breaking news
-
సాక్షి మనీ మంత్ర: లాభాలతో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 31 పాయింట్లు లాభపడి 22,368 వద్దకు చేరింది. సెన్సెక్స్ 89 పాయింట్లు ఎగబాకి 73,738 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో నెస్లే, మారుతీ సుజుకీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ, ఐటీసీ, హెచ్యూఎల్, టైటాన్, పవర్గ్రిండ్, ఇన్ఫోసిస్ కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి. సన్ఫార్మా, ఎం అండ్ ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: గ్రీన్లో ఓపెన్ అయిన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ 89 పాయింట్లు లాభపడి 22,421కు చేరింది. సెన్సెక్స్ 310 పాయింట్లు ఎగబాకి 73,947 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 106 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 87.18 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.61 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.87 శాతం లాభపడింది. నాస్డాక్ 1.11 శాతం ఎగబాకింది. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 1.24% నష్టపోయి రూ.1,512.30 దగ్గర స్థిరపడింది. బ్యాంక్ మార్కెట్ విలువ రూ.14,434.12 కోట్లు తగ్గి రూ.11.48 లక్షల కోట్లుగా నమోదైంది. త్రైమాసిక ఫలితాల ప్రభావంతో విప్రో షేరు 2.01% లాభపడి రూ.461.95 దగ్గర ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.4,756.93 కోట్లు పెరిగి రూ.2.41 లక్షల కోట్లకు చేరింది. ఈ రోజు బోర్డు సమావేశాలు ఉన్న కంపెనీల్లో ప్రధానంగా టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా ఎలెక్సీ, ఎంఅండ్ఎం ఫైనాన్షియల్, ఎంసీఎక్స్ ఇండియా, సైయెంట్ డీఎల్ఎం, నెల్కో ఉన్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: తీవ్ర ఒడుదొడుకులు.. గ్రీన్లో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లు శుక్రవారం తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. కానీ చివరికు లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 153 పాయింట్లు లాభపడి 22,149 వద్దకు చేరింది. సెన్సెక్స్ 599 పాయింట్లు ఎగబాకి 73,088 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, మారుతీ సుజుకీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, విప్రో, బజాజ్ ఫిన్సర్వ్, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్యూఎల్, ఎస్బీఐ కంపెనీ షేర్లు భారీగా లాభపడిన జాబితాలో ఉన్నాయి. హెచ్సీఎల్ టెక్నాలజీస్, టాటా మోటార్స్, నెస్లే, టీసీఎస్, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. యుద్ధభయాలు విస్తరించడంతోపాటు ఫెడ్ ఛైర్మన్ కీలక వడ్డీ రేట్ల పెంపుపై వెనకడుగు వేస్తున్నట్లు తెలిసింది. దాంతో మార్కెట్ ఈ రోజు సెషన్లో తీవ్ర ఒడుదొడుకులకు లోనైంది. చివరకు మార్కెట్లు గ్రీన్లోనే ముగిశాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ 155 పాయింట్లు నష్టపోయి 21,835కు చేరింది. సెన్సెక్స్ 529 పాయింట్లు దిగజారి 71,955 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 106.2 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 87 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.63 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.2 శాతం నష్టాలపాలైంది. నాస్డాక్ 0.5 శాతం దిగజారింది. ఎన్ఎస్ఈ ఏప్రిల్ 24 నుంచి నిఫ్టీ నెక్ట్స్ 50 ఇండెక్స్కి సంబంధించిన డెరివేటివ్ కాంట్రాక్టులను ప్రారంభించనుంది. ఇందుకు సెబీ నుంచి అనుమతులు వచ్చినట్లు తెలిపింది. 10 లాట్ సైజుతో 3 నెలల ఇండెక్స్ ఫ్యూచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్ కాంట్రాక్టులను ప్రవేశపెట్టనున్నట్లు, వీటి కాలవ్యవధి ఎక్స్పైరీ నెలలో చివరి శుక్రవారంతో ముగుస్తుందని పేర్కొంది. 2024 మార్చి నాటికి ఈ ఇండెక్స్లో ఆర్థిక సర్వీసుల రంగం స్టాక్స్ వాటా 23.76 శాతంగా, క్యాపిటల్ గూడ్స్ రంగం వాటా 11.91 శాతం, కన్జూమర్ సరీ్వసెస్ వాటా 11.57 శాతంగా ఉంది. 1997 జనవరి 1న ఈ ఇండెక్స్ను ప్రవేశపెట్టారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 103 పాయింట్లు నష్టపోయి 22,044 వద్దకు చేరింది. సెన్సెక్స్ 454 పాయింట్లు దిగజారి 72,488 వద్దకు చేరింది. సెన్సెక్స్ 30 సూచీలో భారతీ ఎయిర్టెల్, పవర్గ్రిడ్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, టాటాస్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్లు మినహా మిగతావి నష్టాల్లోకి చేరుకున్నాయి. నెస్లే, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఐటీసీ, సన్ఫార్మా, బజాన్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలు భారీగా నష్టపోయిన జాబితాలో ఉన్నాయి. యుద్ధభయాలు విస్తరించడం, వడ్డీ రేట్ల దిశపై అనిశ్చితికి తోడు ముడి చమురు ధరలు పెరుగుతుండడంతో కొంత మంది మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపినట్లు తెలిసింది. మ్యూచువల్ ఫండ్లలో ద్రవ్యలభ్యత అధికంగా ఉండటం వల్ల, సూచీలను కొంతవరకు ఆదుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. విదేశీ సంస్థాగత మదుపర్లు మంగళవారం నికరంగా రూ.4,468.09 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.2,040.38 కోట్ల స్టాక్స్ను కొన్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019