సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవంలో ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, సీఎం రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దంపతులతో పాటు మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థులు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, భరత్ప్రసాద్, బీజేపీ నేత ఆచారి తదితర ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సీఐ విష్ణువర్ధన్రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్తో పాటు పలువురు ఎస్ఐలు పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు. సిర్సనగండ్లకు చెందిన రాచమళ్ల నర్సింహ కుటుంబసభ్యులు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం, రాంపురం గ్రామానికి చెందిన చిలుకాని బాల్రెడ్డి, వెంకటమ్మ జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. భారతిసిమెంట్, ఇతర సేవా సంస్థల ద్వారా తాగునీటి వసతి, మజ్జిగ అందజేశారు. కాగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల ప్రజాప్రతినిధులు, ఎంపీ అభ్యర్థులు, నాయకులు ఒకే వేదికపై కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
breaking news
Breadcrumb
- HOME
Ad - Sakshi_Home_Sticky
adsolute_video_ad
Related news
-
తిరుమలనాథస్వామి జాతర ప్రారంభం
నారాయణపేట రూరల్: మండలంలోని తిర్మలాపూర్ గ్రామ శివారులోని గుట్టపై స్వయంభుగా వెలిసిన తిరుమలనాథస్వామి జాతర బుధవారం ప్రారంభమైంది. ముందుగా శ్రీలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారి సన్నిధిలో అభిషేకం, అర్చన, మహామంగళహారతి కార్యక్రమాలు కనులపండువగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలో మధ్యాహ్నం కల్యాణం నిర్వహించి, సాయంత్రం స్వామివారి పల్లకిసేవా వైభవంగా చేపట్టారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారు, స్వామివారిని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు. నేడు రథోత్సవం ఉత్సవాల్లో భాగంగా రెండవరోజు గురువారం తెల్లవారుజామున స్వామివారి రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అదేవిధంగా ఆలయంలో స్వామివారికి అమృతస్నానం, నైవేద్యం తదితర పూజా కార్యక్రమాల అనంతరం జాతర ఉంటుందని, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఆత్మగౌరవాన్నిదెబ్బతీస్తే సహించం నారాయణపేట: మాదిగల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసి అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు కర్రెప్ప అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రంలో ఇటీవల జరిగిన కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్రెడ్డి మాదిగ ఉద్యమం మీద, నాయకత్వం మీద చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజకీయంగా మాదిగలను అస్తిత్వం లేకుండా చేయాలని కుట్రపూరితంగా రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వటం లేదని ఆరోపించారు. కచ్చితంగా భవిష్యత్తులో మాదిగలకు సముచిత స్థానం ఉందని రేవంత్రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, భవిష్యత్ లో న్యాయం అంటే ప్రస్తుతం న్యాయం జరగలేదని గుర్తించాలన్నారు. అంతే కాకుండా మాదిగలకు చిన్నా చితక నామినేటెడ్ పదవులలో అవకాశం ఇచ్చి అవే పెద్ద పదవులు అని మరోసారి కించపరిచే విధంగా మాట్లాడిన తీరును తామంతా వ్యతిరేకిస్తున్నామన్నారు. సమావేశంలో ఆ సంఘం నాయకులు ఆనంద్, వెంకటేష్, తిరుపతి, కృష్ణ, మహేష్ ఉన్నారు. అలరించినవసంత కవితోత్సవం స్టేషన్ మహబూబ్నగర్: శ్రీరామ నవమిని పురస్కరించుకొని తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక భారత్ స్కౌట్స్, గైడ్స్ భవనంలో వసంత కవితోత్సవం నిర్వహించారు. ఈకార్యక్రమానికి అవధాని చుక్కాయపల్లి శ్రీదేవి అధ్యక్షత వహించగా.. ప్రముఖ వక్త డా.పొద్దుటూరి ఎల్లారెడ్డి మాట్లాడారు. పితృవాక్య పాలకుడైన శ్రీరాముడి జగత్ ప్రసిద్ధమైన కల్యాణాన్ని వీక్షిస్తే, మంచి ఫలితం ఉంటుందన్నారు. రామాయణం అనేది కుటుంబ బంధమని అన్నారు. ప్రవచనకర్త డా.పల్లెర్ల రామ్మోహనరావు మాట్లాడుతూ రామాయణాన్ని మించిన వ్యక్తిత్వ వికాస గ్రంథం ప్రపంచంలో మరొకటి లేదన్నారు. రామనామస్మరణలో గొప్ప శక్తి దాగి ఉందని.. మానవాళి అనుసరించాల్సిన ఎన్నో విషయాలు రామాయణంలో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు రావూరి వనజ, జి.శాంతారెడ్డి సమన్వయ కర్తలుగా వ్యవహరించగా.. కవులు బాదేపల్లి వెంకటయ్య, లక్ష్మణ్గౌడ్, గుముడాల చక్రవర్తి గౌడ్, జగపతిరావు, వెంకటేశ్వర్రావు, కమలేకర్ శ్యాంప్రసాద్రావు, అనురాధ, జమున కవితలు వినిపించారు. -
పల్లెల్లో దళారుల దందా!
మరికల్: ధాన్యం నాణ్యతగా లేదని.. సరిగ్గా ఎండబెట్టలేదని.. వర్షాలు పడితే ధాన్యం మరింత తడిసి నష్టం వాటిళ్లుతుందంటూ.. భయపెట్టడంతోపాటు తూకాల్లో మోసాలకు పాల్పడుతూ రైతుల నుంచి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు కొందరు దళారులు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను లైసెన్స్ లేని దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి గుట్టుగా పక్క రాష్ట్రమైన కర్ణాటకకు తరలించేస్తున్నారు. ఎక్కువ ధరకు అక్కడి మిల్లర్లకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో యాసంగి వరి పంటలు కోతకు రావడంతో మార్కెట్ శాఖ నుంచి లైసెన్స్లు లేని వ్యాపారులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చారు. అప్పుడే కోత వేసిన ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేయడమే కాకుండా తూకాల్లో మోసం చేస్తు కర్ణాటక మిల్లర్లకు అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. ధరలు తగ్గించి.. ఉగాది పండుగకు ముందు యాసంగి కోతలు ప్రారంభం కాగానే వ్యాపారులు కర్ణాటక రాష్ట్రం సిందనూర్, మాన్వి, గంగవతి, రాయచూర్ మిల్లర్ల నుంచి లారీలను రప్పించి క్వింటా ధాన్యం రూ.2,230 నుంచి రూ.2500 వరకు రైతుల వద్ద కొనుగోలు చేశారు. ఉగాది తర్వాత రంజాన్ పండుగ రావడంతో వరుసగా వారం రోజుల పాటు సెలవులు వచ్చాయి. ఈ సమయంలో వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. టెండర్ ధరలు తెలియకపోవడంతో మిల్లర్లు, దళారీ వ్యాపారులు కలిసి ధాన్యంలో నాణ్యత లేదని వంకాలు చెప్పి ఏకంగా క్వింటాపై రూ. 400 తగ్గించారు. లేదంటే ధాన్యం ఆరబెట్టి అమ్మితే క్వింటా రూ.2,550కి కొనుగోలు చేస్తామని చెప్పడంతో ఆకాల వర్షాలకు భయపడ్డిన రైతులు తక్కువగా ధరకే విక్రయించి నష్టాలను మూటగట్టుకుంటున్నారు. దళారీల దందా.. మరికల్ మండలం తీలేర్, వనపర్తి జిల్లా ఆత్మకూర్కు చెందిన దళారులు వరిధాన్యం తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారు. వీరు గత పదేళ్ల నుంచి ఽవానాకాలం, యాసంగిలో జిల్లా వ్యాప్తంగా పలు మండల్లాలో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నారు. కోత వేసిన పంటను కొనుగోలు చేయాలని రైతులు ఈ వ్యాపారులకు ఫోన్ చేయగానే క్షణాల్లో అక్కడికి వాలిపోతారు. ధాన్యాన్ని పరిశీలించి వారు కోత వేసిన పంటలో తేమ, తాలు, బెర్కు ఉందన్ని ఇలా లేనిపొని పేర్లు పెట్టి మార్కెట్ కంటే తక్కువ ధరకు భేరం అడతారు. లేదంటే ఈ ధాన్యాన్ని ఎవరూ కొను గోలు చేయరని, వెళ్లిపోతామని రైతులను భయపెట్టిస్తారు. మొత్తంగా క్వింటా రూ.2100 చొప్పున కొనుగోలు చేసి కర్ణాటక మిల్లర్లకు తరలిస్తున్నారు. అక్కడ క్వింటా రూ.3000 చొప్పున వ్యాపారులకు అమ్ముకుంటున్నట్లు సమాచారం. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి పలుమార్లు ఇంటికి తిప్పించుకొని రూ.100కి రూ.2 చొప్పున కమీషన్ గానీ బ్యాగు పేరిట కిలో, తాలు పేరిట కిలో కట్ చేసి మిగితా డబ్బులను నెల రోజుల తర్వాత రైతుల చేతిలో పెడుతున్నారు. మార్కెట్ శాఖ అనుమతులు లేకుండా వ్యాపారం చేస్తున్న నకిలీ వ్యాపారులపై వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో వ్యాపారులు సిండికేట్గా మారి ఒకే ధరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. మరికల్లో లారీలోకి ధాన్యం ఎక్కిస్తున్నఓ దళారీకి చెందిన కూలీలు ఆదాయమంతాకర్ణాటక రాష్ట్రానికే.. జిల్లాలో యాసంగి సాగులో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం కోసం పక్షం రోజుల కిందట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే ఈ కేంద్రాలకు రైతులు ధాన్యం తేవడానికి సముఖంగా లేరు. ఇప్పటికే కర్ణాటకలో వరి ధాన్యానికి క్వింటాకు రూ.2,800 నుంచి రూ.3 వేల మధ్య పలకడంతో అక్కడి మిల్లర్లు ఇక్కడి దళారీ వ్యాపారులను రంగంలోకి దింపారు. వారికి నేరుగా లారీలను పంపించి ఒప్పందం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మన వ్యవసాయ మార్కెట్లకు రావాల్సిన కమీషన్ ఆదాయం కర్ణాటక వ్యవసాయ మార్కెట్లకు, మిల్లర్లకు చేరుతుంది. 95వేల ఎకరాల్లో వరిసాగు జిల్లాలో ఈ ఏడాది యాసంగిలో 95,926 ఎకరాల్లో వరి సాగు చేశారు. మొత్తం 1.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందుకుగాను జిల్లా వ్యాప్తంగా 96 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. కానీ రైతులకు అకాల వర్షాల భయం పట్టుకోవడంతో ధాన్యం ఆరబెట్టెందుకు భయపడి వారు దళారులను సంప్రందిస్తున్నారు. వారు చెప్పిన ధరకే ధాన్యం అమ్ముకోవడంతో తీవ్రంగా నష్టాల పాలవుతున్నారు. రైతుల నుంచి తక్కువ ధరకు వరి ధాన్యం కొనుగోలు కర్ణాటకకు తరలించి.. అధిక ధరకు విక్రయం చక్రం తిప్పుతున్న తీలేర్, ఆత్మకూర్ వ్యాపారులు ఉగాది వరకు క్వింటా రూ.2500పలికిన ధర ఒక్కసారిగా రూ.400 తగ్గడంతో రైతుల అయోమయం చర్యలు తీసుకుంటాం వ్యవసాయ మార్కెట్ అనుమతి లేకుండా, రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి మోసం చేసిన లైసెన్స్ లేని వ్యాపారులపై తప్పక చర్యలు తీసుకుంటాం. ధాన్యం పక్క రాష్ట్రానికి తరలించకుండా కర్ణాటక సరిహద్దు వద్ద గట్టి నిఘా ఏర్పాటుచేస్తాం. – దేవాదాసు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి -
నేటినుంచి నామినేషన్ల పర్వం
పాలమూరు/మహబూబ్నగర్ న్యూటౌన్/జడ్చర్ల: పార్లమెంట్ ఎన్నికల పర్వంలో మొదటి అంకం నామినేషన్ల ప్రక్రియ గురువారం మొదలు కానుంది. 25 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉండగా ప్రధాన పార్టీల అభ్యర్థులంతా మంచి ముహూర్తం చూసుకొని నామినేషన్లు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో అధికార యంత్రాంగం నామినేషన్ల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాకేంద్రాల్లో ఎన్నికల అధికారులైన కలెక్టర్లు నామినేషన్ పత్రాలను స్వీకరించనున్నారు. ఇందుకోసం కలెక్టర్ చాంబర్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్ణీత వేళల్లో పోటీదారుల నుంచి నామినేషన్ పత్రాలతో పాటు అఫిడవిట్లను స్వీకరించనున్నారు. సెలవు దినమైన ఆదివారం మినహా మిగతా అన్ని రోజుల్లో నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. పోటీ చేసేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. ఈ నేపథ్యంలో మంచి ముహూర్తాలు చూసుకొని నామినేషన్లు వేయాలని, నామినేషన్ల దాఖలు రోజు జన సమీకరణ, ర్యాలీలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సీఎం రాకకు జడ్చర్లలో ఏర్పాట్లు మహబూబ్నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరుకానున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్రెడ్డి జడ్చర్లకు హెలీకాప్టర్లో వస్తారని అధికారులు తెలిపారు. సీఐ ఆదిరెడ్డి ఆధ్వర్యంలో స్టేడియం మైదానంలో హెలీప్యాడ్ను పరిశీలించారు. జడ్చర్ల నుంచి మహబూబ్నగర్ వరకు కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం వంశీచంద్రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అరుణ నామినేషన్కు హాజరుకానున్న లక్ష్మణ్ బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ గురువారం ఉదయం 11.15గంటలకు మహబూబ్నగర్ కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 8గంటలకు కాటన్ మిల్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు యువ మోర్చా ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించనున్నారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు అన్నపూర్ణ గార్డెన్కు చేరుకుని అక్కడి నుంచి క్లాక్టవర్ వరకు ర్యాలీ నిర్వహిస్తారు. ఆ తర్వాత క్లాక్టవర్లో నిర్వహించే కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు, బీజేపీ బీసీమోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారు. నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి బీజేపీ శ్రేణులు కసరత్తు చేస్తున్నారు. పకడ్బందీగా చేపడతాం: కలెక్టర్ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: లోక్సభ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వాన్ని పకడ్బందీగా చేపడతామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జి.రవినాయక్ అన్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ ఆయా జిల్లా కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బదులిస్తూ ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు అభ్యర్థులతో నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. ఈపాటికే రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. తుది ఓటర్ల జాబితా రూపకల్పనలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఓటరు స్లిప్పులు ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు చేపడుతున్నామన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్, రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. ముహూర్త బలం చూసుకుంటున్న అభ్యర్థులు తొలి రోజే నామినేషన్ దాఖలు చేయనున్న డీకే అరుణ రేపు కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ కూడా.. హాజరుకానున్న సీఎం రేవంత్రెడ్డి 25 వరకు గడువు, 26న పరిశీలన.. 29న ఉపసంహరణకు అవకాశం -
జగదభిరాముడి కల్యాణం.. జగమంతా ఆనందం
సిర్సనగండ్లలో మాంగళ్యధారణ ఘట్టం నిర్వహిస్తున్న అర్చకులు చారకొండ: అపర భద్రాద్రిగా విరాజిల్లుతున్న సిర్సనగండ్ల క్షేత్రంలో జగదానంద కారకుడు, జగదాభిరాముడు కల్యాణ వేడుక...బుధవారం కనులపండువగా సాగింది. దేవదేవుడి కల్యాణవైభోగాన్ని.. కనులారా వీక్షించి భక్తజనం పులకించారు. ఉదయం 10 గంటలకు వేదమంత్రోచ్ఛారణలు, మేళతాళాలు, భక్తుల జయజయ ద్వానాల మధ్య కల్యాణమూర్తులను ఊరేగింపుగా కల్యాణవేదిక వద్దకు తీసుకురాగా.. ఆలయ చైర్మన్ డేరం రామశర్మ పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకు జిలకర్ర బెల్లం, మాంగళ్యధారణ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. లోకమంతా వేయికళ్లతో ఎదురుచూసిన అభిజిత్ లగ్నంలో సీతమ్మ మెడలో రామయ్య మాంగళ్యధారణ చేశారు. జగదభిరాముడు మూడుముళ్లు వేసిన క్షణాన ముల్లోకాలు మురిశాయి. వేలాది సంఖ్యలో తరలివచ్చిన భక్తుల రామనామస్మరణ మధ్య ఆ జగదభిరాముడు జానకమ్మను మనువాడాడు. రాముడు దోసిట తలంబ్రాలు నీలపురాసులుగా జానకి దోసిట తలంబ్రాలు మణిమాణిక్యాలై సాక్ష్యాత్కరించిన వేళ.. సిర్సనగండ్ల క్షేత్రం భక్తి పారవశ్యంతో ఓలలాడింది. ఈ సందర్భంగా జైశ్రీరాం నినాదాలు మార్మోగాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. వీఐపీ తాకిడితో పాటు ఎండలు ఎక్కువగా ఉండడంతో భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు. కల్యాణోత్సవానికి దాదాపు 30 వేల మందికి పైగా భక్తులు హజరైనట్లు దేవస్థాన చైర్మన్, ఈఓ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. నయనానందంగా సాగిన రాములోరి కల్యాణం జనసంద్రంగా మారిన సిర్సనగండ్ల క్షేత్రం మార్మోగిన జైశ్రీరామ్ నినాదాలు -
బీఎస్పీ గూటికి మందా
● మాయవతి సమక్షంలో ఏనుగు పార్టీలో చేరిన మాజీ ఎంపీ జగన్నాథం ● నాగర్కర్నూల్ పార్లమెంట్ బరిలో నిలిచే అవకాశం అలంపూర్: లోక్సభ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. పోటీయే ప్రధానం అన్నట్టుగా కొందరు ఉన్న పార్టీని వదిలి.. మరో పార్టీ కండువా కప్పుకొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘కారు’ దిగిన మాజీ ఎంపీ మందా జగన్నాథం.. ఆ తర్వాత ‘చెయ్యి’ అందుకున్నారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానానికి పోటీచేసే అవకాశం కల్పిస్తారని ఆశించగా, పార్టీ అధిష్టానం మరొకరికి టికెట్ కేటాయించింది. ఈనేపథ్యంలో మందా జగన్నాథం కాంగ్రెస్ పార్టీని వీడుతారనే ప్రచారం జోరుగా సాగింది. ఎట్టకేలకు ఆయన కాంగ్రెస్ను వీడి ఏనుగెక్కారు. బుధవారం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మందా ప్రభాకర్ ఆధ్వర్యంలో పార్టీ అధినేత్రి మాయావతిని రాజస్థాన్లో కలిసి, పార్టీ కండువా కప్పుకొన్నారు. 1996లో రాజకీయాల్లోకి ఆరంగేట్రం.. మాజీ ఎంపీ మందా జగన్నాథం 1996లో రాజకీయ ఆరంగేట్రం చేశారు. వైద్య వృత్తిలో కొనసాగిన ఆయన.. ఆ తర్వాత అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి 4 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 1996, 1999, 2004 ఎన్నికల్లో టీడీపీ తరఫున, 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి 4వ సారి లోక్సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. బీఎస్పీలో చేరిన మందా జగన్నాథం నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలో నిలవనున్నారు. 2014లో బీఆర్ఎస్ నుంచి ఇదే స్థానం నుంచి పోటీచేసి ఓటమి చెందారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో పోటీచేసే అవకాశం దక్కలేదు. 2023 అక్టోబర్ వరకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి పనిచేసిన ఆయన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. కాగా.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో బీఎస్పీ గూటికి చేరారు. కాగా, అలంపూర్ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నేతలు ఈ సారి నాగర్కర్నూల్ స్థానం నుంచి పోటీపడుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్ధిగా అలంపూర్కు చెందిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బరిలో ఉండగా.. కొండేరుకు చెందిన మందా జగన్నాథం బీఎస్పీ నుంచి బరిలో నిలుస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బీఎస్పీని వీడి బీఆర్ఎస్ నుంచి బరిలో నిలవగా.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, అక్కడి నుంచి బీఎస్పీలో చేరిన మందా జగన్నాథం పోటీలో ఉండనుండటం కొసమెరుపు.
Related News by category
-
పకడ్బందీగా ఎన్నికల నియమావళి అమలు
నారాయణపేట: లోక్సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పోలింగ్ నిర్వహణ, సన్నద్ధతపై గురువారం న్యూఢిల్లీ నుంచి సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎస్పీ యోగేష్ గౌతమ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా లోక్సభ ఎన్నికల విధులను ప్రతి ఒక్కరూ నిష్పక్షపాతంగా నిర్వహించాలని, పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థిని ఒకే తరహాలో చూడాలని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ జిల్లా అధికారులకు సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు 70 శాతం ఓటరు సమాచార స్లిప్పులను పంపిణీ చేశామన్నారు. మిగిలిన ఓటర్లకు సైతం పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎన్నికలలో డబ్బు, మద్యం ప్రభావం లేకుండా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సీ – విజల్, డయల్ 1950 నంబర్ ద్వారా వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు వివరించారు. జిల్లాలో పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ● ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రత వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ఈవీఎంల అప్పగింత నుంచి పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంల తరలింపు వరకు పటిష్ట బందోబస్తు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ, డబ్బు, మద్యం అక్రమ రవాణాపై ప్రత్యేకంగా నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ వివరించారు. బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ పూర్తి నారాయణపేట: జిల్లాకు అదనంగా వచ్చిన బ్యాలెట్ యూనిట్ల సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తిచేసినట్లు ఎన్నికల అధికారి, కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు మయాంక్ మిట్టల్, అశోక్ కుమార్, ఆర్డీఓ మధుమోహన్, సహాయ రిటర్నింగ్ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో బ్యాలెట్ యూనిట్ల సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 31 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో ఒక్కో పోలింగ్ బూత్లో అదనంగా బ్యాలెట్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈమేరకు జిల్లాకు అదనంగా 700 బ్యాలెట్ యూనిట్లు వచ్చాయని.. నారాయణపేట అసెంబ్లీ సెగ్మెంట్కు 337, మక్తల్ అసెంబ్లీ సెగ్మెంట్కు 355 కేటాయించినట్లు వివరించారు. వాటిని నారాయణపేట, మక్తల్లోని స్ట్రాంగ్ రూముల్లో భద్ర పర్చనున్నట్లు తెలిపారు. సాయంత్రం ఈవీఎంల గోదామును కలెక్టర్ పరిశీలించారు. -
హే.. భగవాన్
సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రోజురోజుకూ ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. గురువారం నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలంలో 46.0, కొల్లాపూర్ 46.0 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. వెల్దండ, కల్వకుర్తి, మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల, చిన్నచింతకుంట, నారాయణపేట జిల్లాలోని ధ న్వాడ, కృష్ణా, కొత్తపల్లి, గద్వాల జిల్లా వడ్డేపల్లి, అయిజ, అలంపూర్ మండలాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదై.. రెడ్ అలర్ట్కు చేరింది. ఈ నెల 4, 5 తేదీల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మరిన్ని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఈ నెల 5 వరకు ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. రెండ్రోజుల్లో ఉష్ణోగ్రతలు రెడ్ అలర్ట్ స్థాయి కి చేరుకుంటాయని చెబుతోంది. ఆదివా రం వరకు తీవ్రమైన వడగాల్పులు ఉంటాయని, ఈ నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కాగా.. ఈ ఏడాది 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటడం ఇదే మొదటిసారి. పలు మండలాల్లో రెడ్ అలర్ట్కు చేరుకున్న ఉష్ణోగ్రతలు ఉమ్మడి జిల్లాలో నేడు, రేపు మరింత పెరిగే అవకాశం తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని నిపుణుల సూచన -
రాయితీ విత్తనాలపై ఆశలు
మరికల్: వానాకాలం సీజన్లో సాగు చేసే పంటలకు గతంలో మాదిరిగా రాయితీపై విత్తనాలను అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. ఈ నిర్ణయం అమలైతే రైతులకు ఆర్థిక భారం తగ్గనుంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు జిల్లాలో సాగు చేసే పంటల వివరాలు, అవసరమయ్యే విత్తనాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. ప్రతి ఏడాది జీలుగ, జనుము విత్తనాలకే రాయితీ అందిస్తున్నారు. చాలా ఏళ్ల క్రితం ప్రభుత్వం అన్ని రకాల విత్తనాలకు రాయితీ ఇస్తుండగా, రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చాక రాయితీ ఇవ్వడాన్ని మానుకున్నారు. మిగితా పంటల విత్తనాలకు కూడా ఎట్టకేలకు రాయితీ పునరుద్ధరిస్తామని చెప్పడం రైతులకు ఊరట కలిగిస్తోంది. పత్తి, వరి సాగుపైనే మొగ్గు జిల్లాలో రైతులు ముందుగా పత్తి సాగు ఎక్కువగా, ఆ తర్వాత వరి పంటకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో కంది పెద్ద ఎత్తున సాగు చేయగా, ఇప్పుడు ఆ స్థానాన్ని పత్తి భర్తీ చేస్తోంది. రైతుల అవసరాలు అదునుగా తీసుకొని వ్యాపారులు నచ్చిన ధరకు విత్తనాలు విక్రయిస్తున్నారు. వచ్చే వానాకాలం సీజన్కు ప్రభుత్వం విత్తన ధరలు, రాయితీని ఖరారు చేయకపోయినా, రాయితీ ఇస్తామని ప్రకటిండంతో ఆశలు చిగురించాయి. ఏ విత్తనాలపై ఎంత మేరకు రాయితీ ఇస్తారనేది ప్రభుత్వం ఇంకా ఖరారు చేయలేదు. పెరుగుతున్న పెట్టుబడుల కారణంగా ప్రభుత్వం అన్ని విత్తనాలకు రాయితీపై అందజేస్తే రైతులు కొద్దిమేరా లాభాలు వచ్చే అవకాశం ఉంది. జిల్లాకు కావాల్సిన విత్తనాలపై అందించిన నివేదిక ఇలా.. పంట ఎకరాలు విత్తనాలు వరి 1,69,000 42,250 కందులు 55,000 1,650 పెసర 3,000 240 అముదం 2,000 40 వేరుశనగ 12,000 720 మొక్కజోన్న 1,200 96 గతేడాది వరకు జీలుగ, జనుము విత్తనాలకే రాయితీ మిగితా విత్తనాలకు అమలైతే తగ్గనున్న ఆర్థిక భారం జిల్లాలో పత్తి, వరి సాగు అధికం సబ్సిడీ ఉండాలి వానాకాలంలో సాగు చేసే అన్ని రకల విత్తనాలకు ప్రభుత్వం సబ్సిడీ అందజేయాలి. పెరిగిన పెట్టుబడులతో లాభాలు రావడం లేదు. ఎక్కువగా నష్టాలు వస్తున్నాయి. ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు అందజేస్తుందని ఆశిస్తున్నాం. – నర్సిములు, రైతు, కన్మనూర్ ఖరారు కాలేదు ఏ విత్తనాలకు ఎంతమేరకు రాయితీ ఇస్తారనే విషయంపై ఇంకా ప్రభుత్వం నుంచి ఖరారు కాలేదు. విత్తనాల అంచనా మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగింది. – జాన్ సుధాకార్, జిల్లా వ్యవసాయాధికారి -
బీర్లు.. నో స్టాక్
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 230 మద్యం దుకాణాల్లో అన్నిచోట్ల నో–స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. 15 రోజులుగా ఉమ్మడి జిల్లాలో స్టాక్ వచ్చిన పది నిమిషాల్లో ఖాళీ అవుతున్నాయి. తిమ్మాజిపేట, కొత్తకోట డిపోల నుంచి ఒక్కో దుకాణానికి 2–5 కేసుల వరకు మాత్రమే బీర్లు ఇస్తున్నారు. ఇచ్చిన స్టాక్ నిమిషాల వ్యవధిలో అయిపోవడంతో కష్టమర్లు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు డిమాండ్కు తగ్గట్టుగా బీర్లు లేకపోవడంతో వ్యాపారులు సైతం నష్టపోతున్నారు. విపరీతంగా పెరిగిన ఎండలకు తోడు ఇటీవల లారీల సమ్మె జరగడంతో బీర్ల సరఫరా, ఉత్పత్తిలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇప్పటి అక్కడక్కడ కొంత వరకు బీర్ల కొరత ఉండగా.. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని, సాధ్యమైనంత వరకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు వెల్లడిస్తున్నారు. ● గత 15రోజుల నుంచి తీవ్రమైన కొరత ● ఒక్క ఏప్రిల్లోనే ఉమ్మడి జిల్లాలో 4,02,961 కేసుల విక్రయం ● ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి అంటున్న ఎకై ్సజ్ అధికారులు ఉత్పత్తి తక్కువ కావడం వల్లే.. గతంలో ప్రతి ఏడాది వేసవి కోసం డిసెంబర్, జనవరి నెలల్లో బీర్లు అధికంగా ఉత్పత్తి చేసి స్టాక్ చేసేవాళ్లు. ఈసారి అలా చేయకపోవడం వల్ల కొరత ఏర్పడింది. ఈ నెల చివరి నాటి వరకు జిల్లాలో బీర్ల కొరత ఉంటుంది. ప్రొడక్షన్ తక్కువ కావడం వల్ల ఈ సమస్య వచ్చింది. – విజయ్భాస్కర్రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్, మహబూబ్నగర్ మహబూబ్నగర్ క్రైం: మండే ఎండల నుంచి ఉపశమనం కోసం మందు బాబులు చల్లని బీర్లపై ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో చల్లదనం ఉన్న బీర్లు మార్కెట్లో కొరత ఏర్పడటంతో భారీగా డిమాండ్ పెరిగింది. ఒక్క ఏ ప్రిల్ నెలలోనే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4,02,961 కేసుల బీర్ల విక్రయాలు జరిగాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉమ్మడి జి ల్లాలోని తిమ్మాజిపేట, కొత్తకోట మద్యం డిపోలకు బీర్లు సరఫరా చేస్తున్నారు. అయితే ఎండలు విపరీతంగా పెరగడంతో పాటు ఇటీవల ప్రొడక్షన్ సక్రమంగా లేకపోవడం ఇందుకు కారణమైంది. ఇప్ప టికే జిల్లాలో చాలావరకు బీర్ల కొరత ఉండగా.. రాబోయే రోజుల్లో ఇది మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీర్లకు డిమాండ్ ఉన్న సమయంలో కొరత తలెత్తడంతో ఇటు మందుబాబులు, అటు వ్యాపారులు అవస్థలు పడుతున్నారు. నో స్టాక్ బోర్డులు -
‘కొడంగల్ – పేట’తో ప్రతి ఎకరాకు సాగునీరు
ధన్వాడ: కొడంగల్ – నారాయణపేట ఎత్తిపోతల పథకంతో ప్రతి ఎకరాకు సాగునీరందిస్తామని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. ధన్వాడ, గున్ముక్ల గ్రామాల్లో గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలతో పాటు రూ. 2 లక్షలలోపు రుణమాఫీ చేస్తామన్నారు. కొడంగల్ – నారాయణపేట ఎత్తిపోతల పథకం నిర్మాణంపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఈప్రాంత అభివృద్ధిని కాంక్షిస్తూ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాగా, గున్ముక్ల గ్రామంలో బీఎస్పీ నాయకులు వెంకట్, రాములు ఆధ్వర్యంలో దాదాపు 100 మంది యువకులు, మహిళలు ఎమ్మెల్యే పర్ణికారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నరహరి, సింగిల్విండో చైర్మన్ వెంకట్రాంరెడ్డి, నిరంజన్రెడ్డి, దామోదర్రెడ్డి, శివకుమార్, రాఘవేందర్రెడ్డి, నరేందర్గౌడ్, లక్ష్మణ్గౌడ్, సుధాకర్రెడ్డి, ప్రశాంత్కుమార్, శివకుమార్, నరేందర్ పాల్గొన్నారు. క్రీడా నైపుణ్యం పెంచుకోవాలి నారాయణపేట రూరల్/దామరగిద్ద: విద్యార్థులు చదువులో రాణించడంతో పాటు క్రీడా నైపుణ్యం పెంచుకోవాలని డీవైఎస్ఓ వెంకటేష్, సెక్టోరియల్ అధికారి శ్రీనివాస్ సూచించారు. నారాయణపేట మండలం జాజాపూర్ జెడ్పీహెచ్ఎస్, దామరగిద్ద మండలంలోని కాన్కుర్తి జెడ్పీహెచ్ఎస్ మైదానాల్లో గురువారం యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో శిక్షణ శిబిరాలను ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు వేసవి సెలవులను వృథా చేయకుండా క్రీడల్లో శిక్షణ పొందాలని సూచించారు. ఆటలు ఆడటం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం పెంపొందుతుందన్నారు. కార్యక్రమంలో డీఎస్ఓ భానుప్రకాష్, జీహెచ్ఎం బాలకిష్టప్ప, పీఈటీలు సాయినాథ్, వెంకటప్ప, స్కూల్ గేమ్స్ సెక్రటరీ నర్సింహులు, సమ్మర్ క్యాంప్ ఇన్చార్జి సాయినాథ్, వెంకటప్ప, కనకప్ప, రమేష్ పాల్గొన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు మాగనూర్: విధి నిర్వహణలో వైద్యసిబ్బంది అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ సౌభాగ్యలక్ష్మి హెచ్చరించారు. మాగనూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆస్పత్రిలోని పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. ఆస్పత్రిలో కాన్పులు, రికార్డుల నిర్వహణ అంశాలపై నిర్లక్ష్యం చేయొద్దన్నారు. పల్లె దవాఖానల్లో సైతం సేవలు మెరుగుపడ్డాలని తెలిపారు. వ్యాక్సినేషన్ విషయంలో ఏఎన్ఎంలు అప్రమత్తంగా ఉండాలన్నారు. డీఎంహెచ్ఓ వెంట మండల వైద్యాధికారిణి నాగజ్యోతి ఉన్నారు.
Photos
View allVideo
View allBullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019