breaking news
-
భారీ ఆర్డర్లకు కొత్త విద్యుత్తు వాహనాలు
స్నేహితులు, కుటుంబ సభ్యులతో జరుపుకుంటున్న చిన్నపాటి వేడుకలకు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టేలా ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా 50 మందికి ఆహారం అందించేలా కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వాహనాలు అన్నీ ఎలక్ట్రిక్ వెహికిల్స్ అని సంస్థ సీఈఓ దీపిందర్ గోయల్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలిపారు. పెద్ద ఆర్డర్లకు సంబంధించి ఈ తరహా వాహనాలను ఉపయోగిస్తుండటం దేశంలో ఇదే మొదటిసారి అని ఆయన చెప్పారు. ఇంతకుముందు పెద్ద ఆర్డర్లు తీసుకున్నా, సంప్రదాయ డెలివరీ భాగస్వాములే అందించేవాళ్లు అని తెలిపారు. దీని వల్ల వినియోగదారులు ఆశించిన స్థాయిలో సంతృప్తి చెందేవారు కాదని చెప్పారు. కొత్తగా తీసుకొచ్చిన ఈ వాహనాలతో భారీ ఆర్డర్లు పెడుతున్న కస్టమర్ల అవసరాలను తీరుతాయని పేర్కొన్నారు. ఇదీ చదవండి: పెరుగుతున్న దిగుమతులు.. ధరలకు రెక్కలు! ఆ వాహనాల్లో కూలింగ్ కంపార్ట్మెంట్లు, హాట్ బాక్స్ల వంటివి ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. దాంతో వినియోగదారులు కోరుకున్న రీతిలో ఆహార పదార్థాలను డెలివరీ చేసే వీలుందన్నారు. ఇటీవల ‘ప్యూర్వెజ్’ పేరుతో తమ వాహానాల కొన్నింటికి రంగు మార్చి విమర్శలకు గురైన సంగతి తెలిసిందే. దాంతో ఆ నిర్ణయం ప్రకటించిన కొద్ది గంటల్లోనే దాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు చెప్పారు. -
సమస్య పరిష్కారానికి ఇరవై గంటల జూమ్కాల్
శాకాహారుల కోసం జొమాటో ప్రత్యేకంగా ప్రారంభించిన ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ ఇటీవల వివాదాస్పదమైన విషయం తెలిసిందే. కొత్త సేవలు ప్రారంభమైన కొద్దిసేపటికే అందులో మార్పులు చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు ప్రకటించాయి. డెలివరీ బాయ్స్ కోసం ప్రత్యేకంగా గ్రీన్ యూనిఫాం కాకుండా ఎర్ర రంగు దుస్తులు మాత్రమే ఉంటాయని ప్రకటించి వివాదానికి ముగింపు పలికింది. అయితే, శాకాహారుల కోసం ప్రత్యేక సేవలు ప్రారంభించడం వెనుక కారణం.. వివాదాస్పదమైన తర్వాత తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన విషయాలను కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ ఇటీవల ఓ వార్తాసంస్థకు తెలిపారు. జొమాటో వినియోగదారుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకే ప్యూర్ వెజ్ ఫ్లీట్ ప్రారంభించామని దీపిందర్ చెప్పారు. తర్వాత ఓ సర్వే నిర్వహించినట్లు తెలిపారు. ‘మీరు మరిన్ని ఆర్డర్లు చేయాలంటే జొమాటో నుంచి ఏం ఆశిస్తున్నారు?’ అని వినియోగదారులను అడిగినట్లు చెప్పారు. దీంట్లో చాలా మంది శాకాహారుల కోసం మరేదైనా ప్రత్యేక సేవలు అందించాలని సూచించినట్లు తెలిపారు. దీనిపై సుదీర్ఘ చర్చల తర్వాత ప్యూర్ వెజ్ ఫ్లీట్ సేవలను ప్రారంభించామన్నారు. అయితే, ఆ పదాల్లో ఉన్న నిగూఢార్థం తమకు తెలియదని.. ఇంతటి వివాదానికి కారణమవుతుందని ఊహించలేదన్నారు. సోషల్ మీడియాలో వివాదం తలెత్తిన తర్వాతే అసలు విషయం అర్థమైందన్నారు. ఇదీ చదవండి..డెబిట్ కార్డు యూజర్లపై భారంమోపిన ప్రముఖ బ్యాంక్ సామాజిక మాధ్యమాల్లో వివాదానికి తెరలేపే వార్తలు వైరల్గా మారిన నేపథ్యంలో వెంటనే దాదాపు 20 గంటల పాటు జొమాటోలోని ఉన్నతోద్యోగులందరూ జూమ్ కాల్లో చర్చించామని చెప్పారు. సమస్యను ఎలా పరిష్కరించాలో మంతనాలు జరిపినట్లు తెలిపారు. చివరకు గ్రీన్ యూనిఫామ్ తొలగించాలనే నిర్ణయానికి వచ్చామన్నారు. కొత్త సేవల వెనుక ఎలాంటి రాజకీయ, మతపరమైన ఉద్దేశాలు లేవని మరోసారి స్పష్టం చేశారు. -
జొమాటో సీఈవో దీపీందర్ మొదటి భార్య ఇప్పుడు ఏం చేస్తున్నారు..?
-
అలాంటి ఫోటోలు జూమ్ చేసి అబ్బాయిలు ఏం చేస్తారో తెలుసు: రష్మీ
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ 'జొమాటో' కొద్దిరోజు క్రితం తన కంపెనీకి చెందిన డెలివరీ బాయ్స్ కోసం గ్రీన్ టీ షర్టును ప్రవేశపెట్టింది. సాధారణంగా జొమాటో డెలివరీ బాయ్స్ రెడ్ టీ షర్ట్ ధరించి తమ కస్టమర్లకు ఆర్డర్ డెలివరీ చేస్తూ ఉంటారు. అయితే వెజ్ డెలివరీ సమయంలో మాత్రం గ్రీన్ టీ షర్ట్స్ ధరించాలని సదరు కంపెనీ ఆదేశించింది. జొమాటో తీసుకున్న నిర్ణయంపై సోషల్మీడియాలో పెద్ద దుమారమే రేగింది. నాన్ వెజ్ తినే వారిని ఇలా అవమానిస్తున్నారా..? అంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. దీంతో ఆ నిర్ణయాన్ని జొమాటో వెనక్కి తీసుకుంది. ఇదే విషయంపై హీరోయిన్, యాంకర్ రష్మీ గౌతమ్ తన అభిప్రాయాన్ని పంచుకుంది. నాకొక సందేహం.. దీనికి సమాధానం మీలో ఎవరికైనా తెలిస్తే వివరణ ఇవ్వండి. గ్రీన్ టీ షర్ట్ ధరించి వెజ్ తినే వారికి ఫుడ్ డెలివరీ చేస్తే తప్పేంటి..? అలా చేయడం వల్ల నాన్ వెజ్ తినే వారి మనోభావాలు ఎందుకు దెబ్బతింటాయి..? అసలు ఈ విషయంలో నాకు ఏమీ అర్థం కావడం లేదు.' అని కామెంట్ చేసింది. అయితే, రష్మీ చేసిన వ్యాఖ్యలకు ఒక నెటిజన్ రియాక్ట్ అయ్యాడు. 'సోషల్ మీడియాలో అటెన్షన్ కోసం ఇలాంటి ట్రిక్స్ మామూలే.. రీచ్ కోసం రష్మి పడుతున్న కష్టాలు అంటూ కామెంట్ చేశాడు. దీంతో వెంటనే రష్మీ కూడా ఘాటుగానే కౌంటర్ ఇచ్చింది. 'సోషల్ మీడియాలో రీచ్ కోసమైతే జొమాటో గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఒక్క ఫోటో షేర్ చేస్తే చాలు.. దానిని జూమ్ చేసీ చేసీ సొల్లు కారుస్తూ అవసరం లేని అటెన్షన్ ఇస్తారు. నాకు తెలిసి నీకు కావాల్సిన అటెన్షన్ ఇప్పుడు దొరికింది అనుకుంటున్నాను.' అని కౌంటర్ ఇచ్చింది. యాంకర్గా మెప్పించిన రష్మీ పలు సినిమాల్లో హీరోయిన్గా కూడా మెప్పించింది. సమాజంలోని అసమానతలు, మూగజీవాల రక్షణ కోసం రష్మి పాటు పడుతూ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. Reach kosam I don’t have to talk about these issues One pic chalu zoom in chesi chesi 🤤 karchuthu avasram leni attention istaru I hope you got your attention now I wonder how long your wait was https://t.co/e7UluLFsKp — rashmi gautam (@rashmigautam27) March 23, 2024 -
జొమాటోలో ‘ప్యూర్ వెజ్’ చిచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఇటీవల అందుబాటులోకి తెచ్చిన ‘ప్యూర్ వెజ్’ ఫుడ్ డెలివరీ సర్వీసులు ఆ సంస్థలో చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ సమస్య నుంచి బయట పడేందుకు సంస్థ టాప్ ఎగ్జిక్యూటీవ్లతో సుమారు ఏకదాటిగా 20 గంటల పాటు జూమ్ కాల్స్ నిర్వహించినట్లు జొమాటో కోఫౌండర్, సీఈవో దీపిందర్ గోయల్ తెలిపారు. జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీ ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్’ ల కార్యక్రమం నిర్వహించింది. అయితే ఎంట్రప్రెన్యూర్ విభాగంలో దీపిందర్ ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది అవార్డ్ను సొంతం చేసుకున్నారు. ఈ అవార్డ్ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ చేతులు మీదిగా అందుకున్నారు. పెద్ద ఎత్తున ట్రోలింగ్ ఈ సందర్భంగా ప్యూర్ వెజ్ వివాదంపై జొమాటో సీఈవో మాట్లాడారు. కస్టమర్లు, ఆయా రెస్టారెంట్ల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా మేం ప్యూర్ వెజ్ మోడ్, ప్యూర్ వెజ్ ఫ్లీట్ సేవల్ని అందుబాటులోకి తెచ్చాం. కానీ ఈ సర్వీసులపై ఊహించని విధంగా వివాదం తలెత్తింది. నెటిజన్లు సైతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారని అన్నారు. తలెత్తిన ఆందోళనలు ‘‘ప్యూర్ వెజ్ వివాదంపై నెటిజన్లు సైతం రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు (RWAs) వెజ్ - నాన్ వెజ్ కలిపి తెస్తే ఆర్డర్లను తిరస్కరించే అవకాశం ఉందనే అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. డెలివరీ సిబ్బందిని సైతం అడ్డుకునే ప్రమాదం ఉందని వాపోయారు. ఇప్పటికే వెల్ఫేర్ అసోసియేషన్లలో విధించే ఆంక్షల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు గురించి ప్రస్తావించారు. అదే సమయంలో డెలివరీ సిబ్బంది సైతం ఓన్లీ వెజ్ పాలసీ వల్ల అవకాశాలు సన్నగిల్లుతాయనే ఆందోళనల్ని వ్యక్తం చేశారు.’’ ప్యూర్ వెజ్పై వెనక్కి తగ్గిన జొమాటో అయితే దీన్ని పరిష్కరించేందుకు జొమాటో ఉన్నత స్థాయి ఉద్యోగులతో సుమారు 20 గంటల పాటు జూమ్ కాల్ నిర్వహించామని గుర్తు చేశారు. ఆ తర్వాత వినియోగదారుల నుంచి వ్యతిరేకత రావడం, ప్యూర్ వెజ్పై దుమారం చెలరేగడంతో ఆయా ప్రభుత్వాలు జొమాటోకి నోటీసులు అందించాయి. ఫలితంగా పలు రాష్ట్రాల్లో ఆ సర్వీసుల్ని నిలిపివేస్తున్నట్లు జొమాటో అధికారికంగా ఎక్స్.కామ్లో ట్వీట్ చేశారు. Hi, we have disabled delivery of non-veg items in Uttar Pradesh, Assam, Chhattisgarh, Madhya Pradesh and Rajasthan as per govt. notice. Hope this clarification helps! — Zomato Care (@zomatocare) January 22, 2024 ఇక ఎన్డీటీవీ అవార్డ్ల కార్యక్రమంలో ‘దయచేసి ఈ ప్యూర్ వెజ్ సర్వీస్ ఏ మతానికి, రాజకీయ ప్రాధాన్యతలకు వ్యతిరేకం కాదని జొమాటో అధినేత, సీఈవో దీపిందర్ గోయల్ మరోసారి పేర్కొన్నారు. మరి రానున్న రోజుల్లో ఈ ప్యూర్ వెజ్ సేవల్ని అందిస్తారా? లేదంటే నిలిపివేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. Even though RTIs and mails for hostel GSec shows that there is no institute policy for food segregation, some individuals have taken it upon themselves to designate certain mess areas as "Vegetarians Only" and forcing other students to leave that area.#casteism #Discrimination pic.twitter.com/uFlB4FnHqi — APPSC IIT Bombay (@AppscIITb) July 29, 2023
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019