ధరూరులో మూడు రోజులుగా నిర్వహిస్తున్న బండారు మహోత్సవం సోమవారంతో ముగిసింది. మూడు రాష్ట్రాలకు చెందిన కురువ కులస్తుల్లోని ఆదిగొండ గోత్రం వారు బండారు మహోత్సవానికి పెద్దఎత్తున తరలిరావడంతో స్థానిక పెద్ద చెరువు జనసంద్రంగా మారింది. ముందుగా బీరలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవుడి పట్టం కట్టడం, బండారు (పసుపు) చల్లడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు బండ్ల చంద్రశేఖర్రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. – ధరూరు
breaking news
Breadcrumb
- HOME
adsolute_video_ad
Related news
-
జమ్మిచేడులో వాస్తవ పరిస్థితి ఇదీ..
జిల్లా కేంద్రానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న జమ్మిచేడులో ఓ కల్లు దుకాణానికి ఆబ్కారీ శాఖ నుంచి లైసెన్స్ ఉంది. ఈసొసైటీలో సుమారు 180 నుంచి 200 మంది వరకు సభ్యులుగా ఉండగా.. కల్లు దుకాణాన్ని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నిర్వహించేవారు. ఈదుకాణం ద్వారా జమ్మిచేడుతో పాటు, జమ్ములమ్మ జాతరలో కూడా కల్లు విక్రయాలు కొనసాగుతుండేవి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక, అధికార పార్టీకి చెందిన కొందరి చూపు కల్లు దుకాణంపై పడింది. కల్లు దుకాణం ఏర్పాటు కోసం పోటీకి దిగారు. జమ్మిచేడులో అప్పటికే లైసెన్స్ ద్వారా కొనసాగుతున్న కల్లు దుకాణానికి పోటీగా ఎలాంటి అనుమతులు లేకుండా మరో కల్లుదుకాణం ఏర్పాటు చేశారు. అందులో ప్రధానంగా పాతపాలెం, గోన్పాడ్ గ్రామాలకు చెందిన అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు కీలకపాత్ర పోషించారనే ప్రచారం జోరుగా ఉంది. -
కల్లు మాఫియా..!
మంగళవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2024వివరాలు 8లో uగద్వాల రూరల్: కల్లుదందాకు గద్వాల పెట్టింది పేరు. అధికారంలో ఎవరుంటే వారు దర్జాగా దందాను కొనసాగిస్తారు. తాజాగా అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ఓ అడుగు ముందుకు వేశారు. తమకున్న అధికార బలంతో ఏకంగా కల్లుదుకాణం స్థానంలో ఎలాంటి అనుమతులు లేకుండా కల్లు డిపోను ఏర్పాటు చేసుకున్నారు. ఈడిపో నుంచి సమీప గ్రామాలకు అక్రమంగా కల్లు తరలిస్తూ రూ.లక్షలు దండుకుంటున్నారు. తమ అక్రమ సంపాదనకు ఎలాంటి అడ్డు రాకుండా అన్ని సెటిల్మెంట్లు చేసుకున్నారు. కల్లు దందాతో ప్రతినెలా సుమారు రూ.35 లక్షలకు పైగా అక్రమార్జనకు పాల్పడుతున్నారు. తమకు సహకరిస్తున్న నియోజకవర్గ ముఖ్యనేత, ఆబ్కారీ శాఖలోని అవినీతి అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. రహస్యంగా కొనసాగిస్తున్న అక్రమ కల్లుడిపో దందాపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. రూ.లక్షలు కొల్లగొట్టేందుకు స్కెచ్.. రూ.6 లక్షలకు లైసెన్స్ ఉన్న కల్లు దుకాణాన్ని దక్కించుకున్న సదరు నాయకులు.. రూ. లక్షలు కొల్లగొట్టేందుకు పెద్ద స్కెచ్ వేశారు. ఆబ్కారీ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే తమకున్న అధికార పలుకుబడితో ఏకంగా కల్లుడిపోను ఏర్పాటుచేసి, అక్రమ దందాకు తెరలేపారు. ఫిబ్రవరి నుంచి అక్రమ కల్లుదందా నిరాటకంగా కొనసాగుతోంది. నిత్యం 250 కేసుల కల్లు తయారీ.. కల్లుడిపోలో నిత్యం 250 కేసుల కల్లును తయారు చేస్తున్నట్లు సమాచారం. అందులో 100 కేసుల కల్లు స్థానికంగా జమ్మిచేడులోనే విక్రయిస్తుండగా.. మిగిలిన 150 కేసుల కల్లును గద్వాల మండలంలోని చుట్టుపక్కల పల్లెలతో పాటు మల్దకల్ మండలంలోని రెండు, మూడు గ్రామాలకు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. కల్లు కేసులను ఎలాంటి అనుమతులు లేని ఓ బొలేరో వాహనంలో దర్జాగా తరలిస్తున్నారు. రోజుకు రూ. 1.25 లక్షల ఆదాయం.. కల్లుడిపో నుంచి విక్రయించే 250 కేసుల కల్లు ద్వారా రోజు సుమారు రూ. 1.25 లక్షల వరకు సంపాదిస్తున్నారన్నారు. ఈ లెక్కన నెలకు సుమారు రూ. 35 లక్షలకు పైగా వెనకేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో ఆబ్కారీ శాఖ అధికారులకు, కల్లుడిపో ఏర్పాటుకు సహకరించిన ముఖ్యనేతకు నెలవారీ మామూళ్ల రూపంలో సుమారు రూ.10లక్షల నుంచి రూ.15లక్షల వరకు అందుతున్నట్లు తెలిసింది. ఈ అక్రమ కల్లుడిపో ఆబ్కారీ శాఖ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉండటం విశేషం. న్యూస్రీల్ముఖ్యనాయకుడితోస్థానికుల మొర.. కల్లుడిపో ద్వారా రూ.లక్షలు సంపాదిస్తూ, తమకు ఏమాత్రం డబ్బులు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని జమ్మిచేడుకు చెందిన కొందరు గద్వాల నియోజకవర్గ ముఖ్యనాయకుడితో మొర పెట్టుకోగా.. పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చి పంపినట్లు తెలిసింది. అయితే నెలరోజులు గడిచినా సదరు ముఖ్యనాయకుడి నుంచి ఎలాంటి పరిష్కారం కనిపించకపోవడంతో గత ప్రభుత్వ హయాంలో కల్లుసొసైటీ నిర్వాహకుడే మేలని చర్చించుకోవడం కొసమెరుపు. రూ. 6 లక్షలకు సెటిల్మెంట్.. జమ్మిచేడులో రెండు కల్లుదుకాణాలు కొనసాగుతుండటం.. ఆశించిన స్థాయిలో లాభాలు దక్కకపోవడంతో సదరు నాయకులు నిరాశకు గురయ్యారు. దీంతో కల్లుదుకాణాన్ని తమకు అప్పగించాలని లైసెన్స్ ఉన్న కల్లుసొసైటీ నిర్వాహణ దారుడితో బేరసారాలు నెరిపారు. కల్లుదుకాణ సొసైటీ నిర్వాహణ సమయం దసరా పండుగ వరకు ఉందని.. అందుకు సంబంధించిన డబ్బులు కూడా సొసైటీ సభ్యులకు ముందుగానే చెల్లించానని.. మధ్యలో సొసైటీని వదిలేస్తే ఆర్థికంగా నష్టపోతానని సదరు నిర్వాహకుడు పాతపాలెం, గోన్పాడు గ్రామాలకు చెందిన నాయకులతో చెప్పినట్లు సమాచారం. సొసైటీని పూర్తిగా తమకే ఇవ్వాలంటే మీకెంత ఇవ్వాలని ప్రతిపాదించి, పలుమార్లు బేరాలు కొనసాగించగా.. చివరికి రూ.6 లక్షలకు సెటిల్మెంట్ అయినట్లు తెలిసింది. జమ్మిచేడులో కల్లు దుకాణం బదులు డిపో ఏర్పాటు సమీప గ్రామాలకుయథేచ్ఛగా కల్లు సరఫరా దర్జాగా అక్రమ దందాకుతెరలేపిన అధికార పార్టీనాయకులు నియోజకవర్గ ముఖ్యనేత, ఆబ్కారీ శాఖకు పెద్దఎత్తున ముడుపులు? సమాచారం లేదు.. జమ్మిచేడులో కల్లు దుకా ణం నిర్వహించుకునేందుకు మాత్రమే సొసైటీకి అనుమతులు ఇచ్చాం. అక్కడ కల్లు దుకాణం స్థానంలో కల్లుడిపో ఏర్పాటు చేసిన విషయం తెలియదు. దీనిపై విచారించి అవసరమైన చర్యలు తీసుకుంటాం. కల్లుడిపోను తొలగిస్తాం. మాకు ఎలాంటి ముడుపులు ముట్టడం లేదు. – అరుణ్కుమార్, ఆబ్కారీ శాఖ ఈఎస్ -
ప్రచార హోరు..
సాక్షి, నాగర్కర్నూల్: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీలు తమ ఎన్నికల ప్రచారంలో వేగం పెంచాయి. ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం నాగర్కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. బిజినేపల్లి మండలకేంద్రంలో సాయంత్రం 4 గంటలకు నిర్వహించే కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సభ నేపథ్యంలో అవసరైన ఏర్పాట్లను పార్టీ నేతలు సిద్ధం చేశారు. ఈ సభకు నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పెద్ద ఎత్తున ప్రజలను తరలించాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. లక్షమందికి పైగా జనసమీకరణ చేపట్టి సీఎం సభను విజయవంతం చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లురవి, ఎమ్మెల్యేలు జనసమీకరణ ఏర్పాట్లలో తలమునకలయ్యారు.బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారానికి ఈనెల 25న గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రపటేల్ హాజరుకానుండటంతో పార్టీల పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరెత్తనుంది. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 26, 27వ తేదీల్లో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో బస్సుయాత్ర నిర్వహించనున్నారు. 26న బస్సుయాత్ర ద్వారా మహబూబ్నగర్ జిల్లాకేంద్రానికి చేరుకొని రోడ్షో నిర్వహిస్తారు. ఆ రోజు రాత్రికి అక్కడే బస చేసి, 27న సాయంత్రం 6 గంటలకు జిల్లాకేంద్రంలో నిర్వహించే భారీ రోడ్షోలో పాల్గొననున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నేతల రాకతో పార్టీల ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కనుంది. నేడు కందనూలుకుముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బిజినేపల్లిలోభారీ బహిరంగసభ 26, 27న మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ బస్సుయాత్ర -
వస్తున్నాం.. లింగమయ్యా
అచ్చంపేట/అమ్రాబాద్: తెలంగాణ అమరనాథ్ యాత్రగా ప్రసిద్ధిగాంచిన సలేశ్వరం లింగమయ్య ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభయ్యాయి. పున్నమికి ముందురోజు మదినిండా లింగమయ్యను స్మరించుకుంటూ వేలాది మంది భక్తులు నల్లమల బాటపట్టారు. ‘వస్తున్నాం.. లింగమయ్యా..’ అంటూ దట్టమైన అడవిలో లోయలు, గుట్టలు దాటుకుంటూ సాహస యాత్రలో ఉత్సాహంగా ముందుకు కదిలారు. గతంతో పోల్చితే సోమవారం భక్తుల తాకిడి పెద్దగా కనిపించలేదు. భగభగమండుతున్న ఎండల్లో పగటి వేళ ప్రయాణం చేయలేకపోవడం ఒకటైతే.. అటవీ శాఖ రాత్రివేళ భక్తులను అనుంతిచకపోవడం మరో కారణంగా చెప్పవచ్చు. మరోవైపు అటవీశాఖ ఐదురోజుల జాతరను మూడురోజులకు కుదించడం, రాత్రి సమయంలో భక్తులను అనుమతించకపోవడంతో సలేశ్వరం లింగమయ్యను దర్శించుకొనేందుకు భక్తులు పగలే బారులుతీరారు. చెంచు పూజారులు లింగమయ్యకు గిరిజన సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేశారు. ఇరుకై న కొండ, కోనల్లో నడక సాగిస్తూ సలేశ్వరం జలపాతం వద్ద పర్యాటకులు స్నానాలు ఆచరించి.. లింగమయ్యను దర్శించుకొని తరించారు. బారులుతీరిన వాహనాలు ఫర్హాబాద్ నుంచి రాంపూర్ చెంచుపెంట వరకు వాహనాలు బారులుదీరాయి. మరోమార్గమైన అప్పాయిపల్లి– గిరిజన గుండాల వద్ద జన సందోహం నిండుగా కనిపించింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. లోయలో పైనుంచి జాలువారుతున్న నీటి ధారలో యువకులు కేరింతలు కొడుతూ సేదతీరారు. లింగమయ్యను దర్శించుకునే క్రమంలో అలసిపోయిన భక్తులు పొంచి ఉన్న ప్రమాదాలను లెక్క చేయకుండా చెట్లు, పుట్టలు, గుట్టల నడుమ సేదతీరుతున్నారు. ఆలయం, జలపాతం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు తలెత్తకుండా వలంటీర్లు సహకారం అందిస్తున్నారు. అన్నదానం.. తాగునీటి వసతి సలేశ్వరం వచ్చే భక్తుల కోసం మోకాళ్ల కురువ, అప్పాయిపల్లి మార్గంలోని గిరిజన గుండాల వద్ద స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఏర్పాటు చేసిన అన్నదానం, చలివేంద్రాలు భక్తులను ఆదుకుంటున్నాయి. అల్పాహారం మొదలుకొని మధ్యాహ్నం, రాత్రి సమయంలో భోజనాలు, రాగి అంబలి, మజ్జిగ, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. అలాగే ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో తాగునీటి ఏర్పాట్లు చేశారు. ఫర్హాబాద్ చెక్పోస్టు, పుల్లాయిపల్లి బేస్ క్యాంపు, రాంపూర్ పెంట, మోకాళ్ల కుర్వు (సలేశ్వరం), లింగాల మండలం అప్పాయిపల్లి, గిరిజన గుండాల వద్ద 5 వేల లీటర్ల వాటర్ ట్యాంకులు, చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా దాతలు ఏర్పాటు చేసిన ఉచిత భోజనశాలలతో పాటు 20 ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తున్నారు. మూడు రోజులపాటు తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు డీఈ హేమలత తెలిపారు. నిరంతర పర్యవేక్షణ పోలీస్, అటవీ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్ శాఖలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాయి. సీసీ, ట్రాప్ కెమెరాల ద్వారా అడవి మార్గంలో నిరంతర పర్యవేక్షణ చేసేలా ఏర్పాట్లు చేశారు. ఫర్హాబాద్– రాంపూర్– సలేశ్వరం క్షేత్రం వరకు పోలీసులు ప్రత్యేక బందోబస్తు కల్పిస్తున్నారు. డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సీఐలు, ఎస్ఐలు బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. పుల్లాయిపల్లి వరకే బస్సులు సలేశ్వరం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. అయితే పుల్లాయిపల్లి పెంట వరకు మాత్రమే బస్సులు వెళ్తున్నాయి. అక్కడి నుంచి మోకాళ్ల కురువ చేరుకునేందుకు 50 ఆటోలు అందుబాటులో ఉంచారు. రాంపూర్ వరకు ఉన్న రోడ్డు పరిస్థితి, వర్షం పడితే కలిగే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి ముందుస్తుగా పుల్లాయిపల్లి వరకు బస్సులను అనుమతించారు. 20 నిమిషాలు ఒక బస్సు చొప్పున ప్రయాణికులకు వీలుగా నడిపిస్తున్నారు. సోమవారం అచ్చంపేట డిపో నుంచి 16, నాగర్కర్నూల్ 23, కొల్లాపూర్ 4, కల్వకుర్తి 4 బస్సుల చొప్పున మొదటి రోజు పుల్లాయిపల్లి వరకు బస్సులు నడిపించారు. వైభవంగా ప్రారంభమైన సలేశ్వరం ఉత్సవాలు మొదటిరోజు వేలాదిగా తరలివచ్చిన భక్తులు పగటిపూట అనుమతి, ఎండల తీవ్రతతో అవస్థల పాలు తెలంగాణ అమరనాథ్ సాహస యాత్రకు క్యూకట్టిన జనం నట్టడవిలో మార్మోగుతున్న లింగమయ్యనామస్మరణ -
No Headline
వనపర్తి సంస్థానం చివరి రాజుగా జనుంపల్లి రాజారామేశ్వర్రావు (1944 సంవత్సరం)లో పట్టాభిషిక్తుడయ్యారు. 21 ఏళ్ల వయసులో రాజ్యపాలన చేపట్టిన ఆయన నిజాం ప్రభువుకు సామంతరాజుగా ఉంటూ పాలన సాగించారు. 1947లో స్వాతంత్య్రం రావడంతో.. వనపర్తి సంస్థానాన్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేసేందుకు రామేశ్వర్రావు అప్పటి ప్రధాని నెహ్రూతో ఒప్పందం చేసుకున్నారు. 1949లో ఇండియన్ ఫారిన్ సర్వీస్లో చేరి, పలు ఆఫ్రికన్ దేశాలలో భారత ప్రభుత్వానికి కమిషనర్గా పనిచేశారు. 1957లో దేశవ్యాప్తంగా జరిగిన రెండో సార్వత్రిక ఎన్నికల్లో మహబూబ్నగర్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి తొలిసారి ఎంపీగా గెలుపొందారు. 1962లో ఉమ్మడి జిల్లాలో రెండు ఎంపీ స్థానాలు ఏర్పాటు చేశారు. అప్పుడు కొత్తగా ఏర్పడిన నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానంలో పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1967లో తిరిగి మహబూబ్నగర్లో పోటీ చేసి మూడోసారి ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. అనంతరం 1972, 1977లో జరిగిన ఎన్నికల్లోనూ వరుసగా విజయం సాధించారు. 1977లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైనా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 42 పార్లమెంట్ స్థానాల్లో 40 స్థానాలు కాంగ్రెస్ గెలిచింది. అందులో మహబూబ్నగర్ ఎంపీగా రాజా రామేశ్వర్రావు విజయకేతనం ఎగురవేశారు. 1977లో కేంద్రంలో ఏర్పడిన జనతా ప్రభుత్వం మూడేళ్లకే పడిపోవడంతో 1980లో మద్యంతర ఎన్నికలు వచ్చాయి. నాడు ఇందిరా కాంగ్రెస్గా పార్టీని వేరుచేసిన ఇందిరాగాంధీ మహబూబ్నగర్ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. కాగా.. ఐదుసార్లు వరుసగా గెలుస్తున్న రామేశ్వర్రావుపై పోటీచేయడం ఎందుకని మెదక్ సిట్టింగ్ ఎంపీ మల్లికార్జున్గౌడ్ను పాలమూరులో పోటీకి నిలబెట్టి.. ఆమె మెదక్లో పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో రామేశ్వర్రావుపై మల్లికార్జున్ సంచలన విజయం సాధించారు.
Related News by category
-
హే.. భగవాన్
సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రోజురోజుకూ ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. గురువారం నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలంలో 46.0, కొల్లాపూర్ 46.0 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. వెల్దండ, కల్వకుర్తి, మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల, చిన్నచింతకుంట, నారాయణపేట జిల్లాలోని ధ న్వాడ, కృష్ణా, కొత్తపల్లి, గద్వాల జిల్లా వడ్డేపల్లి, అయిజ, అలంపూర్ మండలాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదై.. రెడ్ అలర్ట్కు చేరింది. ఈ నెల 4, 5 తేదీల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మరిన్ని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఈ నెల 5 వరకు ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. రెండ్రోజుల్లో ఉష్ణోగ్రతలు రెడ్ అలర్ట్ స్థాయి కి చేరుకుంటాయని చెబుతోంది. ఆదివా రం వరకు తీవ్రమైన వడగాల్పులు ఉంటాయని, ఈ నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కాగా.. ఈ ఏడాది 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటడం ఇదే మొదటిసారి. పలు మండలాల్లో రెడ్ అలర్ట్కు చేరుకున్న ఉష్ణోగ్రతలు ఉమ్మడి జిల్లాలో నేడు, రేపు మరింత పెరిగే అవకాశం తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని నిపుణుల సూచన -
కొనసాగుతున్న జొన్నల కొనుగోళ్లు
రాజోళి: మండలంలో జొన్నల కొనుగోలు కొనసాగుతోంది. పీఏసీఎస్, మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కొనుగోళ్లలో భాగంగా మండలంలోని రాజోళి, పచ్చర్లలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. పచ్చర్లలో గురువారం 43 మంది రైతులకు సంబంధించి 1,781 బస్తాలను కొనుగోలు చేసినట్లు పీఏసీఎస్ సీఈఓ రవికుమార్ తెలియజేశారు. కాగా.. రాజోళిలోని కొనుగోలు కేంద్రంలో బుధవారం నుంచి గన్నీ బ్యాగుల కొరత ఉందని, అందుకే అక్కడ గురువారం కొనుగోలు జరగలేదన్నారు. గన్నీ బ్యాగులు అందుబాటులోకి రాగానే రాజోళిలో కూడా కొనుగోళ్లు జరుగుతాయని వివరించారు. -
పోలింగ్ సమయం పొడిగింపు
గద్వాల రూరల్: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమయాన్ని పొడిగించినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సంతోష్ గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. తీవ్రమైన ఎండల దృష్ట్యా పౌరులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు పోలింగ్ సమయాన్ని ఇంతకు ముందు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు ఉండేది. ప్రస్తుతం దీనిని ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పొడిగించి పోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి గద్వాల రూరల్: మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నాగర్కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు రుచేశ్జైవన్షి ఆధ్వర్యంలో వనపర్తి ఓసీలోని ఎన్ఐసీ కేంద్రంలో వనపర్తి, గద్వాల జిల్లాలకు సంబంధించిన మైక్రో అబ్జర్వర్లను వనపర్తి జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నందలాల్ పవార్, గద్వాల అదనపు కలెక్టర్ అపూర్వచౌహన్ సమక్షంలో రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలియజేశారు. కార్యక్రమంలో ఎల్డీఎం అయ్యప్ప, ఈడీఎం శివ పాల్గొన్నారు. ఓటు హక్కును వినియోగించుకోవాలి మల్దకల్: ఓటు విలువైంది. 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జెడ్పీ సీఈఓ కాంతమ్మ సూచించారు. గురువారం మల్దకల్లో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి డీఆర్డీఓ నర్సింగరావుతో పాటు ఆధికారులు సుధారాణి, రమేష్బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గ్రామాల్లో ప్రతి ఓటరుకు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే బాల్యవివాహాలు, బాలకార్మిక నిర్మూలనపై అవగాహన కల్పించారు. సీడీపీఓ కమలాదేవి, నాగరాణి, ఎంపీఓ ప్రవీణ్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గద్వాల మార్కెట్యార్డు సమాచారం గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్యార్డుకు గురువారం 645 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టంగా రూ.7,039, కనిష్టంగా రూ.3,002, సరాసరి రూ.5,729 ధరలు పలికాయి. 21 క్వింటాళ్ల ఆముదం రాగా.. గరిష్టంగా రూ.5,429, కనిష్టంగా రూ.4,666, సరాసరి రూ.5,429 ధరలు వచ్చాయి. 4,081 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టంగా రూ.2,401, కనిష్టంగా రూ.1,509, సరాసరి ధర రూ.1,669 ధరలు వచ్చాయి. 26 క్వింటాళ్ల వరి (హంస) రాగా గరిష్టం, కనిష్టం, సరాసరి ధర రూ.1,702 పలికింది. -
‘రెండోసారి మోసపోతే మనదే తప్పు’
అయిజ: అమలు చేయలేని హామీలు చెబితే చాలామంది మోసపోయి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారని, ఒక సారి మోసపోతే అవతల వారిది తప్పవుతుందని, రెండో సారి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే వేసిన వారిదే తప్పవుతుందని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. అయిజ మున్సిపాలిటీ పరిధిలోని రాయల్రెడ్డి ఫంక్షన్హాల్లో అయిజ మండల మున్సిపాలిటీ, మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు హాజరవగా.. ఎమ్మెల్సీ మాట్లాడారు. గత శాసనసభ ఎన్నికల్లో అలంపూర్ నియోజకవర్గంలో 30 వేలకు పైగా బీఆర్ఎస్కు మెజార్టీ ఇచ్చారని అదే స్ఫూర్తితో ఎంపీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓట్లేసి, వేయించి బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. గెలిచిన వెంటనే డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని, ఇప్పుడేమో ఆగస్ట్ 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని చెబుతున్నారన్నారు. ప్రజలను నమ్మించి ఎంపీ ఎన్నికల్లో ఓట్లేయించుకునేందుకు రెండో సారి ప్రయత్నిస్తున్నాడన్నారు. ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ.. అలంపూర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఉన్నారని, ఎంపీగా ప్రవీణ్కుమార్ను గెలిపిస్తే ముగ్గురి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. -
ఉత్సాహంగా ఎడ్లబండ్ల గిరక పోటీలు
గట్టు: మండల పరిధిలోని బల్గెరలో నిర్వహిస్తున్న దిగంబరస్వామి జాతర సందర్భంగా గురువారం ఎడ్లబండ్ల గిరక పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ పోటీల్లో నాలుగు బహుమతులను కర్నూల్ జిల్లాకు చెందిన ఎడ్ల బండ్లు దక్కించుకున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఎడ్ల బండ్ల పోటీల్లో 3,721.3 ఫీట్ల దూరం గిరకను లాగి మొదటి బహుమతి రూ.20 వేలను కర్నూల్ జిల్లా హాలహర్వి ఈరన్నకు చెందిన ఎడ్ల దక్కించుకుంది. ద్వితీయ బహుమతి రూ.15 వేలను గుమ్మురాళ్ల పాలకుర్తికి చెందిన ఎడ్ల బండి 3,692.2 ఫీట్ల దూరం ఎడ్ల బండి గిరకను లాగి దక్కించుకున్నాయి. తృతీయ బహుమతి రూ.10 వేలను నల్గొండ రంగన్న ఎడ్ల బండి 3,608.9 ఫీట్ల ఎడ్ల బండి గిరకను లాగి దక్కించుకున్నాయి. నాలుగో బహుమతి రూ.5 వేలను రంగన్నకు చెందిన ఎడ్ల బండి 3,594 ఫీట్ల దూరం లాగి దక్కించుకున్నాయి. పోటీల్లో మొత్తం 15 జతల ఎడ్లు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. బాసు శ్యామల, హనుమంతు నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Photos
View allVideo
View allTuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019