Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

నేడు గోదారి హారతి

Published Tue, Apr 23 2024 8:20 AM

-

కాళేశ్వరం: కాళేశ్వరంలోని త్రివేణి సంగమ గోదావరిలో (నేడు)మంగళవారం పౌర్ణమి సందర్భంగా గోదావరి హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఈఓ ఏ.మారుతి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాయంత్రం 5.30గంటలకు గోదావరి వద్ద హారతి పూజా కార్యక్రమం ఉంటుందని తెలిపారు. భక్తులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు హాజరుకావాలని ఆయన కోరారు.

నేడు హనుమాన్‌ జయంతి పూజలు..

హనుమాన్‌ జయంతి సందర్భంగా కాళేశ్వరం దేవస్థానం పరిధిలోని గుండం చెరువు కట్టమీద శ్రీఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం ఉదయం 9.30గంటలకు ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈఓ మారుతి తెలిపారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.

Advertisement

Copy Button

 

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250