breaking news
-
ప్రపంచంలోనే తొలి ఏఐ అందాల పోటీలు!
ఎన్నో రకాల అందాల పోటీలను చూసి ఉంటారు. కానీ ఇలాంటి సాంకేతికతో కూడిన అందాల పోటీలను చూసి ఉండరు. ప్రపచంలోనే తొలిసారిగా ఏఐ అందాల పోటీలు వరల్డ్ ఏఐ క్రియేటర్ అవార్డ్స్(WAICA) పిలుపునిచ్చింది. ఈ పోటీలో కృత్రిమ మేధస్సుతో రూపొందించిన మోడల్స్ పాల్గొంటారు. కోటి రూపాయల విలువ చేసే ప్రైజ్మనీలతో భారీ ఎత్తున ఈ ఏఐ అందాల పోటీలను నిర్వహిస్తోంది WAICA. ఈ ఐఏ మోడల్స్ని ప్రేక్షకుల్లో వాటికున్న ఆదరణ, ఫ్లాట్ఫామ్లో ఎక్కువగా వినియోగించగలిగేది, సోషల్ మీడియా క్రేజ్ వంటి వాటిని ఆధారంగా చేసుకుని న్యాయనిర్ణేతలు విజేతను ప్రకటిస్తారు. తొలిసారిగా కంప్యూటర్ సాంకేతికత సృష్టించిన మనుషుల అందాల పోటీ అనేది ఫ్యాషన్ వైవిధ్యానికి ఓ నిదర్శనం. వరల్డ్ AI క్రియేటర్ అవార్డ్స్ వర్చువల్ మోడల్స్ని సబ్స్క్రిప్షన్-ఆధారిత ప్లాట్ఫారమ్ అయిన ఫ్యాన్వ్యూని(Fanvue) కూడా కలిగి ఉంటుంది. ఇక్కడ సదరు వర్చువల్ మోడల్ ఫ్యాన్ వ్యూ, పీఆర్ మద్దతులను కూడా బేస్ చేసుకుని విజేతను ప్రకటించడం జరుగుతుంది. అలాగే రన్నరప్, మూడో స్థానంలో ఉన్న విజేతలకు కూడా నగదు బహుమతులు అందచేయడం జరుగుతుందని వరల్డ్ ఏఐ క్రియేటర్ అవార్డ్స్ పేర్కొంది. ఈ పోటీలకు ఎంట్రీలు గత ఆదివారం(ఏప్రిల్ 14) నుంచే ప్రారంభమయ్యాయి. మే 10న విజేతలను ప్రకటిస్తారు. ఇక ఈ అందాల పోటీ ఈ నెలఖారులోపు జరగనుంది. ఇక ఈ పోటీలు నలుగురు సభ్యుల ఫ్యానెల్ సమక్లంలో జరుగుతుంది. ఆ ఫ్యానెల్లో ఇద్దరు ఏఐ ఇన్ఫ్లయోన్సర్ జడ్డిలు..ఒకరేమో మూడు లక్షల ఫ్యాన్ఫాలోయింగ్ కలిగిన స్పెయిన్కు చెందిన ఐతానా లోపెజ్, మరోకరు రెండు లక్షలకు పైగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఎమిలీ పెల్లెగ్రిని జడ్జిలుగా వ్యవహరిస్తారు. ఇక వారిలో మిగిలిన ఇద్దరు వ్యక్తులు..పీఆర్ సలహదారు, వ్యవస్థాపకుడు ఆండ్రూ బ్లాచ్, మరొకరు అందాల పోటీ చరిత్రకారుడు, బ్యూటీ క్వీన్ స్కాండల్స్ పుస్తక రచయిత అయిన సాలీ-ఆన్ ఫాసెట్ విజేతలను ప్రకటిస్తారు. ఇది ఏఐ సృష్టికర్తలలో దాగున్న ప్రతిభ సామర్థ్యాన్ని వెలికి తీసేందుకు జరుగుతున్న అందాల పోటీ అని ఫ్యానల్ వ్యక్తులు చెబుతున్నారు. ఈ పోటీల్లో పాల్గొనేవారు తప్పనిసరిగా 100 శాతం ఏఐ జనరేటేడ్ మోడల్స్నే క్రియేట్ చేయాలి. అందుకోసం ఎలాంటి టూల్స్ ఉపయోగిస్తారనేందుకు ఎలాంటి పరిమితులు లేవు. ఓన్లీ ఏఐ జెనరేటర్ క్రియేషన్స్ని స్వాగతిస్తుంది. అది డీప్ ఏఐ, లేదా వ్యకగత టూల్స్ వంటివి ఏదైనా కావొచ్చు. ఈ పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నవారు దాదాపు రూ. 4 లక్షలపైనే నగదు బహుమతి అందజేస్తారు నిర్వాహకులు. ( చదవండి: సింఘారా పిండి గురించి విన్నారా..? బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
ప్రపంచ సుందరి పోటీలకు వేదికగా భారత్
న్యూఢిల్లీ: భారత్ త్వరలో ఒక ప్రతిష్టాత్మక ఈవెంట్కు వేదిక అవనుంది. ఈ ఏడది జరిగే 71వ ప్రపంచ సుందరి పోటీలకు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ తన అధికారిక ఎక్స్(ట్విటర్)లో ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఈ నిర్ణయంతో 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మిస్ వరల్డ్ పోటీలకు భారత్ వేదికగా నిలవనుంది. చివరిసారిగా 1996లో బెంగళూరులో భారత్లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించారు. Chairman of Miss World, Julia Morley CBE stated "Excitement fills the air as we proudly announce India as the host country for Miss World. A celebration of beauty, diversity, and empowerment awaits. Get ready for a spectacular journey! 🇮🇳 #MissWorldIndia #BeautyWithAPurpose — Miss World (@MissWorldLtd) January 19, 2024 ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు ఢిల్లీలోని భారత్ కన్వెన్షన్ సెంటర్, ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. మార్చి 9న నిర్వహించే మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలను రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. కేవలం అందం మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో సానుకూల మార్పును తీసుకొచ్చే సామర్థ్యం, తెలివితేటలు ఉన్నవారిని గుర్తించి సత్కరించడం దీని ముఖ్య ఉద్దేశం. గతంలో భారత్కు చెందిన ఐశ్వర్యరాయ్, ప్రియాంక చోప్రా, మానుషి చిల్లర్ తదితరులు మిస్ వరల్డ్గా ఎంపికయ్యారు. ఇదీచదవండి.. మోదీ భావోద్వేగం -
మంచి అవకాశాలు వస్తే నటిస్తా.. మిసెస్ సౌత్ ఇండియా రన్నరప్
తమిళ సినిమా: మిసెస్ సౌత్ ఇండియా అందాల పోటీల్లో తమిళనాడుకు చెందిన వైశాలి.ఎస్ మొదటి రన్నర్గా కిరీటాన్ని గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె శనివారం సాయంత్రం మీడియాతో ముచ్చటిస్తూ గతవారం కేరళలో పెగాసెస్ గ్లోబల్ లిమిటెడ్ సంస్థ మిసెస్ సౌత్ ఇండియా అందాల పోటీలను నిర్వహించిందన్నారు. ఇందులో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 14 మంది మగువలు పాల్గొన్నారన్నారు. వారిలో తానొకరినని చెప్పారు. మూడు రౌండ్లలో జరిగిన ఈ పోటీల్లో తాను మొదటి రన్నర్గా నిలిచానని పేర్కొన్నారు. అదేవిధంగా మిసెస్ ఇన్స్పౌరింగ్గా ఎన్నికయ్యానని తెలిపారు. ఇది తన కెరీర్లో ఆరంభమేనని ముందు ముందు మరిన్ని అందాల పోటీల్లో పాల్గొని మిసెస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకుంటాననే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అందుకు తన కుటుంబ సపోర్టు ఎంతగానో ఉందని పేర్కొన్నారు. వివాహమైన ప్రతి స్త్రీ తనకంటూ ఒక గుర్తింపును పొందాలన్నారు. అందుకు తగిన ప్రయత్నాలు చేయాలని నచ్చిన రంగంలో ఇష్టమైన వృత్తిని చేపట్టాలని అన్నారు. తాను తనకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని ఏదైనా సమస్యలను అధిగమిస్తూ ఈ విజయాన్ని సాధించానన్నారు. తనకు దివంగత ముఖ్యమంత్రి జయలలిత రాజకీయ జీవితం స్ఫూర్తి అని చెప్పారు. సామాజిక స్ఫృహ అధికమన్నారు. అలా క్యాన్సర్ బాధితులకు కోసం తన జుట్టును దానం చేశానని, తనను స్ఫూర్తిగా తీసుకొని పలువురు తన బాటలో పయనించడం సంతోషంగా ఉందన్నారు. సినిమాల్లో నటిస్తారా అని అడుగుతున్నారని ఇటీవలే నటుడు ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించిన కలగ తలైవన్ చిత్రంలో చిన్న పాత్ర పోషించానని, అదేవిధంగా నిమిర్దు సెల్లడా అనే షార్ట్ ఫిల్మ్లో నటించానని చెప్పారు. ఇకపై కూడా మంచి అవకాశాలు వస్తే నటిస్తానన్నారు. తన అభిమాన నటుడు రజనీకాంత్ అని వైశాలి పేర్కొన్నారు. -
మిస్ ఇండియా రన్నరప్గా ఆటో డ్రైవర్ కూతురు
లక్నో: అందాల పోటీలు..ఈ పేరు వినగానే అందరూ డబ్బున్న వారే పాల్గొంటారని అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక రిక్షా డ్రైవర్ తన కూతురు ఈ అందాల కిరీటం గెలవాలని కలలు కన్నాడు. దానికోసం ఎంతో కష్టపడ్డాడు. చివరికి ఒక అడుగు దూరంలో తన కూతురికి ఆ అవకాశం చేజారిపోయింది. అయితే, వీఎల్సీసీ మిస్ ఇండియా పోటీలో రన్నరప్గా తన కూతురుని ప్రపంచం ముందు నిలబెట్టడంలో మాత్రం ఆయన విజయం సాధించాడు. ఈ పోటీల్లో మన హైదరాబాదీ అమ్మాయి మానసా వారణాసి విన్నర్గా నిలవగా.. ఉత్తర్ప్రదేశ్కి చెందిన మాన్యా సింగ్ రన్నరప్గా నిలిచింది. ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ అందరి మన్ననలను పొందుతున్న మాన్యా విజయగాథను ఇప్పుడు తెలుసుకుందాం. అందాల పోటీలలో నిలవాలంటే అందంగా ఉండాలి. చక్కని ముఖవర్చస్సు కలిగి, అందమైన శరీరాకృతి కోసం ఎన్నో చేయాలి. ఇదంతా ఖర్చుతో కూడుకున్న విషయమని చాలా మందికి ఆసక్తి ఉన్నా ఆర్థిక పరిస్థితులు సహకరించక పోవడం వలన తమ ఆశను మనస్సులోనే చంపుకొంటారు. అయితే, ఉత్తరప్రదేశ్ కు చెందిన మాన్యా సింగ్ అందరిలా ఆలోచించలేదు. ఈమె తండ్రి ఒక ఆటోవాలా. తల్లి ఇంటిలో పనులు చేసుకొంటూ తన ఇద్దరు పిల్లలను చూసుకొనేది. పేదరికం కారణంగా మాన్య కొద్దివరకే చదువుకొని ఉద్యోగంలో చేరాల్సిన పరిస్థితి ఎదురైంది. మాన్య డిగ్రి ఫీజు కోసం తల్లి దగ్గర ఉన్న కొద్దిపాటి బంగారాన్నికూడా కుదువపెట్టాల్సి వచ్చింది. తన ఖర్చుల కోసం ఇంట్లో వారు పడుతున్న కష్టాన్ని చూడలేని మాన్య పద్నాలుగు ఏళ్లప్పుడే ఇంట్లోనుంచి వెళ్లిపోయింది. రాత్రిపూట కాల్సెంటర్లో ఉద్యోగం చేసుకుంటూ, ఉదయంపూట చదువుకునేదాన్ని అని చెప్పింది. మిస్ఇండియా పోటీల్లో గెలవాలని నిర్ణయించుకొని దీనికోసం ఎన్నో తిండి, నిద్రలేని రాత్రులు గడిపానని తెలిపింది. ఉద్యోగం చేస్తున్నప్పుడు నడిచి వెళ్తు రిక్షా డబ్బులు కూడా దాచుకునే దాన్నని మాన్యా గుర్తు చేసుకుంది. ఈ రోజు మానాన్న, అమ్మా, అన్నయ్య నాకోసం పడ్డ కష్టం, వారు నాకు అందించిన సహకారం వలనే ఈ స్థానంలో నిలిచాను’ అని ఆమె వివరించింది. చదవండి: ‘మిస్ ఇండియా’ కిరీటం.. విన్నర్గా తెలుగమ్మాయి -
అందమైన గెలుపు
‘‘మీ లక్ష్యం ఏంటి?’’ మిస్ ఇండియా, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ .. ఏ బ్యూటీ కంటెస్ట్లోనైనా కామన్ క్వశ్చన్ ఇది. కంటెస్టెంట్స్ ఇచ్చే సమాధానమూ సర్వ సాధారణమే.. ‘‘అనాథలకు సేవ చేయడం’’ అంటూ! అయితే అందాల కిరీటం దక్కగానే ధ్యేయం మారిపోతుంది. సినిమా ఇండస్ట్రీలో అవకాశాల తలుపులు తట్టే ప్రయత్నం మొదలవుతుంది. గత కొన్నేళ్లుగా ఇదే సంప్రదాయంగా కొనసాగుతోంది. కానీ ఆ సంప్రదాయాన్ని కాదని.. సినిమా, మోడలింగ్ రంగాల్లో అవకాశాలు వచ్చినా సింపుల్గా ‘నో’ చెప్పి ఇతర రంగాల్లో స్థిరపడ్డ అందాల రాణులూ ఉన్నారు. వాళ్ల గురించి తెలుసుకుందాం. ఇంద్రాణి రెహ్మాన్ మన దేశంలో అందాల పోటీలు 1952లో ప్రారంభమయ్యాయి. ఆ యేటి బ్యూటీ ‘మిస్ ఇండియా యూనివర్స్’ ఇంద్రాణి రెహ్మాన్. సినిమా రంగాన్ని ఎంచుకోక.. తనకు ఇష్టమైన శాస్త్రీయ నృత్యంలోనే సాధన చేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు. పద్మశ్రీ బిరుదూ పొందారు. హార్వర్డ్ మొదలు ఎన్నో యూనివర్శిటీల్లో బోధించారు. జూలియర్డ్ స్కూల్లో ఫ్యాకల్టీ మెంబర్గా ఉన్నారు. రీటా ఫారియా 1966లో ‘మిస్ వరల్డ్’గా ఎన్నికైన రీటా ఫారియా మిస్ వరల్డ్ కిరీటాన్ని పొందిన తొలి భారతీయురాలే కాదు.. ఫస్ట్ ఏషియన్ కూడా. అలా ఆమె క్రౌన్ ధరించిందో లేదో ఇలా మోడలింగ్, సినిమా చాన్సెస్ ఆమె ఇంటి కాలింగ్ బెల్ నొక్కాయి. ‘నో చాన్స్’ అని చెప్పింది. ఆమె ఆశ, ఆశయం అంతా డాక్టర్ కావాలనే. తర్వాత డాక్టర్ డేవిడ్ పావెల్ అనే ఎండోక్రైనాలజిస్ట్ను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో ఐర్లాండ్లోని డబ్లిన్లో స్థిరపడ్డారు రిటా ఫారియా. కవితా భంభాని 1969లో ‘మిస్ ఇండియా’గా ఎన్నికయ్యారు కవితా భంభాని. ఇండియన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లోకి అడుగు పెట్టారు. ఇంటీరియర్ డిజైనర్గా ఖ్యాతి సంపాదించారు. సినిమా రంగంతో ఆమెకున్న కనెక్షనల్లా హీరో అనిల్ కపూర్ ఆమెకు మరిది కావడమే. అవును.. అనిల్ కపూర్ భార్య సునీతా కపూర్.. కవితా భంభాని చెల్లెలు. అలమ్జీత్ కౌర్ 1978 ‘మిస్ ఇండియా యూనివర్స్’ అలమ్జీత్ కౌర్. లా చదువుతున్నప్పుడు మిస్ ఇండియా కంటెస్ట్లో పాల్గొన్నారు. మిస్ యూనివర్స్ కంటెస్ట్లో బెస్ట్ నేషనల్ కస్ట్యూమ్ అవార్డ్ కూడా అందుకున్నారు. ఈ పోటీల తర్వాత మళ్లీ న్యాయశాస్త్ర రంగంలోకి వచ్చారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. దీప్తీ దివాకర్ 1981లో ‘మిస్ ఇండియా వరల్డ్’గా ఎన్నికయ్యారు దీప్తీ దివాకర్. ఆమె భరతనాట్య కళాకారిణి. ప్రపంచ వ్యాప్తంగా నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు. రచనా వ్యాసాంగం కూడా చేస్తారు. ‘ట్రీ ఆఫ్ వర్స్’ అనే ఆధ్యాత్మిక కవితా సంకలనాన్ని ప్రచురించారు. ఉత్తరా మాత్రే ఖేర్ 1982 ‘మిస్ ఇండియా వరల్డ్’ కిరీటాన్ని గెల్చుకున్నారు. స్వల్ప కాలమే మోడల్గా పనిచేసి, తర్వాత ఆ రంగానికి స్వస్తి చెప్పారు. రెస్టారెంట్ బిజినెస్లోకి దిగారు. ప్రస్తుతం నాసిక్లో భర్తతో కలిసి వ్యవసాయం చేస్తున్నారు. ఓ ట్రస్ట్నూ నిర్వహిస్తున్నారు. అన్నీ థామస్ 1998 ‘మిస్ ఇండియా వరల్డ్’ అన్నీ థామస్. డాక్టర్ కావాలనుకున్నారు. కాని ఈ బ్యూటీ కంటెస్ట్ తర్వాత మెడిసిన్ తన కప్ ఆఫ్ టీ కాదని గ్రహించి.. ఈవెంట్ మేనేజర్గా స్థిరపడ్డారు. ప్రస్తుతం దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్నారు. సారా కార్నర్స్ 2001లో ‘మిస్ ఇండియా వరల్డ్’గా కిరీటాన్ని అందుకున్నారు సారా. తొమ్మిదేళ్ల వయసు నుంచే మోడలింగ్లో ఉన్న ఆమె ఈ కంటెస్ట్ తర్వాత మోడలింగ్కు గుడ్బై చెప్పి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్లోకి అడుగుపెట్టారు. రచయిత్రి కూడా. పిల్లల కోసం కథలు రాస్తారు. వాసుకీ సుంకవల్లి న్యూయార్క్ యూనివర్శీటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన వాసుకీ 2011లో ‘మిస్ ఇండియా యూనివర్స్’గా గెలుపొందారు. రెయిన్ మేకర్ సంస్థ సహ స్థాపకురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వన్యా మిశ్రా 2012 ‘మిస్ ఇండియా వరల్డ్’ వన్యా మిశ్రా. ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్ అయిన ఆమె తన కాలేజ్మేట్తో కలిసి ఫ్యాషన్ అంyŠ లైఫ్ స్టయిల్ స్టోర్ నిర్వహిస్తున్నారు. శిల్పా సింగ్ 2012 ‘మిస్ ఇండియా యూనివర్స్’ శిల్పా సింగ్. క్యూబ్ 26 అనే టెక్ స్టార్టప్తో బిజినెస్, మార్కెటింగ్ రంగంలో స్థిరపడ్డారు. మిస్ ఇండియా నుంచి మార్కెటింగ్ హెడ్ దాకా సాగిన తన ప్రయాణాన్ని టెడెక్స్ టాక్లో పంచుకున్నారు కూడా.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019