ్ఛ’ పథకాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఏడు నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న కిశోర బాలికలకు నెలకు 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ ప్యాడ్స్ను పంపిణీ చేస్తోంది. ఏడాదికి 12 కోట్ల ప్యాడ్స్ను బాలికలకు ఉచితంగా అందిస్తున్నారు. 10,144 పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లోని 9,74,121 మంది కౌమార బాలికలకు వీటిని అందిస్తోంది. ఇప్పుడు బాలికల డ్రాప్ అవుట్స్ తగ్గాయి. చదువుపై దృష్టి పెట్టడంతో ఫలితాల సాధనలోనూ బాలురను మించిపోయారు. అమ్మఒడి .. జగనన్న గోరుముద్ద చిన్నారుల చదువుకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా సీఎం జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం అమ్మ ఒడి. ప్రభుత్వంతోపాటు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏటా రూ.15 వేలు క్రమం తప్పకుండా ప్రభుత్వం అందజేస్తోంది. దీనివల్ల విద్యార్థుల హాజరు గణనీయంగా పెరిగింది. దీనికి తోడు రోజుకొక మెనూతో మధ్యాహ్న భోజనం చక్కగా అమలవుతోంది.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019