breaking news
Ad - Sakshi_Home_Sticky
-
పశ్చిమలో మాదిగలందరి మద్దతు రజినమ్మకే
పట్నంబజారు: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మాదిగలందరి మద్దతు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విడదల రజినీకే అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి అత్తోట జోసఫ్ స్పష్టం చేశారు. గుంటూరు చంద్రమౌళి నగర్లోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గురువారం మాదిగ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అత్తోట జోసఫ్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో కూడా గుంటూరు నగరంలోని మాదిగల్లో 70 శాతం వైఎస్సార్ సీపీకే ఓటు వేశారని తెలిపారు. జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా ఏకంగా 95 శాతానికి పైగా మాదిగ సామాజికవర్గం ప్రయోజనం పొందిందని చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో తాము మాదిగ కురుక్షేత్ర మహా సభ పెడితే తమపై కేసులు పెట్టారని గుర్తుచేశారు. జగనన్న సీఎం అయ్యాక ఆ కేసులు ఎత్తివేశారని తెలిపారు. చంద్రబాబు మళ్లీ మాదిగ సామాజిక వర్గీకరణ జిల్లాల వారీగా చేస్తానని చెప్పడం మరో మోసపు వాగ్దానమని ఎండగట్టారు. మంత్రి రజిని చిలకలూరిపేటలో ఎస్సీలకు మార్కెట్ యార్డు చైర్మన్ పదవి ఇచ్చి, గౌరవించారని గుర్తుచేశారు. ట్రక్కు డ్రైవర్, కూలీకి ఎమ్మెల్యే టికెట్లు మాదిగ లాయర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పుసులూరి జీవరత్నం మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో మాదిగ సామాజిక వర్గానికి చెందిన అతి సామాన్యులైన ట్రక్కు డ్రైవర్, ఒక ఉపాధి హామీ పథకం కూలీకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన ఘనత జగనన్నదేనన్నారు. మాదిగ జాతిని చంద్రబాబుకు తాకట్టు పెట్టాలని మంద కృష్ణ మాదిగ చూస్తున్నారని ధ్వజమెత్తారు. వర్గీకరణ విషయం కోర్టులో ఉన్నందున, ఎవరెన్ని కల్లబొల్లి కబుర్లు చెప్పినా నమ్మవద్దని తెలిపారు. గుంటూరు పశ్చిమలో మంత్రి విడదల రజినిని కచ్చితంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కో–కన్వీనర్ డొక్కా జార్జి, లీగల్ సెల్ నాయకుడు పచ్చల విజయానంద్, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి అచ్చిబాబు, మార్కెట్ యార్డు డైరెక్టర్లు గుంజర ప్రభు, దర్శనపు బెంజిమన్, నాయకులు రవికుమార్, రూబెన్, ఎస్సీ నేతలు జాబాబు, లూర్దురాజు, స్వామి పాల్గొన్నారు. మద్దతు ప్రకటించిన మాదిగ సంఘాల ఐక్య వేదిక -
టీడీపీ విందు రాజకీయం
సత్తెనపల్లి: సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తప్పదని భావిస్తున్న టీడీపీ అభ్యర్థులు అడ్డదారులూ తొక్కుతున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఆత్మీయ సమావేశాల పేరుతో డబ్బులు, గిఫ్ట్లతో ప్రలోభ పెడుతున్నారు. ఆత్మీయ సమావేశాల పేరుతో విందు ఇచ్చి, కూపన్లు పంపిణీ చేస్తున్నారు. అనంతరం ఆ కూపన్లు తీసుకొని ఒక్కొక్కరికి రూ. 2 వేలు చొప్పున నగదు, స్వీట్ బాక్స్ అందిస్తున్నారు. పట్టణంలోని కాకతీయ కల్యాణ మండపంలో గురువారం ఆర్ఎంపీలు, పీఎంపీల ఆత్మీయ సమావేశంను స్వతంత్ర ల్యాబ్ నిర్వాహకుడు బాషా, రైల్వేస్టేషన్ సమీపంలోని ఆర్ఎంపీ హనుమంతురావు, పాత బస్టాండ్లోని ఆర్ఎంపీ బాష ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి 300 మందికి పైగా హాజరయ్యారు. స్వతంత్ర ల్యాబ్ పేరుతో ముద్రించిన కూపన్లు పంపిణీ చేశారు. అనంతరం వారందరికీ విందు ఇచ్చారు. ఆ కూపన్లు తీసుకొని ఒక్కొక్కరికి రూ. 2 వేలు చొప్పున నగదు, ఒక స్వీట్ బాక్స్ పంపిణీ చేసి టీడీపీకి ఓటు వేయాలని, వైద్యం నిమిత్తం వచ్చే రోగులను కూడా ప్రభావితం చేయా లని సూచించారు. సమావేశానికి ముందు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వచ్చి కొద్దిసేపు చూసి చూడనట్లుగా వ్యవహరించి, సరిగ్గా డబ్బు, స్వీట్ బాక్స్లు పంపిణీ చేసే క్రమంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. బిల్లులు లేని కాంగ్రెస్ ప్రచార సామగ్రి స్వాధీనం పట్నంబజారు: ఎటువంటి బిల్లులు లేకుండా ట్రావెల్స్లో వచ్చిన పార్టీ జెండాలను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గురువారం కేసు నమోదైంది. కొత్తపేట పోలీసుల వివరాల మేరకు.. హైదరాబాద్ నుంచి గుంటూరుకు కావేరి ట్రావెల్స్ బస్సులో గురువారం తొమ్మిది గోతాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జెండాలు, టోపీలు, కీచైన్లు తదితరాలు వచ్చాయి. ఈ క్రమంలో ఎటువంటి బిల్లులు లేకపోవడం గమనించిన అధికారులు వాటిని సీజ్ చేశారు. ఎఫ్ఎస్టీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గోతాల్లో ఉన్న సామగ్రి విలువ రూ.60,500 ఉంటుందని తెలిపారు. -
నా బిడ్డను ఆశీర్వదించండి
కారెంపూడి: ఎల్లప్పుడూ ప్రజా సమస్యల పరిష్కారానికే పరితపించే తన బిడ్డను మరోసారి ఆశీర్వదిస్తే ఇంకా అభివృద్ధి చేస్తాడని మాచర్ల వైఎస్సార్ సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తల్లి పిన్నెల్లి రాములమ్మ ప్రజలను కోరారు. కుమార్తె జవ్వాజి నాగమణితో కలసి గురువారం మండలంలోని ఒప్పిచర్ల గ్రామంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీపీ బొమ్మిన సావిత్రి, మాజీ సర్పంచ్ రామదేని లక్ష్మీ వెంట రాగా..ఇంటింటికీ వెళ్లి ఫ్యాను గుర్తుకు ఓటేయాలని, ఎంపీ అభ్యర్థి అనిల్కుమార్ యాదవ్ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మాజీ ఎంపీపీ చినవెంకట నర్సయ్య, ఎంపీటీసీ అనంతరామయ్య, ఆంజనేయులు, రామయ్య, శ్రీను, దోర్నాల సాంబిరెడ్డి, చిలుకూరి చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మా కాలనీ బాగుపడింది
మా కాలనీలో తాగునీటికి గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. రోడ్లపై మురుగు పారి, దోమలు బెడద తట్టుకోలేకపోయాం. జగనన్న పాలనలో ఇంటింటికి మంచినీటి కొళాయి వచ్చింది. రోడ్ల మీద మురుగును సైడ్ డ్రెయిన్లతో మళ్లించి సమస్యను పరిష్కరించారు. బడి బాగు చేయించి, పిల్లలకు మంచి భోజనం పెడుతున్నారు. – బుల్లా చంద్రశేఖరరావు, ఎస్పీ కాలనీ, నెమలికల్లుమార్పు తీసుకొచ్చారు మా ఊరిలో ముస్లింలకు సౌకర్యంగా ఈద్గా కట్టించారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు చొరవతో షాదీఖానా నిర్మించారు. సీసీ రోడ్లు, డొంక రోడ్డు వేసి గ్రామంలో ఎంతో మార్పు తీసుకొచ్చారు. – షేక్ ఖాశిం, ముస్లిం కాలనీ, నెమలికల్లు అభివృద్ధి చేసుకున్నాం ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సహకారంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం. రూ.31కోట్లతో సంక్షేమ పథకాలు, రూ.11 కోట్ల నాన్ డీబీటీ సాయం గ్రామస్తులకు అందింది. రూ.2.95 కోట్లతో ప్రభుత్వ భవనాలొచ్చాయి. నరుకుళ్ళపాడు సొసైటీ ద్వారా ఎరువుల గౌడౌన్ నిర్మించుకున్నాం. – కోవూరి చినరాంబాబు, సర్పంచ్, నెమలికల్లు -
గుంటూరు
శుక్రవారం శ్రీ 3 శ్రీ మే శ్రీ 2024సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 504.90అడుగుల వద్ద ఉంది. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 400 క్యూసెక్కులు విడుదలవుతోంది. మకర తోరణం వితరణ చెరుకుపల్లి: పొన్నపల్లి ఎస్టీ కాలనీలోని కోదండ రామాంజనేయస్వామికి పిట్టు కృష్ణారెడ్డి తన కుమారుడు ఏడుకొండలరెడ్డి జ్ఞాపకార్థం మకర తోరణం, వెండి కళ్లు, రాళ్ల బొట్లు అందజేశారు. 7
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019