Sakshi News home page

adsolute video ad after first para

‘షైన్‌’ విద్యార్థుల ప్రభంజనం

Published Thu, May 2 2024 4:10 PM

‘షైన్‌’ విద్యార్థుల ప్రభంజనం

హన్మకొండ: పదో ఫలితాల్లో హనుమకొండలోని షైన్‌ హైస్కూల్‌ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. కార్పొరేట్‌ విద్యా సంస్థలను తలదన్నేలా తమ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకే తలమానికంగా నిలిచారని షైన్‌ విద్యా సంస్థల చైర్మన్‌ మూగల కుమార్‌ యాదవ్‌ తెలిపా రు. పది జీపీఏ సాధించడంలో షైన్‌ ఎప్పుడూ అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. జిల్లాలోనే అత్యధికంగా 40 మంది 10 జీపీఏ సాధించారని, 56 మంది 9.8, 50 మంది 9.7, 56 మంది 9.5, 43 మంది 9.3, 55 మంది 9.2 జీపీఏ సాధించి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచారని వివరించారు. తెలుగులో 222, హిందీలో 166, ఇంగ్లిష్‌లో 125, గణితంలో 265, సైన్స్‌లో 248, సోషల్‌లో 213 మంది 10 జీపీఏ సాధించారని తెలిపారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో అత్యుత్తమ బోధన అందించడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించామన్నారు. ఈ సందర్భంగా ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను షైన్‌ యాజమాన్యం అభినందించింది. కార్యక్రమంలో డైరెక్టర్‌ పి.రాజేంద్రకుమార్‌, ఐఐటీ కోఆర్డినేటర్‌ మూగల రమేష్‌, షైన్‌ ఎర్రగట్టు చైర్మన్‌ జె.శ్రీనివాస్‌, ప్రిన్సిపాళ్లు బి.రాజ్‌కుమార్‌, బి.సంపత్‌, పి.విశాల్‌, కవితా రాణి, దినేష్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

adsolute_video_ad

homepage_300x250