breaking news
Ad - Sakshi_Home_Sticky
-
వందేళ్ల తర్వాత సర్వే
బ్రిటిష్ కాలంలో భూ సర్వే చేపట్టారు. అప్పటి నుంచి ఏ ప్రభుత్వం భూ సర్వేపై దృష్ఠి సారించి రైతుల భూ సమస్యల పరిష్కారించడానికి మొగ్గు చూపలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొన్ని వేల కోట్లు ఖర్చుచేసి భూ రీసర్వేను చిత్తశుద్ధితో నిర్వహిస్తోంది. భూముల రీసర్వే వల్ల ఏన్నో ఏళ్ల నుంచి ఉన్న మా భూ సమస్యలు పరిష్కారమయ్యాయి. శాశ్వత హక్కు పత్రాలు చేతికందాయి. – నడుపూరు అప్పలనాయుడు, రైతు, ఆనందపురం ఎంతో మందికి ప్రయోజనం భూములు రీ సర్వేతో చాలా గ్రామాల్లో భూ సమస్యలు గట్టెక్కాయి. కొత్తగా భూ యజమానులు హక్కు పత్రాలు పొందారు. ఈ హక్కు పత్రాలుతో రుణాలు కూడా పొందుతున్నారు. ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే ప్రతిపక్షాలకు పనిపాటా లేకుండా ఓటర్లును మభ్యపెట్టే కార్యక్రమం చాలా దారుణంగా ఉంది. – వాకముల్ల చిన్నంనాయుడు, పీఏసీఎస్ అధ్యక్షుడు, రాజాం. ● -
పోస్టల్ బ్యాలెట్ల పరిశీలన
విజయనగరం అర్బన్: పోస్టల్ బ్యాలెట్ల పరిశీలన కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం జరిగింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఈ కార్యక్రమాన్ని పరిశీలించారు. బ్యాలెట్ పేపర్లను, కవర్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేసి, ఆయా ప్రాంతాలకు పోస్టల్ బ్యాలెట్లను త్వరగా పంపించాలని ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్లు నోడల్ ఆఫీసర్ సందీప్కుమార్, డీఆర్డీఏ పీడీ ఎ.కళ్యాణ చక్రవర్తి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సుధారాణి, ఆయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు. రెండు పూరిళ్లు దగ్ధం గుర్ల: మండలంలోని చోడవరంలో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో లావేటి అప్పారావు, లావేటి ఎరకయ్యకు చెందిన పూరిల్లు పూర్తిగా కాలిపోయాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవ్వరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సుమారుగా రెండు లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. అగ్ని మాపక సిబ్బంది మంటలు ఆదుపు చేశారు. -
No Headline
విజయనగరం అర్బన్/రాజాం/మెరకముడిదాం/గుర్ల: సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్ గాలి స్పీడుగా వీస్తోంది. కూటమితో ముందుకొచ్చిన చంద్రబాబు ఏ హామీ ఇచ్చినా ఓటర్లు నమ్మడం లేదు. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ ‘కోటు’బాబులతో పాటు కమెడియన్ ఆర్టిస్ట్లను రంగంలోకి దించినా జనాల్లో స్పందన కనిపించడం లేదు. టీవీ యాక్టర్లను చూసేందుకు కూడా టీడీపీ, కూటమి సభలకు జనాలు రావడం లేదు. దీంతో ఏమి చేయాలో తోచక టీడీపీ అధినేత చంద్రబాబు అండ్ కో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై లేనిపోని ఆరోపణలకు దిగారు. భూ యజమానులకు మేలుచేసేలా.. వివాదాలకు తెరదించేలా.. మూడేళ్లుగా ఓ యజ్ఞంలా చేపట్టిన ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు–భూ రక్షణ సర్వే’ను తప్పుదోవ పట్టించే యత్నానికి దిగారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంశాలను ప్రజలకు తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 983 గ్రామాలకు 481 గ్రామాల్లో రీ సర్వే పూర్తికావడం, రైతుల చేతికి హక్కు పత్రాలు అందడం, భూ వివాదాలు కళ్లముందే పరిష్కారం కావడం, కోర్టుల చుట్టూ తిరగాల్సిన పనితప్పడంతో టీడీపీ అబద్ధాలను ప్రజలు, మేధావులు నమ్మడంలేదు. ఎన్నికల వేళ చట్టం గుర్తొచ్చిందా అంటూ విమర్శిస్తున్నారు. రాజకీయ లబ్ధికోసం ప్రజోపయోగ కార్యక్రమాన్ని తప్పుదోవ పట్టించడంపై మండిపడుతున్నారు. ప్రభుత్వం చేసిన మేలు కనిపించాలంటే పొలాల్లోకి వచ్చి సరిహద్దురాళ్లను చూస్తే తెలుస్తుందని చంద్రబాబుకు హితవుపలుకుతున్నారు. వందేళ్ల తర్వాత ఊరూరా భూముల రీసర్వే ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష’ పథకం కింద భూములకు సర్వహక్కులు ఇప్పటికే జిల్లాలో 983 గ్రామాలకు 481 గ్రామాల్లో రీ సర్వే పూర్తి రైతుల చేతికి భూ హక్కు పత్రాలు వివాదాలకు తెర రైతుల సమక్షంలోనే సరిహద్దు రాళ్ల ఏర్పాటు బృహత్తర కార్యక్రమంపై ఎన్నికల వేళ దుష్ప్రచారానికి దిగిన చంద్రబాబు అండ్ కో.. ఛీ కొడుతున్న జనం -
రోడ్డు ప్రమాదంలో బీజేపీ నేత దుర్మరణం
గుర్ల: మండలంలోని కలవచర్ల వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బీజేపీ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు అల్లూరి రామకృష్ణ రాజు (56) తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని 108 ద్వారా విజయనగరంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతున్న ఆయన గురువారం మృతి చెందారు. ఎస్ఐ భాస్కరరావు కేసు నయోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కలవచర్ల వద్దనున్న మలుపు వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అల్లూరి రామకృష్ణ రాజు, కోటగండ్రేడు నుంచి వస్తున్న మరో ద్విచక్ర వాహనాన్ని తప్పించిబోయి రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఆయన మృతి వైఎస్సార్సీపీ నాయకులు, బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. నేటి నుంచి రిఫరీ, రిఫ్రెషర్స్ సెమినార్ విజయనగరం: న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలో రెండు రోజుల పాటు నేషనల్ తైక్వాండో రిఫరీ, రిఫ్రెషర్స్ సెమినార్ శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్టు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్.వేణుగోపాలరావు గురువారం తెలిపారు. నగరంలోని రాజీవ్ క్రీడా మైదానం ప్రాంగణంలో జరిగే సెమినార్లో వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు, కోచ్లు పాల్గొనున్నట్లు పేర్కొన్నారు. -
వాటీజ్ దిస్ ‘బేబీ’?
సాక్షి ప్రతినిధి, విజయనగరం: మిట్ట మధ్యాహ్నం... బొబ్బిలి మెయిన్రోడ్డు... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మలివిడత ప్రచార సభ... వేలాది జనం పోటెత్తారు. బుధవారం ఈ ప్రభంజనాన్ని చూసినవారంతా ఆశ్చర్యపోయారు. కానీ ఒక్కరు మాత్రం ఉలిక్కిపడ్డారు. ఆయనే బొబ్బిలి టీడీపీ అభ్యర్థి ఆర్వీఎస్కేకే రంగారావు ఉరఫ్ బేబీనాయన! తమ పూర్వీకుల వీరప్రతాపం గురించి కోటకు వచ్చినవారందరికీ పూసగుచ్చినట్లు చెప్పే ఆయన... ఇప్పుడు జగన్మోహన్రెడ్డి సభ అంటే హడలిపోవడం విచిత్రంగా ఉందని బొబ్బిలి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అంతకుముందు జరిగిన వైఎస్సార్సీపీ సభలకు పోటెత్తిన జనాన్ని చూసి ముందురోజు నుంచే ‘రక్షణ’ పేరుతో చెడగొట్టే కార్యక్రమానికి తెరలేపారు. బొబ్బిలి కోట సమీపంలో సభ పెడితే తమ కుటుంబానికి భద్రత ఉండదని, తమకు రక్షణ కల్పించాలంటూ తన న్యాయవాది ద్వారా ఎన్నికల కమిషన్కు, అధికారులకు ఫిర్యాదులు పంపించడం గమనార్హం. కానీ రోడ్డుషోకు హాజరైన ప్రజలు కానీ, వైఎస్సార్సీపీ శ్రేణులు కానీ ఆ కోట గేటు వైపు కూడా కన్నెత్తిచూడలేదు. ఇక తన ప్రసంగంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్కడా బేబీనాయన గురించి కానీ, మంత్రి పదవి కోసం సంతలో పశువులా అమ్ముడుపోయి వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఆయన సోదరుడు ఆర్వీఎస్కే రంగారావు (సుజయ్) గురించి కానీ ప్రస్తావన తీసుకురాలేదు. ఒకవైపు కూటమి నాయకులు తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నా జగన్మోహన్రెడ్డి మాత్రం తన ప్రత్యర్థి పార్టీకి చెందిన బొబ్బిలి రాజుల పట్ల హుందాగా వ్యవహరించడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ● ఇప్పుడు ఎమ్మెల్యే కావాలని... బొబ్బిలి పట్టణంలో దశాబ్దాల సమస్యగా ఉన్న మెయిన్ రోడ్డు విస్తరణనూ చేపట్టలేక బేబీనాయన మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు, ఆయన సోదరుడు సుజయ్ టీడీపీలోకి వెళ్లి మంత్రిగా అధికారం వెలగబెట్టినప్పుడు చేతులెత్తేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.10 కోట్ల వ్యయంతో మెయిన్రోడ్డును విస్తరించారు. ఆ సోదరులు బొబ్బిలికి చేసిన మేలేమిటో ఒక్కటీ చెప్పలేరు. ● ఆ మెయిన్ రోడ్డుపైనే సభలన్నీ... ‘సైకిల్ పోవాలి’ అంటూ చంద్రబాబు నినాదం ఇచ్చిన ‘ఇదేమి ఖర్మ’ కార్యక్రమం కూడా బొబ్బిలి మెయిన్రోడ్డుపైనే 2022 డిసెంబర్ 23న బేబీనాయన సమక్షంలోనే జరిగింది. పట్టుమని రెండు వేల మంది కూడా ఆ కార్యక్రమానికి రాలేదు. ఆ తర్వాత అదే రోడ్డుపై గత ఏడాది నవంబరు 23న జరిగిన వైఎస్సార్సీపీ ‘ప్రజా సంకల్పయాత్ర’కు జనం పోటెత్తారు. కళాభారతి నుంచి బొబ్బిలి కోట వరకూ జనసంద్రమైంది. జగన్మోహన్రెడ్డి కార్యక్రమాలకు అంతకుమించి జనం వస్తారనే అంచనాతో బేబీనాయనకు బెంగపట్టుకుంది. సభాస్థలి కోటకు సమీపంలో పెట్టడం ఇష్టం లేక తన కోట ‘భద్రత’ పేరుతో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలంటే భయమా? లేదంటే ద్వేషమా? ఇంటి సమీపంలో సభ పెడితే తనకు రక్షణ ఉండదా? బొబ్బిలి టీడీపీ అభ్యర్థి బేబీనాయన ముందస్తుగా బెంగ సీఎం జగన్ బొబ్బిలి రోడ్డుషోపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు ఏమిటీ నాయనా మీ గొప్ప... అధికారం దక్కేవరకే బేబీనాయనకు ప్రజలతో పని. ఒకసారి పీఠం దక్కిందా ఆ తర్వాత అదే ప్రజలను కోట గుమ్మం కూడా ఎక్కనివ్వని చరిత్ర ఆయన సొంతం. చివరకు అధికారులైనా దర్బార్మహల్లో రోజంతా పడిగాపులు బొబ్బిలి ప్రజలకు అనుభవమే. తొలుత 2009లో బొబ్బిలి 29వ వార్డు కౌన్సిలర్గా బేబీ నాయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. అదీ కోటను ఆనుకొని ఉన్న వార్డు, ఆరొందలకు మించని ఓటర్లు అయినా సరే గెలుపుపై భయం పట్టుకుంది. అప్పట్లో పోటీ పడిన టీడీపీ అభ్యర్థిని నయానాభయానో ఒప్పించి తన ఏకగ్రీవ ఎన్నిక కోసం బరి నుంచి తప్పించారు. అలా బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకున్న ఆయన పదవీకాలం 2009–14లో ముచ్చటగా మూడుసార్లు మాత్రమే ఆ కుర్చీలో కూర్చున్నారు. కారణమేమిటో తెలుసా? మున్సిపల్ సాధారణ సమావేశాల్లో కౌన్సిలర్లు కొన్ని సమస్యలపై నిలదీస్తుండటంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసేవారు. పదవీ అలంకారం కాదు ప్రజాసేవ కోసమనే విషయం తెలియని ఆయన ఇక ఆ తర్వాత ఎప్పుడూ కౌన్సిల్ హాలులోకి అడుగుపెట్టలేదు. వైస్ చైర్మన్ గునాన విజయలక్ష్మికి బాధ్యతలు అప్పగించేసి ప్రజలకు ముఖం చాటేశారు. అంతేకాదు మున్సిపల్ చైర్మన్ పదవిలోకి వచ్చినప్పుడు తనకోసం ప్రత్యేకంగా చేయించుకున్న కుర్చీని కూడా కోటకు తీసుకుపోయారు.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019