breaking news
Ad - Sakshi_Home_Sticky
-
ధోని 3 సిక్స్లు బాదాడు.. అయితే ఏంటి?: పొలార్డ్
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్, టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని గురించి ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆఖరి ఓవర్లో ఎవరైనా హిట్టింగ్ ఆడటం సహజమేనని.. అదేమీ గొప్ప విషయం కాదన్నాడు. ముఖ్యంగా ధోని లాంటి వరల్డ్క్లాస్ ప్లేయర్ల నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ రావడాన్ని బౌలర్ తప్పిదంగా చూడలేమని పొలార్డ్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్ ఆదివారం చెన్నై జట్టుతో తలపడింది. సొంతమైదానం వాంఖడేలో టాస్ గెలిచిన ముంబై సారథి హార్దిక్ పాండ్యా తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. బౌలర్లు చెత్త ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా పేసర్లు పెద్దగా ప్రభావం చూపలేక ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. గెరాల్డ్ కొయెట్జీ(1/35), జస్ప్రీత్ బుమ్రా(0/27) కాస్త మెరుగైన ఎకానమీతో బౌలింగ్ చేయగా.. హార్దిక్ పాండ్యా(2/43), రొమారియో షెఫర్డ్(0/33). ఆకాశ్ మధ్వాల్ (0/37) మాత్రం చెత్తగా ఆడారు. DO NOT MISS MSD 🤝 Hat-trick of Sixes 🤝 Wankhede going berserk Sit back & enjoy the LEGEND spreading joy & beyond 💛 😍 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #MIvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/SuRErWrQTG — IndianPremierLeague (@IPL) April 14, 2024 సీఎస్కే ఇన్నింగ్స్లో ఆఖరి ఓవర్ వేసిన పాండ్యా బౌలింగ్లో ధనాధన్ ధోని హ్యాట్రిక్ సిక్సర్లతో దుమ్ములేపాడు. పాండ్యా సంధించిన బంతులను లాంగాఫ్, లాంగాన్, డీప్ స్క్వేర్ లెగ్ దిశగా సిక్సర్లుగా మలిచి.. మరో రెండు రన్స్ చేసి.. 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్లో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేయగా.. ముంబై 186 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా 20 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో బౌలర్గా, బ్యాటర్(6 బంతుల్లో 2), కెప్టెన్గా విఫలమైన హార్దిక్ పాండ్యాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అతడి బౌలింగ్లో ధోని సిక్సర్లు హైలైట్ కావడంతో.. ముంబై బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ భిన్నంగా స్పందించాడు. ‘‘అవును.. అతడు మూడు సిక్సర్లు కొట్టాడు. చివరి ఓవర్లో 20 పరుగులు తీశాడు. అయితే, ఆఖరి ఓవర్లో ఎవరైనా 20 పరుగులు సాధించగలరు కదా! అందులో వింతేముంది? ఇక ఎంఎస్ చాలా ఏళ్లుగా వరల్డ్క్లాస్ క్రికెటర్గా కొనసాగుతున్నాడు. అలాంటి వ్యక్తి ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటంలో ఆశ్చర్యం లేదు. అతడు మైదానంలో అడుగుపెట్టి షాట్లు బాదుతుంటే చూడటాన్ని మేము కూడా ఆస్వాదిస్తాం. అయితే, ఈరోజు ధోనిని పెవిలియన్కు చేర్చేందుకు మేము రచించిన వ్యూహాలు ఫలితాన్నివ్వలేదు. మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం’’ అని కీరన్ పొలార్డ్ చెప్పుకొచ్చాడు. కాగా ముంబైపై సీఎస్కే విజయంలో కీలక పాత్ర పోషించిన పేసర్ ‘బేబీ మలింగ’ మతీశ పతిరణ(4/28)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. చదవండి: #Hardik Pandya: అతడిదంతా నటన! ధోని సిక్సర్లు కొడుతుంటే అలా.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
#MI: హార్దిక్ రాగానే కోపంగా వెళ్లిపోయిన మలింగ! పొలార్డ్ సైతం..
ముంబై ఇండియన్స్ మ్యాచ్ అంటే చాలు కెప్టెన్ హార్దిక్ పాండ్యానే ట్రెండింగ్లోకి వస్తున్నాడు. సారథిగా తప్పిదాలు చేయడమే గాకుండా.. సీనియర్ల పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తున్నాడంటూ నెటిజన్లు అతడిపై మండిపడుతున్నారు. ఐపీఎల్-2024లో భాగంగా తమ తొలి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో తలపడినపుడు.. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ పొజిషన్ను పాండ్యా పదే పదే మారుస్తూ అతడిని పరుగులు పెట్టించిన విషయం తెలిసిందే. అదే విధంగా.. ప్రధాన పేసర్, ఎంఐ సీనియర్ జస్ప్రీత్ బుమ్రాను కాదని తానే బౌలింగ్ ఎటాక్ ఆరంభించాడు. బ్యాటింగ్ ఆర్డర్లోనూ ఏడో స్థానంలో వచ్చి విమర్శలు మూటగట్టుకున్నాడు. ఇక అహ్మదాబాద్లో జరిగిన ఈ మ్యాచ్లో ముంబై ఆరు పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. తాజాగా ఉప్పల్లో సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లోనూ ఓటమి పాలైంది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్లో 31 రన్స్ తేడాతో ప్రత్యర్థి చేతిలో పరాజయం చవిచూసింది. ఇక్కడ కూడా పాండ్యా.. అరంగేట్ర క్వెనా మఫాకాతో ముంబై బౌలింగ్ ఎటాక్ను ఆరంభించాడు. మరోసారి.. బుమ్రాను పక్కనపెట్టి మూల్యం చెల్లించాడు. Hardik didn't even tried to stop Malinga from getting up and leaving the chair for him. Look at the face of Pollard even he is not comfortable. Pandya doesn't know how to respect seniors. He could have brought new chair 😡😡#MIvsSRH #SRHvMI #RohitSharma𓃵 #klaasen #HardikPandya pic.twitter.com/araISohypL — Rishabh (@iamrishabhNP) March 27, 2024 ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ లసిత్ మలింగతో పాండ్యా ప్రవర్తించిన తీరు చర్చనీయాంశమైంది. మ్యాచ్ అనంతరం కరచాలనం చేస్తున్న సమయంలో మలింగను నెట్టివేసినంత పనిచేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. అనంతరం మరో వీడియో కూడా తెరమీదకు వచ్చింది. ఇందులో బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్, మలింగ కుర్చీల్లో కూర్చుని ఉండగా.. హార్దిక్ అక్కడికి వచ్చాడు. ఇద్దరూ అక్కడి నుంచి లేచి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పొలార్డ్ను చెయ్యిపట్టి ఆపిన మలింగ.. కుర్చీ ఖాళీ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. WHAT. A. MATCH! 🔥 Raining sixes and 500 runs scored for the first time ever in #TATAIPL 💥 Hyderabad is treated with an epic encounter 🧡💙👏 Scorecard ▶️ https://t.co/oi6mgyCP5s#SRHvMI pic.twitter.com/hwvWIDGsLh — IndianPremierLeague (@IPL) March 27, 2024 ఆ తర్వాత ఆ కుర్చీలో కూర్చున్న పాండ్యా పొలార్డ్తో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. అతడు కూడా ముభావంగా ఉన్నట్లు కనిపించింది. ఏదేమైనా.. ముంబై ఇండియన్స్లో ఇప్పుడు పాండ్యా పెత్తనమే నడుస్తోందని.. ఇది ఎవరికీ మింగుడుపడటం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Im the captain 💙 HARDIK 😎 Give me my chair 🪑 #HardikPandya #pollard#malinga#SRHvMI #MIvsSRH pic.twitter.com/gixxZFj7Qn — கீரிபுள்ள 2.0❤️🔥MSD 💛CSK 💛AMARAN🤓 (@ssv__remo) March 27, 2024 -
#MI: బుమ్రాను వద్దన్నారా?.. అందులో తప్పేముంది?
‘‘జట్టుగా ముందుకు వెళ్లాలనుకున్నపుడు కొన్ని కఠిన నిర్ణయాలు అమలు చేయాల్సి ఉంటుంది. గత రెండేళ్లుగా హార్దిక్ గుజరాత్ తరఫున బౌలింగ్ ఎటాక్ ఆరంభిస్తూనే ఉన్నాడు. ఇక్కడ కూడా అంతే. కొత్త బంతిని అతడు బాగా స్వింగ్ చేయగలడు. ఇందులో కొత్తేమీ లేదు. న్యూ బాల్తో కలిగే ప్రయోజనాలను మేము అందిపుచ్చుకోవాలనుకున్నాం. హార్దిక్ ఈ నిర్ణయం తీసుకున్నపుడు నాకేమీ తప్పుగా అనిపించలేదు. అందుకే అలాగే ముందుకు వెళ్లాం’’ అని ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ అన్నాడు. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో హార్దిక్ పాండ్యా సరైన నిర్ణయాలే తీసుకున్నాడని సమర్థించాడు. కాగా ఐపీఎల్-2024ను పరాజయంతో మొదలుపెట్టింది ముంబై ఇండియన్స్. అహ్మదాబాద్లో గుజరాత్తో జరిగిన మ్యాచ్లో ఆరు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా ముంబై కెప్టెన్గా తొలి మ్యాచ్లో హార్దిక్ ఖాతాలో పరాజయం చేరింది. ఈ నేపథ్యంలో గుజరాత్తో మ్యాచ్లో హార్దిక్ పాండ్యా నిర్ణయాలపై విమర్శలు వస్తున్నాయి. జస్ప్రీత్ బుమ్రా వంటి వరల్డ్క్లాస్ పేసర్ ఉండగా.. ఆల్రౌండర్ పాండ్యా బౌలింగ్ ఎటాక్ ఆరంభించడమేమిటని మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటగాళ్ల సేవలను సరిగ్గా వినియోగించుకుంటునే అనుకున్న ఫలితాలు రాబట్టవచ్చని పాండ్యాకు హితవు పలుకుతున్నారు. అదే విధంగా.. లక్ష్య ఛేదనలో భాగంగా హార్దిక్ పాండ్యా ఏడోస్థానంలో రావడాన్ని విమర్శిస్తున్నారు. ఈ విషయాలపై స్పందించిన కోచ్ కీరన్ పొలార్డ్ పాండ్యాకు మద్దతుగా నిలిచాడు. కొత్త బంతితో హార్దిక్ బరిలోకి దిగడం సరైందేననన్న పొలార్డ్.. ఏడో స్థానంలో బ్యాటింగ్కు రావాలన్నది హార్దిక్ ఒక్కడి నిర్ణయం కాదని తెలిపాడు. ‘‘ఏ డెసిషన్ అయినా కలిసే తీసుకుంటాం. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా ఏం చేయాలో ఆలోచిస్తున్నాం. టాపార్డర్ చివరి వరకు బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది. అలా కాని పక్షంలో.. టాప్, మిడిలార్డర్ విఫలమైతే పవర్ హిట్టర్లను కాస్త ఆలస్యంగా పంపిస్తాం. చాలాసార్లు టిమ్ డేవిడ్ మా మ్యాచ్ను ఫినిష్ చేయడం చూసే ఉంటారు. హార్దిక్ కూడా చాలా ఏళ్లుగా ఇదే పని చేస్తున్నాడు. ఆటలో ఇవన్నీ సహజం. ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనా వేయలేం. నిన్న మాత్రం మా వ్యూహాలు సత్ఫలితాలను ఇవ్వలేదంతే’’ అని పొలార్డ్ చెప్పుకొచ్చాడు. చదవండి: #Hardik Pandya: నువ్వేమైనా ధోని అనుకున్నావా?.. నీకిది అవసరమా?: షమీ A game of ᴇʙʙꜱ & ꜰʟᴏᴡꜱ 🫡@gujarat_titans display quality death bowling to secure a remarkable 6️⃣ run win over #MI 👏@ShubmanGill's captaincy starts off with with a W Scorecard ▶️https://t.co/oPSjdbb1YT #TATAIPL | #GTvMI pic.twitter.com/jTBxANlAtk — IndianPremierLeague (@IPL) March 24, 2024 -
పొలార్డ్ విధ్వంసం.. ఆఖరి బంతికి గెలుపు! షాక్లో షాహీన్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024 సీజన్లో కరాచీ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ లీగ్లో భాగంగా శనివారం లాహోర్ ఖలందర్స్తో జరిగిన ఉత్కంఠ పోరులో 2 వికెట్ల తేడాతో కరాచీ విజయం సాధించింది. చివరి బంతికి మీర్ హంజా సింగిల్ తీసి కరాచీని గెలిపించాడు. అయితే 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరాచీ కింగ్స్ 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కరాచీ ఆటగాడు, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కిరాన్ పొలార్డ్ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదుకు దాడికి దిగాడు. మరో ఎండ్లో ఉన్న షోయబ్ మాలిక్తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో కిరాన్ కేవలం 33 బంతుల్లోనే 5 సిక్స్లు, ఒక ఫోరుతో 58 పరుగులు చేశాడు. అయితే కరాచీ ఇన్నింగ్స్ 16 ఓవర్లో షాహీన్ అఫ్రిది.. అద్భుత బంతితో పొలార్డ్ను ఔట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే మాలిక్ కూడా ఔట్ కావడంతో ఒక్కసారిగా మ్యాచ్ లాహోర్ వైపు మలుపు తిరిగింది. ఆఖరి ఓవర్లో కరాచీ విజయానికి 11 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది.. ఆఫ్ స్పిన్నర్ ఆషాన్ బట్టికి అప్పగించాడు. ఇదే షాహీన్ చేసిన తప్పిదం. చివరి ఓవర్లో తొలి బంతినే హసన్ అలీ సిక్సర్గా మలిచాడు. దీంతో కరాచీ విజయసమీకరణం 5 బంతుల్లో 5 పరుగులగా మారిపోయింది. ఆ తర్వాత ఐదో బంతికి హసన్ అలీ ఔటైనప్పటికీ.. క్రీజులోకి వచ్చిన కొత్త బ్యాటర్ మీర్ సింగిల్ తీసి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. ఇది చూసిన అఫ్రిది తలను పట్టుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లహోర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. లహోర్ ఓన సాహిబ్జాదా ఫర్హాన్(72) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. కరాచీ బౌలర్లలో మీర్ హంజా, షంసీ, హసన్ అలీ తలా రెండు వికెట్లు సాధించారు. -
పూనకాలు తెప్పించిన పోలార్డ్.. బాబర్ వరల్డ్ రికార్డు ఇన్నింగ్స్ వృధా
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్లో కరాచీ కింగ్స్ ఆటగాడు, విండీస్ విధ్వంసకర యోధుడు కీరన్ పోలార్డ్ రెచ్చిపోయాడు. పెషావర్ జల్మీతో ఇవాళ (ఫిబ్రవరి 21) జరిగిన మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్తో పూర్వంలా పూనకాలు తెప్పించాడు. 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 49 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. 𝑽𝒊𝒏𝒕𝒂𝒈𝒆 𝑷𝒐𝒍𝒍𝒚 𝒊𝒏 𝑷𝑺𝑳 𝟐𝟎𝟐𝟒🔥 📸: Fan Code pic.twitter.com/uUMO58x5Sj — CricTracker (@Cricketracker) February 21, 2024 పోలార్డ్ సుడిగాలి ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో ప్రత్యర్ది బ్యాటర్ బాబర్ ఆజమ్ (పెషావర్) వరల్డ్ రికార్డు ఇన్నింగ్స్ వృధా అయ్యింది. ఈ మ్యాచ్లో 51 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 72 పరుగులు చేసిన బాబర్.. టీ20ల్లో అత్యంత వేగంగా (271 ఇన్నింగ్స్ల్లో) 10,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. He's still got it 🥶pic.twitter.com/kthsVbhdf3 — CricTracker (@Cricketracker) February 21, 2024 పోలార్డ్తో పాటు జేమ్స్ విన్స్ (30 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), ముహమ్మద్ అక్లక్ (13 బంతుల్లో 24; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), షోయబ్ మాలిక్ (29 బంతుల్లో 29; ఫోర్, సిక్స్) రాణించడంతో పెషావర్ నిర్ధేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని కరాచీ 16.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఫలితంగా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పెషావర్ బౌలర్లలో లూక్ వుడ్ (3.5-1-20-2) ఒక్కడే కరాచీ బ్యాటర్లను కాస్త ఇబ్బంది పెట్టాడు. సలాంకీల్ వికెట్ తీసినప్పటికీ (4-0-54-1) భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్.. బాబర్ ఆజమ్ (72) రాణించడంతో 154 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ (19.5 ఓవర్లలో ఆలౌట్) చేయగలిగింది. పెషావర్ ఇన్నింగ్స్లో బాబర్తో పాటు రోవ్మన్ పావెల్ (39), ఆసిఫ్ అలీ (23) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కరాచీ బౌలర్లలో మీర్ హమ్జా, హసన్ అలీ చెరో 3 వికెట్లు, డేనియల్ సామ్స్ 2, షోయబ్ మాలిక్, మొహమ్మద్ నవాజ్ తలో వికెట్ పడగొట్టారు.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019