breaking news
-
బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య
భైంసా: బాసర ట్రిపుల్ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పీయూసీ–2 చదువుతున్న బుచ్చుక అరవింద్ హాస్టల్ గదిలో మంగళవా రం ఉరివేసుకున్నాడు. సిద్ది పేట జిల్లా తొగుట మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన అరవింద్ ఇటీవలే ఇంటికి వెళ్లి ఈ నెల 12న క్యాంపస్కు తిరిగివచ్చాడు. హాజరుశాతం తక్కువగా ఉందని అరవింద్ను అధికారులు పరీక్షకు అనుమతించలేదని సమాచారం. దీంతో మన స్తాపం చెందిన అరవింద్..తోటి విద్యార్థులు పరీక్షకు వెళ్లిన కొద్దిసేపటికే ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని నిర్మల్ ఆస్పత్రికి తరలించారు. మృతికి కళాశాల యాజమాన్యమే కారణం తొగుట(దుబ్బాక): తమ కుమారుడు ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యమే కారణమని అరవింద్ తల్లిదండ్రులు ఆరోపించారు. అరవింద్కు నాలుగు నెలల క్రితం డెంగీ సోకిందని, చికిత్స చేయించుకొని తిరిగి కళాశాలకు వెళ్లాడని వారు చెప్పారు. అయితే హాజరుశాతం తక్కువగా ఉందని, పరీక్షలకు అనుమతించమని చెప్పారని, దీంతో ఫీజు కట్టడానికి తాను డబ్బులు పంపామన్నారు. అయినా తమ కుమారుడిని పరీక్షలకు అనుమతించకపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు వారు కన్నీటిపర్యంతమయ్యారు. ఐదు నెలల్లో ముగ్గురు ♦ బాసర ఆర్జీయూకేటీలో గడిచిన ఐదునెలల్లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ♦ 2023, నవంబర్ 25న నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన ప్రవీణ్కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ∙2024, ఫిబ్రవరి 22న రంగారెడ్డి జిల్లాకు చెందిన టి.శిరీష ఆత్మహత్య చేసుకుంది. ♦ తాజాగా అరవింద్ ఆత్మహత్య చేసుకున్నాడు. ♦ 2023–24 విద్యాసంవత్సరంలో ఆర్జీయూకేటీలో మొత్తం ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా బాసరలోనే ఎక్కువ మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. క్యాంపస్లో ఉండే అధికారులు విద్యార్థుల మానసిక పరిస్థితిని అంచనా వేయలేకపోతున్నారు. 9 వేల మంది విద్యార్థులు చదివే క్యాంపస్లో విద్యార్థుల భవిష్యత్పై దృష్టి సారించాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. -
పసుపుబోర్డు ఎక్కడుందో చెప్పాలి.. : ఎంపీ బాజిరెడ్డి
నిజామాబాద్: ‘పసుపు బోర్డు తెచ్చానని గొప్పలు చెప్పడం కాదని.. జిల్లాలో బోర్డు ఎక్కడ ఏర్పాటు చేశారో ఎంపీ అర్వింద్ చూపించాలని.. నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఎంపీకి అహంకారంతో ఉన్నారని.. నిజాంషుగర్ ఫ్యాక్టరీ పేరిట మరోసారి బాండ్ పేపర్ డ్రామా ఆడుతున్నారన్నారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు అర్వింద్ను కచ్చితంగా ఓడిస్తారన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బాజిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని, కాంగ్రెస్ మూడోస్థానానికి పరిమితం అవుతుందన్నారు. పసుపుబోర్డు పేరుతో ఇప్పటికే ఎంపీ అర్వింద్ ప్రజలను మోసం చేశారన్నారు. ఆయన ఎంపీ కాకముందే పసుపు క్వింటాలుకు రూ. 17వేలు ధర పలికిందన్నారు. పసుపు దిగుబడి తగ్గినందునే ధర పెరిగిందన్నారు. గత ఐదేళ్లలో ఎంపీ అర్వింద్ అహంకారంతో నడుచుకున్నారని.. ఆయన ఓటమి ఖాయమన్నారు. కేంద్రంలో మోదీ గెలవాలని కానీ.. అర్వింద్, బండి సంజయ్ లాంటి వాళ్లు ఓడిపోవాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. సీఎం రేవంత్ హామీలు అమలు చేయడం లేదు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నారని బాజిరెడ్డి విమర్శించారు. రుణమాఫీ చేయలేదని, రైతుబంధు ఇవ్వలేదని, కల్యాణలక్ష్మికి అదనంగా తులం బంగారం హామీలు ఇచ్చి మోసం చేశారన్నారు. అధికారంలో ఉండి కూడా అబద్ధాలు ఆడుతున్నారన్నారు. తాను ఎంపీగా గెలిచి ప్రశ్నించే గొంతునవుతానని పేర్కొన్నారు. బీఆర్ఎస్కు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఇవి చదవండి: తర్జన భర్జన! తెరపైకి రోజుకో పేరు.. -
దొరల పాలనను అంతం చేయాలి! : ఎంపీ ధర్మపురి అర్వింద్
నిజామాబాద్: తెలంగాణలో కొనసాగుతున్న దొరల పాలనను అంతం చేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. మండలంలోని రామడుగు గ్రామంలో రూరల్ బీజేపీ అభ్యర్థి కులాచారి దినేశ్కు మద్దతుగా శుక్రవారం ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దోచుకున్న వాళ్లను ప్రజలు ఓటుతో జవాబు చెప్పి బుద్ధి చెప్పాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని అని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. 75 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క బీసీ ముఖ్యమంత్రి దొరకలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బీసీ డిక్లరేషన్ అరచేతిలో వైకుంఠంలాగా ఉందని, మరోసారి బీసీలకు అన్యాయం చేయడానికి రేవంత్ కుట్రపన్నారని పేర్కొన్నారు. ప్రచారంలో నాయకులు గద్దె భూమన్న, రాజేశ్వర్, కర్క గంగారెడ్డి, రామస్వామి, గంగాదాస్ తదితరులు పాల్గొన్నారు. ఇవి కూడా చదవండి: వ్యూహాలకు పదును! ప్రచారానికి మిగిలింది 11 రోజులే.. -
రేవంత్ కంటే కేసీఆరే మంచోడు: ఎంపీ అర్వింద్
సాక్షి, మెట్పల్లి: జగిత్యాల జిల్లా మెట్పల్లిలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఆదివారం ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కంటే సీఎం కేసీఆరే మంచోడని అర్వింద్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలో హంగ్ ప్రభుత్వం రానుందని జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ధర్మపురి అర్వింద్ కోరుట్ల నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కోరుట్లలో అర్వింద్ ఇప్పటికే ప్రచారం ప్రారంభించి దూసుకుపోతున్నారు. ఇంట్రస్టింగ్ కామెంట్లతో పాటు తిట్లతో ప్రత్యర్థులపై విరుచుకుపడే అర్వింద్ రేవంత్ కంటే కేసీఆర్ మంచోడని అనడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ పోరు ప్రధానంగా బీఆర్ఎస్, కాంగగ్రెస్ మధ్య జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకునే రేవంత్ కంటే కేసీఆర్ బెటరని అర్వింద్ అన్నట్లు తెలుస్తోంది. -
రిలయన్స్ రిటైల్ చేతికి అరవింద్ బ్యూటీ బ్రాండ్స్
న్యూఢిల్లీ: వేగంగా వృద్ధి చెందుతున్న సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల (బీపీసీ) వ్యాపార కార్యకలాపాలను మరింతగా విస్తరించడంపై రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అరవింద్ ఫ్యాషన్కి చెందిన అరవింద్ బ్యూటీ బ్రాండ్స్ రిటైల్ను కొనుగోలు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఆర్ఆర్వీఎల్ అనుబంధ సంస్థ రిలయన్స్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్తో షేర్ల కొనుగోలు ఒప్పందం (ఎస్పీఏ) కుదిరినట్లు అరవింద్ ఫ్యాషన్ వెల్లడించింది. ఈక్విటీ వాటా విక్రయ విలువ రూ. 99.02 కోట్లుగా ఉండనున్నట్లు పేర్కొంది. చెల్లించాల్సిన రుణాలు, ఈక్విటీ అంతా కలిపి సంస్థ మొత్తం విలువను రూ. 216 కోట్లుగా లెక్కగట్టినట్లు వివరించింది. డీల్లో భాగంగా అరవింద్ ఫ్యాషన్స్ నిర్వహిస్తున్న ఫ్రాన్స్ బ్యూటీ రిటైల్ బ్రాండ్ సెఫోరాకు భారత్లో ఉన్న 26 స్టోర్స్ కూడా ఆర్ఆర్వీఎల్కు దక్కుతాయి. ఇకపై తాము పూర్తిగా ఫ్యాషన్ (యూఎస్ పోలో, యారో మొదలైన 5 బ్రాండ్స్) పైనే దృష్టి పెట్టనున్నట్లు అరవింద్ ఫ్యాషన్స్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో అరవింద్ బ్యూటీ బ్రాండ్స్ రిటైల్ టర్నోవరు రూ. 336.70 కోట్లుగా నమోదైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్లోని రిటైల్ కంపెనీలన్నింటికీ ఆర్ఆర్వీఎల్ హోల్డింగ్ సంస్థగా ఉంది. బ్యూటీ రిటైల్ ప్లాట్ఫాం ’టిరా’ కొనుగోలుతో సౌందర్య సాధనాల వ్యాపారంలోకి ప్రవేశించింది. నైకా, టాటా, హిందుస్తాన్ యూనిలీవర్కి చెందిన లాక్మే మొదలైన దిగ్గజ బ్రాండ్స్తో పోటీపడుతోంది. రెడ్సీర్ స్ట్రాటెజీ కన్సల్టెంట్, పీక్ 15 సంయుక్త నివేదిక ప్రకారం 2022లో 19 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల మార్కెట్ 2027 నాటికి 30 బిలియన్ డాలర్లకు చేరనుంది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
సుస్మితా సేన్ అందానికి దక్కిన కిరీటానికి 30 ఏళ్లు పూర్తి
Multiple cat checj
Check international block
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019