ఆంధ్రప్రదేశ్ పునర్వభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీని కేంద్ర ప్రభుత్వ మంజూరు చేసింది. ఈ యూనివర్సిటీని గిరిజన ప్రాంతం, రిజర్వ్డ్ అసంబ్లీ లేదా పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో నిర్మించాలి. దీనికోసం తొలివిడతగా రూ.834 కోట్లను కేటాయించి రూ.426 కోట్లను విడుదల చేసింది. దీంతో చంద్రబాబునాయుడు అండ్ కో చకచకా పావులు కదిపారు. యూనివర్సిటీ నిర్మాణ నిబంధనలను తుంగలో తొక్కేశారు. ముందుగా విశాఖకు అతి సమీపంలోని కొత్తవలస ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములను అతి తక్కువ ధరకు కొనుగోలు చేయడం, వాటికి ఆనుకొనిఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం వంటి పనులు ప్రారంభించారు. ఈ ప్రాంతంలో అతి తక్కవ ధరకు వందల ఎకరాలను కూడబెట్టారు. ప్లాట్లు వేశారు. ఇదంతా చూసిన స్థానికులు వీరికేం పిచ్చి.. నివాసయోగ్యంకాని చోట ప్లాట్లు వేస్తున్నారని అనుకున్నారు. అప్పుడే మొదలైంది చంద్రబాబు డ్రామా. వారి రియల్ వ్యాపారానికి జాతీయ గిరిజన యూనివర్సిటీ పేరు పెట్టారు. నిబంధనలు దాచిపెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీశారు. 2017 సంవత్సరంలో కొత్తవలస మండ లం రెల్లి రెవెన్యూ గ్రామం అప్పన్న దొరపాలెం సమీపంలో నిర్మాణానికి ఏ మాత్రం అనువుగా లేని కొండ ప్రాంతంలో సర్వే నంబర్ 1–8లో 526.24 ఎకరాల భూమిని గుర్తించారు. ఇందులో కొంత కొండవాలు ప్రాంతంలో 180 మందికి ఇచ్చిన పట్టా భూమి 185 ఎకరాలను సైతం సేకరించారు. యూనివర్సిటీ నిర్మాణానికి భూసేకరణ పూర్తయిందంటూ కేంద్రానికి నివేదికలను పంపారు. ఎన్నికలకు ఏడాది సమయం ఉండగా హడావిడిగా అప్పటి భూగర్భ గనులశాఖ మంత్రి సుజయకృష్ణరంగారావు చేతుల మీదుగా ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి సమక్షంలో 2017 డిసెంబర్ నెలలో శంకుస్థాపన చేశారు. ఆ సమయంలోనే కేంద్ర ప్రభుత్వ అధికారులు పర్యటించి ఈ ప్రాంతం వర్సిటీ నిర్మాణానికి అనువుగా లేదని, ఈ ప్రాంతం ఎస్టీ సెగ్మెంట్లో లేదని వ్యతిరేకించారు. నివేదిక సైతం ఇచ్చారు. అయినా.. తమ రియల్ ఎస్టేట్వ్యాపారం పూర్తయ్యేవరకు చంద్రబాబు అండ్ కో ఈ నివేదికను బహిర్గతం చేయలేదు. తమ అనుకూల మీడియాతో ఈ ప్రాంతం ఆంధ్రాయూనివర్సిటీ పరి సరాల వలే అభివృద్ధి చెందుతుందని, వర్సిటీ ప్రహరీ పనులు ప్రారంభమైపోయాయంటూ ఊహాజనిత కథనాలతో ప్రచారం చేశారు. ఒక్క ప్రహరీతో కారుచౌకగా కొనుగోలు చేసిన భూ ములను వందలకోట్ల రూపాయలకు అమ్మేసి.. కొనుగోలుదారులకు పంగనామం పెట్టారు.
breaking news
Breadcrumb
- HOME
Ad - Sakshi_Home_Sticky
adsolute_video_ad
Related news
-
వ్యక్తిపై కత్తితో దాడి
వేపాడ: మండలంలోని వావిలపాడు గ్రామానికి చెందిన ఎం.సన్యాసిరావును అదే గ్రామానికి చెందిన ఆరిపాక సంతోష్ కత్తితో గాయపర్చి హత్యాయత్నానికి పాల్పడటంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజేష్ తెలిపారు. దీనికి సంబంధించి ఎస్ఐ అందించిన వివరాలు.. వావిలపాడుకు చెందిన ఆరిపాక సంతోష్ మద్యం సేవిస్తూ వుంటాడు. సన్యాసిరావుకు సంతోష్ వరుసకు కుమారుడు అవుతాడు. మద్యం సేవించడం మంచిది కాదని సంతోష్ను మందలిస్తూ వుండే వాడు. దీన్ని తట్టుకోలేని సంతోష్ గురువారం ఉదయం సన్యాసిరావు ఇంటికి వెళ్లి కత్తితో పీకపై గాయపర్చి హత్యాయత్నానికి పాల్పడినట్లు ఎస్ఐ తెలిపారు. దీంతో కుటుంబీకులు సమీపంలో వున్న ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సంతోష్ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. పోలీస్ సంక్షేమ పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి చర్యలు విజయనగరం క్రైమ్: జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏఆర్ పోలీసులైన్స్లో నడపబడుతున్న పోలీస్ వెల్ఫేర్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఖాళీగా ఉన్న మూడు ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ఎస్పీ ఎం.దీపిక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో ఆరో తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మ్యాఽథ్స్, ఫిజిక్స్ బయాలజీతో పాటూ ఇంగ్లిష్ సబ్జెక్ట్ కూడా బోధించాల్సి ఉంటుందన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హతను తెలిపే ఒరిజినల్ ధ్రువపత్రాలు, రెజ్యూమ్ తీసుకుని ఏప్రిల్ 26 ఉదయం 10 గంటలకు పాఠశాలలో నిర్వహించబోయే టీచింగ్ డెమో, మౌఖిక పరీక్షకు హాజరు కావాలన్నారు. ఉపాధ్యాయ పోస్టులకు బీఈడీ విద్యార్హతతో పాటూ అర్హతలు కలిగిన అభ్యర్థులు స్కూల్లో నిర్వహించే మౌఖిక పరీక్షకు ఆ రోజు హాజరు కావాలన్నారు. వివరాలకు 94917 99315, 91211 09485 సంప్రదించాలని కోరారు. వెబ్సైట్లో డీఎడ్ హాల్టికెట్లువిజయనగరం అర్బన్: ఈ నెల 22 నుంచి 27 వరకు జరిగే డీఎడ్ మూడవ సెమిస్టర్ (2022–24 బ్యాచ్ మరియు ఒన్స్ ఫైల్డ్), మొదటి సెమిస్టర్ (2023–25 బ్యాచ్ మరియు ఒన్స ఫైల్డ్) పరీక్షలకు హాజరగు విద్యార్థులకు హాల్ టికెట్లు వెబ్సైట్లో పొందుపరచామని డీఈఓ ఎన్.ప్రేమకుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థుల కోసం ‘బీఎస్ఈ.ఏపీ.జీఓవి.ఐఎన్’ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. బాలికపై లైంగిక దాడి డెంకాడ: మండలంలోని ఒక గ్రామంలో అమానవీయ ఘటన జరిగింది. దిశ పోలీసులు అందించిన వివరాలు.. బుధవారం ఏడేళ్ల బాలికపై 50 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక విజయనగరంలోని ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. విజయనగరం దిశ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గడ్డివాములు, వాటర్ పైపులు దగ్ధం రాజాం సిటీ: మున్సిపాల్టీ పరిధి పొనుగుటివలస గ్రామంలో మీసాల రమేష్కు చెందిన ఎకరన్నర గడ్డివాము, 80 నీటి పైపులు దగ్ధమయ్యాయి. గురువారం గడ్డివాము వద్ద ఆకస్మాత్తుగా మంటలు చెలరేగి వెనువెంటనే ప్లాస్టిక్ పైపులకు మంటలు అంటుకుని కాలిపోయాయి. సమాచారం తెలుసుకున్న పొందూరు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సుమారు 2 లక్షల రూపాయలు మేర ఆస్తి నష్టం సంభవించిందని బాధితుడు లబోదిబోమంటున్నాడు. అలాగే సంతకవిటి మండలం తాలాడ గ్రామానికి చెందిన బెరవ అప్పలనాయుడు, బెవర రాజారావుల గడ్డివాములతో పాటు 20 బస్తాల ధాన్యం కాలిపోయాయి. రాజాం ఫైర్ స్టేసన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సారాతో వ్యక్తి అరెస్టు సీతానగరం: మండలంలోని బక్కుపేట గ్రామంలో ఎస్ఈబీ సీఐ జె.శ్రీనివాసరావు నేతృత్వంలో గురువారం తనిఖీలు చేపట్టిన సమయంలో 190 సారా ప్యాకెట్లతో ఓ వ్యక్తి పట్టుబడగా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ముందస్తు సమాచారం మేరకు గ్రామానికి చెందిన పి. లక్ష్మణదొర ఇంట్లో తనిఖీలు చేసి సారాను గుర్తించినట్లు సీఐ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్సై బి.రాజశేఖర్ పట్నాయక్, జె.జగన్నాథరావు, ఎం. శ్రీవాణి, హెచ్సీ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. -
అట్లకర్ర పట్టుకున్న డాక్టర్
రాజాం: ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తలే రాజేష్ గురు వారం రాజాం మండలంలోని బొమ్మినాయుడువలస, ముద్దాడజోగివలస, గార్రాజుచీపురుపల్లి తదితర గ్రామాల్లో పర్యటించారు. ముద్దాడ జోగివలసలో ఓ పెళ్లింట మహిళలు వండుతున్న పిండి వంటల్లో భాగస్వామ్యమయ్యారు. డాక్టర్ కాస్త అట్లకర్ర పట్టుకోవడంతో మహిళలు మురిసిపోయారు. మహిళల ఓట్లన్నీ జగనన్నకే అంటూ సంతోషంగా చెప్పారు. వ్యాధుల వివరాల నమోదు తప్పనిసరి విజయనగరం ఫోర్ట్: జిల్లాలో నమోదయ్యే అన్ని రకాల వ్యాధుల వివరాలను ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ పోర్టల్ (ఐహెచ్ఐపీ)లో నమోదుచేయాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటిలిజెన్స్ (సీబీహెచ్ఐ) ల్యాబ్ టెక్నికల్ ఆఫీసర్ రవికుమార్ సూచించారు. జిల్లా పర్యటనలో భాగంగా డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు, ఇతర అధికారులతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం సమావేశమయ్యారు. జిల్లాలో ఏ ప్రాంతం, ఏ గ్రూపు వారికి, ఏ సీజన్లో ఏఏ రకాల వ్యాధు లు వ్యాప్తి చెందుతున్నాయో గుర్తిస్తే.. వ్యాప్తిని అరికట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలోని పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులు, సర్వజన ఆస్పత్రిని మూడు రోజులపాటు పరిశీలిస్తామని చెప్పారు. ఆస్పత్రుల సిబ్బందికి సూచనలు ఇస్తామన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.భాస్కరరావు, సీబీహెచ్ఐ గణాంకాధికారి రామారావు, డీఎంఓ మణి, ఎస్ఓ రామారావు, డాక్టర్ వెంకటేష్, హెల్త్ ఎడ్యుకేటర్స్ సత్యరాజ్, అనిల్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
సైకిల్ మాకొద్దు బాబూ...
చీపురుపల్లి: రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పాలన చూసి టీడీపీ వర్గీయులు ఆ పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. సైకిల్ మాకొద్దు.. ఫ్యానే ముద్దు అంటూ వలసపోతున్నారు. పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో గురువారం పలు చేరికలు జరిగాయి. చీపురుపల్లి మేజర్ పంచాయతీ పరిధిలోని ఆకులపేట గ్రామానికి చెందిన పిన్నింటి, కొండేటి, మీసాల, పతివాడ ఇంటి పేరుకు చెందిన 30 కుటుంబాలు టీడీపీను వీడి వైఎస్సార్ సీపీలో చేరాయి. ఇటీవల తమకు తెలియకుండానే టీడీపీ కండువాలు తమకు వేశారని, టీడీపీలో ఉండే పరిస్థితే లేదని వారంతా స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీలోకి వచ్చిన వీరికి ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఇప్పిలి అనంతం, జిల్లా కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, మాజీ జెడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు, యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణలు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో మీసాల హరి, గవిడి సురేష్ తదితరులు పాల్గొన్నారు. 13వ వార్డు నుంచి చేరికలు ఇదిలా ఉండగా పట్టణంలోని జెడ్పీటీసీ వలిరెడ్డి శిరీష కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు ఆధ్వర్యంలో చీపురుపల్లి మేజర్ పంచాయతీలోని 13వ వార్డు నుంచి పలువురు వైఎస్సార్ సీపీలో చేరారు. ఇటీవల టీడీపీలో చేరిన 13వ వార్డు మెంబరు తల్లి సంగంరెడ్డి కనకమ్మ, సంగంరెడ్డి శివ, వెలుసూరి వెంకటరమణ తదితరులకు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జుజ్జూరు వర్మ, కంచుపల్లి అశోక్, అడ్డూరి కృష్ణ, బుంగ కనకేశ్వరరావు తదితరులు ఉన్నారు. టీడీపీకి భారీ షాక్ రేగిడి : టీడీపీకి భారీ షాక్ తగిలింది. మండలంలో లక్ష్మీపురం గ్రామంలో టీడీపీకి చెందిన 50 కుటుంబాలు వైఎస్సార్సీపీలోకి చేరాయి. గురువారం ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, వైస్ ఎంపీపీ టంకాల అచ్చెన్నాయుడు, పార్టీ మండల అధ్యక్షుడు వావిలపల్లి జగన్మోహనరావులు పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి ఆహ్వానించారు. టీడీపీకి చెందిన నేదూరి దుర్గయ్య, బొంతల సంగయ్య, మిరియాలు జప్పన్న, కాయల తవుడు, జోరీగల వెంకటి, కాయల రామారావు, బొంతల రామయ్య, బొంతల అప్పలరాం, నేదూరి అప్పలరాం, మిరియాల లోకేష్ తదితరులతో పాటు మరో 40కి పైగా కుటుంబాలు వైఎస్సార్సీపీలోకి చేరాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనను ప్రజలు అంతా ఆహ్వానిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కెంబూరి వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ ఎర్నేన అప్పలనాయుడు, అప్పాపురం సర్పంచ్ కరణం శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ బాలి తవిటినాయుడు, పాలవలస దవళేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. టీడీపీని వీడి.. వైఎస్సార్సీపీలోకి... ● పార్టీలోకి ఆహ్వానించిన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి మండలంలోని దువ్వాం పంచాయతీ నుంచి టీడీపీకి చెందిన 50 కుటుంబాలు గురువారం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీసివాసరావు సమక్షంలో పార్టీలో చేరారు. విజయనగరంలోని ఆయన నివాసం వద్ద టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోనికి వచ్చిన లారీ ఓనర్స్ అసోషియేషన్ ప్రతినిధి బాలి రామారావు, బాలి రమణ, బాలి కూర్మారావు, పేరెంట్స్ కమిటీ చైర్మన్ పతివాడ తవిటినాయుడు, రెల్లి పైడినాయుడు, గొర్లె లోకేష్, గొర్లె చిన్న, బాలాజీ తదితర 50 కుటుంబాలకు చెందిన వారందరికీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని, జగన్మోహన్రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావటం ఖాయమని అన్నారు. రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలన్నా, మంచి అభివృద్ధి కార్యక్రమాలు అమలు కావాలన్నా ప్రతీ ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఎమ్మెల్యే, ఎంపీ రెండు ఓట్లును వేసి ఎమ్మెల్యేగా బొత్స సత్యనారాయణను, ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్ను గెలిపించి జగన్మోహన్రెడ్డిని సీఎంను చేయాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ నేతేటి కృష్ణవేణి, స్థానిక నాయకుడు తోట రవి, ఏఎంసీ మాజీ చైర్మన్ మీసాల విశ్వేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు కొణిశ కృష్ణంనాయుడు, తాటిగూడ పీఏసీఎస్ అధ్యక్షుడు ఎడ్ల అప్పారావు, వలిరెడ్డి లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలోకి వలసల జోరు -
అప్పుల భయంతో వ్యక్తి ఆత్మహత్య
బాడంగి: అప్పులు తీర్చలేనన్న భయంతో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు... మండలంలోని చినభీమవరం గ్రామానికి చెందిన ఉయ్యాల నూకందొర అలియాస్ ఆది (45) విజయనగరంలోని సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్టు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే.. మృతుడు ఇంట్లో భార్యకు తెలియకుండా రూ.50వేల వరకు అప్పులు చేశాడు. ఈ మొత్తాన్ని ఎలా తీర్చాలో తెలియక ఆందోళనకు గురై బుధవారం ఉదయం అరటి తోట వద్ద పురుగుల మందు తాగి వాంతులు చేసుకొంటూ ఇంటికి చేరుకున్నాడు. భార్య పద్మ చూసి ఏమైందని ప్రశ్నించగా పురుగుల మందు తాగానని చెప్పాడు. దీంతో కుటుంబీకుల సహాయంతో 108 ద్వారా స్థానిక సీహెచ్సీకి తరలించారు. ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం విజయనగరం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. మృతునికి తల్లి అప్పలనర్సమ్మ, భార్య పద్మ ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఆర్.జయంతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లింట విషాదం
● సారి సామగ్రి ఇచ్చేందుకు వెళ్తుండగా రోడ్డుప్రమాదం ● సంఘటన స్థలంలోనే మహిళ మృతి ● మరో పదకొండు మందికి తీవ్రగాయాలు గుమ్మలక్ష్మీపురం/కురుపాం: వివాహానంతరం వధువుకు ఇవ్వాల్సిన సారి సామగ్రి ఇచ్చేందుకు వెళ్తుండగా మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదం పెళ్లివారింట విషాదం నింపింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా..మరో 11 మంది తీవ్రగాయాల పాలయ్యారు. బాధితులు, పోలీసులు తెలిపిన మేరకు ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. కురుపాం మండలంలోని కాకితాడ గ్రామానికి చెందిన పెద్దింటి కాంతారావు, సరోజినిల కుమార్తె లిజితకు కొమరాడ మండలంలోని పూడేసు గ్రామానికి చెందిన యువకుడితో ఇటీవలే వివాహమైంది. వధువుకు సారిసామగ్రి ఇచ్చేందుకు కుటుంబసభ్యులు, బంధువులు గురువారం ట్రక్కర్లు్, ఆటోల్లో బయల్దేరారు. ఈ క్రమంలో అందరికంటే వెనుకగా వధువు సొంతకుటుంబీకులను తీసుకువెళ్తున్న ట్రక్కర్ రస్తాకుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రం సమీపంలో అదుపుతప్పి ప్రధానరహదారిలోని కల్వర్టుగోడను బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆ వాహనంలో ఉన్న వధువు మేనత్త కమిడి కమల(55) అక్కడికక్కడే మృతిచెందగా..మృతురాలి తమ్ముడు పెద్దింటి భుజంగరావు, మరదలు సుజాత, మరో మేనకోడలు బి. సుగుణ, మేనకోడలి కుమారుడు చైతన్య, మేనకోడలు సుగుణ భర్త రవితో పాటు ఇతర కుటుంబసభ్యులు గంటా పవన్, లిమ్మ సుమన్, పాలక శశిరేఖ, పి.మారతమ్మ, ఎన్.పుష్పరాజ్లతో పాటు డ్రైవర్ తేజ తీవ్రగాయాలపాయ్యారు. ప్రమాదం జరిగిన విషయాన్ని గమనించిన ఇతర కుటుంబసభ్యులు క్షతగాత్రులను హుటాహుటిన భద్రగిరి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో కమలను పరీక్షించిన వైద్యాధికారి రవికుమార్ ఆమె అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. అలాగే తల పుర్రెభాగంలో తీవ్రంగా గాయపడిన నాలుగేళ్ల బాలుడు చైతన్యతో పాటు మారతమ్మ, పుష్పరాజు, తదితరులను మెరుగైన వైద్యం నిమిత్తం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఈ సంఘటనపై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కురుపాం ఎస్సై ఎస్.షన్ముఖరావు తెలిపారు.
Related News by category
-
వందేళ్ల తర్వాత సర్వే
బ్రిటిష్ కాలంలో భూ సర్వే చేపట్టారు. అప్పటి నుంచి ఏ ప్రభుత్వం భూ సర్వేపై దృష్ఠి సారించి రైతుల భూ సమస్యల పరిష్కారించడానికి మొగ్గు చూపలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొన్ని వేల కోట్లు ఖర్చుచేసి భూ రీసర్వేను చిత్తశుద్ధితో నిర్వహిస్తోంది. భూముల రీసర్వే వల్ల ఏన్నో ఏళ్ల నుంచి ఉన్న మా భూ సమస్యలు పరిష్కారమయ్యాయి. శాశ్వత హక్కు పత్రాలు చేతికందాయి. – నడుపూరు అప్పలనాయుడు, రైతు, ఆనందపురం ఎంతో మందికి ప్రయోజనం భూములు రీ సర్వేతో చాలా గ్రామాల్లో భూ సమస్యలు గట్టెక్కాయి. కొత్తగా భూ యజమానులు హక్కు పత్రాలు పొందారు. ఈ హక్కు పత్రాలుతో రుణాలు కూడా పొందుతున్నారు. ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే ప్రతిపక్షాలకు పనిపాటా లేకుండా ఓటర్లును మభ్యపెట్టే కార్యక్రమం చాలా దారుణంగా ఉంది. – వాకముల్ల చిన్నంనాయుడు, పీఏసీఎస్ అధ్యక్షుడు, రాజాం. ● -
వాటీజ్ దిస్ ‘బేబీ’?
సాక్షి ప్రతినిధి, విజయనగరం: మిట్ట మధ్యాహ్నం... బొబ్బిలి మెయిన్రోడ్డు... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మలివిడత ప్రచార సభ... వేలాది జనం పోటెత్తారు. బుధవారం ఈ ప్రభంజనాన్ని చూసినవారంతా ఆశ్చర్యపోయారు. కానీ ఒక్కరు మాత్రం ఉలిక్కిపడ్డారు. ఆయనే బొబ్బిలి టీడీపీ అభ్యర్థి ఆర్వీఎస్కేకే రంగారావు ఉరఫ్ బేబీనాయన! తమ పూర్వీకుల వీరప్రతాపం గురించి కోటకు వచ్చినవారందరికీ పూసగుచ్చినట్లు చెప్పే ఆయన... ఇప్పుడు జగన్మోహన్రెడ్డి సభ అంటే హడలిపోవడం విచిత్రంగా ఉందని బొబ్బిలి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అంతకుముందు జరిగిన వైఎస్సార్సీపీ సభలకు పోటెత్తిన జనాన్ని చూసి ముందురోజు నుంచే ‘రక్షణ’ పేరుతో చెడగొట్టే కార్యక్రమానికి తెరలేపారు. బొబ్బిలి కోట సమీపంలో సభ పెడితే తమ కుటుంబానికి భద్రత ఉండదని, తమకు రక్షణ కల్పించాలంటూ తన న్యాయవాది ద్వారా ఎన్నికల కమిషన్కు, అధికారులకు ఫిర్యాదులు పంపించడం గమనార్హం. కానీ రోడ్డుషోకు హాజరైన ప్రజలు కానీ, వైఎస్సార్సీపీ శ్రేణులు కానీ ఆ కోట గేటు వైపు కూడా కన్నెత్తిచూడలేదు. ఇక తన ప్రసంగంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్కడా బేబీనాయన గురించి కానీ, మంత్రి పదవి కోసం సంతలో పశువులా అమ్ముడుపోయి వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఆయన సోదరుడు ఆర్వీఎస్కే రంగారావు (సుజయ్) గురించి కానీ ప్రస్తావన తీసుకురాలేదు. ఒకవైపు కూటమి నాయకులు తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నా జగన్మోహన్రెడ్డి మాత్రం తన ప్రత్యర్థి పార్టీకి చెందిన బొబ్బిలి రాజుల పట్ల హుందాగా వ్యవహరించడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ● ఇప్పుడు ఎమ్మెల్యే కావాలని... బొబ్బిలి పట్టణంలో దశాబ్దాల సమస్యగా ఉన్న మెయిన్ రోడ్డు విస్తరణనూ చేపట్టలేక బేబీనాయన మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు, ఆయన సోదరుడు సుజయ్ టీడీపీలోకి వెళ్లి మంత్రిగా అధికారం వెలగబెట్టినప్పుడు చేతులెత్తేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.10 కోట్ల వ్యయంతో మెయిన్రోడ్డును విస్తరించారు. ఆ సోదరులు బొబ్బిలికి చేసిన మేలేమిటో ఒక్కటీ చెప్పలేరు. ● ఆ మెయిన్ రోడ్డుపైనే సభలన్నీ... ‘సైకిల్ పోవాలి’ అంటూ చంద్రబాబు నినాదం ఇచ్చిన ‘ఇదేమి ఖర్మ’ కార్యక్రమం కూడా బొబ్బిలి మెయిన్రోడ్డుపైనే 2022 డిసెంబర్ 23న బేబీనాయన సమక్షంలోనే జరిగింది. పట్టుమని రెండు వేల మంది కూడా ఆ కార్యక్రమానికి రాలేదు. ఆ తర్వాత అదే రోడ్డుపై గత ఏడాది నవంబరు 23న జరిగిన వైఎస్సార్సీపీ ‘ప్రజా సంకల్పయాత్ర’కు జనం పోటెత్తారు. కళాభారతి నుంచి బొబ్బిలి కోట వరకూ జనసంద్రమైంది. జగన్మోహన్రెడ్డి కార్యక్రమాలకు అంతకుమించి జనం వస్తారనే అంచనాతో బేబీనాయనకు బెంగపట్టుకుంది. సభాస్థలి కోటకు సమీపంలో పెట్టడం ఇష్టం లేక తన కోట ‘భద్రత’ పేరుతో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలంటే భయమా? లేదంటే ద్వేషమా? ఇంటి సమీపంలో సభ పెడితే తనకు రక్షణ ఉండదా? బొబ్బిలి టీడీపీ అభ్యర్థి బేబీనాయన ముందస్తుగా బెంగ సీఎం జగన్ బొబ్బిలి రోడ్డుషోపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు ఏమిటీ నాయనా మీ గొప్ప... అధికారం దక్కేవరకే బేబీనాయనకు ప్రజలతో పని. ఒకసారి పీఠం దక్కిందా ఆ తర్వాత అదే ప్రజలను కోట గుమ్మం కూడా ఎక్కనివ్వని చరిత్ర ఆయన సొంతం. చివరకు అధికారులైనా దర్బార్మహల్లో రోజంతా పడిగాపులు బొబ్బిలి ప్రజలకు అనుభవమే. తొలుత 2009లో బొబ్బిలి 29వ వార్డు కౌన్సిలర్గా బేబీ నాయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. అదీ కోటను ఆనుకొని ఉన్న వార్డు, ఆరొందలకు మించని ఓటర్లు అయినా సరే గెలుపుపై భయం పట్టుకుంది. అప్పట్లో పోటీ పడిన టీడీపీ అభ్యర్థిని నయానాభయానో ఒప్పించి తన ఏకగ్రీవ ఎన్నిక కోసం బరి నుంచి తప్పించారు. అలా బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకున్న ఆయన పదవీకాలం 2009–14లో ముచ్చటగా మూడుసార్లు మాత్రమే ఆ కుర్చీలో కూర్చున్నారు. కారణమేమిటో తెలుసా? మున్సిపల్ సాధారణ సమావేశాల్లో కౌన్సిలర్లు కొన్ని సమస్యలపై నిలదీస్తుండటంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసేవారు. పదవీ అలంకారం కాదు ప్రజాసేవ కోసమనే విషయం తెలియని ఆయన ఇక ఆ తర్వాత ఎప్పుడూ కౌన్సిల్ హాలులోకి అడుగుపెట్టలేదు. వైస్ చైర్మన్ గునాన విజయలక్ష్మికి బాధ్యతలు అప్పగించేసి ప్రజలకు ముఖం చాటేశారు. అంతేకాదు మున్సిపల్ చైర్మన్ పదవిలోకి వచ్చినప్పుడు తనకోసం ప్రత్యేకంగా చేయించుకున్న కుర్చీని కూడా కోటకు తీసుకుపోయారు. -
రోడ్డు ప్రమాదంలో బీజేపీ నేత దుర్మరణం
గుర్ల: మండలంలోని కలవచర్ల వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బీజేపీ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు అల్లూరి రామకృష్ణ రాజు (56) తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని 108 ద్వారా విజయనగరంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతున్న ఆయన గురువారం మృతి చెందారు. ఎస్ఐ భాస్కరరావు కేసు నయోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కలవచర్ల వద్దనున్న మలుపు వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అల్లూరి రామకృష్ణ రాజు, కోటగండ్రేడు నుంచి వస్తున్న మరో ద్విచక్ర వాహనాన్ని తప్పించిబోయి రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఆయన మృతి వైఎస్సార్సీపీ నాయకులు, బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. నేటి నుంచి రిఫరీ, రిఫ్రెషర్స్ సెమినార్ విజయనగరం: న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలో రెండు రోజుల పాటు నేషనల్ తైక్వాండో రిఫరీ, రిఫ్రెషర్స్ సెమినార్ శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్టు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్.వేణుగోపాలరావు గురువారం తెలిపారు. నగరంలోని రాజీవ్ క్రీడా మైదానం ప్రాంగణంలో జరిగే సెమినార్లో వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు, కోచ్లు పాల్గొనున్నట్లు పేర్కొన్నారు. -
No Headline
విజయనగరం అర్బన్/రాజాం/మెరకముడిదాం/గుర్ల: సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్ గాలి స్పీడుగా వీస్తోంది. కూటమితో ముందుకొచ్చిన చంద్రబాబు ఏ హామీ ఇచ్చినా ఓటర్లు నమ్మడం లేదు. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ ‘కోటు’బాబులతో పాటు కమెడియన్ ఆర్టిస్ట్లను రంగంలోకి దించినా జనాల్లో స్పందన కనిపించడం లేదు. టీవీ యాక్టర్లను చూసేందుకు కూడా టీడీపీ, కూటమి సభలకు జనాలు రావడం లేదు. దీంతో ఏమి చేయాలో తోచక టీడీపీ అధినేత చంద్రబాబు అండ్ కో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై లేనిపోని ఆరోపణలకు దిగారు. భూ యజమానులకు మేలుచేసేలా.. వివాదాలకు తెరదించేలా.. మూడేళ్లుగా ఓ యజ్ఞంలా చేపట్టిన ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు–భూ రక్షణ సర్వే’ను తప్పుదోవ పట్టించే యత్నానికి దిగారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంశాలను ప్రజలకు తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 983 గ్రామాలకు 481 గ్రామాల్లో రీ సర్వే పూర్తికావడం, రైతుల చేతికి హక్కు పత్రాలు అందడం, భూ వివాదాలు కళ్లముందే పరిష్కారం కావడం, కోర్టుల చుట్టూ తిరగాల్సిన పనితప్పడంతో టీడీపీ అబద్ధాలను ప్రజలు, మేధావులు నమ్మడంలేదు. ఎన్నికల వేళ చట్టం గుర్తొచ్చిందా అంటూ విమర్శిస్తున్నారు. రాజకీయ లబ్ధికోసం ప్రజోపయోగ కార్యక్రమాన్ని తప్పుదోవ పట్టించడంపై మండిపడుతున్నారు. ప్రభుత్వం చేసిన మేలు కనిపించాలంటే పొలాల్లోకి వచ్చి సరిహద్దురాళ్లను చూస్తే తెలుస్తుందని చంద్రబాబుకు హితవుపలుకుతున్నారు. వందేళ్ల తర్వాత ఊరూరా భూముల రీసర్వే ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష’ పథకం కింద భూములకు సర్వహక్కులు ఇప్పటికే జిల్లాలో 983 గ్రామాలకు 481 గ్రామాల్లో రీ సర్వే పూర్తి రైతుల చేతికి భూ హక్కు పత్రాలు వివాదాలకు తెర రైతుల సమక్షంలోనే సరిహద్దు రాళ్ల ఏర్పాటు బృహత్తర కార్యక్రమంపై ఎన్నికల వేళ దుష్ప్రచారానికి దిగిన చంద్రబాబు అండ్ కో.. ఛీ కొడుతున్న జనం -
అభ్యర్థుల ఖర్చుల పరిశీలన
విజయనగరం అర్బన్: ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఎన్నిక ఖర్చును జిల్లా వ్యయ పరిశీలకుడు ప్రభాకర్ ప్రకాష్ రంజన్, ఆనంద్కుమార్, ఆకాష్ దీప్ గురువారం పరిశీలించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మొదటి విడత ఖర్చుల పరిశీలనా కార్యక్రమం జిల్లా వ్యయ నోడల్ అధికారి డాక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. వివిధ నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి ప్రతినిధులు తమ ఖర్చుల వివరాలను రెండో విడత ఈ నెల 6న, మూడో విడత 10న నిర్వహిస్తారు. కార్యక్రమంలో నియోజకవర్గాల అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లు, పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి ప్రతినిధులు పాల్గొన్నారు. వెలవెలబోయిన బాలకృష్ణ రోడ్షో విజయనగరం రూరల్: విజయనగరంలో గురువారం రాత్రి స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరిట సినీ నటుడు బాలకృష్ణ నిర్వహించిన రోడ్షో జనం లేక వెలవెలబోయింది. జిల్లాకో మెడికల్ కళాశాల, ప్రపంచంలోనే తొలిసారిగా డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుదేనంటూ చేసిన ఉత్తిత్తి ప్రసంగం టీడీపీ కార్యకర్తల్లో విసుగు పుట్టించింది. టీడీపీ ఉనికిని కాపాడుకోవడానికి ఇదే ఆఖరిపోరాటంగా పేర్కొన్నారు. విజయనగరం టీడీపీ ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడును వాహనంపై నుంచి కిందకు దించేయడం ఆయన అనుచరుల్లో ఆగ్రహం తెప్పించింది. సభ జరుగుతున్నంత వరకు కలిశెట్టి కిందనే నిల్చోవాల్సి వచ్చింది. కంట్రోల్ రూమ్ సందర్శన విజయనగరం అర్బన్: కలెక్టరేట్లోని ఎన్నికల కంట్రోల్ రూమ్ను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు హనష్ చాబ్రా గురువారం సందర్శించారు. వివిధ విభాగాల ఇన్చార్జిలతో మాట్లాడారు. ఎన్నికల విధులపై ఆరా తీశారు. మీడియా మోనటరింగ్ విభాగాన్ని సందర్శించి, ఎంసీఎంసీ అనుమతులు, పెయిడ్ న్యూస్, రాజకీయ ప్రకటనలపై సమీక్షించారు. జిల్లాలో ఇంత వరకు సీజ్ చేసిన వస్తువులు, మద్యం తదితర అంశాలపై నియోజకవర్గాల వారీగా అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్వో ఎస్.డి.అనిత, కంట్రోల్ రూమ్ ఇన్చార్జి పి.బాలాజీ, ఆయా విభాగాల ఇన్చార్జి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పైడితల్లి హుండీల ఆదాయం లెక్కింపు విజయనగరం టౌన్: పైడితల్లి అమ్మవారి ఆలయ హుండీల ఆదాయాన్ని అమ్మవారి కళ్యాణ మండపం ఆవరణలో గురువారం లెక్కించారు. 34 రోజులకు చదురుగుడి హుండీల నుంచి రూ.13,14,277లు వచ్చినట్టు ఆలయ ఈఓ డీవీవీ ప్రసాదరావు తెలిపారు. కార్యక్రమంలో శ్రీవారి సేవా సంఘం ప్రతినిధులు, ధర్మవరం గ్రూప్ టెంపుల్స్ ఈఓ బి.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. 15 నుంచి ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు విజయనగరం: ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఈ నెల 15 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎస్.వెంకటేశ్వరరావు గురువారం తెలిపారు. ఏపీ క్రీడాప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 50 శిబిరాలు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. శిబిరాల్లో 8 నుంచి 14 సంవత్సరాలలోపు వయస్సు గల బాల, బాలికలు తమకు ఇష్టమైన క్రీడాంశంలో ఉచితంగా శిక్షణ పొందవచ్చని సూచించారు.
Photos
View allVideo
View allBullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019