Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

సమస్యలకు సత్వర పరిష్కారం

Published Tue, Apr 23 2024 8:20 AM

కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్న 
చిన్నారి తల్లితండ్రులు  - Sakshi

భూపాలపల్లి: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్‌ భవేష్‌మిశ్రా అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల సమస్యలకు సంబంధించిన 36 దరకాస్తులను కలెక్టర్‌ స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కృతజ్ఞతలు తెలిపిన అక్షయ తల్లితండ్రులు..

చిన్నారి అక్షయకు మెరుగైన వైద్యసేవలు అందిస్తామని కలెక్టర్‌ భవేష్‌మిశ్రా హామీ ఇచ్చినందుకు చి న్నారి తల్లితండ్రులు సోమవారం కలెక్టర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శస్త్ర చికిత్స కు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు.

కలెక్టర్‌ భవేష్‌మిశ్రా

Advertisement

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250